26, ఫిబ్రవరి 2026, గురువారం

పదహారవసామాన్యఆదివారం

 

పదహారవసామాన్యఆదివారం

సొ.జ్ఞాన 12:13,16-19

రోమ 8:26-27

మత్తయి 13:24-43

                                                                                                                    బ్రదర్సుభాష్సిడి 

 

మొదటిపఠనందేవుడుతానున్యాయంమరియుదయగలదేవుడిగాచూపిస్తున్నాడు.

దేవుడు తన ప్రజలు పశ్చాత్తాపపడాలని ఎదురు చూస్తున్నాడుదేవుడు తన ప్రజలు నీతిగా జీవించాలని కోరుకుంటాడుదేవుడు తన ప్రజలకు నీతిమంతమైన జీవితాన్ని గడపడానికి స్వేచ్ఛనిచ్చాడు.

మళ్లీమళ్లీ పాపంచేయడం మరియు తప్పుచేయడం మానవత్వందయ మరియు క్షమించడం దైవత్వంఅని మొదటిపఠనం వివరిస్తుంది. దేవుడు న్యాయమైన మరియు దయగలతండ్రిఅతను ప్రతిఒక్కరినీ సమానంగా చూస్తాడుఆయన మనందరికీ రక్షణపొందే అవకాశాన్ని కల్పిస్తాడుమరియు ఎవరైనా దేవునిశక్తిని అనుమానించినప్పుడుదేవునిశక్తి వివిధమార్గాల్లో ప్రజలకు చూపబడుతుందిమానవులనుఖండించడానికిదేవునికిఅధికారంఉందికానీ ఆయన ఇంకా మనల్ని ఓపికగా భరిస్తున్నాడు.

Vs.19. దేవుడు తన ప్రజలు పశ్చాత్తాపపడుటకు వేచియుండుట మరియు ఆయన వారిని క్షమించుట మనము చూస్తాముఅలాగే దేవుడు మనలను కూడా తానుచేసినట్లుగాఒకరినొకరు క్షమించాలని కోరుకుంటున్నాడుతన ప్రజలు నీతిగా జీవించాలని ఆయన కోరుకుంటాడుదయ మరియు క్షమాపణవంటి దేవుని లక్షణాలను కలిగి ఉండమని ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు.

మంచిచేసేవారు దేవుని బిడ్డలని మరియు చెడుచేసేవారు సాతాను బిడ్డలని తెలియచేస్తున్నారు .

కావున దేవుడు మనలను తన మంచిబిడ్డలుగా ఉండమనికోరుచున్నాడు

 

కీర్తన: 86:5-6,9-10,15-16 : ఇది దయకోసం దేవునికి ప్రార్థన.

 

రెండవ పఠనంఆత్మ మనకొరకు దేవునితో విజ్ఞాపన చేస్తుంది.

స్వభావరీత్యా మానవులు బలహీనులుపాపంవైపు సులభంగా పడిపోతారుమనము తరచుగా పాపపుఉచ్చులో పడిపోతాముమన సోదరులను ప్రేమించడంలో విఫలమవుతాముఇతరులను క్షమించడంలో విఫలమవుతాముమరొకరి అవసరంలో మనం కనికరంచూపడంలో విఫలమవుతాము.

కానీ ఆత్మ అలాంటి వారందరికీ సహాయం చేయడానికి మరియు అవసరమైనది చేయడానికి సహకరిస్తుంది అని పునీత పౌలుగారు చెపుతున్నారుఆత్మమనలోఉందిమన తరపున తండ్రికి విజ్ఞప్తి చేస్తుంది మరియు దేవుణ్ణి తండ్రి అని సంభోదించుటకు వీలు కల్పిస్తుందికాబట్టి మానవులుగా మనం శరీరానికి వ్యతిరేకంగామన కోరికలు మరియు స్వార్థపూరిత వైఖరితో పోరాడుతామని పౌలుగారు చెపుతున్నారుమనం యేసు ద్వారా మనతండ్రికి ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మ నిజానికి మనలో మూలుగుతూ ఉంటుందిమరియు యేసుక్రీస్తుద్వారా మనం ప్రార్థనలో ఏది అడిగినా తండ్రి అయిన దేవుడు మనకు సమాధానం ఇస్తాడు లేదా దయచేస్తాడు అని పునీత పౌలుగారు చెపుతున్నారు.

సువిశేషం:ఈ సువార్తపఠనం గత ఆదివారం యేసు చేసిన ప్రసంగం యొక్క కొనసాగింపు.

నేటి సువార్తలోయేసు పరలోక రాజ్యం గురించి వివరించడానికి మూడు ఉపమానాలు చెప్పాడుయేసు జన సమూహంతో ఉపమానాలుగా ఎందుకు మాట్లాడతాడో మరియు శిష్యులకు విత్తువాడు యొక్క ఉపమానాన్ని ఎందుకు వివరించాడో కూడా తెలియచేస్తుంది.

మొదటి ఉపమానం పరలోకరాజ్యం విత్తువాడు (దేవుడు)తో పోల్చబడిందని చెబుతుందిమరియు పొలమును ప్రపంచం తోపోల్చారుమరియు మంచి విత్తనాలను గోధుమలతో (దేవునిబిడ్డలుగామరియు చెడువిత్తనాలను కలుపు మొక్కలతో (సాతానుబిడ్డలుగాశత్రువును (చెడు)గా పోల్చారు.

ఇక్కడవిత్తువాడు కలుపు విత్తనాలను పొలములో చల్లెనా?

లేదుకానీ ఒక శత్రువు అసూయతో అలాచేశాడు.

దేవుడుచెడ్డవారినిసృష్టించాడా?

లేదుకానీ దుర్మార్గుడు సాతాను చెడును మంచిదని చూపించడం ద్వారాప్రజలను ప్రలోభపెట్టడం లేదా ప్రజలను పాపపు మార్గాన నడిపిస్తున్నాడు .ప్రజలు చెడు వైపు ఎందుకు మొగ్గుచూపుతారు,  ఎందుకంటే

-చెడు ఆకర్షణీయంగా ఉంటుంది.

చెడు ప్రలోభపెడుతుంది.

చెడు అందంగా కనిపిస్తుంది.

-చెడు మంచివలె నటిస్తుంది.

సుఖాలుశక్తి,  లేదా సంపద మొదలైన వాటి రూపంలో చెడు మానవుడిని ప్రలోభపెడుతుందిఅయితేగోధుమలు మరియు కలుపుమొక్కలు కలిసి పెరుగుతాయి మరియు పంటలను సేకరించేవరకు అవి గుర్తించబడవుఅదేవిధంగా ప్రపంచంలో మంచివ్యక్తులు (దేవునిబిడ్డలుగామరియు చెడ్డవ్యక్తులు (చెడుబిడ్డలుగాకలిసిజీవిస్తారు.  తుది తీర్పు వరకు ఏది మంచి మరియు చెడు అనేది గ్రహించబడదు.

విత్తువాడు చివరి వరకు ఓపికపట్టిగోధుమలు మరియు కలుపుమొక్కలను వేరుచేస్తాడుఅలాగే దేవుడు కూడా చాలా ఓపికగా ఉంటాడుచెడ్డ వ్యక్తులు మంచి వారిగా మారాలని ఎదురుచూస్తాడుమరియు తీర్పు రోజున అతను మంచి మరియు చెడులను వేరుచేస్తాడుమంచి వ్యక్తులు దేవునిబిడ్డలుగా అవుతారు మరియు వారు పరలోక రాజ్యాన్ని వారసత్వంగా పొందుతారుమరియు చెడుప్రజలు చెడుబిడ్డలుగా,  నిత్య నరకాగ్ని వారికి వారసత్వంగా ఉంటుంది.

