29, మార్చి 2025, శనివారం

తపస్సు కాలపు నాలుగోవ ఆదివారం

తపస్సు కాలపు నాలుగోవ ఆదివారం
యెహోషువా 5:9-12
2 కొరింథి 5: 17-21
లూకా 15: 1-3, 11-32
                   క్రీస్తునాధునియందు ప్రియ విశ్వాసిని విశ్వాసులరా, ఈ నాడు మనమందరము కూడా తపస్సు కాలపు నల్గొవా ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము. ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనలను మనం ద్యానించినట్లయితే మూడు పఠనలు కూడా నూతన జీవితం యొక్క సందేశాన్ని మనకు అందజేస్తున్నాయి. 
              అసలు నూతన జీవితం అంటే ఏమిటి అని గ్రహించినట్లయితే పునీత అసిస్సిపురి ఫ్రాన్సిస్ వారు, అవిలాపురి తెరెసమ్మ గారు మరియు సిలవా యోహాను గారు ఈ విధంగా అంటున్నారు నూతన జీవితం అనేది: 
* నూతన జీవితం అనేది క్రీస్తు అడుగు జడలో నడవటం మరియు అయన ఉదాహరణలను అనుసరించడం, 
* నూతన జీవితం అంటే ప్రపంచంలోని భోగభాగ్యలకు దూరంగా ఉండటం మరియు నిరాడంబరమైన జీవితాన్ని గడపటం.
* నూతన జీవితం అంటే దేవుని సృష్టిలో సామరహస్యం జీవించడం మరియు దానిని సంరక్షించడం.
* నూతన జీవితం అంటే ఇతరులను నిస్వార్థంగా ప్రేమించటం మరియు అవసరాలను తీర్చుటకు సిద్ధంగా ఉండటం.
* నూతన జీవితం అంటే మన పాపాల నుండి వైదోలగడం మరియు దేవుని వైపు తిరగడం.
* నూతన జీవితం అంటే దేవునితో నిరంతరం సంభాసించటం మరియు అయన చిత్తని తెలుసుకొవడానికి ప్రయత్నించటం.
* నూతన జీవితం అంటే దేవునిపై పూర్తిగా నమ్మకం ఉంచడం మరియు అయన మార్గదర్శకత్వనికి లోబడి జీవిచడం.
* పునీత సిలువ యోహాను గారికి నూతన జీవితం అంటే మన కోరికలను మరియు అటాచ్మెంట్‌లను అధిగమించడం మరియు దేవునిపై మాత్రమే ఆధారపడటం.
* పునీత అవిలాపురి తెరెసమ్మ మరియు సిలువ యోహాను. వారిద్దరికి కూడా నూతన జీవితం అనేది నిరంతర ఆధ్యాత్మిక ప్రయాణం అని మరియు అది దేవుని ప్రేమలో మరింతగా ఎదగడానికి మనలను పిలుస్తుందని బోధించారు.
                యెహోషువ 5:9-12:
ఈ మొదటి పఠనములో ఇశ్రాయేలీయులు ప్రజలు వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత జరిగిన ముఖ్యమైనటువంటి సంఘటన గురించి వివరించబడింది. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు చేయబడని సున్నతి గిల్గాలులో చేయబడుతుంది. దీని అర్థం ఏమిటంటే, వారు ఐగుప్తు బానిసత్వం యొక్క కళంకాన్ని తొలగించుకున్నారు మరియు దేవుని ఎన్నిక చేసుకున్న నూతన ప్రజలుగా కొత్త ప్రారంభాన్ని పొందారు. దీని తర్వాత వారు మొదటిసారిగా ఆ దేశపు పంటను తిన్నారు మరియు అప్పటివరకు వారికి ఆహారంగా ఉన్న మన్నా అక్కడితోటి ఆగిపోయింది. ఈ సంఘటన మన జీవితాలకు ఒక గొప్ప గుణ పాఠాన్ని నేర్పుతుంది. మనం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపం యొక్క బంధకాల నుండి విడుదల పొందుతాము. బాప్తిస్మం అనేది మన జీవితంలో ఒక నూతన ప్రారంభాన్ని మరియు నూతన జీవితాన్ని ప్రారాంబించటం సూచిస్తుంది. ఇకపై మనం పాత జీవితానికి చెందినవారం కాదు అని క్రీస్తునందు కొత్త సృష్టిగా జీవిస్తాము. దేవుడు మనకు అవసరమైన ప్రతిదాన్ని సరైన సమయంలో అందిస్తాడు. అరణ్యంలో మన్నాను అందించిన దేవుడే, వాగ్దాన భూమిలో పంటను కూడా అందించాడు. అదే విధంగా మనం ఆయనపై నమ్మకం ఉంచితే, మన అవసరాలను ఆయన తప్పకుండా తీరుస్తాడు అని ఈ నాటి మొదటి పఠనములో దేవుడు తెలియజేస్తున్నాడు.
