17, జులై 2021, శనివారం

పదహరవ సామాన్య ఆదివారం


 పఠనములు: యిర్మీయా:23 :1 -6; ఎఫె:2 :13 -18; మార్కు:6 :౩౦ -34
క్రీస్తు నాధుని యందు ప్రియ విశ్వాసులారా! ఈనాడు మన తల్లి తిరుసభ పదహారవ సామాన్య ఆదివారంలోకి మనందరినీ ఆహ్వానిస్తుంది.
      ముందుగా మొదటి పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే, పూర్వ వేదంలో ఇశ్రాయేలీయుల రాజుల స్వార్ధం, అహం, పాలితులపట్ల అశ్రద్ధవల్ల తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు చెల్లా చెదురయ్యారని యిర్మీయా ప్రవక్త మొదటి పఠనంలో తెలియజేస్తున్నాడు.
       రెండవ పఠనాన్ని మనం చూస్తే, పునీత. పౌలు గారు చెల్లా చెదురైనా మానవ జాతిన ఏకం చేయడానికి క్రీస్తు ప్రభువు తన జీవితాన్నే త్యాగం చేసారని బోధిస్తున్నాడు.
               అదే విధంగా, సువిశేష పఠనంలో కాపరిలేని గొర్రెలవలే నున్న వారిని చూసి యేసు జాలి పడి వారికి ఉపదేశింప నారంభించెను అని పు.మార్కు గారు తెలియజేస్తున్నారు.
           అయితే , ముందుగా మొదటి పఠనాన్ని క్లుప్తంగా ధ్యానించినట్లయితే,ఈ లోకంలో జీవిస్తున్న ప్రతిఒక్కరికి దేవుడు ఏదోఒక బాధ్యతను అప్పగించి ఉన్నాడు.అయితే ఆ బాధ్యతను నీవు ఏవిధంగా నెరవేరుస్తున్నావు అనేది  ముఖ్యం.ఉదా;నాయకులు,ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు,  గురువులు,ఇంకా మొదలైనవారు.
            ఈనాటి పఠనంలో,యిర్మీయా ప్రవక్త గారు ఆత్మ పూరితుడై ఇశ్రాయేలు రాజులగురించి ప్రవచించాడు.యిర్మీ;21 ;1 లో చూస్తే, “ప్రభు మందను చెల్లాచెదరు చేసి,నాశనము చేయు కాపరులు శాపగ్రస్తులు”,అని బోధించాడు.ఎందుకంటే వారు ప్రజలపై జాగ్రత్తపడకుండా, వారిని ఎంతో కష్టపెట్టి, అన్యదేవములను కొలువమని చెబుతూ, వారిని బ్రష్టులుగా చేసి, దేవునినుండి దూరమయ్యేలా వారిని చెల్లాచెదరు చేసారు.దీని కారణంగా ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వకుండా వారి ఇష్టాను సారము జీవించసాగారు. హోషేయ:5 :4 లో చూస్తే,"ప్రజలు తాము చేసిన దుష్కార్యాలవలన తిరిగి దేవునివద్దకు రాలేకపోవుచున్నారు.వారు విగ్రహారాధనమున తల మునస్కులై యున్నారు.కావున ప్రభువును తెలిసికోజాలకున్నారు".
      ఎజ్య్రా కాలములో దివ్య గ్రంధాన్ని చదువుచున్నప్పుడు దుఃఖం  పట్టలేక బోరున ఏడ్చారు అని తెలుపుచున్నది(నెహమ్యా : 8 :9). కానీ, రానురాను వారిలో ఆ విశ్వాసం సన్నగిల్లిపోతుంది.అదే విధంగా, రాజు అనేవాడు ఇశ్రాయేలు ప్రజలకు సేవకుడు మాత్రమే. కానీ, ఐగుప్తు దేశంలో ఫరో రాజు మాత్రం దేవునితో సమానము.అందుకే దావీదు మహారాజు తనను సేవకుడిగా పోల్చుకున్నాడు, నేను దేవుని యొక్క సేవకుడనని. మొదటి సమువేలు;17 :34 లో చూస్తే, దావీదు సౌలుతో "నీ దాసుడు తన తండ్రి గొఱ్ఱెలమందనుకాయుచుండెడివాడు.అప్పుడప్పుడు సింగము గాని, ఎలుగుబంటిగాని, మంద మీద పడి గొర్రెలనెత్తుకొని పోయెడిది.నేను వన్య మృగమును తరిమి, చావమోది దాని నోటినుండి గొర్రెను విడిపించుకొని వచ్చెడివాడను.అది నామీద తిరగబడెనేని మెడక్రింద జూలు పట్టుకొని చితక బొడిచి చంపెడివాడను".ఇలా తన తండ్రి గొర్రెలను కాపాడినట్లు దావీదు రాజుగా అభిషిక్తుడైన తరువాత కూడా తన తండ్రి అయినటువంటి దేవునియొక్క మంద అయినటువంటి మనలను తన మరణాంతము వరకు, ఇతర రాజులనుండి సురక్షితముగా కాపాడుకుంటూ వచ్చాడు.సమువేలు  ప్రవక్త  కాలమున  ఇశ్రాయేలుప్రజలు,సమువేలుతో ఇలా అంటున్నారు; అన్ని రాజ్యాలకు రాజు ఉన్నాడు, మాకు కూడా ఒక రాజును నియమించు అని పలుకుచున్నారు.రాజుని ఎప్పుడైతే వారికి నియమించారో అప్పటి నుండి వారి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి,ఇంకా విభజన ఏర్పడినది.
