24, డిసెంబర్ 2021, శుక్రవారం

క్రీస్తు జయంతి మహోత్సవము(2)

క్రీస్తు జయంతి మహోత్సవము

                       యెషయా 9:1 -6, తీతు 2 :11-14 , లూకా2:1 -14

ప్రతిజననం ఎంతో ప్రత్యేక్యమైనది  ఈలోకంలో  ఉన్న మనందరి జీవితం జన్మoతోనే ప్రారంభంఅవుతుంది మనం చాల మంది పుట్టినరోజులను ఘనంగా కొనియాడతo. అంగరంగవైభవంగా కొన్నీ పుట్టిన రోజులను చేసుకుంటాం. సంఘసేవకుల, రాజకీయానాయకుల పుట్టినరోజును జరువుపుకుంటాం. ఈరోజు ప్రత్యేకమంగా రాజులకు రారాజు ప్రభులకు ప్రభు అయిన క్రీస్తుప్రభు యొక్క జన్మదినము. జరుపుకుంటున్నాం. ఎందరో చూడాలనుకున్నారు కానీ చూడలేదు.ఎందరో ఆయనను తాకాలనుకున్నారు కానీ తాకలేదు. కానీ మనం అదృష్టవంతులము. పరలోకదూతలు మాత్రమేకాదు ఈరోజు సంతోషంమనందరికీ  ఎందుకు అంటే సృష్టిలో మొట్టమొదటి సారి దేవుడు మన మధ్యలోకి వస్తున్నారు.
తన     పర లోక మహిమను అలాగే నిత్యము సేవించుకునే విధానము వదిలి పెట్టి మన కోసం మన మధ్య లోనికి వస్తున్నారు. సృష్టిలో మొట్టమొదటి సారిగా ఒక్క శిశువు జన్మించిన తరువాత తల్లి తన కుమారుని పొలి ఉన్నారు.
మాములుగా ఈలోకంలో జన్మిస్తే, మనం అంటాము మీ అమ్మలాగా ఉన్నావు నాన్నాలాగా ఉన్నావు. కానీ యేసు ప్రభువు జనము తో తన తల్లి శిశువుని పోలి వుంది. ఎందుకంటే  దేవుడు మానందరిని తన పోలికలో సృజించారు . 
దేవుడే మరియమ్మ గారిని  సృజించారు ఆ తల్లి ఇప్పుడు దేవున్ని పోలివుంది. మొట్టమొదట  సారిగా మరియమ్మగారు పరలోక అనుభూతిని పొందారు. తన పవిత్ర చేతులులతో దేవున్ని తాకారు . బాల యేసు జన్మిoచిన స్థలం   పవిత్ర మైనది, పశువుల పాక పవిత్ర స్థలంగా  మారింది. ఆయన  జన్మిoతో భూలోకం పరలోకంగా మారింది . ఎవరు ఇష్ట పడని అంగీకరించని స్థలం అందరిచేత అంగీకరించబడుతుంది. ఎందుకంటే రక్షకుడు జన్మిoచరు .యేసు ప్రభువు పశువుల పాకలో జన్మిoచరు.ఎందుకంటే స్థలం ఆ స్థలం సామాన్యలకు చెందినది, సమాజంలో ఎవ్వరు పట్టించుకోని వారు అక్కడ వుంటారు
(Outcast people ignored people forgotten in the society) ఆయన అక్కడ జన్మనిoచుట ద్వారా ఆయన అందరితో సరిసమానం అని చెబుతున్నారు. ఈ సమాజం పట్టించుకోని వారిని దేవుడు పట్టించుకుంటున్నారు.
దేవుడు కేవలం ఎన్నుకొన్న వారికి మాత్రమే కాదు  జన్మిoచిoది.
 క్రీస్తు ప్రభువు తన్ను తాను అందరి చేత అంగీకరించబడేoదుకు ఆయన కూడా అందరిలో ఒక్కరె, సరి సమానమే  అనే భావన ప్రజల్లో తీసుకొని రావటానికి ఈ విధంగా ఆయన చేశారు.  మనకు జన్మిoచిన శిశువు ఎలాంటి వారంటే
ఆశ్చర్యకరుడు
 ఆలోచన  కర్త
బలవంతుడగు దేవుడు
 నిత్యుడగు తండ్రి
సమాధాన కర్త
ఆనాడు యూదా ప్రజలు చీకటిలో వెలుగును చూసారు అంటే స్వయంగా దేవుడు ఇచ్చే  రక్షకున్ని చూసారు  అని అర్ధం.
  వారి జీవితంలో పాపం తొలగించబడినది అని అర్ధంకూడా.మన కోసం జన్మిoచిన శిశువు తనయొక్క పరిచర్య ద్వారా అద్భుతముల ద్వారా ,బోధనల ద్వారా   ఆశ్చర్యకరమైన కార్యములు ద్వారా అనేక మంది జీవితాలలో వెలుగు ను నింపారు. ఆయన పుట్టుకతో  ఈ లోకంలో వెలుగు నింపబడినది భూలోకం పవిత్ర  పరచబడింది.
 మన కుంటుంబంలో శిశువు  జన్మిస్తే   ఆ తల్లి మీద వున్నా అవమానం తొలిగిపోతుంది శిశువు     దుఃఖము  సంతోషంగా  మారుతుంది.
మనకోసం జన్మిoచిన   శిశువు మాటతప్పని వారు మనస్సు బాధ పెట్టని వారు ,సమర్దుడు మన కోసం తన జీవాన్నే త్యాగం చేసే వారు ,స్వస్థత పరిచే కుమారుడు
 ఆయన తండ్రితో నిత్యం వుంటూ తన దీవెనలు మనకు  ఇచ్చేవారు.
 యేసు ప్రభువు  జన్మిoచిన తరువాత ఆయన్ను కనుగొన్నది రెoడు వర్గాల వారు
1.గొల్లలు - సామాన్న ప్రజలు
2. జ్ఞానులు - అన్ని తెలిసినవారు
ఒక వర్గ  వారు ఏమి తెలియని సామాన్యులు రెండవ వారు అన్ని తెలిసినవారు.
రెoడు వర్గాల వారు ఆయన్ను మెసయ్యగా గుర్తించారు మిగతా సగం  సగం తెలిసినవారు  యేసయ్యను గుర్తించలేదు, అంగీకరించలేదు.
రెoడవ పఠనములో పౌలు గారు రక్షకుని  రాక గురించి చెబుతున్నారు సర్వమానవాళికి రక్షణ కృప  ఒసగబడినది .
 ఆయన ఈలోకంలో వున్నా వారి జీవితములను సరిచేయుటకు  ఆయన వచ్చి వున్నారు
 ఆయన రాకడ కోసమై  మనం -ఇంద్రియ నిగ్రహం కలిగి జీవించాలి ,ఋజు మార్గాన ప్రయాణించాలి, పవిత్రమైన  జీవితం  గడపాలి .ఈ వాన్ని జరిగినప్పుడు ఆయన మనలో  జన్మి స్తారు. కాబట్టి మన జీవితంలను సరిచేసుకోవాలి ఆయన కోసం తయ్యారవాలి. పునీత అగస్టీన్గారుఅంటున్నారు యేసుప్రభు ఈలోకానికి వచ్చింది మనకు దైవత్వం పంచటానికి మనలో దైవత్వం పెంచటానికి, దైవత్వం ఇవ్వడానికి వచ్చారు.
మన కొరకు పంపబడిన వారు లోక రక్షకుడు,
అయన మన పాపముల నుండి రక్షించే వ్యక్తి
అయన మనలను చేడు నుండి రక్షించే వ్యక్తి
అయన మనలను స్వార్ధం నుండి రక్షించే వ్యక్తి
అయన మనలను ఈలోక ఆశల నుండి రక్షించే వ్యక్తి
అశాంతి నుండి రక్షించే దేవుడు సాతాను బాధల నుండి రక్షించే దేవుడు.