            2 కొరింథీయులు 5:17-21:
ఈ రెండొవ పఠనములో క్రీస్తునందు  ఎవరైతే ఉంటారో వారి యొక్క నూతనత్వాన్ని మరియు దేవునితో సమాధానపడే అవకాశాన్ని గురించి మాట్లాడుతుంది. ఎవరైనా క్రీస్తునందు ఉంటే, వారు నూతన సృష్టి పునీత పౌలు గారు అంటున్నారు. అంటే మనలో ఉన్నటువంటివి పాతవి గతించిపోయి, ఇదిగో కొత్తవి వచ్చాయి ఇదంతా దేవుని ద్వారానే సాధ్యమైంది అంటు,  క్రీస్తు ద్వారా మనలను తనతో సమాధానపరచుకున్నాడు అని మరియు ఆ సమాధాన పరిచర్యను మనకు అప్పగించాడు. యేసు క్రీస్తు పాపం చేయకపోయినా, మన కొరకు పాపవిమోచకుడిగా చేయబడ్డాడు, తద్వారా మనం దేవుని నీతి బిడ్డలుగా తీర్చిదిద్దాబడ్డము. ఈ మాటలు మనకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తాయి. క్రీస్తునందు మనం కొత్త జీవితాన్ని ప్రారంభించగలము. దేవుడు మనలను తనతో సమాధానపరచుకోవడమే కాకుండా, ఇతరులను కూడా ఆయనతో సమాధానపరచడానికి మనలను రాయబారులుగా నియమించాడు. ఇది మనకు ఇవ్వబడిన గొప్ప నూతన అధ్యాద్మిక బాధ్యత.
                  లూకా 15:1-3, 11-32:
చివరికి సువిశేష పఠనములో యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమానం గురించి ఇది దేవుని యొక్క అపారమైన ప్రేమను మరియు క్షమాపణను చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చిన్న కుమారుడు తన తండ్రి ఆస్తిని తీసుకొని దూర దేశానికి వెళ్లి దుర్వ్యసనాలతో దానిని నాశనం చేసుకుంటాడు. చివరికి దిక్కులేని స్థితిలో తన తండ్రి వద్దకు తిరిగి వస్తాడు. తండ్రి అతన్ని చూసి జాలిపడి పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుంటాడు మరియు ఘనంగా విందు ఏర్పాటు చేసి సంతోషిస్తాడు. అయితే పెద్ద కుమారుడు దీనిని చూసి అసూయపడతాడు. ఈ ఉపమానంలో తండ్రి దేవునికి, ఇద్దరు కుమారులు కూడా మానవులకు ప్రాతినిధ్యం వహిస్తారు. చిన్న కుమారుడు పాపంలో పడిపోయిన మరియు దేవునికి దూరమైన వ్యక్తిని సూచిస్తాడు. అతని పశ్చాత్తాపం మరియు తిరిగి రావడం అనేది దేవుని క్షమాపణను పొందడానికి అవసరమైన హృదయ మార్పును తెలియజేస్తుంది. తండ్రి యొక్క నిస్వార్ధమైన ప్రేమ మరియు క్షమాపణను మరియు దేవుని యొక్క కరుణను మరియు ఆయన పాపులను స్వీకరించే విధానాన్ని చూపిస్తుంది. పెద్ద కుమారుడు తమ నీతిని గూర్చి గర్వపడే మరియు ఇతరులను తక్కువగా చూసే వారిని సూచిస్తాడు. దేవుని ప్రేమ అందరికీ అందుబాటులో ఉంటుందని మరియు మనం ఇతరుల పశ్చాత్తాపం పట్ల సంతోషించాలి అని ఈ ఉపమానం మనకు నేర్పుతుంది. 
           కాబ్బట్టి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ప్రేమగలవాడు మరియు క్షమించేవాడు. ఆయన మనలను పాపం యొక్క బంధకాల నుండి విడిపించడానికి, మనకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి మరియు తనతో సమాధానపరచుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయనపై విశ్వాసం ఉంచాలి, మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడాలి మరియు ఆయన ప్రేమను ఇతరులతో పంచుకోవాలి అప్పుడే మనం ఒక నూతన సృష్టిగా లేకపోతే నూతన వ్యక్తులుగా పరిగనింపబడతాము. మరి అటువంటి దీవెనలకొరకై మనమందరము ఈ బలి పూజలో ప్రార్దించుకుందాము.