        మొదటి రాజులగ్రంధము 9 :4 -9 లో చూస్తే తండ్రియైన దేవుడు సొలొమోను రాజుతో ప్రమాణము చేస్తున్నాడు. అదేమిటంటే, నీతండ్రి దావీదు వలె నన్ను చిత్త శుద్దితో కొలుస్తూ, నాకు విధేయుడవై నా ఆజ్ఞలను పాటింతువేని నీ వంశీయుడొకడు నిత్యము నీ సింహాసముపై కూర్చుండి ఇశ్రాయేలును పరిపాలించునని నేను పూర్వము నీ తండ్రి దావీదునకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకొందును.కానీ, నీవుగాని, నీ అనుయాయులు  గాని  నన్ను విడనాడి అన్యదైవములను ఆరాదింతురేని,ఇశ్రాయేలును నేనిచ్చిన నేలమీద నుండి తొలగింతును. నేను దేవాలయమును విడనాడుదును,జనులు చూసి నవ్వుకొందురు. గడ్డిపోచతో సమానముగా చూతురు.ప్రభువు ఈ గడ్డకు, ఈ దేవాలయానికి ఎంత గతి పట్టించెనో చూడుడని ఛీ కొట్టుకొందురు".  దేవుడు వారితో ఇంత చెప్పినా కూడా వారు మాత్రం ఆయనకు విరుద్ధముగానే జీవించారు.
    అంతే కాకుండా ఒక్కటిగావున్న రాజ్యాన్ని సొలొమోనురాజు మరణించిన తరువాత రెండుగా విభజించి ఒకటి ఉత్తర రాజ్యంగా, మరొకటి దక్షణ రాజ్యంగా విభజించారు.దీని మూలంగా వీటిని పరిపాలిస్తున్న రాజులు వారి స్వంత స్వలాభాలకోసం, అన్యదేవుళ్ళను కొలవడం,బంగారముతో ఆవులనుచేసి కొలవడం,వారికిష్టమొచ్చినట్లు దేవాలయమును నిర్మించి, సాధారణ కుటుంబానికి చెందిన యాజకులను ఈ దేవాలయములలో నియమించడం,కొండలపైనదబ్బర దేవతలకు దూపములను, నైవేద్యములను అర్పించడం, ఇలా ఇన్నోరకాలుగా  ప్రజలను ఎన్నో పాపములను ఒడిగట్టేలా చేసారు. ఇలాంటి క్లిష్ట సమయంలో క్రీస్తుపూర్వం 595 - 587 మధ్య కాలంలో పరిపాలిస్తున్నటువంటి సిద్కియా రాజును తన పాపపు జీవితము నుండి మరల మంచి జీవితమునకు తీసుకురావటానికి యిర్మీయా ప్రవక్తను దేవుడు పంపిస్తున్నాడు.కానీ, అతడు మాత్రం ప్రవక్త మాటలను వినికూడా, ఆచరించకుండా బబులోనియాపై యుద్దానికి దిగాడు. అందుకు గాను బాబులోనీయులు ఇశ్రాయేలు ప్రజలను ఓడించి, యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసి,ప్రజలను బానిసలుగా బాబులోనియాకు తీసుకొని వెళ్లారు. దీనంతటికి ముఖ్య కారణం అప్పుడున్నటు వంటి కాపరులే.
    అయితే దేవునినుండి వెడలిపోయిన ప్రతిఒక్కరిని మరల దేవునితో ఏకం చేయడానికి,అయన వద్దకి చేర్చుటకు ఈ యిర్మీయా ప్రవక్తను తన చిన్న ప్రాయమునందే ఎన్నుకొని తన పేరిట బోధించామని పంపిస్తున్నాడు. అదేవిధంగా రానున్న మెస్సయా గురించి తెలియజేస్తున్నాడు. "నేను దావీదు వంశమునుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి.రాజు విజ్ఞానముతో పరిపాలించును. దేశమంతట నీతి న్యాయములు నెలకొల్పును.అతని పరిపాలనా కాలమున యూదా భద్రముగా జీవించును" (యిర్మీయా :23 :6 ).  
    మరి ఈనాటి సువిశేష పఠనాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు:
                మొదటిది, శిష్యులయొక్కపని.
                 రెండవది, దేవునియొక్క కనికరం.
      మొదటిగా, గడచినా వారము యేసుప్రభువు తన పండ్రెండు మంది శిష్యులను ఇద్దరిద్దరిని చొప్పున వివిధ ప్రాంతాలకు వేదప్రచారమునకు పంపించినపుడు,వారు వెళ్లి హృదయపరివర్తనము గురించి బోధించి,పిచచములను ప్రాలద్రోలి, ఎంతోమందిని స్వస్థపరిచి,తిరిగి ఏసుప్రభువుని చేరుకొనిన పిమ్మట వారి శ్రమను, పనితనమును చూసి,వారికి విశ్రాంతి అవసరమని గుర్తించి,జనసమూహమునుండి  ఈనాడు వారిని నిర్జనప్రదేశమునకుపంపిస్తునాడు.ఇక్కడ శిష్యులపై దేవునియొక్క ప్రేమను మనం చూస్తున్నాం. ఇక్కడ మనం అర్ధం చేసుకునేదిఏమిటంటే,క్రీస్తును అనుసరిస్తున్న మనము ప్రతిరోజు ప్రజల ఆవరణనుండి, దేవుని ఆవరణకు వెళ్ళాలి.మనయొక్క బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలి.అప్పుడే మన జీవితానికి ఒక అర్ధం, పరమార్ధం ఉంటుంది.
         రెండవదిగా, దేవుని యొక్క కనికరం. మనం చూస్తే,యిర్మీయా ప్రవక్త యొక్క ప్రవచనం నెరవేరుతుంది. యేసుప్రభువు జనసమూహాన్ని చూసి,కాపరిలేని గొర్రెల వలే నున్న వారిపై కనికరము కలిగి, వారికి అనేకవిషయములను బోధింపనారంభించెను అని పు.మార్కు గారు అంటున్నారు.