 ఉపమానం దేవుని సహనాన్ని మరియు దీర్ఘశాంతాన్ని నొక్కి చెబుతుందిఎందుకంటే అతను గోధుమలు మరియు కలుపు మొక్కలను రెండింటినీ పంట వరకు కలిసి పెరగడానికి అనుమతించాడుఇది చివరి తీర్పు  మరియు పశ్చాత్తాపానికి ప్రతీక.

ఎదుగుదల మరియు ఫలవంతంవిశ్వాసుల జీవితాల్లో ఆధ్యాత్మిక వృద్ధి మరియు ఫలవంతమైన ప్రాముఖ్యతను  ఉపమానం వివరిస్తుంది.ఇది గోధుమల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుందినిజమైన విశ్వాసం మరియు నీతివంతమైన జీవనం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది.

రెండవ ఉపమానం ధ్యానించి నట్లయితేదేవుని రాజ్యం ఆవగింజలాంటి దనిఅది ఒకపెద్ద చెట్టుగా మారి ఆకాశ  పక్షులకు ఆశ్రయం అవుతుందిక్రైస్తవమతం యొక్క విశ్వాసం ప్రారంభంలో చిన్నదికావచ్చు కానీ తరువాత అది పెరుగుతుంది మరియు అనేక మంది ప్రజలుసంస్కృతులు మరియు దేశాలుదేవుని ప్రేమను అర్థం చేసుకొనిదేవుని రాజ్యం మనం ఊహించిన దానికంటే భిన్నమైనదని గ్రహిస్తారు.దేవుని రాజ్యం దయ మరియు కరుణతో నిండి ఉంది అని గ్రహిస్తారు.

మనం నిద్రలో ఉన్నప్పుడు అంటే అజాగ్రత్తతో ఉంటె శత్రువు ఉద్దేశపూర్వకంగానే నాశనం చేయడానికి వచ్చి పొలంలో కలుపు మొక్కలను చల్లుతారుఅంటే మనం మెలుకువగా ఉండాలి లేదా మన చుట్టూ ఉన్నచెడు గురించి జాగ్రత్తలుతెలుసుకోవాలిపునీత పేతురు గారు తన లేఖలలో నిబ్బరమైన బుద్ధిగల వారై మెలకువగా ఉండుడిమీ విరోధియైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.” (1పేతురు 5:8).

కాబట్టి ఈ ఉపమానం మనలను ప్రార్థనలో అవగాహన కలిగి ఉండాలని బోధిస్తుందివిఫలమవ్వకుండానిత్యమూ ప్రార్థన చెయ్యమనికోరుతున్నాడుఎందుకంటే సాతాను మనవెంటే పొంచి ఉంటుంది.

మూడవ ఉపమానం ద్వారా మనందరం కూడా పులిసిన పిండి వలె ఉండమని , మనం కుటుంబాల్లో మరియు సమాజాలలోదేవుని ప్రేమ మరియు దయను వ్యాప్తిచేయడం లేదా ఇతరులకు మంచితనాన్ని పంచుకోవడంలో పులిసిన పిండిలాగా ఉండాలిమనం కూడా భూమిపై దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలని ఈమూడుపఠనాలు మనల్నికోరుతున్నాయి.

 

15వ సామాన్య ఆదివారం

 