22, మార్చి 2025, శనివారం

తపస్సు కాలపు మూడవ ఆదివారము

తపస్సు కాలపు మూడవ ఆదివారము 

నిర్గమ 3:1-8, 13-15
1కొరింథీ 10:1-6, 10-12
లూకా 13:1-9
క్రీస్తునాధునియందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనము  తపస్సు కాలపు మూడవ ఆదివారంలోనికి ప్రవేశించియున్నాము. ఈ నాటి మూడు దివ్యాగ్రంధ పఠనములు మనకు దేవునితో మన సంబంధం గురించి మరియు ఆయనకు మహిమను తెచ్చే జీవితాలను ఎలా జీవించాలని అనే  ముఖ్యమైన అంశాల గురించి తెలియజేస్తున్నాయి.
           అసలు దేవునితో సంబంధం అంటే ఏమిటి అని మనం గ్రహించినట్లయితే పునీత అవిలాపురి తెరెసమ్మ గారు  ఈ విధంగా అంటున్నారు. 
1. వ్యక్తిగత అనుభవం: ప్రతి ఒక్కరి జీవితములో కూడా దేవునితో ఒక వ్యక్తిగతమైన సబంధం ఉండాలని మరియు మన హృదయాలలో దేవునితో ఒక ప్రత్యేకమైన సంభందం  ఉండాలని ఈ మొదటి మాటలో అంటున్నారు.
2. స్నేహం: ఆమె ప్రార్థన దేవునితో ప్రేమపూర్వకమైన స్నేహం అంటున్నారు.  ఎందుకు ఆమె ఆలా అంటున్నారు అంటే స్నేహితులు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటారో, తమ సంతోషాలను మరియు బాధలను పంచుకుంటారో, అదే విధంగానే మనం కూడా దేవునితో మన హృదయాన్ని తెరవాలని ఒక స్నేహితునివలె మనము కూడా ఆయనతో మాట్లాడాలని తెలియజేస్తున్నారు.
3. ఆత్మ పరిశీలన: దేవునితో మన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ఆత్మ పరిశీలన చాలా ముఖ్యమైన సాధనమని ఆమె అంటున్నారు. మన బలహీనతలను మరియు మన పాపాలను గుర్తుచేసుకొని వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి ఆమె మనకు తెలియజేస్తున్నారు. 
                          ఈ విధమైనటువంటి సంబంధాన్ని  మనం  జీవిచాలని ఆమె అంటున్నారు. ఈ నాటి పఠనలుకూడా ఇదే విషయాన్ని  మనకు తెలియజేస్తున్నాయి. 
           ముందుగా మొదటి పఠనములో మోషే దేవుని యొక్క పిలుపును అందుకుంటాడు. దేవుడు మండుతున్న పొద రూపంలో మోషేకు ప్రత్యక్షమై, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్న వారిని విడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకుంటానాడు. ఇక్కడ, దేవుడు మోషేతో తనను తాను 'నేను ఉన్నవాడను' అని పరిచయం చేసుకుంటాడు, ఇది ఆయన శాశ్వతత్వాన్ని, స్వయం సమృద్ధిని మరియు విశ్వాసనీయతను తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు తన ప్రజల బాధలను చూసి, వారిని విడిపించడానికి ఒక గొప్ప నిర్ణయాన్ని  తీసుకున్నాడు. అంతేకాకుండా ఇక్కడ దేవుని పిలుపు మరియు ఆయన శక్తిని ఈ సంఘటనద్వారా మనకు తెలియజేస్తుంది. ఇక్కడ మనము గమనించలసింది దేవుని పేరు యొక్క ప్రాముఖ్యత మరియు ఆయనతో మన సంబంధం గురించి ఇది తెలియజేస్తుంది. 
         రెండవ పఠనములో  పౌలు ఇశ్రాయేలీయుల ఎడారి ప్రయాణం నుండి నేర్చుకోవలసిన గుణ పాఠాల గురించి కొరింథీయులకు గుర్తుచేస్తున్నాడు మరియు వివరిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని అద్భుతాలను చూసినప్పటికీ, వారు అవిధేయత, విగ్రహారాధన మరియు సణుగుడు ద్వారా పాపం చేశారు అని పౌలు గారు వారి అనుభవాలను మనకు హెచ్చరికగా ఉపయోగిస్తాడు, తద్వారా మనం అదే తప్పులు చేయకుండా ఉంటాము అని దేవునితో సభందం కలిగి జీవిస్తామని అంటున్నారు.
అంతేకాకుండా ఇక్కడ మనం దేవుని విశ్వాసనీయతను అంత తేలికగా తీసుకోకూడదు. మన హృదయాలను పాపం నుండి కాపాడుకోవాలి మరియు దేవునికి విధేయత చూపాలి అని అంటున్నారు. ఎందుకంటే గర్వం అనేది మన పతనానికి దారితీస్తుందని కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయంగా ఆయనతో సంబంధం  కలిగి ఉండాలని అంటున్నారు.
         చివరిగా సువిశేష పఠనములో యేసు పీలాతు చేతిలో చంపబడిన గలిలయుల గురించి మరియు సిలోయము గోపురం కూలి చనిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఈ సంఘటనలు ఎందుకు క్రీస్తు వారికీ తెలియజేస్తున్నాడంటే పాపులు పశ్చాత్తాపపడకపోతే వారు కూడా నాశనం అవుతారని హెచ్చరికగా ఉపయోగిస్తాడు. యేసు ఒక అంజూరపు చెట్టు ఉపమానాన్ని కూడా చెబుతాన్నాడు, ఇది దేవునిపట్ల మన పశ్చాత్తాపం మరియు ఫలాలను ఉత్పత్తి చేయడం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తుంది. మనం మన పాపాలను విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని వైపు తిరగాలుగుతామో. అపుడే దేవుడు మనకు పశ్చాత్తాపపడటానికి అవకాశాలను ఇస్తాడు, కానీ మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మనం దేవునికి ఫలాలను ఇచ్చే విధంగా మనం మారాలని, అంటే మనం ఆయనకు మహిమ తెచ్చే జీవితాలను జీవించాలి తెలియజేస్తున్నాడు.