 అయితే ప్రజలపై ఎందుకు దేవుడు జాలి చూపిస్తున్నాడు అంటే, ఏమార్గమున వెళ్లాలో వారికి తెలియదు.అందుకే దేవుడంటున్నాడు,"నేనే మార్గమును"అని.ఎవరిని ఆశ్రయిస్తే వారిలో కష్టాలుపోతాయని వారికీ తెలియదు. అందుకే దేవుడంటున్నాడు, "నేనే జీవమును" అని.అయితే సత్యవంతుడైనటువంటి యేసుప్రభువుని ఎప్పుడైతే వారు ఆశ్రయిస్తున్నారో,   వారి రోగములను నయం చేస్తున్నాడు.పాపములను తుడిచివేస్తున్నాడు.పరలోక రాజ్యం గురించి,నిత్య జీవితము గురించి,అదేవిధముగా, తండ్రి దేవునియొక్క ప్రేమను గురించి తెలియజేస్తూ, వారిని పాపపు మార్గము నుండి నిత్యజీవితము అను మార్గము వైపు నడిపిస్తున్నాడు.అందుకే ఈనాటి సువిశేష పఠనంలో ఎంతోమంది ప్రజలు దేవునియొద్దకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. 
 ఆనాడు ఎంతోమంది రాజులు వారి స్వార్ధం కోసం చూసుకుంటే ఈనాడు యేసుప్రభువు ప్రజల క్షేమం కోరుకున్నాడు. అందుకే వారియొక్క జీవితాలను మారుస్తున్నాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు  ఇలా అంటున్నాడు, “నేను మీ క్షేమము కొరకు ఆదేశించిన పధకములు నాకు మాత్రమే తెలియును.నేను మీ అభివృద్ధినేగాని వినాశనమును కోరాను.నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని"(యిర్మీ:29 : 11 ).
    అయితే ఆ బంగారు భవిష్యత్తును మనం పొందాలంటే ఏం చేయాలి?
         1 .యేసుప్రభువునందు విశ్వాసం కలిగి జీవించాలి.
                         ఈ విశ్వాసమే ఈలోకంలోఉన్న ప్రతిఒక్కరిని దేవునిలో ఏకం చేయగలదు.అందుకే రెండవపఠనంలో పు.పౌలు గారు ఇలా అంటున్నారు:"యూదులము, అన్యులము అయినా మనము అందరము, క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము".అందుకే ఈనాడు ఎంతోమంది ప్రజలు వివిధ గ్రామాలనుండి దేవునివద్దకు  వచ్చి ఎన్నోమేలులను పొందుచున్నారు.ఇది కేవలం వారి విశ్వాసం వలననే.ఆనాడు ఈ యూదులు అన్యులు ఎంతో  శత్రువులుగా వుండి,వారి ప్రాణాలను కూడా లెక్కచేయకుండా, ఒకరిపై ఒకరు యుద్ధము చేసుకొనుచుండెడివారు. కానీ “క్రీస్తు వీలందరికోసం ఒక్కడే ఈ లోకానికి వచ్చి సిలువపై ఘోరాతి గోరంగా మరణించి,ఆ వైరమును రూపు మాపెను” (పు.పౌలు:2 :16 ).  అలా, ఈ అన్యులను, యూదులను ఒక్కటిగా మార్చాడు.వీరిని దేవునియొక్క సమక్షంలో నడిపించాడు.స్నేహితులుగామార్చడు.అదేవిధంగా,వీరందరికి ఒకే నియమం కల్పించాడు. చివరికి అందర్నీ ఒక్కటిగా కలిపాడు.
      2 .భాద్యత కలిగిన కాపరులుగా లేక వ్యక్తులుగా మెలగాలి.
                మోషే ప్రవక్త నలుబది సంవత్సరములు భాద్యత కలిగిని కాపరిగా ఉండి,ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కనాను దేశమునకు నడిపించాడు.దావీదు మహారాజు నలుబది సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు బాధ్యత కలిగిన రాజుగా ఉండి వారిని దేవుని వైపు నడిపించాడు.అలాగే, ఎంతోమంది ప్రవక్తలుకూడా బాధ్యత కలిగిన కాపరులుగా ఉండి దేవుడు వారి జీవితములో నియమించిన పనిని వారు పూర్తి విధేయతతో,  భాద్యతగా చేసారు.అదే విధంగా ఈనాడు నువ్వు నేను కూడా ఒక నాయకుడిగా,అధికారిగా,ఉపాధ్యాయుడిగా,గురువుగా,ఒక తల్లి తండ్రిగా,మనకు నియమించబడిన పనిని సక్రమంగా నెరవేర్చినపుడే మనం బాధ్యతకలిగిన కాపరులుగా పిలువబడడానికి అర్హులమవుతాం. 
       ౩. ఐక్యతా వారధులుగా ఉండాలి.
                ఈనాటి రెండవ పఠనంలో, పు.పౌలు గారు, చెల్లాచెదురైన మానవజాతిని ఏకం చేయడానికి క్రీస్తు ప్రభువు తన జీవితాన్నే త్యాగం చేసాడని వివరిస్తున్నాడు. వీరులు ఎప్పుడైతే రాజ్యంలో ఐక్యతను కోరుకుంటారో,అప్పుడే రాజ్యం సుఖ సంతోషాలతో అలరాలుతుంది.యేసుప్రభువు తన మరణము ద్వారా ద్వేషాన్ని,విభజనా శక్తిని నాశనం చేసి, నూతన మనిషిని, నూతన కుటుంబాన్ని రూపొందించాడు.పు. పౌలు గారు ఇలా అంటున్నారు:"పూర్వము మీరెట్లుండిరో స్మరింపుడు.ఒకప్పుడు మీరు శారీరకంగా అన్యులై ఉంటిరి, కానీ ఇప్పుడు క్రీస్తుయేసు నందు ఏకమగుటతో, దూరస్థులగు మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసికొనిరాబడితిరి"( ఎఫె:2 :11 ,13 ).  అందుకే ఈనాడు క్రైస్తవ మతం అంటే ఐక్యత కలిగిన మతంగా పిలువబడుతోంది.అయితే ఈనాడు మన జీవితములో కూడా ఐక్యత కలిగి ఉండాలంటే లేక ఐక్యత వారధులుగా ఉండాలంటే,ఒకరినొకరు అర్ధం చేసుకొంటూ,శాంతి, సమాధానాలతో,కరుణతో మెలిగినపుడే,మనలో ఐక్యత ఏర్పడి, ఐక్యత వారధులుగా మెలుగుతాము. 