15వ సామాన్య ఆదివారం

యెషయ 55:10-11
రోమియులు 8 18-23
మత్తయి 13:1-23

ఈనాటి దివ్య పఠణాలు దేవుని యొక్క వాక్కుకు ఉన్నటువంటి గొప్ప శక్తిని గురించి బోధిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్కు మనందరినీ కూడా ఎంతో ప్రభావితం చేసి, మార్చి వేస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ప్రకటించిన సందర్భంలో అది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విధమైనటువంటి ప్రేరణ కలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యం ప్రకటించిన సందర్భంలో అది కొన్నిసార్లు ప్రజల యొక్క జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురాని సందర్భంలో మనం నిరాశ చెందకూడదు అని కూడా ఈ దివ్య పఠణాలు మనకు సెలవిస్తున్నాయి. ఒక విధముగా చెప్పాలి అంటే ఈనాడు మనం విన్నటువంటి ఈ దివ్య పఠణాలు మనకు గుర్తు చేసే అంశం ఏమిటంటే ఏ విధముగా దేవుని యొక్క వాక్యమును మనము వ్యక్తిగతంగా స్వీకరిస్తూ ఉన్నాము అలాగే దేవుని యొక్క వాక్కు మన జీవితములను ఫలభరితము చేస్తూ ఉన్నదా లేదా. దేవుని యొక్క వాక్కు యొక్క గొప్పతనము. కీర్తన 119:9-11, 105
2 తిమోతి 3:16
హెబ్రీ 4:12
ఈనాటి మొదటి పట్టణంలో యెషయ ప్రవక్త బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నారు.యెషయ  ప్రవక్త ప్రభువు యొక్క వాక్కును వానతోను,మంచుతోను పోల్చి చెబుతున్నారు. వానయు, మంచు ఈ రెండిటికి కూడా జీవమును ఇచ్చే శక్తి ఉన్నది. ఎందుకంటే వాన భూమి మీద పడిన సందర్భంలో అది కొత్త మొలకలు పుట్టే లాగా సహాయపడుతూ ఉంది. అదే విధంగా వానయు, మంచుయు జీవన మనుగడను కొనసాగిస్తుంటాయి ఎందుకంటే నీరు లేకపోతే మనం, జంతువులు, వృక్షములు బ్రతుకలేం. దేవుని యొక్క వాక్కు మన అందరిలో కూడా కొత్త జీవమును పుట్టిస్తుంది.ప్రభువు యొక్క వాక్కు ప్రకటించిన సందర్భంలో అది మనలో ఏదో ఒక విధమైన ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది. యెషయ ప్రవక్త పలికినటువంటి ఈ మాటల యొక్క సంపూర్ణ అర్ధాన్ని గ్రహించాలి అంటే ఆనాటి సందర్భం తెలుసుకోవాలి. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా  దేశంలో బానిసత్వపు జీవితం గడుపుతున్నారు. అక్కడ అనేక కష్టాలు పడుతూ తమకు విముక్తి ఎప్పుడు కలుగుతుందా? అని ఆశతో ఎదురు చూస్తూ నిరాశతో నిస్పృహలతో కృంగి నశించి బాధపడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క వాక్కు ద్వారా ఊరటనిస్తున్నారు. యావే దేవుడు తప్పనిసరిగా ఇశ్రాయేలు ప్రజలకు విముక్తిని దయచేసి మనకు తిరిగి తీసుకొని పోతారని, రక్షణ ప్రసాదిస్తారని ప్రవక్త ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. ఇస్రాయేలు ప్రజలు ప్రభువు యొక్క వాక్కును కూడా విశ్వసించాలి అని యెషయ ప్రవక్త తెలియజేస్తున్నారు. అదేవిధంగా దేవుని యొక్క వాక్కు శక్తివంతమైనదని విశ్వాసనీయమైనదని సృష్టికి మూలమైనదని, నడిపించే వాక్కుని, ప్రేమించే వాక్కు అని, క్షమించే వాక్కు అని ప్రవక్త తెలియజేస్తున్నారు. ప్రభు యొక్క మాటకు తిరుగులేదు, అది తన కార్యాన్ని తప్పక సాధిస్తుంది. ఏ విధముగానయితే కురిసిన వర్షం వృధాగా పోదో అలాగే ప్రకటించినటువంటి దైవవాక్కు వృధాగా పోదు. వానయు మంచు పంట ఎదుగుదలకు కృషి చేస్తాయి అలాగే దైవ వాక్కు కూడా మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు కృషి చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క సంతోషకరమైనటువంటి వార్త ప్రకటించుట ద్వారా ఇశ్రాయేలు ప్రజలలో ఒక కొత్త నమ్మకం, కొత్త ఆశలు పుట్టుకొని వచ్చాయి. ఇది దేవుని యొక్క వాక్కుకు ఉన్నటువంటి శక్తి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు మన యొక్క ఆధ్యాత్మిక జీవితము నశించిపోవుటను గురించి తెలియజేస్తున్నారు. ఈ లోక సంబంధమైన జీవితం జీవిస్తే మన యొక్క ఆధ్యాత్మిక జీవితం నశించి పోతూ ఉంటుంది.  ఏసుప్రభు యొక్క మార్గంలో నడిచినటువంటి పునీత పౌలు గారు రోమీయులను దేవుని యొక్క వాక్కును విశ్వసించమని కోరుతున్నారు. ఆదాము యొక్క పాపము ఈ లోకంలోకి వినాశనమును తీసుకుని వచ్చింది అదేవిధంగా ఈ సృష్టికి మరియు మానవాళికి నాశనమును తీసుకొని వచ్చింది. ఆదికాండము 3:14-19 మనకు తెలిపే అంశము ఏ విధముగా సృష్టి నాశనం అవుతున్నది మానవుని ఒక పాపము వలన. పౌలు గారు తెలిపే అంశమేమిటంటే క్రీస్తు ప్రభువు మనలను రక్షిస్తారు.
ఈనాటి సువిశేషం లో యేసు క్రీస్తు ప్రభువు వారు అందరూ అర్థం చేసుకునే విధంగా ఉపమాన రీతిగా దేవుని యొక్క వాక్కుకు ఉన్నటువంటి శక్తిని గురించి తెలియజేస్తున్నారు. విత్తువాడు విత్తనములు వెదజల్లుటకు వెళుతున్నారు. విత్తనాలు చల్లే సందర్భంలో కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతినేలపడ్డాయి, ఇంకొన్ని విత్తనాలు,  కొన్ని ముళ్ళ పొదల మధ్య పడ్డాయి మరికొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై పడినవి. ఈ ఉపమానంలో చల్లబడిన విత్తనము ఒక్కటే కానీ ఆ విత్తనములు పడినటువంటి స్థలములు నాలుగు రకములు.