కాబట్టి  ప్రియా దేవుని బిడ్డలరా ఇక్కడ మనం నేర్చుకోగల కొన్ని సాధారణ గుణాలు మనకు కనిపిస్తాయి. దేవుడు నమ్మదగినవాడు మరియు విశ్వాసనీయుడు. మనం పాపం నుండి పశ్చాత్తాపపడాలి మరియు దేవునికి విధేయత చూపాలి.
 కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఈ  తపస్సు కాలం మనం పశ్చాత్తాపాన్ని, విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడానికి, దేవునిచే అనుగ్రహించబడిన సమయం కాబట్టి  మన పాపాలను దేవుని ముందు ఉంచుతు పశ్చాత్తాపం పడి దేవునితో సంబంధం  కలిగి జీవించాలని ప్రార్దించుకుందాము.

Fr. Johannes OCD

15, మార్చి 2025, శనివారం

తపస్సుకాలపు రెండొవ ఆదివారము

తపస్సుకాలపు రెండొవ ఆదివారము
ఆదికాండము 15:5-12, 17-18
ఫిలిప్పీయులు 3:17-4:1
లూకా 9:28-36

          క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ  దేవుని  దైవ భక్తులారా, ఈ రోజున మనమందరము తపస్సుకాలపు రెండవ  ఆదివారం లోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ నాటి మూడు పఠనలు కూడా మనం దేవుని విశ్వసించాలి, క్రీస్తును అనురించాలి మరియు ఆయన మాట వినాలి అని తెలియజేస్తున్నాయి ఎందుకంటే అలా చేయడం ద్వారా, మనం ఆయన వాగ్దానాలను పొందుతాము మరియు ఆయన మహిమలో పాలుపంచుకుంటాము అని క్లుప్తంగా వివరిస్తున్నాయి.
           మొదటి పఠనములో ఆదికాండము  నుండి చూస్తున్నాము ఇక్కడ అబ్రాహామునకు మరియు దేవునికి మధ్య ఒక ఒప్పందం గురించి తెలియజేస్తుంది. దేవుడు అబ్రామునకు ఆకాశంలోని నక్షత్రాలను చూపించి, అతని సంతానం ఆలాగే ఉంటుందని వాగ్దానం చేస్తున్నాడు. దానికి గాను అబ్రాము దేవునిపై విశ్వాసం చూపిస్తున్నాడు, ఇది అతనికి బహు మంచిగా అనిపించింది. మరల కొద్దీ సేపటి తర్వాత అబ్రాము దేవుని వాగ్దానం గురించి అనుమానం వ్యక్తం చేసాడు అది ఏవిధంగానంటే తన సంతానం ఈ భూమిని ఎలా పొందుతుందని  దేవుని అడిగాడు. దానికి గాను దేవుడు అబ్రాహాముతో నీవు దీనిని నమ్ముటకు కొన్ని జంతువులను తెచ్చి, వాటిని రెండుగా కోసి, ఒకదానికొకటి ఎదురుగా అమర్చమని చెప్పాడు. ఈ ఒప్పంద విధిలో భాగంగా, దేవుడు ఒక పొగమంచు పొగ మరియు మంట దీపం రూపంలో జంతువుల మధ్య దీర్ఘంగా నడిచాడు. దానికి గాను ఈ ఒప్పందంలో దేవుడు అబ్రాము సంతానానికి కనాను అను భూమిని ఇస్తానని వాగ్దానం చేసియున్నాడు. అబ్రాము సంతానం నాలుగు వందల సంవత్సరాలు బందీలుగా ఉంటారని, తర్వాత వారు గొప్ప సంపదతో తిరిగి వస్తారని దేవుడు అబ్రాహామునకు ఒక కచ్చితమైనటువంటి మాటను చెప్పాడు. ఇక్కడ ఈ వచనలలో దేవుని విశ్వాసనీయతను మరియు ఆయన వాగ్దానాలను నెరవేర్చే శక్తిని చూపిస్తుంది. అబ్రాహాము దేవునిని విశ్వసించినట్లే, మనం కూడా ఆయనను విశ్వసించాలి మరియు ఆయన వాగ్దానాలపై ఆధారపడి జీవిస్తుండాలి, ఎందుకంటే మనము కూడా అబ్రాహాము వలే దేవునిపై విశ్వాసం ఉంచి జీవిస్తే అయన వలే మనము కూడా దివించబడతాము. కాబట్టి ఆ ఆశీర్వాదలను ఎలా పొందలో అబ్రాహామును ఒక ఉదాహరణగా తీసుకోవాలని మొదటి పఠనము మనకు వివరిస్తుంది.