           కాబట్టి ప్రియ విశ్వాసులారా! ఈనాడు మన జీవితములలోకి, మంచికాపరి ఐన మన యేసు ప్రభువుని ప్రగాఢమైన విశ్వాసముతో ఆహ్వానించి,భాద్యత కలిగిన కాపరులుగా జీవిస్తూ, ఐక్యత కలిగి జీవిస్తూ,ఒక మంచి క్రీస్తుననుసరించు వ్యక్తులుగా జీవించడానికి ప్రయత్నిదాం.అప్పుడే మన జీవితానికి ఒక అర్ధం, పరమార్ధం ఉంటుంది. ఆమెన్.

             Nandigama Sunil mario

15, జులై 2021, గురువారం

కార్మెల్ మాత మహోత్సవం

కార్మెల్ మాత మహోత్సవము 

పాలస్తీనాలోని కార్మెల్ కొండలు చాలా ప్రసిద్దమైనటువంటివి. ఇక్కడ బైబిల్ లోని ప్రసిద్ద సంఘటనలు జరిగాయి. మరి ముఖ్యమైనటువంటి సంఘటన ఏమిటి అంటే ఏలియా ప్రవక్త  యవే దేవుని మహిమను, మహోన్నతను చూపిస్తూ బాలు ప్రవక్తలను చంపినది ఈ పర్వతము మీదనే. అదే విధముగా కీర్తన గ్రంధములో ఈ పర్వతము యొక్క అందాన్ని వివరించడము  మనము చూస్తాము. ప్రవక్తలు ఈ పర్వతము గురించి మాటలాడుతారు. ఈ పర్వతము నిజ దేవుని మహిమను చాటుతుంది.  ఈ పర్వతములో పుట్టిన టువంటి ఒక సన్యస కుటుంబమే కార్మెల్ సభ. ఈ సభకు ఈ పేరు అక్కడ మరియమాతకు అర్పించినటువంటి ఒక చిన్న దేవాలయము నుండి వచ్చింది. ఆ పర్వతము మీద ఉన్న టువంటి దేవాలయము పేరు కార్మెల్ మాత దేవాలయము.  

     ప్రతి సన్యాస సభ తన యొక్క పేరును ఒక స్థలం నుండి లేక  వారి పునీతుని నుండి పొందుతుంది. కార్మెల్ అనేది పాలస్తీనా లో ఉన్నటువంటి ఒక కొండ . సిలువ యుద్దాలు జరిగిన తరువాత 11 మరియు 12 వ  శతాబ్దాలలో ఈ కొండలలో సన్యాస జీవితము ప్రబలిల్లీనది. సిలువ యుద్దాలలో పాల్గొన్న టువంటి  కొంతమంది సైనికులు దేవునికి తమ జీవితాన్ని  అంకితము చేస్తూ అక్కడ ఉన్న కొండ గృహాలలో ప్రార్దన జీవితము జీవిస్తూ బ్రతికారు.  వీరు తమ జీవితాలను మఠవాసులు కంటే ఎక్కువగా  ప్రార్దన జీవితానికి కేటాయించారు.  ఎక్కువ సమయము ధ్యానము చేస్తూ  మౌనమును పాటిస్తూ జీవించారు. వీరిలో మనకు   ఈజిప్టు ఎడారిలో ఉన్నటువంటి ఆదిమ క్రైస్తవ సన్యాసుల జీవన శైలి కనుపడుతువుండేది. వీరు ఎక్కువగా వారి వారి గదులలో ఒంటరిగా జీవిస్తూ  ప్రార్దనకు ప్రాముఖ్యత ఇస్తూ జీవించేవారు. వీరిని  కార్మెల్ మాత సహోదరులు అనే పేరుతో  పిలుస్తారు. ఇది  వారు మరియమాతకు ఇచ్చే ప్రాముఖ్యతను సూచిస్తుంది.  కార్మెల్ కొండలలో ఉన్న ఈ  సభ ఇస్లాం ప్రభావము వలన ఆ ప్రాంతాన్ని వదలి ఐరోపా కు వెల్ల వలసి వచ్చినది . కేవలము కార్మెల్ సభ సభ్యులు మాత్రమే కాక అనేక సభల వారు ఆక్కడనుండి వేరే ప్రదేశాలకు వెళ్ళేరు. 

