19, ఆగస్టు 2024, సోమవారం

యెహెఙ్కేలు 28:1-10, మత్తయి 19:23-30

యెహెఙ్కేలు 28:1-10, మత్తయి 19:23-30

అంతట యేసు తన శిష్యులతో, "ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే , ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరం అని మరల మీతో రూఢిగా చెప్పుచున్నాను" అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, "అట్లయిన ఎవడు రక్షణము పొందగలడు ?" అనిరి. అందుకు యేసు వారిని ఆదరముతో చూచి వారితో, "మానవులకు ఇది అసాధ్యము. కాని దేవునికి సమస్తము సాధ్యమే" అని పలికెను. అపుడు పేతురు యేసుతో, "మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి. మాకు ఏమి లభించును?" అనెను. అందుకు యేసు వారితో "పునఃస్థితి స్థాపన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు, నన్ను అనుసరించిన మీరును పండ్రెండు గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను గాని , సోదరులనుగాని, సోదరీలనుగాని, తల్లిని గాని తండ్రినిగాని, పిల్లలనుగాని భూములనుగాని త్యజించిన ప్రతివాడును నూరంతలు పొంది, నిత్య జీవమునకు వారసుడగుడను, అయినను మొదటివారు అనేకులు  కడపటివారు అగుదురు. కడపటివారు అనేకులు మొదటివారు అగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అనెను. 

ఈనాటి మొదటి పఠనంలో ప్రభువైన దేవుడు తన ప్రవక్తను పంపుతు నా ప్రజలకు నా సందేశాన్ని వినిపించు అంటున్నాడు.  అది ఏమిటంటే తూరు రాజు గర్వముతో, నేను దేవుడును అని పొంగిపోతున్నాడు. దేవుని స్థానంలో కూర్చోవాలనుకొనుచున్నాడు. దేవునితో సరి సమానుడనని అనుకుంటున్నాడు. నేనే దేవుడను అని జీవిస్తున్నాడు. నేను అందరికంటే తెలివైన వాడనని అనుకుంటూ జీవిస్తున్నాడు. పొగరెక్కి జీవిస్తున్నాడు. కాబట్టి ఈనాడు దేవుడు తన ప్రవక్తను ఆ తూరు రాజు దగ్గరకు పంపిస్తున్నాడు. సోదరులారా ఈనాడు మనలో చాలా మంది గర్వముతో పొంగిపోయేవారిని మనము చూస్తూనే ఉన్నాం. ఆస్తి చూసుకొని గర్వ పడేవారు ,డబ్బుచూసుకొని గర్వ పడేవారు, అందాన్ని చూసి , సంపదలు చూసి చాలా మంది గర్వముతో జీవించేవారు మన సమాజంలో ఉన్నారు. నాకు అన్ని తెలుసు అని అహంకారంతో, అజ్ఞానములో పడిపోతున్నాం. దేవుడు మనందరికీ ఒక గప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాడు.  అది ఏమిటంటే మనం ఎంత కష్ట పడి, ఎంత  సంపాదించినా ఏమి కూడా మన వెంట రాదు. అపుడు మనకు అర్ధం అవుతుంది మనం మానవులమేనని.  చాల మంది తాము   దేవుడిలాంటి వారిమి  అని అజ్ఞానములో అనుకున్నవి అబద్దాలు అని తెలుసుకుంటాము. ఎప్పుడైతె మనం గర్వంతో, స్వార్ధంతో  ఉంటామో మనలను మనము తెలుసుకోలేము. మనలను రక్షించడానికి దేవుడు తన ప్రవక్తలను మన వద్దకు పంపిస్తుంటాడు. ఎంత ఎదిగిన, ఎన్ని సంపాదించిన ఎన్ని ఉన్న మనం దేవుని వంటి వారము కాము. దేవుడిలా కాలేము ఎందుకంటే మనకున్నదంత దేవుడు మనకు ఇచ్చినదే.  ఆయన అన్ని తీసుకోగలడు. కాబట్టి ఎంత ఎదిగిన  ఒదిగి ఉండాలి. గర్వముతో కాకుండా విధేయతతో తగ్గింపు మనస్సుతో జీవించడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు. 