అయన మన కొరకు పంపబడిన దేవుడు. అయన మరణించిన వారికే జీవమునిచ్చుటకు వచ్చిన పంపబడిన దేవుడు.
గాయ పడినవారికీ స్వస్థత ఇచ్చుటకు పంపబడ్డాడు.
త్రప్పిపోయిన గొర్రెలను వెదకి రక్షిన్చుటకు పంపబడ్డారు.
గ్రుడ్డువారికిచూపును ఇచ్చుటకు కృంటువారిని నడిపించుటకు చెవిటి వారికి వినికిడి ఇచ్చుటకు స్వర్గఅనుభూతుని ఇచ్చుటకు అయనపంపబడ్డారు.
సేవసేయడానికి అయన పంప బడ్డారు. ఆయనను దేవుడు పంపించింది మన కొఱకు అలానే మనం కుడా  ఈలోకానికి పంపబడ్డాం. మరి ఆయన లాగే మనం జీవిస్తున్నాము? దేవుని యొక్క ప్రణళికయె మనజీవితం దేవుడు పంపించారు కాబట్టి    ఈలోకానికి మనతల్లిదండ్రుల ద్వారా వచ్చాము, అయన మన కొరకు  వచ్చిన వ్యక్తియే   దేవుడు ఇమ్మానుయేల్ అనగా దేవుడుమనతో ఉన్నాడు. పవిత్ర గ్రంధం మనం క్షుణముగా తెలుసు కుంటే దేవుడు తన ప్రజలతో ఉన్నాడు.
ఇశ్రాయేలీయలను నడిపించుటకు దేవుడు వారిమధ్యలోనే ఉన్నారు, వారిని  నడిపిస్తున్నారు నిర్గమ ;   3: 14
దేవుడు వారితో ఉండాలనుకునారు. అయిన ప్రజలు అయన గొప్పతనం గ్రహించలేదు. ఆయనకు అవిశ్వాసముగా జీవించారు. యేసు ప్రభువారు  మన మధ్య లోకి వచ్చారు. మనవునిగా మన మధ్య జీవించారు.
మత్తయి: 14  : 16   దేవుడుమనతో ఉండాలని ఆశపడి 
పరలోకం వీడి   భువికి వచ్చారు.  అన్నీ వదిలేసుకొని వచ్చారు. ఇంకామనం అయనగొప్పతనం తెలుసుకోలేక పోతున్నాం.
దేవుడు మన కొరకు మన మధ్యకు 
వచ్చి ఉండాలనుకున్నారు. అయితే మనం దేవుని తో ఎలాగా ఉంటున్నాం.
క్రీస్తు జననం దేవుని మనకు దగ్గరకు చేర్చింది. ఆయనను మన కుటుంబ సభ్యులుగా పరిచయంచేసింది.
ఆయనను మన స్నేహితులుగాచేసింది.
పంపబడిన యేసుప్రభు యొక్క మంచితనం రక్షణకార్యంలో యేసు ప్రభువు   యొక్క జననం ఈరోజు మనం ధ్యానించు కొంటున్నాం.  అయితే ఆ జననములో నలుగురు ముఖ్య మైన వ్యక్తులు ఉన్నారు. 
తండ్రిదేవుడు, కుమారుడైనయేసుప్రభు, పవిత్రాత్మదేవుడు , మరియమ్మ యేసేపు
వీరు అందరు కూడా ప్రజల కొరకు మేలును మాత్రమే చేసారు. తండ్రి, పవిత్రాత్మ, కుమారుడుని ఈలోకంలో మేలు చేయడానికి పంపిస్తున్నారు. నా కుమారుడు వెంటనే వస్తున్నారు. అయన జీవితములో ఎవరికి హానిచేయలేదు. యేసు మానవ అవతారంకు  సహాకరించిన వారు మరియమ్మగారు యేసేపుగారు. వారు కుడా బిడ్డను తమ బిడ్డగా స్వీకరించారు. 
ఆయనను అనేక విధాలుగా కాపాడారు. 
వీరు అందరు కూడా ప్రజల కోసం ,శ్రీ యేసు కోసం పని  చేసిన వారే. వారి అభివృద్ధికి తోడ్పడిన వారే.