    అనతి కాలములోనే ఈ  సభ అనేక ప్రాంతాలకు వ్యాప్తి చెందడము జరిగింది. ఐరోపా ఖండములో ఈ సభ సభ్యలు వారి క్రొత్త దేవాలయాలను కార్మెల్ మాత పేరున ఏర్పాటుచేయడము జరిగినది. కార్మెల్ సభ  మరియమాతకు అంకితము చేయబడియన ఒక సన్యస సభ ,అది సంపూర్తిగా మరియమాత సభ  totus marianus est . చారిత్రకముగా కార్మెల్ కొండలలో ఉన్నటువంటి  సన్యాసులు వారీ పేరును ,గుర్తింపును వారు ఏర్పాటు చేసుకున్న చిన్న మరియమాత దేవలయము నుండి పొందేరు. మారియమాత భక్తి అనేది వారి జీవితాలలో ఒక ప్రదాన అంశము. 14 వ శతాబ్దములో ఉన్నటువంటి  కార్మెల్ రచనలలో వారి జీవిత విదానము మరియమాత వలె ఉండాలి అని కోరుకునేవారు. మరియ మాత  కార్మెలీయులకు సోదరి మాత్రమే కాదు వారి తల్లీకూడ.   ఆమెలో వారు చూసెదీ ఏమిటి అంటే ఏ విధముగా ఆమె జీవితాన్ని దేవుని కోసము జీవించినది అని, ఒక సారి ఆమె జీవితము చూసినట్లయితే ఆమె జీవితములో దేవుడు ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తుంటాడు. ఆమె దేవుని కోసము పరితపిస్తుంది . ఆమె మనస్సు  , ఆమె ఇంద్రియాలను, ఆమె శక్తి యుక్తులను మొత్తన్ని దేవుని కోసమే ఆమె హెచ్చించినది. ఆమె మనస్సు  దేవుని చూడడానికి ఆయన ఇష్ట ప్రకారముగా జీవించడానికి ప్రాముఖ్యతను ఇస్తుంది. కార్మెల్ సభ సభ్యులు కూడా మరియమాత వలే జీవించడానికి ముఖ్యముగా , ఆ  ఆధ్యాత్మిక జీవితాన్ని, మౌన జీవితాన్ని , ధ్యాన జీవితాన్ని మారియమాత నుండి  పొందుతారు లేక నేర్చుకుంటారు. వీరు పరిశుద్ద కన్య మరియ సహోదరులు అను  పేరును కలిగిఉన్నారు.  ఆమె ప్రేమకు, సేవకు  అంకితము చేయబడ్డ ఒక సన్యాస  సభకూ చెందినవారు కనుకనే. మరియమాత తో ఈ ప్రత్యేక సంభందము వీరి జీవితలను పరిపూర్ణ ప్రేమను చేరే విధముగా చేస్తుంది. మరియమాత  సాన్నిధ్యం  ఈ సభ చరిత్ర మొత్తము ఉన్నది. ఈ సభ దాని పుట్టుపూర్వోత్తరాలు  ఈ కొండ మీదనే జరుగుతున్నాయి. మరియమాతను  ప్రార్దనకు  మరియు దేవునికి జీవితాన్ని అంకితము చేయటములో మాతృకగా తీసుకొని వీరు జీవిస్తారు. అదే విధముగా  మరియమాతను దేవుని వాక్కును ఎల్లప్పుడూ ధ్యానిస్తూ జీవించే వ్యక్తిగా మరియు దేవుని చిత్తానికి సంపూర్తిగా అర్పించుకున్న వ్యక్తిగా చూస్తారు. ఈ  సభ అందరి వలె ప్రార్దన చేస్తుంది. కానీ ఈ సభ ముఖ్య ఉద్దేశమే ప్రార్ధనలో దేవుని కనుగొని  ఆయనను అనుభవపూర్వకముగా తెలుసుకొని ఈ అనుభవాన్ని ఇతరులకు చెప్పడము.  మరియమాత అడుగు జాడలలో నడుస్తూ దేవుని ఏ విధముగా  చేరుకోవాలి , దేవుణ్ణి ఈ లోకములోనే ఉండగా ఏ విధముగా  ఆయనలో ఐక్యము కావాలి  అని నేర్పిన వారు ఈ సభ పునీతులయిన  ఆవిలపూరీ తెరేసమ్మ , పునిత సిలువ యోహాను గార్లు అధె  విధముగా చిన్న తెరేసమ్మ గారు కూడా చిన్న చిన్న పనులు చేస్తూ దేవుని ఏ విధమూగ చే రుకోవలో చెపుతుంది ఈమె కూడా ఈ సభ పునీతురాలే. వీరి  జీవితము మరియమాతను అనుసరించి ఉంటుంది. దైవ ప్రేమ, దైవ అన్వేషణ వీరిలో మనము ఎక్కువగా  చూస్తాము. పునీత సిలువ యోహాను గారు రాసిన రచనలలో మరి ముఖ్యముగా కార్మెల్ పర్వత ఆరోహణము , ఆంధకార రాత్రి, ఆధ్యాత్మీక గీతం  మరియు  సజీవ ప్రేమాగ్ని జ్వాల అనే పుస్తకాలలో మనము దేవుని అన్వేషించడము,  ఆయనను  చేరుకోవడము చూస్తూంటాము. ఇది నిజానికి చాలా గొప్ప జీవితము, మరియమాత  వలె వేరొక చింతన లేకుండా కేవలము  దైవ చింతనతో జీవించే ఒక జీవితము. అందుకె  మరియమాత తన ఉత్తరియాన్ని విరికి ఇవ్వడము జరిగినది.   తిరుసభలో ఉన్నటువంటి వెదపండితులలో నలుగురు మాత్రమే స్త్రీలు, వారీలో  ఇద్దరు  ఆవిలపూరి తెరజమ్మ  మరియు చిన్న తెరేజమ్మ ఈ సభ  వారే. కార్మెల్ మాత పండుగకు ఈ సభకు  చాలా  విడదీయయరాని బందాన్ని మనము చూస్తాము. ఎప్పుడైతే ఈ సభ ఇటువంటి  జీవితాన్ని విడనాడి దాని సభ్యులు వారి ఇష్ట  ప్రకారముగా జీవిస్తూ ఉన్నారో అప్పుడు ఆ సభ పెద్దలు అయిన పునీత సైమన్ స్టాక్ గారు ప్రతిరోజూ ప్రార్దన చేస్తు మరియమాత  సహాయాన్ని కోరుతూ తన సభను  కాపాడుకోమని కోరేవాడు. ఒక రోజు ఆమె ఆయనకు ఆ సభకు  అభయమిస్తూ ఆమె ఉత్తరియాన్ని పునీత సైమన్ స్టాక్ గారికి ఇచ్చింది. ఈ  ఉత్తరియాన్ని ఇస్తూ ఎవరియతే దీనిని ధరించి చనిపోతారో వారిని  కాపాడుతాను అని అభయము ఇచ్చింది. అప్పటి నుండి  మనము ఉత్తరియము  ద్వారా మారియమాత ఇచ్చిన  అభయాన్ని పండుగగా  జరుపుకుంటున్నాము. 