సువిశేష పఠనంలో దేవుడు అంటున్నాడు. ధనవంతుడు  పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము. ఎందుకు క్రీస్తు ప్రభువు ఈ మాటలను పలికి ఉన్నాడు? అంటే ధనవంతుడైన ఒక యువకుడు నేను పరలోక రాజ్యము పొందాలంటే ఏమి చేయాలి అని క్రీస్తు ప్రభువుని   అడిగినప్పుడు, నీకు ఉన్న దానిని అమ్మి, పేదలకు ధానము చేయుము అనగానే, ఆ యువకుడు అధిక సంపదలు కలవాడు కాబట్టి డబ్బు, సంపదల మీద ఉన్న ప్రేమ వలన , ఆశ వలన దైవరాజ్యానికి దూరమైపోతున్నాడు. మనలో కూడా ప్రియ  విశ్వాసులారా డబ్బు సంపాదనలో పడి, ఈ లోక సంపదలలో పడి దేవుడిని, పరలోక సంపదలను కోల్పోతున్నాము. 

అదే విధంగా దేవునికి  సమస్తము సాధ్యమే అని వాక్యం సెలవిస్తుంది. ఆయన తనను విశ్వసించి వెంబడించువారికి సమస్తమును సమృద్ధిగా ఇస్తాను అని     వాగ్దానం చేస్తున్నాడు. మనం దేవుని అనుసరిస్తే మనకు ఏమి  లభిస్తుంది అంటే 1. పునరుత్తాణ భాగ్యం. 2. పరలోక ఆసనం లభిస్తుంది. 3. నిత్యజీవమునకు వారసులగుతారు, 4. ఈ లోకంలో కడపటి వారు పరలోకంలో మొదటివారుగా ఉంటారు. 5. నూరంతలగ ఆత్మ బంధువులను పొందుదురు. కాబట్టి ప్రియా విశ్వాసులారా మనము ఎప్పుడైతే మన సంపదలను, మనకున్న సమస్తాన్ని పరిత్యజించి క్రీస్తును అనుసరిస్తామో అప్పుడు దేవుడు మనకు సమస్తాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి త్యాగ పూరిత జీవితం జీవించడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్ధన: దయామయుడైన దేవా! నీవు  తనను తాను తగ్గించుకొని, వినయంతో జీవించే ప్రతి వ్యక్తిని కరుణించి దీవించేవాడవు. కనుక తండ్రి మేము గర్వాత్ములము కాకుండా వినయ విధేయతలతో జీవించి ఈ లోక ఆశలు, ఈలోక సంపదలు, ఈ లోక వస్తువులో ఈ లోక వ్యక్తులను పరిత్యజించి నిన్ను వెంబడించే భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

మత్తయి 19: 16-22

 మత్తయి 19: 16-22

అంతట ఒక యువకుడు యేసుని సమీపించి, "బోధకుడా! నిత్యజీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పనియేమి?" అని ప్రశ్నించెను. "మంచిని గూర్చి నన్నేల ప్రశ్నించెదవు మంచివాడు దేవుడు ఒక్కడే. నిత్యజీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము" అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి?" అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, "నరహత్య చేయకుము. వ్యభిచరింపకుము. దొంగిలింపకుము. అబద్ధసాక్ష్యములు పలుకకుము. తల్లితండ్రులను గౌరవింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము" అనెను. అంతట అతడు యేసుతో "ఇవన్నియు ఆచరించుచుంటిని. ఇంకను నాకు లోటు ఏమి?"  అని అడిగెను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో, వెళ్లి నీ ఆస్తిని అమ్మి, బీదలకు దానము చేయుము.  అపుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము" అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపదగలవాడగుటచే, ఈ మాట విని బాధతో వెళ్లిపోయెను. 