అదేవిధముగా మనం కుడా ఇతరుల మేలుకోరకు పని చేయాలి. 

వారికీ  మనకు ఉన్న దానితో సహాయం చేయాలి.
వారికీ ఇవ్వాల్సినంత ప్రేమను ఇవ్వాలి. క్రిస్మస్ పండుగ
 ద్వారా దేవుడు మనకు ఇచ్చిన  గొప్ప ఆశీర్వాదాలు
ఆయన మనలను దత్త పుత్రులుగాచేసారు గలతి : 4 : 5 మనలను తనబిడ్డలుగా అంగీకరించారు

క్రీస్తు జయంతి సామాన్యుల కు గుర్తుపునిచ్చింది. గొర్రెల కాపరులకు దేవుడు ఒక గుర్తింపు ఇస్తున్నారు.
వారికే గొప్ప దర్శనం కలగజేస్తున్నారు. యేసు ప్రభు వారికీ మనకు కూడా గుర్తిపును ఇస్తున్నాడు.
క్రీస్తు జయంతి దేవుని అభయం ఇస్తుంది. దేవుడు మనతో ఉన్నాడు అన్న అభయం.
క్రీస్తు జయంతి మనలను పాపముల నుండి వైదొలిగి నీతిమంతమైన జీవితం జీవించమని నేర్పిస్తుంది.
క్రీస్తు జయంతి మనకు జీవితం ప్రసాదిస్తుంది. ఆయనతో క్రొత్త జీవితం మొదలైంది. అలాగే ఈరోజు అయన
మనతో జన్మిస్తే క్రొత్తజీవితం ప్రారభించవచ్చు.
Rev.Fr.Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...