    అనేక దేశాలలో ముక్యముగా ఐరోపా , లాటిన అమెరికాను దేశాలలో చాలా గొప్పగా ఈ పండుగను జరుపుకుంటారు. పతన స్థితిలో ఉన్న కార్మెల్ సభ మరలా ఏ విధముగా పునరుద్దరిచబడిందో అదే విధముగా మన జీవితాలు కూడా పునరుద్దరిచబడాలి  అని ఆ మరియమాత  ఉత్తరియాన్ని ధరించి , ఆమె మద్యస్థ  ప్రార్ధన ద్వార  వేడుకొందాము. 

Fr. Amrutha Raju OCD

4, జులై 2021, ఆదివారం

14 వ సామాన్య ఆదివారము

 

14 వ సామాన్య ఆదివారము 

యెహేజ్కెలు 2  : 2  - 6 / 2  కొరింతి 12 : 7  - 10 /  మార్కు 6 : 1  - 6 

 

క్రిస్తునాధుని యందు ప్రియమైన స్నేహితులారా  ఈ నాదు మనము పధ్నాలుగోవా సామాన్య ఆదివారములోనికి ప్రవేశించియున్నాము ఈ నటి పరిశుద్ధ గ్రంథ పఠనలద్వారా త తండ్రి  దేవునికి మన పై ఉన్నటువంటి ప్రేమను తల్లి శ్రీ సభ మనకి తెలియజేస్తుంది 

ఐతే  మొదటిపఠనములో మనము గమనించినట్లు ఐతే ప్రభువైన యావే యెహేజ్కెలు ప్రవక్తతో పలుకుచున్న మాటలను మనము వింటున్నాము నర పుత్రుడా ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసిరి వారు  మొండివారిగా నన్ను లెక్కచేయతలేదు వారి మధ్యకు నిన్ను పంపుచున్నాను వారితో ప్రవక్త వున్నాడని గ్రహించి ఐన దేవునివైపు మారులుతారు అని మనకి అర్ధమగుచున్నది  

  ఈ ఇశ్రాయేలీయులు ఎవరయ్యా అంటే ఇక స్వరముతూ యావెను స్తుతించినవారే యావెను నమ్మినవారే ప్రభు నిన్ను పోలినదేవుడు ఎవరు అని పలికిన వారే నీవే అద్భుతకార్యములను  చేసినవాడవు అని ముక్త కంఠముతో స్తుతించినవారు ఈ ఇశ్రాయేలీయులు [నిర్గమ 15 : 11 ]  అహాబు రాజు పరిపాలన కాలములో బాలు దేవతలు పూజిస్తూ ప్రభువుని మరచిపోయి అందరు ప్రష్టులైపోయారు పాపముతో నిండి పోయారు పూర్తిగా వారి జీవన వ్యాపారములో మునిగి పోయారు త్రాగడం సుకించడం అనేదే వారి జీవిత వాంఛగా మారినిది వారి పనులలో దేవుని యొక్క ప్రస్తావనే లేదు దేవుడిని మరచి పోయారు ఇశ్రాయేలీయుల గురించి ప్రభువైన యావే ప్రవక్త అయినటువంటి ఎహేజ్కెళుతో పలికెళిన మాటలను మనము ఈనాటి మొదటి పట్టణములో వింటున్నాము దేవుడు తన ప్రజల తప్పులను ఏత్తిచూపిన విధానం ఆసక్తి కరంగా ఉంటుంది వారు కేవలం విశ్వాసం లేని వారు అవిధేయులు మాత్రమే కారని వారు తిరుగుబారు దారులని మొండి వారని ప్రభువు ప్రవక్తకు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దేవుడు పలికిన ఈ పలుకులు ఇశ్రాయేలీయుల పట్ల అనాదిగ అయన చూపిన ప్రేమ పరోక్షముగా వెల్లడిస్తాయి అయినప్పటికీ తాను ఎన్నుకున్న ప్రజలలో తాను కోరుకున్న మార్పు వస్తుంది అన్న ఆశతో ప్రవక్తని పంపించడం దేవుని  యొక్క ప్రేమకు నిలువెత్తు సాక్షం. ఏదో ఒకనాటికి వారిలో హృదయ పరివర్తనం కలుగుతుంది తమ మధ్య గల ప్రవక్తను వారు గురుతిస్తారు తెలుసుకుంటారు అవిధేయులైన ఇశ్రాయేలు ప్రజల పట్ల ప్రభువైన దేవునికి వారిమీద గల నమ్మకం.