విత్తనము చల్లినది దేవుడే ఆ యొక్క విత్తనము దేవుని యొక్క వాక్యం. చల్లబడినటువంటి స్థలములు మనందరిని కూడా సూచిస్తున్నాయి. ప్రతి ఒక్క రైతు విత్తనములు చల్లిన సందర్భంలో ఒక మంచి ప్రతిఫలాన్ని ఆశిస్తారు. పంట వేసే సందర్భంలో ఏ రైతు కూడా తాను వేసిన విత్తనాలన్నీ ఫలిస్తాయని తలంచడు. కొన్ని విత్తనాలు గాలికి  కొట్టుకొని పోవచ్చు, కొన్ని విత్తనాలు మొలకలు రావచ్చు కొన్ని విత్తనాలు తాలు గింజలు ఉండవచ్చు కాబట్టి ఆయన 100% ఫలమును ఆశించడు కానీ వేసినటువంటి పంట మాత్రం తప్పకుండా లభిస్తుందని విత్తనాలు వెదజల్లుతాడు. ఈ విత్తనాలు పడినటువంటి నాలుగు స్థలాలు మన జీవితములను ఏ విధంగా పోలి ఉన్నాయి అని తెలుసుకుందాం.
1. త్రోవ పక్కపడిన విత్తనాలు
త్రోవ పక్కన పడిన విత్తనాలు మొలక ఎత్తటానికి చాలా కష్టం ఎందుకంటే నేల గట్టిగా ఉంటుంది కాబట్టి. నేల మీద పడిన విత్తనాలు భూమిలోనికి స్వొచ్చుకపోలేనందువలన వాటిని పక్షులు వచ్చి తిని వేస్తాయి. అలాగే ఆ మార్గం గుండా నడిచి వెళ్లేవారు ఆ విత్తనాలను త్రొక్కి వేస్తారు. ఈ యొక్క స్థలమును పోలిన వారు దేవుని యొక్క వాక్కును నామమాత్రంగా వింటారు ఆ యొక్క వాక్కు లోనికి పోనందువలన వారి యొక్క జీవితంపై ఎటువంటి ప్రభావితం ఉండదు. వాస్తవానికి ఈ యొక్క విత్తనాన్ని పోలిన వారు వారి యొక్క హృదయములను ఈ లోక సంబంధమైన విషయంతో మూసేస్తారు అందుకని దేవుడి యొక్క వాక్యం వారిలో ప్రవేశించదు కావున ఆ యొక్క వాక్యం ఎటువంటి ప్రతిఫలమును వారి జీవితంలో ఇవ్వదు.
2. రాతి నేలపై పడిన విత్తనాలు
ఈ యొక్క నేలను పోలినటువంటి వారు ఎక్కువ భావోద్వేగాలను కలిగినటువంటి వారు వారు ఎప్పుడు కొత్తదనం కోసం ఎదురు చూస్తూనే ఉంటూ ఉంటారు కానీ జీవితంలో దేని మీద కూడా సరియైనటువంటి ఆసక్తి చూపనై ఉంటారు. ఇలాంటివారు దేవుని యొక్క వాక్కును విన్నటువంటి సందర్భంలో బాగానే ఉంటారు సంతోషిస్తారు ఆసక్తిగా వింటారు కానీ కొద్ది సమయంకే ఆ యొక్క వాక్కు నుండి వారు వేరే అంశముల వైపు పయనిస్తారు. మొదట్లో వారు చాలా ఆసక్తిగా ఉంటారు కానీ తర్వాత తర్వాత వారి యొక్క ఇంట్రెస్ట్ దేవుని యొక్క వాక్కు మీద తగ్గిపోతుంది. పవిత్ర గ్రంథంలో యోహాను సువార్తలో దీనికి తగినటువంటి ఉదాహరణ ఉంది. ఏసుప్రభువుని వెంబడించే శిష్యులు అనేక అనేకమంది ఉన్నప్పటికీ ఎప్పుడైతే తాను ప్రజలకు తన యొక్క శరీర రక్తాలను భోజనంగా ఇస్తారని చెప్పారో అప్పుడు ఆ మాటలను వారు స్వీకరించడానికి అంగీకరించలేరు. ఆ మాటలు వారు జీర్ణించుకోలేకపోయారు. మొదట్లో యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వారికి సంతోషంగానే, వినసొంపుగా ఉన్నాయి కానీ కొద్దిసేపటికే వారికి దేవుని మీద , దేవుని యొక్క ఆ వాక్కు మీద ఉన్నటువంటి ఆసక్తి పోయింది అందుకే వారు క్రీస్తు ప్రభువుని వెంబడించలేకపోయారు . యోహాను 6:60
3. ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనములు
ఈ విత్తనములు పోలిన వారు మొదట్లో దేవుని యొక్క వాక్యమును విని కొంత సమయం వరకు ఆచరిస్తూ ఉంటారు కానీ ఈ లోక సంబంధమైన వ్యసనాలు, వ్యామోహాలు వారిని ఈ లోకానికి పరిమితం చేస్తాయి. సైతాన్ కి సంబంధించినటువంటి అలవాట్లు కలిగిన వారు దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువ కాలం పాటించలేరు. ఎవరి యొక్క ఆలోచనలైతే ధనం మీద గాని, అధికారం మీద కానీ పేరు ప్రతిష్టల మీద కానీ ఉంటాయో వారు ఎక్కువగా వీటి గురించే ఆలోచన చేస్తారే అలాంటి వారిలో దేవుని యొక్క వాక్కు ప్రభావం ఎక్కువగా ఉండదు. వారు దేవుని యొక్క వాక్కు ప్రకారంగా జీవించాలి అని అనుకోరు. చాలామంది దేవుని యొక్క వాక్కు ప్రకారంగా జీవించలేక పోతారు ఎందుకంటే దైవవాక్కు కన్నా ఈ లోక సంబంధమైన విషయాలే వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. చాలామంది ఈ విత్తనమును పోలి ఉంటారు ఎందుకంటే వాక్యమును వింటారు కానీ ఆ వాక్యానికి తగినటువంటి జీవితం జీవించరు.
4. సారవంతమైన నేల మీద పడిన విత్తనములు
ఈ నేలను పోలిన వారు దేవుని యొక్క వాక్యమును విని విన్నటువంటి వాక్యమును ఆచరించేవారు. వారి జీవితంలో ఎన్ని శోధనలు వచ్చిన, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, సమస్యలు వచ్చిన వారు పడిపోరు విశ్వాసాన్ని కోల్పోరు దేవుని యొక్క వాక్కు అనుసారముగా ప్రతినిత్యం జీవిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్కు అనుసరించే సందర్భంలో ప్రాణాలను సైతం కోల్పోవుటకు వారు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు ఇలాంటి వారి జీవితంలో వారు ముప్పదంతలుగా అరవ దంతులగా నూరంతులుగా ప్రతి ఫలమును చూస్తారు వారు అడిగిన ప్రతి వరమును దేవుడు దయచేసి ఉంటారు. మనందరం కూడా సారవంతమైన నేలను పోలిన వ్యక్తులుగా ఉండాలి అన్నదే దేవుని యొక్క కోరిక అందుకే దేవుడు ప్రవక్తల తర్వాత ప్రవక్తలను రాజుల తర్వాత రాజులను యాజకుల తర్వాత యాజకులను సేవకుల తర్వాత సేవకులను సేవకుల తర్వాత సేవకులను పంపిస్తున్నారు వాక్యమును బోధించేలాగా చేస్తున్నారు ఆ వాక్యము ద్వారా మన అందరి జీవితాలు మారాలి అని మనందరి జీవితం ప్రతిఫలం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి దేవుడి యొక్క వాక్యమును ఏ విధముగా స్వీకరిస్తున్నారు ఏ విధముగా ఆలకిస్తున్నాం ఏ విధముగా ఆచరిస్తున్నాం అని మనందరం కూడా వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్కు ఎంతో శక్తివంతమైంది కాబట్టి ఆ వాక్యము క అనుసారంగా మనం జీవించి మన జీవితాలను దేవునికి అనుగుణంగా మార్చుకోవాలి.