            తరవాత రెండవ పఠనములో  పౌలు గారు ఫిలిపియులైన క్రైస్తవులకు సరైన మార్గంలో నడవాలని సలహా ఇస్తున్నాడు. అతను తనను  అనుసరించమని చెబుతున్నాడు. ఈ సందర్భంలో  పౌలు ఎందుకు ఆ ప్రజలను ఆవిధంగా అంటున్నాడంటే అతని విశ్వాసం మరియు నిబద్ధతను అనుసరించమని సలహా ఇస్తున్నాడు. అదేసమయంలో, కొందరు ప్రజలు వారి శరీరాన్ని దేవుని దృష్టిలో అపవిత్రం చేస్తున్నారని మరియు వారికీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారని వారి జీవితాలను బట్టి పౌలు ఆవిధంగానైనా వారిని తిరిగి దేవుని చెంతకు తీసుకునిరావాలన్నా ఆలోచనతోటి వారిని హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా, వారు ప్రభువులో స్థిరంగా నిలబడాలని కోరుకుంటున్నాడు. ఈ విధంగా, పౌలు ఫిలిప్పీయులకు మంచి మార్గంలో నడవడం మరియు దేవుని వాక్యాన్ని పాటించడం గురించి బోధిస్తున్నాడు. కనుక మన జీవితంలో కూడా అనేక సార్లు మనకిష్టమొచ్చినట్లు జీవిస్తూ ఉంటాము. కాబ్బటి ఈనాటి నుండి మనమందరము చెడు జీవితాన్ని వదలిపెట్టి మంచి మార్గాన్ని ఎంచుకోవడం మరియు దేవుని వాక్యాన్ని పాటించడం గురించి ఆలోచించడం మొదలు పెట్టమని పౌలు గారు మనలను  ఈ రెండవ పఠనము ద్వారా హెచ్చరిస్తున్నాడు.
           చివరిగా సువిశేష పఠనములో  యేసు ప్రభువుని రూపాంతరికరణము గురించి చెప్పబడింది. యేసుక్రీస్తు మొషే మరియు ఎలియా  కలిసి ఉండగా రూపాంతరం చెందాడు. ఈ సందర్భంలో ఇక్కడ మన ఆలోచన ఏవిధంగా ఉండాలంటే యేసు ప్రభువు యొక్క విశ్వాసం మరియు అయన యొక్క వాక్య పరిచర్య మరియు అయన వచ్చిన పనిని గురించి ఆలోచించామని మనకు సలహా ఇస్తుంది. ఇక్కడ మనం గమనించలసింది ఏమిటంటే, యేసు తన శిష్యులైన పేతురు, యోహను, యకోబులను వెంటబెట్టుకొని పర్వతము మీదికి తీసుకొని వేలతాడు. అక్కడికి వెళ్లిన తరువాత యేసుక్రీస్తు రూపాంతరం చెండుతాడు. అయన ముఖం మారిపోయి, తన వస్త్రాలు ప్రకాశవంతంగా మారుతాయి. మోషే మరియు ఎలియా ప్రవక్తలు  ఆయనతో సంభాసించటం వారి ముగ్గురికి కనిపిస్తారు. అక్కడ వారు ముగ్గురు అయనకు జెరూసలేములో సంభవించే మరణం మరియు పునరుత్థానం గురించి మాట్లాడారు వారు మాట్లాడుకుంటారు. ఇది అంత జరిగిన తరువాత వారు తిరిగి కిందకు వచ్చే సమయములో ఒక మేఘం వారిని కమ్ముకుంటుంది. ఆ మేఘం నుండి ఒక స్వరం వారికీ వినిపిస్తుంది, అది ఏమిటంటే ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను ఏర్పరచుకొనినవాడు; ఆయన మాట వినుడు అని ఒక శబ్దం వస్తుంది. ఇక్కడ మనం గమనించలసింది.
ఈ సంఘటన యేసు యొక్క దైవత్వాన్ని మరియు ఆయన తండ్రితో ఉన్న ప్రత్యేక సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మోషే మరియు ఏలీయా కనిపించడం ద్వారా పాత నిబంధన యేసులో నెరవేరుతుందని చూపిస్తుంది. తండ్రి స్వరం యేసును ఆయన కుమారుడిగా ధృవీకరిస్తుంది మరియు ఆయన మాట వినమని మనకు ఆజ్ఞాపిస్తుంది. కాబట్టి మనము అయన మాట విని దేవుని ఆశీర్వాదలు పొందాలని మనము ప్రార్థన చేసుకోవాలి మరియు ఆయనను విశ్వాసించాలి.
        కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా ఈ తపస్సు కలమంతా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశము, అంతే కాకుండా మన విశ్వాసాన్ని దేవుని పట్ల ఏంతగా ఉందొ నిరూపించుకొనే ఒక గొప్ప అవకాశము, అందుకని మనం మన విశ్వాసాన్ని దేవుని ముందు వ్యక్తపరుచుచు అయన యడల మన విశ్వాసాన్ని చూపిస్తూ జీవించాలని ఈ దివ్యబలి పూజలో విశ్వాసంతో ప్రార్థించుకుంటు పాల్గొందాము.
Fr. Johannes OCD 