ధ్యానము : నిత్య జీవము పొందుటకు నేను చేయ వలసిన మంచి పని ఏమిటి ప్రభువా? అని అడిగిన  ధనికుడైన యువకునికి, దేవుడు మాత్రమే మంచి వాడు అని ప్రభువు తేటతెల్లం చేస్తున్నారు. ఎందుకు దేవుడు ఒక్కడే మంచివాడు? అంటే   ఆయన ఎప్పుడు మంచినే చేస్తాడు, మానవుని వలే దురాలోచనలు, చేడు  పనులు, హత్యలు, దొంగతనాలు, అబద్దాలు, మోసాలు, కపటము, స్వార్ధం, లేక మానవునిలో కనపడే ఏ చేడు భావన దేవునిలో ఉండదు. ఆయన సకల సద్గుణాల నిధి. ఇతరుల ఉన్నతిని కోరువాడు. ఆయన ప్రేమామయుడు. పునీత పౌలు, యోహానులు చెప్పినట్లు ఆయన ప్రేమ. ప్రేమ సమస్తమును భరిస్తుంది. కాని మానవుడు తనకు వ్యతిరేకముగా ఏదైనా జరిగితే ఓర్చుకోలేడు. దేవుడు ఈ ఆజ్ఞలు మనకు ఇవ్వడం వలన మనం కూడా అయన వలే ఉండాలని కోరుతున్నాడు. కేవలం మానవ స్వభావం కాక దైవిక స్వభావం మనలో ఉండాలని కోరుకుంటున్నారు.    

యేసు ప్రభువు ఆ యువకునితో నిత్య జీవం పొందుటకు దైవాజ్ఞలను ఆచరింపమని చెబుతున్నారు.  యువకునికి ఉన్న కోరిక నిత్య జీవం పొందాలని. యువకుడు అడిగినది యేసు  ప్రభువును. కేవలం యేసు ప్రభువు మాత్రమే నిత్య జీవం ఇవ్వగలడు. కాని నిత్య జీవం ఇచ్చే ప్రభువు, దేవుని ఆజ్ఞలను పాటించు అని చెబుతున్నాడు. దేవుని ఆజ్ఞలు మనలను నిత్య జీవం పొందుటకు అర్హులను చేస్తాయి. దేవుని ఆజ్ఞలు ఏమి? అని యువకుడు ప్రభువును అడుగుతున్నాడు.  యేసు ప్రభువు ఆ యువకునికి నిత్య జీవితానికి మనలను అర్హులను చేసే  దేవుని ఆజ్ఞలను వివరిస్తున్నాడు. అవి ఏమిటి అంటే నరహత్య చేయకుండా ఉండటం, వ్యభిచరించకుండా ఉండటం, దొంకిలింపకుండా ఉండటం, అబద్ద సాక్ష్యములు చెప్పకుండా ఉండటం, తల్లితండ్రులను గౌరవించడం, ఒక వ్యక్తి తనను తాను ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించడం ఇవి ఒక వ్యక్తిని నిత్యజీవం పొందేలా చేస్తాయి. ఇవి కేవలం మనలను నిత్య జీవం పొందేలానే కాక దేవుని మనస్సును కలిగి ఉండేలా చేస్తాయి.  మనలను దేవునికి ఇష్టమైన వారిగా చేస్తాయి. 