Fr. Balayesu OCD

పదునాల్గవ సామాన్య ఆదివారం

 

 పదునాల్గవ సామాన్య ఆదివారం

జెకరియా 9: 9-10, 
రోమా 8: 9, 11-13, 
మత్తయి  11: 25-30

                      బ్రదర్. సుభాష్ ఓ.సి.డి

క్రీస్తుపూర్వం 538 వ సంవత్సరం యిస్రాయేలు ప్రజలు బబులోనియా బానిసత్వం నుండి తిరిగివచ్చిన కాలం.
యిస్రాయేలు ప్రజలను పరిపాలించుటకు ఈ రాజులూ కూడా లేరు . యిస్రాయేలు ప్రజలు స్వతంత్రులు, కానీ ముఖ్య అధికారం మాత్రం యూదులు, పర్షియా, గ్రీసు మరియు రోమీయులది. కానీ యిస్రాయేలు ప్రజలకు ఏ రాజునూ లేడు. దేవాలయం ధ్వంసం చేయబడింది ప్రజల జీవితములో శాంతి లేదు.
ఈ సమయములో జెకర్యా మరియు హగ్గయి  ప్రవక్తలు ఇద్దరు కూడా దేవాలయ నిర్మాణంలో   యిస్రాయేలు ప్రజలను ప్రోత్సహిస్తారు.
ఆ సందర్భంలో జెకరియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను  సంతోష పరిచే వాక్యాలే  మొదటి పఠనంలో చూస్తున్నాము.
9. వచనంలో చూస్తున్నాం, యూదా మరియు యిస్రాయేలు ప్రజలారా మీరు సంతసించండి నేను మీ మధ్య నివసించబోతున్నాను. ఒక శాంతి యుతమైనటువంటి రాజ్యాన్ని స్థాపిస్తాను. మీ శాంతి రాజు గాడిదపై ఊరేగింపుగా వచ్చును అని చెపుతున్నాను. 
రాజులు గుఱ్ఱములపై  లేదా అశ్వములపై  లేదా రథములపైనా కదా ఊరేగింపుగా వస్తారు గాడిదమీద రావటం ఏమిటి?.
ఇక్కడ గాడిద అనే జంతువు వినమ్రతకు, శాంతి సూచనగా నిలుస్తుంది. 
గొప్ప రాజులుకూడా గాడిదపైన ఉరేగింపబడ్డారు. జాయిరు, యిస్రాయేలు ప్రజల ఏడవ నాయకుడు. తన ముప్పది మంది కుమారులతో ముప్పది గాడిదలపై స్వారీ చేసి గిలియాద్ దేశములో ముప్పది పట్టణములను దాడి చేసెను. (న్యాయాధిపతులు 10: 4) 
సొలొమోను మహారాజు కూడా గాడిదపై ప్రయాణించెను (1రాజుల  1 :33). దావీదు మహారాజు కుమారులు కూడా గాడిదపై పర్వతములలోకి పారిపోయాను (2వ సమూయేలు 13 : 29 ). దావీదు మహారాజు కుమారుడు అబ్షాలోము గాడిదపై స్వారీ చేసెను (2వ సమూయేలు 18 : 9 )
ఇక్కడ గాడిదను తక్కువ విలువగల  జంతువుగా కాకుండా గాడిదయొక్క వినమ్రతను ముఖ్యమైన అంశముగా మనం గ్రహించాలి.
10 వ వచనంలో ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను యిస్రాయేలు నుండి రథములను యెరూషలేమునుండి యుద్దఅశ్వములను  తొలగింతును ధనస్సులను  నాశనం చేసెదను.
ఇక్కడ రథములు, ధనస్సులు అధికారానికి గుర్తు. కానీ దేవుడు రథములను తొలగిస్తాను  అంటున్నాడు, ధనస్సులను నాశనం చేస్తా అంటున్నాడు.  అంటే అధికారాన్ని తీసివేస్తా అని చెపుతున్నాడు.
యుద్ధాశ్వములు యుద్దానికి ఉపోయోగించే జంతువులు యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉంటాయి. రాజులకు ఒక శక్తి, బలం లాంటివి. దేవుడు వాటిని కూడా తొలగిస్తానని అంటున్నాడు.
యుద్దాలు శత్రుత్వానికి, చంపుకోవడానికి, చావడానికి గుర్తు. 
ఇక యుద్దాలు జరగవు, శాంతిని దయచేస్తాను అని అంటున్నాడు. మిమ్మలను శాంతితో పరిపాలించుటకు రాజు రాబోవుచున్నాడు అని ప్రభువు జెకర్యా ప్రవక్త ద్వారా పలుకుచున్నాడు.
సువిశేషం:
 25 - 27 వచనాలలో క్రీస్తు ప్రభువు, తండ్రి దేవుడిని స్తుతిస్తున్నారు. ఈ వాక్యాలు యూదుల అధికారములను ధర్మశాస్త్ర బోధకులను, పరిస్సయులను ఉద్దేశించినవి. ఈ వచనంలో దేవుడికి క్రీస్తు ప్రభువుకి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రేమను మనం గమనించవచ్చు.
అంతేకాక “విజ్ఞులకు, వివేకావంతులకు” ,” వీటిని”, “పసిబిడ్డలకు”  “మరుగు పరచి” “బయలు పరచి” అనే  పదాలను వింటున్నాము.
విజ్ఞులకు, వివేకవంతులు :- అంటే యూదులు అధికారులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయులు, గర్వాత్ములు క్రీస్తుని రాజుగాను, దేవుని  కుమారుడగును, రక్షకుడిగాను విశ్వశించని వారు నిరాకరించనివారు.
వీటిని :- క్రీస్తు చేసేటటువంటి అద్భుత కార్యాలు, స్వస్థతలు, మంచి పనులు (పరమ రహస్యాలు) 
పసిబిడ్డలు :- అంటే వయస్సు పరంగా కాదు ఇక్కడ ప్రభువు వ్యక్తుత్వన్ని గురించి మాట్లాడుతున్నాడు. వినమ్ర హృదయులు కలిగిన వారు, పేదలు, దరిద్రులు, పాపాత్ములు  క్రీస్తుని తమ రాజుగా స్వీకరించిన వారు, క్రీస్తు రక్షకుడిగా విశ్వసించినవారు.
మరుగుపరచి:- తొలగించి, తీసివేయబడి. విజ్ఞులు మరియు వివేకవంతుల, నుండి తీసివేయటం 
బయలు పరచటం:- పసిబిడ్డలు వంటి వ్యక్తుత్వం, మంచితనం కలిగిన వారికీ దేవుని ఆశిర్వాదములు బయలుపరచబడ్డాయి.
సొలొమోను మహారాజు  వలె విజ్ఞానం, వివేకం ఉంది దేవుని యందు విశ్వాసం మరియు మంచితనం లేకపోతె మరి ఎందుకు పనికిరాము, దేవునిచే తిరస్కరించబడుతాం.
28 - 30 వచనాలను ధ్యానిస్తే: - ఈ వచనాలు, జీవితంలో, మానసిక, శారీరక, ఆత్మలో, భారంగా నలిగి పోతున్న ప్రజలకు, క్రీస్తు పలుకుతున్న వచనాలు, “భారముచే అలసి సొలసి ఉన్న జనులారా నాయొద్దకు రండి విశ్రాంతినిస్తాను”. అని అంటున్నాడు. 
అంటే క్రీస్తు ప్రభువు మనందరినీ ఆహ్వానిస్తున్నారు. శాంతిని పొందుటకు, రక్షణ పొందుటకు, సంతోషంగా ఉండుటకు.
 పునీత  అగస్తీను  గారు " నా ఆత్మా నీలో కలవనిదే దానికి శాంతి లేదు" అని చెపుతారు. 
ఎప్పుడైతే దేవుని చెంతకు వస్తామో, మన ఆత్మలు దేవునిలో లీనమవుతాయో మనకు కూడా శాంతి లభిస్తుంది.
యూదుల మతాచారాలు వారి చట్టాలు, వారి పరిపాలన ప్రజలకు చాల భారమైంది, శాంతి లేని ఒక అన్యాయపు పరిపాలన యూదులు ప్రజలపై భారం మోపుదురు, కానీ వారి చిటికిన వ్రేలుకూడా సహాయం చేయడానికి కదుపరు. మత్తయి 23 : 4 
యూదా సిద్దాంతాలతో, చట్టాలతో ప్రజలు నలిగి సతమతమవుతున్నారు, కానీ వారు మాత్రం సుఖవంతమైన జీవితాన్ని జీవించేవారు. 
కానీ క్రీస్తు మాత్రం యూదులకంటే భిన్నంగా ప్రజల భారాన్ని కూడా మోశారు.
నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది . ఏమిటి దీని అర్థం?
ఇక్కడ క్రీస్తు ప్రభువు తన సిద్దాంతాలతో , ధర్మశాస్త్ర బోధకులు లేదా యూదుల చట్టాలను పోల్చి చెపుతున్నారు.
యూదుల చట్టాలు " ప్రాణానికి ప్రాణం , కంటికి కన్ను , పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు, దెబ్బకు దెబ్బ నిర్గమ 21 వ అధ్యాయంలో చూస్తున్నాం.  ఈ విధంగా ఉంటుంది. అంటే ప్రతీకారం అనే చట్టం యూదులది. 
యేసు కాడి,  ప్రేమతో కూడినది, దైవ ప్రేమ, సోదర ప్రేమ.
క్రీస్తుని  చట్టం నీ శత్రువులను ప్రేమింపుము, వారికోసం ప్రార్థన చేయుము. క్రీస్తు చట్టంలో క్షమా , దయ , జాలి, సహాయం, కనికరం ఉంటాయి. కానీ యూదా చట్టంలో ఇవేవి ఉండవు.
క్రీస్తు ఈ లోకంలో శాంతిని నెలకొల్పడం కోసం గాడిదపైన వినమ్రుడై , ఉరేగించబడ్డాడు, శ్రమలు అనుభవించి , అవమానాలు పొంది, యూదులు మోపిన సిలువ అనే భారాన్ని మోసి మనకోసం మరణించాడు.
క్షమించు అనే మాట ద్వారా లోకమంతటికి శాంతిని నెలకొల్పాడు.
రెండవ పఠనం;
దేవుని ఆత్మ మనలో వాసమై ఉందని పునీత పౌలు గారు పలుకుతున్నారు.
కాబట్టి మనము ఇక శరీరానికి భానిసలము కాము. ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించమని కోరుతున్నారు. 
13 వ వచనంలో మనము శరీరాను సారంగా జీవిస్తే, మనం మరణిస్తాం. ఆత్మచే జీవిస్తే మరణించినను జీవిస్తాము అని అంటున్నారు. 
ఎందుకంటే ఒక సందర్భంలో పౌలుగారు ఈవిధంగా పలుకుతున్నారు మన హృదయాలు దేవుని ఆలయాలు కాబట్టి దేవుడు మనలో ఉన్నప్పుడు మనము కూడా దేవుడివలె జీవించాలని మనకు తెలియచేస్తున్నారు. 
చివరిగా ఈ మూడు పఠనాలు మనందరినీ కూడా సువిశేషంలో క్రీస్తు ప్రభువు బోధించిన విధంగా 29 వ వచనం . సాధుశీలుడుగను, వినమ్ర హృదయము కలిగి జీవించాలి అప్పుడే మన ఆత్మలకు శాంతి లభిస్తుంది.
మత్తయి 5 : 5  వినమ్ర హృదయులు ధన్యులు, వారు భూమికి వారసులు అగుదురు.
మత్తయి 5 : 9 శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు.
కాబట్టి మనందరం కూడా క్రీస్తు వాలే శాంతి స్థాపకులుగా, మన కుటుంబాలలో , మన సంఘాలలో ఒక నిర్మలమైన జీవితాన్ని జీవించుదాం