8, మార్చి 2025, శనివారం

తపస్సుకాలపు మొదటి ఆదివారము


ద్వితీయోపదేశకాండము 26:4-10, రోమీయులకు 10:8-13, 
లూకా 4:1-13.

          క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియా  దేవుని భక్త జనులరా , ఈ రోజున మనమందరము తపస్సుకాలపు మొదటి ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము, ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనములను మనం ద్యానించినట్లయితే, ఈ మూడు పఠనలు కూడా మనకు ముఖ్యమైనటువంటి కొన్ని అవసరమైనటువంటి అంశముల గురించి తెలియజేస్తునాయి. అవి విశ్వాసం, విధేయత మరియు దేవుని యొక్క విశ్వసనీయత యొక్క ప్రాముఖ్యతను గురించి చెబుతున్నాయి. 

                ముందుగా మనము మొదటి పఠనమును గమనించినట్లయితే ఈ యొక్క మొదటి పఠనములో. దేవుని కృపకు గుర్తుగా ఇశ్రాయేలీయుల యొక్క పంట మొదటి ఫలాలను దేవునికి అర్పించేటువంటి ఆచారాన్ని గురించి వివరిస్తుంది.
అంతే కాకుండా దేవుడు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నప్పుడు వారిని విడిపించి, వాగ్దాన భూమికి నడిపించిన విధానాన్ని కూడా మనకు గుర్తుచేస్తుంది.
అంతే కాకుండా దేవుడు తన ప్రజలకు చేసిన మంచి పనులను గుర్తుచేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
మన జీవితంలో కూడా దేవుడు అనేక సార్లు అనేక విధాలుగా ఎన్నెన్నో చేసిన మేలులను ఈ సమయాన మనము గుర్తుచేసుకొని, దేవునికి కృతజ్ఞతలు చెప్పడం చాలా ముఖ్యం. ఎందుకంటే పాపం అనే జీవితములో మనము అనేక సార్లు దేవునికి వెతిరేకంగా చేసిన కూడా అయన మనలను క్షమించి మరల అయన చెంతకు తీసుకున్నాడు. కాబ్బటి మనము కూడా ఇజ్రాయెల వాలే దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరిగి అయన చెంతకు రావాలని మొదటి పఠనము మనలను ఆహ్వానిస్తుంది.
                 రెండొవ పఠనములో రోమీయులకు 10:8-13లో 
యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించడం మరియు మన జీవితములో విశ్వసించడం ద్వారా రక్షణ పొందవచ్చని మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే యేసు ప్రభువు ప్రభువు అని విశ్వాసిస్తామో అప్పుడే మనము అయన ద్వారా రక్షింపబడతాము(10:9). ఇక్కడ విశ్వాసం యొక్క సార్వత్రిక స్వభావాన్ని నొక్కి వక్కనించి చెబుతుంది, ఇక్కడ యూదుడని