ఆ యువకుడు ఈ ఆజ్ఞలన్నిటిని చిన్నప్పటి నుండి పాటిస్తున్నాను అని చెబుతున్నాడు. కాని ఆ యువకునిలో ఎదో ఓక  లోపం ఉన్నది అని ఆ యువకునికి అనిపిస్తుంది.  ఎందుకు ఆ యువకుడు అలా అనుకుంటున్నాడు అంటే నిత్యజీవాన్ని ఇచ్చే ఈ ఆజ్ఞలను ఆ యువకుడు పరిపూర్తిగా పాటించి ఉండడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలలో  నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అని చెబుతున్నాయి. ఈ యువకుడు నేను చిన్నప్పటి నుండి చేస్తున్నాను అని అన్నప్పటికీ, ప్రభువు, నీవు పరిపూర్ణుడవు కాగోరినచో నీవు నీ ఆస్తిని అమ్మి బీదలకు  దానము చేయుము అని అంటున్నాడు. అంటే ఈ యువకుడు తనతో పాటు ఉన్నటువంటి పేదలను పట్టించుకోలేదు. ఈ లోపం ఈ యువకునిలో ఉన్నది. అదే విధంగా తన ఆస్తిని వదులుకోవడానికి ఇష్ట పడటం లేదు, తన ఆస్తిని నిత్య జీవం కంటే ఎక్కువగా ఆ యువకుడు ప్రేమించాడు. కనుకనే ఆ యువకుడు బాధతో వెళ్ళిపోతున్నాడు. తన ఆస్తిని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడుటలేదు. యేసు ప్రభువు పరలోకంలో ఆస్తిని కూడపెట్టుకొనే మార్గం చూపిన కేవలం ఈలోకం ఆస్తుల మీదనే ఆ యువకుడు ధ్యాస పెట్టాడు. 

దేవునితో సంభాషణ: ప్రభువా నేను కూడా యువకుని వలే  నిత్య జీవం పొందాలనే ఆశ కలిగి ఉన్నాను. మీ గురించి విన్నప్పుడు, మీ గురించి చదివినప్పుడు, మీరు మాత్రమే ఈ నిత్య జీవం ఇవ్వగలరని తెలుసుకున్నాను. మీరు మాత్రమే  ఇవ్వగలిగే ఆ నిత్య జీవం పొందాలని అనుకుంటాను. కాని ఆ నిత్య జీవం పొందుటకు నన్ను అర్హున్నీ చేసేటువంటి మీ అజ్ఞాలను నేను పాటించుటలో అనేక  సార్లు విఫలం చెందుతున్నాను. నన్ను నేను ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించుటలో విఫలం చెందాను. ఇతరులు గొప్పగా ఉండే ఓర్చుకోలేకపోయాను. అనేకసార్లు మీ అజ్ఞలను పాటించుటలో పూర్తిగా విఫలం అయ్యిపోయాను. నన్ను నేను ప్రేమించాను, అభిమానించాను, వృద్ధిలోకి రావాలని కాంక్షించాను,  కాని ఇతరులను అలా చూడలేక పోయాను. నిన్ను అనుసరించాలని, నీ వలె ఉండాలని, నిత్య జీవం పొందాలని అనుకుంటున్నాను. ఈ లోక విషయాలు, ఆస్తుల మీదనే నా మనసును కేంద్రీకరించాను కాని నీ వలె తండ్రి చిత్తము మీద నా మనస్సును పెట్టలేక పోతున్నాను. 

ప్రార్ధన: ప్రేమమయుడవైన ప్రభువా! మీరు నిత్య జీవం పొందుటకు మమ్ములను అర్హులను చేయుటకు మేము చేయవలసిన క్రియలను మాకు తెలియజేస్తున్నారు. మీరు ఇచ్చిన ఆజ్ఞలను అన్నింటిని పాటించుటకు కావలసిన అనుగ్రహాలు మాకు దయచేయండి. పరలోకంలో ఆస్తిని కూడపెట్టుటకు ఈ లోకంలో ఏమి కోల్పోవుటకైనను సిద్దపడే మనస్సును మాకు ఇవ్వండి.  నన్ను నేను ప్రేమించుకొనునట్లు ఇతరులను ప్రేమించుటకు, మీవలె సకల సుగుణాలు కలిగి ఉండుటకు కావలసిన అనుగ్రహాలు మాకు దయచేసి, మేము తండ్రి వలే పరిపూర్ణులమగుటకు కావలసిన అనుగ్రహములు దయచేయండి. ఆమెన్ 

తపస్సుకాలపు రెండొవ ఆదివారము

తపస్సుకాలపు రెండొవ ఆదివారము ఆదికాండము 15:5-12, 17-18 ఫిలిప్పీయులు 3:17-4:1 లూకా 9:28-36           క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ  దేవుని ...