13 వ సామాన్య ఆదివారం

 13 వ సామాన్య ఆదివారం


2రాజులు 4: 8-11, 14-16

రోమా 6: 3-4, 8-11

మత్తయి 10: 37-42


ఈనాటి  దివ్య గ్రంథ పఠనాలు దేవుని యొక్క సేవ చేసేటటువంటి వారి యొక్క జీవితమును గురించి తెలియజేయబడుతున్నాయి. దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి సువార్త సేవకులు,దేవుడిని ప్రేమిస్తూ, పొరుగు వారిని ప్రేమిస్తూ దేవునికి సాక్ష్యం ఇస్తూ జీవించాలి. సువార్త సేవకులు కూడా ఒక త్యాగపూరితమైన జీవితం జీవించాలి అనే అంశము గురించి కూడా ఈనాటి దివ్య ప ఠణనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. దేవుని శిష్యులుగా ఉండాలి అంటే వారి జీవితంలో అనేక రకాలైన త్యాగాలు చేయాలి.

ఈనాటి మొదటి పఠనంలో దేవుని యొక్క ప్రవక్త అయిన ఎలిషాకు షునేము పట్టణంలో ఉన్న ఒక సంపన్నురాలు ఆతిథ్యం ఇచ్చినటువంటి విధానం మనం తెలుసుకుంటున్నాం. ఎలీషా ప్రవక్త దేవుని యొక్క సేవకుడని గుర్తించి తాను చేసేటటువంటి పరిచర్యకు షునేము పట్టణంలో ఉన్న సంపన్నురాలు సహకరించింది. ఈమె ఎలీషాకు ఆహ్వానం ఇచ్చి ఆతిథ్యమిచ్చి స్వయంగా తన యొక్క ఇంటి మీదనే అతని కొరకు బస చేయుటకు ఒక గదిని నిర్మించి దానిలో ఒక మంచాన్ని, బల్లను, కుర్చీని, దీపాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంపన్నురాలు దేవుని యొక్క రక్షణ కార్యములో తన వంతు సహకారం తాను చేస్తుంది. ఈ సంపన్నురాలు దేవుని యందు అచంచల విశ్వాసం కలిగినటువంటి ఒక వ్యక్తి. దేవుడు తనకిచ్చినటువంటి వరాల ద్వారా ఇతరులకు సహాయం చేస్తుంది. దేవుని యొక్క పని కోసం తనకు సాధ్యమైన విధంగా ఆమె ఎలీషాకు భోజనం పెట్టి, వారి యొక్క బాగోగులను చూసుకున్నారు. ఆమె యొక్క మంచితనమును, ప్రేమను, విశ్వాసమును చూసిన ఎలీషా ప్రవక్త ఈ విశ్వాసికి కృతజ్ఞత తెలపాలి అని భావించారు దానికి గాను తన కుటుంబంలో సంతానం లేదని తన శిష్యుడైన గెహాజీ ద్వారా తెలుసుకొని వారికి సంతాన వరమును ప్రసాదించారు. ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనం గ్రహించవలసిన సత్యమేమిటంటే ఇతరులకు మేలు చేస్తే ఆ మేలు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడు ఎవరి రూపాన ఏ అవసరంలో మన కుటుంబాన్ని సందర్శిస్తారు తెలియదు కాబట్టి వచ్చినటువంటి వారిని ప్రేమతో స్వీకరిస్తూ వారికి సాధ్యమైన విధంగా మంచి చేస్తే అది ఒక గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. అదేవిధంగా ఏ కుటుంబం అయితే దేవుని యొక్క సేవకులను గుర్తించి వారికి పరిచర్య చేస్తూ వారిని బాధ పెట్టకుండా మంచిగా చూసుకుంటారో ఆ కుటుంబము ఎల్లప్పుడూ కూడా దీవించబడుతుంది. క్రీస్తు ప్రభువై స్వయముగా తన శిష్యులతో అంటున్నారు మేము స్వీకరించిన వారు నన్ను స్వీకరిస్తారు అలాగే నన్ను పంపిన వారిని కూడా స్వీకరిస్తారని. ఈ సంపన్నురాలు కేవలము ఎలిషాను మాత్రమే కాదు తన ఇంటికి ఆహ్వానించింది స్వయముగా దేవుడిని తన ఇంటిలోనికి ఆహ్వానించింది అందుకనే ఆమె కుటుంబంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నారు భర్త వృద్ధుడైనప్పటికిని వారు చేసినటువంటి మంచి పనికి గాను దేవుడు అసాధ్యమైన కార్యం సుసాధ్యం చేస్తున్నారు వారు ఆయన ఎడల గొప్ప ప్రేమను చాటి చెప్పారు అందుకే దేవుడు వారిని దీవించారు. ఈ సంపన్నురాలు ఎలీషా ప్రవక్తకు ప్రత్యక్షంగా సువార్త సేవకు సహకరించకపోయినప్పటికీ పరోక్షంగా ఆమె సహకరించారు అలాగే మనం కూడా సువార్త సేవకులకు సహకరించాలి.

రోమీ-12:13

హెబ్రి-13:2

1పేతు-1:4-9

ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు మనందరం కూడా క్రీస్తు నందు జ్ఞాన స్నానం పొందినట్లయితే క్రీస్తు మరణం మందు జ్ఞాన స్నానము పొందుతామని మనందరికీ కూడా గుర్తు చేస్తున్నారు. క్రీస్తుతో మరణించుట అంటే మనం కూడా మన యొక్క పాపములకు మరణించి ఒక కొత్త జీవితమును జీవించాలి అప్పుడే మన యొక్క జీవితమునకు సరియైనటువంటి అర్థం ఉంటుంది. ఏ విధముగానయితే క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం ఒక కొత్తదనము తీసుకుని వచ్చినదో అదే విధముగా మనము కూడా క్రీస్తుతో మన యొక్క పాపములకు మరణించినట్లయితే ఒక పవిత్రమైన, కొత్తదైన, సంతోషకరమైనటి జీవితం జీవించవచ్చు అదియే పునీత పౌలు గారు మనకు తెలియచేసే అంశం.

ఈనాటి సువిశేష పట్టణంలో ఏసుప్రభు యొక్క శిష్యులకు ఉండవలసినటువంటి కొన్ని లక్షల గురించి మత్తయి సువార్తికుడు మనకు తెలియచేస్తున్నారు ప్రభు యొక్క శిష్యులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అన్నిటికంటే దేవుడిని ఎక్కువగా దేవుడిని ఎక్కువగా ప్రేమించడం అంటే తమ యొక్క జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చుటయే. ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద కాకుండా వ్యక్తుల మీద కాకుండా ప్రేమ నంతయు దేవుని మీద చూపించినప్పుడే మనం గొప్ప సాక్షి పూరిత జీవితం జీవిస్తున్నాం. చాలా సందర్భాలలో మనందరం కూడా ఈ లోకంలో ఉన్న వ్యక్తులను వస్తువులను ప్రేమిస్తుంటాం వాటికే ప్రాధాన్యతనిస్తుంటా కానీ ఏసుప్రభు ఎవరైతే తన శిష్యులుగా ఉండాలి అనుకుంటున్నారో వారు మొట్టమొదటిగా తమ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలుపుచున్నారు. ఎందుకంటే దేవుడే వారిని తన ముఖ పోలికలో సృజించారు, వారిని దీవించారు ఎన్నుకున్నారు. కాబట్టి వారు తమ జీవితంలో అన్నిటికన్నా దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తూ ప్రాధాన్యతనిస్తూ జీవించాలి. దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వటం ద్వారా  వారు దేవుని యొక్క కుటుంబంలో భాగస్తులు అవుతారు.