గ్రీసుదేశస్థుడని భేదములేదు. అందరూ కూడా ఒకటేనాని ఒక్క ప్రభువే అందరికి ప్రభువైయునాడని. ఆయనను నమ్మడం ద్వారా ఎవరైనా రక్షణ పొందవచ్చు అని తెలియజేస్తుంది. ఇక్కడ మనము పూర్తిగా గమనించినట్లయితే ఇది మనకు దేవుని ప్రేమను, ఆయన రక్షణ ప్రణాళికను గురించి తెలియజేస్తుంది. కాబ్బటి మనము కూడా అదే విశ్వాసాన్ని దేవుని పట్ల చూపిస్తూ జీవించాలని రెండొవ పఠనము మనకు వివరిస్తుంది.   
                చివరిగా సువిశేష పఠనములో  యేసు ఎడారిలో శోధించబడిన వృత్తాంతాన్ని గురించి వివరిస్తుంది. యేసు సాతాను శోధనలను లేఖనాల ద్వారా జయించాడు. ఇక్కడ విశ్వాసం మరియు దేవుని వాక్యానికి విధేయత గురించి చెబుతుంది. యేసు శోధనలను ఎదుర్కొన్నప్పుడు, ఆయన దేవుని వాక్యంపై ఆధారపడ్డాడు. మనం కూడా అనేక సార్లు అనేక విధాలుగా శోధనలను ఎదుర్కొనేటప్పుడు, దేవుని వాక్యం మనకు ఎంతగానో సహాయం చేస్తుంది. బలహీనలుగా ఉన్నా మనలను దేవుని వాక్యం బలవంతులను చేస్తోంది. కాబ్బటి మనము ముందుగా దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే దేవుడు మనకు కూడా ప్రాముఖ్యతను ఇస్తాడు. 
       కాబట్టి ప్రియా దేవుని బుడ్డలారా మనం దేవునిపై విశ్వాసం ఉంచాలి, ఆయన వాక్యానికి విధేయత చూపాలి మరియు ఆయన చేసిన మేలులను గుర్తుచేసుకోనీ కృతజ్ఞతలు చెల్లించుకుందాము.
Fr. Johannes OCD

1, మార్చి 2025, శనివారం

సామాన్యకాలపు ఎనిమిదవ ఆదివారము

సామాన్యకాలపు ఎనిమిదవ  ఆదివారము
సిరా 27:4-7
1 కొరింథీయులు 15:54-58
లూకా 6:39-44

          క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియా  దేవుని జనులరా , ఈ రోజున మనము సామాన్య కాలపు ఎనిమిదవ ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము, ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనములను మనం చుసినట్లయితే, ఈ మూడు  మనకు ముఖ్యమైనటువంటి మూడు అంశముల గురించి తెలియజేస్తున్నాయి. అవి  మన జీవితానికి చాలా విలువైన విషయాల గురించి నేర్పుతున్నాయి. అవి ఏమిటంటే మన మాటలు, మన చేతలు ద్వారా చేసే పనులు, మన స్వభావం గురించి ఆలోచించి, మంచి జీవితాన్ని గడపమని ఈ వాక్యాలు మనకు నేర్పిస్తున్నాయి. ఈ ముఖ్య గుణములు మన జీవితములో ఎంతగానో ఉపయోగపడతాయి. మనలను మంచి మార్గములో ప్రయాణించుటకు ఉపయోగపడతాయి.