ఈ నాటి రెండవ పట్టణములో పునీత పాల్ గారు నా శరీరములో ఒక ముళ్ళు గ్రుచ్చ బడినది అది సైతాను దూత అంటారు. ఏమిటి ఆ ముళ్ళు? ఎవరు ఈ సైతాను దూత? [2 కొరింథీలు 11 : 12 - 15  ]  పౌలు అసత్యపు ఆపోస్టులను సైతాను ప్రతిరూపాలతో పోలుస్తున్నాడు. అసత్యపు ఆపోస్టులలో ఒకడు శరీరములో ముల్లువలె పౌలును బాధించేవాడు పౌలు సువార్త పరిచేర్యకు అడ్డు పడుతూనేఉన్నాడు కనుక ఆ అసత్యపు అపోస్తులను ఉదేశించి పౌలు శరీరములో ముళ్ళు అని అన్నాడు నిజానికి క్రీస్తు ప్రభువు బలహీనులైన వ్యక్తులద్వారానే  తన శ్రీసభ నిర్మాణం కొనసాగిస్తూ ఉంటారు అందుకే పౌలు తన బలహీనతల గురించి యంత ఎక్కువగా ప్రకటిస్తూ ఉండేవాడో అంత ఎక్కువగా ప్రజలు ఆయనలో పునరుతనా క్రీస్తును దర్శించ గలిగేవారు ఒక్క మాటలో చెప్పాలంటే వేద ప్రచారములో పౌలు ఎన్ని వేదనలకు గురి అయ్యాడో ఏవిందంగా తిరస్కరించ బడ్డాడో ఈ నాటి రెండవ పఠనం తెలియజేస్తుంది. యేసు క్రీస్తు ప్రభువే సొంత ప్రజలతో తృణీకరించ బడినపుడు పౌలు వంటి సువార్తికులు బోధకులు ప్రభువు అడుగు జడలలో నడిచే క్రెస్తవ విశ్వాసులు ఏదో ఒక్క రూపములో తిరస్కారానికి గురికావడం సహజమేనని ఈనాటి సువిశేషములో స్పష్టమగుతుంది. యేసు ప్రభువు తన సొంత ఊరు నజరేతుకు వెళ్లారు సొంత ప్రజలే ఆయనను నిరాకరించారు తృణీకరించారు బోధకుడిగా అయన చేసిన బోధనలను కూడా తిరస్కరించారు యేసు ప్రభువు తన సొంత ప్రదేశానికి నజరేతుకి రాకమునిపే ఆ పట్టణ ప్రజలు యేసు బోధనలు చేస్తున్నాడు అని అద్భుతాలు కూడా చేస్తున్నాడని చెప్పుకున్నారు. ఈ నాటి సువిశేషములో యేసు ప్రభువు ప్రధానమందిరములో బోధించడంతో ప్రారంభమై పరిసర గ్రామాలలో బోధించడం ముగుస్తుంది.

యేసు ప్రభువు గల బోధన సామర్ధ్యాన్ని జ్ఞానాన్ని చూసి నజరేతువాసులోతో సహా ప్రజలందరూ ఆచార్య పోయారు అయితే అయన బోధిస్తున్నవి సత్యసందేశాలు అయినప్పటికీ ప్రజలు వాటిని ఆమోదించలేక పోయారు మన మధ్య పుట్టి పెరిగినవాడు మనకే బోధన చేస్తాడా అన్న చులకన భావం వలన వారు బోధకుడిగా యేసు ప్రభుని అదరణిచలేక పోయారు తృణీకరించారు

ప్రియమైన స్నేహితులారా క్రీస్తు ప్రభు పలికిన ప్రతి మాట నిత్యా సత్యమని విశ్వసించాలి ఎందుకంటె పలికిన వాడు పురాతనుడైన ప్రభువు మహిమాన్వితుడైన తండ్రి దేవుని సన్నిధానంలో ఉన్నారు. ఈ సత్యాన్ని మనసారా నమ్మి ప్రభు మాటలను త్రికరణ శుద్ధిగా పాటించక పోతే అనజరేతు ప్రజలు తిరస్కరించిన దానికంటే మనము ఏవిధముగా మెరుగైన వరమని అనిపించుకోము తనని నమ్మి వచ్చిన రోగులను స్వస్థ పరిచారు క్రీస్తుప్రభువు. మనము కూడా ఆయనను నమ్మి క్రీస్తు సువార్తలో పాలుపంచుకోవాలని మహిమలు చూడాలని ఈ నాటి పరిశుద్ధగ్రంధ పఠనాలు మనకు తెలియచేస్తున్నాయి ఆమెన్.