రెండవ లక్షణం- ఏసుప్రభు యొక్క శిష్యులుగా ఉండాలి అంటే వారికి ఉండవలసిన రెండవ లక్షణం ఏమిటంటే తమ శిలువను తాము ఎత్తుకొని దేవుడిని వెంబడించాలి. యూదుల నమ్మకం ప్రకారం సిలువ శిక్ష అనేది అతిపెద్ద తప్పిదం చేసిన వారికి వేసేటటువంటి శిక్ష అయితే ఈ సిలువ యూదులకు అవమానంగా ఉన్నది కానీ క్రీస్తు ప్రభువు తన శిష్యులకు నేర్పిన విషయం ఏమిటంటే సిలువను ఎత్తుకొని రావటం అంటే వారి జీవితంలో గొప్ప క్షమించే గుణమును కలిగి ఉండటం, అవమానాలు భరించటం, నిందలు మోయటం. సిలువను ఎత్తుకొని రావటం అంటే బాధలు కష్టాలు సమస్యలు అన్నిటిని కూడా ప్రేమతో భరించుకొని స్వీకరించుకొని క్రీస్తు ప్రభువును వెంబడించుట అలాగే సిలువను ఎత్తుకొని ఏసుక్రీస్తును అనుసరించడం అంటే సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుడిని వెంబడించుటయే. వీటన్నిటినీ చేకొని క్రీస్తు ప్రభువుని అనుసరించాలి. చాలా సందర్భాలలో మనము సిలువను తృణీకరిస్తాం కానీ క్రీస్తు ప్రభువు మనందరినీ కూడా సిలువను ఎత్తుకొని తనను అనుసరించమన్నారు అనగా ఈ క్షమించే గుణములు కలిగి అవమానాలు భరించి అలాగే సమస్తమును త్యజించుకొని క్రీస్తు ప్రభువుని అనుసరించాలి.

మూడో లక్షణం-దేవుని కొరకు మన జీవితములను కోల్పోవుట మనం కలిగి ఉండాలి. మన జీవితంలో మన యొక్క స్వార్ధపు ఆలోచనలకు కాకుండా స్వార్థపు జీవితం కాకుండా మన కొరకు మనము జీవించకుండా క్రీస్తు కొరకు జీవించాలి అప్పుడే ఆ జీవితమునకు సరియైనటువంటి అర్థం ఉంటుంది. పునీతులు ఈ లోకంలో జీవించినప్పుడు తమ కొరకు తాము జీవించకుండా ఇతరుల కొరకు దేవుని కొరకు జీవించిన విధంగా మనం కూడా దేవుని కొరకు జీవించాలి.

దేవుని యొక్క సేవ చేసేటటువంటి వారికి తగినటువంటి ప్రతిఫలం దొరుకుతుందని యేసు క్రీస్తు ప్రభువు ముందుగానే తెలియజేస్తున్నారు. అలాగే ఎవరైతే దేవుని యొక్క సేవకులు వీరు అని గుర్తించి వారిని ఆదరించి మంచిగా చూసుకుంటారు వారి ఎల్లప్పుడూ కూడా దీవించబడుతుంటారు. కాబట్టి దేవుని యొక్క సేవకులను గుర్తించి వారికి మంచిని చేస్తూ మనం కూడా దేవుని యొక్క సువార్తలో భావిస్తులై జీవించుదాం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సువార్త సేవ చేసే వారికి మన వంతు సహాయం మనం చేద్దాం.

ఈనాటి పరిశుద్ధ దివ్య గ్రంథ పఠనాలు దేవుని యొక్క సేవ చేసేటటువంటి వారి యొక్క జీవితమును గురించి తెలియజేయబడుతున్నాయి. దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి సువార్త సేవకులు,దేవుడిని ప్రేమిస్తూ, పొరుగు వారిని ప్రేమిస్తూ దేవునికి సాక్ష్యం ఇస్తూ జీవించాలి. సువార్త సేవకులు కూడా ఒక త్యాగపూరితమైన జీవితం జీవించాలి అనే అంశము గురించి కూడా ఈనాటి దివ్య ప ఠణనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. దేవుని శిష్యులుగా ఉండాలి అంటే వారి జీవితంలో అనేక రకాలైన త్యాగాలు చేయాలి.

ఈనాటి మొదటి పఠనంలో దేవుని యొక్క ప్రవక్త అయిన ఎలిషాకు షునేము పట్టణంలో ఉన్న ఒక సంపన్నురాలు ఆతిథ్యం ఇచ్చినటువంటి విధానం మనం తెలుసుకుంటున్నాం. ఎలీషా ప్రవక్త దేవుని యొక్క సేవకుడని గుర్తించి తాను చేసేటటువంటి పరిచర్యకు షునేము పట్టణంలో ఉన్న సంపన్నురాలు సహకరించింది. ఈమె ఎలీషాకు ఆహ్వానం ఇచ్చి ఆతిథ్యమిచ్చి స్వయంగా తన యొక్క ఇంటి మీదనే అతని కొరకు బస చేయుటకు ఒక గదిని నిర్మించి దానిలో ఒక మంచాన్ని, బల్లను, కుర్చీని, దీపాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంపన్నురాలు దేవుని యొక్క రక్షణ కార్యములో తన వంతు సహకారం తాను చేస్తుంది. ఈ సంపన్నురాలు దేవుని యందు అచంచల విశ్వాసం కలిగినటువంటి ఒక వ్యక్తి. దేవుడు తనకిచ్చినటువంటి వరాల ద్వారా ఇతరులకు సహాయం చేస్తుంది. దేవుని యొక్క పని కోసం తనకు సాధ్యమైన విధంగా ఆమె ఎలీషాకు భోజనం పెట్టి, వారి యొక్క బాగోగులను చూసుకున్నారు. ఆమె యొక్క మంచితనమును, ప్రేమను, విశ్వాసమును చూసిన ఎలీషా ప్రవక్త ఈ విశ్వాసికి కృతజ్ఞత తెలపాలి అని భావించారు దానికి గాను తన కుటుంబంలో సంతానం లేదని తన శిష్యుడైన గెహాజీ ద్వారా తెలుసుకొని వారికి సంతాన వరమును ప్రసాదించారు. ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనం గ్రహించవలసిన సత్యమేమిటంటే ఇతరులకు మేలు చేస్తే ఆ మేలు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడు ఎవరి రూపాన ఏ అవసరంలో మన కుటుంబాన్ని సందర్శిస్తారు తెలియదు కాబట్టి వచ్చినటువంటి వారిని ప్రేమతో స్వీకరిస్తూ వారికి సాధ్యమైన విధంగా మంచి చేస్తే అది ఒక గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. అదేవిధంగా ఏ కుటుంబం అయితే దేవుని యొక్క సేవకులను గుర్తించి వారికి పరిచర్య చేస్తూ వారిని బాధ పెట్టకుండా మంచిగా చూసుకుంటారో ఆ కుటుంబము ఎల్లప్పుడూ కూడా దీవించబడుతుంది. క్రీస్తు ప్రభువై స్వయముగా తన శిష్యులతో అంటున్నారు మేము స్వీకరించిన వారు నన్ను స్వీకరిస్తారు అలాగే నన్ను పంపిన వారిని కూడా స్వీకరిస్తారని. ఈ సంపన్నురాలు కేవలము ఎలిషాను మాత్రమే కాదు తన ఇంటికి ఆహ్వానించింది స్వయముగా దేవుడిని తన ఇంటిలోనికి ఆహ్వానించింది అందుకనే ఆమె కుటుంబంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నారు భర్త వృద్ధుడైనప్పటికిని వారు చేసినటువంటి మంచి పనికి గాను దేవుడు అసాధ్యమైన కార్యం సుసాధ్యం చేస్తున్నారు వారు ఆయన ఎడల గొప్ప ప్రేమను చాటి చెప్పారు అందుకే దేవుడు వారిని దీవించారు. ఈ సంపన్నురాలు ఎలీషా ప్రవక్తకు ప్రత్యక్షంగా సువార్త సేవకు సహకరించకపోయినప్పటికీ పరోక్షంగా ఆమె సహకరించారు అలాగే మనం కూడా సువార్త సేవకులకు సహకరించాలి.