ముందుగా మనము మొదటి పఠనము చూసింట్లయితే 
సిరా 27:4-7 వచనలలో  మన మంచి జీవితం అనేది మన మాట్లమీద ఆధారపడివుందని తెలియజేస్తుంది. అది ఏ విధంగానంటే మనుషుల నిజమైన స్వభావం మీద ఆధారపడివుంది. లూకా సువార్తలో మనము చూస్తున్నాము చెట్టును బట్టే పండ్లు కాస్తాయని. చెట్టు పండును బట్టి ఎలా దాని స్వభావము తెలుస్తుందో, అదే విధంగా మనిషి మాటలను బట్టి అతని హృదయం తెలుస్తుంది.
 ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటకూడా చాలా విలువైనది. మన జీవితములో కొన్ని సార్లు తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటాము. ఏవిధంగానంటే ఎవరినీ తొందరపడి పొగడకూడదు, వారి మాటలు విన్నాకే వారిని అంచనా వేయాలి.
 నిజం జీవితములో మనం మాటల ద్వారానే మన నిజస్వరూపాన్ని బయటపెడతాము. అందుకే మనం మాట్లాడే ప్రతి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని ఈ మొదటి పఠనములో చూస్తున్నాము.
       రెండొవ పఠనము: 
1 కొరింథీయులు 15:54-58:
 ఈ వాక్యాలు మరణంపై విజయం గురించి, శాశ్వత జీవితం గురించి మాట్లాడుతున్నాయి. యేసుక్రీస్తు ద్వారా మరణం అనేది ఓడిపోతుందని, మానవులమైనటువంటి మనకు శాశ్వత విజయం లభిస్తుందని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. మన మానవ జీవితంలో మనము అనేక సార్లు పాపమనే ఉబిలో పడిపోతున్నాము అంటే మనము పాపమానే జీవితములో అనేక సార్లు చనిపోతున్నాము. మరి దీని నుండి మనము బయటకి జీవముతో రావాలంటే యేసు క్రీస్తును దృఢనమ్మకముతో విశ్వాసించాలి ఎందుకంటె క్రీస్తు ద్వారా మనము మరణాన్ని జయించవచ్చు. ఎటువంటి గొప్ప బహుమానము క్రీస్తు ద్వారా  దేవుడు మనకు విజయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేయాలి. మన శ్రమలు ప్రభువులో వ్యర్థం కావు అని, ఎల్లప్పుడూ ప్రభువు పనిలో నిమగ్నమై ఉండాలని అప్పుడే మనము అన్ని జయింపగలమని ఈ వాక్యాలు మనకు నేర్పిస్తున్నాయి.
               చివరిగా సువిశేష పఠనము:
లూకా 6:39-44 ఈ వచనాలు ఇతరులను తీర్పు తీర్చడం గురించి, మంచి ఫలాలను ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాయి. ముందుగా గుడ్డివాడు గుడ్డివాడిని నడిపించలేడని, అంటే పాపం అనే జీవితములో జీవించే వాడు ఇతరులకు మంచిని నేర్పించలేడు అని, ముందుగా మన కంటిలోని దూలాన్ని తీసివేయాలని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. మంచి చెట్టు మంచి పండ్లను ఇచ్చినట్లే, చెడ్డ చెట్టు చెడ్డ పండ్లను ఇస్తుందని, వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు అంటున్నారు. మన హృదయం నుండి వచ్చే మాటలు మన స్వభావాన్ని తెలియజేస్తాయనీ. ఇతరులను మనము సరిచేయడానికి ముందు మనల్ని మనం సరిచేసుకోవాలని సువిశేష పఠనము మనకు నేర్పిస్తుంది.
కాబ్బటి మన మాటలు, చేతలు మంచి ఫలాలను ఇవ్వాలనుకుంటే మన స్వభావము అనేది మంచిగా ఉండాలి అప్పుడే మనము ఇతరులను మంచి మార్గములో ప్రయాణించేలా చేయగలుగుతాము. 
           కాబ్బటి ప్రియా దేవుని బిడ్డలరా మన మాటలు, చేతలు, మన స్వభావం ఇవి అన్ని కూడా మనలను మంచి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలని నేర్పిస్తున్నాయి. ఒక క్రైస్తవునిగా నీ జీవితాము ఏ విధంగా ఉందొ తెలుసుకొని జీవించాలని ఈ బలి పూజలో ప్రార్దించుకొందము.
Fr. Johannes OCD

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...