రోమీ-12:13

హెబ్రి-13:2

1పేతు-1:4-9

ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు మనందరం కూడా క్రీస్తు నందు జ్ఞాన స్నానం పొందినట్లయితే క్రీస్తు మరణం మందు జ్ఞాన స్నానము పొందుతామని మనందరికీ కూడా గుర్తు చేస్తున్నారు. క్రీస్తుతో మరణించుట అంటే మనం కూడా మన యొక్క పాపములకు మరణించి ఒక కొత్త జీవితమును జీవించాలి అప్పుడే మన యొక్క జీవితమునకు సరియైనటువంటి అర్థం ఉంటుంది. ఏ విధముగానయితే క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం ఒక కొత్తదనము తీసుకుని వచ్చినదో అదే విధముగా మనము కూడా క్రీస్తుతో మన యొక్క పాపములకు మరణించినట్లయితే ఒక పవిత్రమైన, కొత్తదైన, సంతోషకరమైనటి జీవితం జీవించవచ్చు అదియే పునీత పౌలు గారు మనకు తెలియచేసే అంశం.

ఈనాటి సువిశేష పట్టణంలో ఏసుప్రభు యొక్క శిష్యులకు ఉండవలసినటువంటి కొన్ని లక్షల గురించి మత్తయి సువార్తికుడు మనకు తెలియచేస్తున్నారు ప్రభు యొక్క శిష్యులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అన్నిటికంటే దేవుడిని ఎక్కువగా దేవుడిని ఎక్కువగా ప్రేమించడం అంటే తమ యొక్క జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చుటయే. ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద కాకుండా వ్యక్తుల మీద కాకుండా ప్రేమ నంతయు దేవుని మీద చూపించినప్పుడే మనం గొప్ప సాక్షి పూరిత జీవితం జీవిస్తున్నాం. చాలా సందర్భాలలో మనందరం కూడా ఈ లోకంలో ఉన్న వ్యక్తులను వస్తువులను ప్రేమిస్తుంటాం వాటికే ప్రాధాన్యతనిస్తుంటా కానీ ఏసుప్రభు ఎవరైతే తన శిష్యులుగా ఉండాలి అనుకుంటున్నారో వారు మొట్టమొదటిగా తమ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలుపుచున్నారు. ఎందుకంటే దేవుడే వారిని తన ముఖ పోలికలో సృజించారు, వారిని దీవించారు ఎన్నుకున్నారు. కాబట్టి వారు తమ జీవితంలో అన్నిటికన్నా దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తూ ప్రాధాన్యతనిస్తూ జీవించాలి. దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వటం ద్వారా  వారు దేవుని యొక్క కుటుంబంలో భాగస్తులు అవుతారు.

రెండవ లక్షణం- ఏసుప్రభు యొక్క శిష్యులుగా ఉండాలి అంటే వారికి ఉండవలసిన రెండవ లక్షణం ఏమిటంటే తమ శిలువను తాము ఎత్తుకొని దేవుడిని వెంబడించాలి. యూదుల నమ్మకం ప్రకారం సిలువ శిక్ష అనేది అతిపెద్ద తప్పిదం చేసిన వారికి వేసేటటువంటి శిక్ష అయితే ఈ సిలువ యూదులకు అవమానంగా ఉన్నది కానీ క్రీస్తు ప్రభువు తన శిష్యులకు నేర్పిన విషయం ఏమిటంటే సిలువను ఎత్తుకొని రావటం అంటే వారి జీవితంలో గొప్ప క్షమించే గుణమును కలిగి ఉండటం, అవమానాలు భరించటం, నిందలు మోయటం. సిలువను ఎత్తుకొని రావటం అంటే బాధలు కష్టాలు సమస్యలు అన్నిటిని కూడా ప్రేమతో భరించుకొని స్వీకరించుకొని క్రీస్తు ప్రభువును వెంబడించుట అలాగే సిలువను ఎత్తుకొని ఏసుక్రీస్తును అనుసరించడం అంటే సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుడిని వెంబడించుటయే. వీటన్నిటినీ చేకొని క్రీస్తు ప్రభువుని అనుసరించాలి. చాలా సందర్భాలలో మనము సిలువను తృణీకరిస్తాం కానీ క్రీస్తు ప్రభువు మనందరినీ కూడా సిలువను ఎత్తుకొని తనను అనుసరించమన్నారు అనగా ఈ క్షమించే గుణములు కలిగి అవమానాలు భరించి అలాగే సమస్తమును త్యజించుకొని క్రీస్తు ప్రభువుని అనుసరించాలి.

మూడో లక్షణం-దేవుని కొరకు మన జీవితములను కోల్పోవుట మనం కలిగి ఉండాలి. మన జీవితంలో మన యొక్క స్వార్ధపు ఆలోచనలకు కాకుండా స్వార్థపు జీవితం కాకుండా మన కొరకు మనము జీవించకుండా క్రీస్తు కొరకు జీవించాలి అప్పుడే ఆ జీవితమునకు సరియైనటువంటి అర్థం ఉంటుంది. పునీతులు ఈ లోకంలో జీవించినప్పుడు తమ కొరకు తాము జీవించకుండా ఇతరుల కొరకు దేవుని కొరకు జీవించిన విధంగా మనం కూడా దేవుని కొరకు జీవించాలి.

దేవుని యొక్క సేవ చేసేటటువంటి వారికి తగినటువంటి ప్రతిఫలం దొరుకుతుందని యేసు క్రీస్తు ప్రభువు ముందుగానే తెలియజేస్తున్నారు. అలాగే ఎవరైతే దేవుని యొక్క సేవకులు వీరు అని గుర్తించి వారిని ఆదరించి మంచిగా చూసుకుంటారు వారి ఎల్లప్పుడూ కూడా దీవించబడుతుంటారు. కాబట్టి దేవుని యొక్క సేవకులను గుర్తించి వారికి మంచిని చేస్తూ మనం కూడా దేవుని యొక్క సువార్తలో భావిస్తులై జీవించుదాం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సువార్త సేవ చేసే వారికి మన వంతు సహాయం మనం చేద్దాం.

Fr. Bala Yesu OCD

లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...