                                                                                      -BR. MANOJ

 

 

 

 

28, జూన్ 2021, సోమవారం

పద మూడవ సామాన్య ఆదివారం


సో, జ్ఞాన 1 : 13  - 15 , 2 : 23  - 24 
2 కొరింతి ౮: 7 , 9 , 13  - 15 
మార్క్ 5  : 21  - 43

క్రీస్తునాదునియందు  ప్రియమైనటువంటి సహోదరి సహోదయులారా ఈ నాడు మనమందరం కూడా పదమూడోవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేచించియున్నాము, ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలను మనం ధ్యానించినట్లైతే ఇవి ముఖ్యముగా మానవునియొక్క జీవితంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన రెండు అంశాల గురించి మనకు తెలియజేస్తున్నాయి అవి ఏమిటంటే మరణము నుండి జీవమును మరియు అనారోగ్యం నుండి ఆరోగ్యము. ఈ రెండు అద్భుతాలు కూడా దేవుని యొక్క శక్తి ద్వారానే జరుగుతున్నటువంటివి మరియు అయన యొక్క హస్తం మనలను తాకటం ద్వారా ఈ యొక్క అద్భుతాల్ని మనం పొందుతున్నామని ఈ నాటి పఠనములు మనకు తెలియజేస్తున్నాయి.
ముందుగా మనం మరణము నుండి జీవమును చిసినట్లైతే మరణమనేది చనిపోయిన వ్యక్తిని తప్ప మగత అందరిని ఆడిపిస్తుంది కానీ జననం మాత్రం పుట్టిన వ్యక్తిని ఏడిపిస్తూ మిగతా అందరిని కూడా సంతోషపరుస్తుంది. ఎందుకంటే దేవుడు ఈ యొక్క లోకాని సృష్టించినప్పుడు అన్నిటిని కూడా సమానంగా సృష్టించియున్నాడు. అంతేకాక తాను సృష్టించిన దానిని అటువంటి స్వార్థం లేకుండా సృష్టించియున్నాడు. ఆలా సృష్టించడమే కాకుండా ఈ యొక్క సృష్టి కలకలం తన యొక్క ఆదీనంలో వుంచుకోవాలనుకున్నాడు కానీ దేవుడు సృస్టించనటువంటిది ఒకటి ఉంది అదే మరణము. ఈ యొక్క మరణం అనేది మనువుడు కొనితెచ్చుకున్నాడు.
మరణము
మరణం అనేది అవ్వ ద్వారా ఆదాముల పాపం ద్వారా ఈ యొక్క లోకానికి వచ్చింది, దేవుడు సృష్టించినపుడు మరణమనేది ఈ యొక్క లోకంలో లేదు, ఈ యొక్క మరణం ఎప్పుడు మానవులోకి వచ్చిందంటే మానవుడు ఎప్పుడైతే  దేవునికి వెతిరేకంగా తిరిగి పాపపు జీవితమును ఎంచుకున్నాడో అప్పుడే  మానవుల యొక్క జీవితంలోకి మరణమనే పదం సంభవించింది. ఈ యొక్క మరణం అనేది మానవుని యొక్క జీవితంలో చివరి గడియ అన్నమాట ఎందుకంటే మరణం అనేది నీటిపై ఉన్నటువంటి బుడగ వంటిది అది ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికి తెలియదు అదే విధంగా మానవునియొక్క జీవితంలో కూడా మరణమనేది ఎప్పుడు సంభవిస్తుందో మానవునికి తెలియకుండానే వస్తుంది. 
ఈ యొక్క మరణం ఎక్కడ నుండి వచ్చిందని మనం గమనించినట్లయితే ఇది సాతాను యొక్క అసూయవల్ల అంటే కాకుండా దీనికి మూలకారకుడు ఆ సాతాని. ఈ యొక్క మారానని మనం మొదటి పఠనములో చిసినట్లైతే 1 : 13 వ వచనంలో దేవుడు మరణమును సృష్టించలేదు, ప్రాణులు చనిపోవుట చూసి అయన సంతసింపడు అని. ప్రియా దేవుని బిడ్డలారా మానవులు చనిపోవుట దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే తాను సృష్టించిన సృష్టిలో వినాశనకరమైనది అది లేదు. అంతేకాకుండా దేవుడు సృష్టించిన విధానాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఆ ప్రాణి మరణించదు. ఎందుకంటే దేవుడు సృష్టించిన దానిని ఎల్లపుడు తన యొక్క అధీనములో ఉంచుకోవాలని అనుకున్నాడు అంటే కాకుండా భౌతిక మరణానికి దూరంగా ఉంది తన యొక్క నిత్యా జీవితములో జీవించాలని మానవులందరికీ కూడా తన యొక్క జీవమును ఇచ్చి వున్నాడు. కానీ మానవుడు మాత్రం దేవుని యొక్క ప్రణాలికను ప్రక్కన పెట్టి సాతాను యొక్క అడుగు జడలో నడిచాడు.
ఈ యొక్క పాపా జీవితం ఎక్కడ నుంచి వచ్చిందయ్యా అని మనం ధ్యానించినట్లైతే ఇది పాత నిబంధనలో అవ్వ అధములనుంచి వచ్చింది, ఆ యొక్క పాపమే ఇప్పటి వరకు కూడా మానవుని విడిచిపెట్టటం లేదు.
అసలు ఈ యొక్క మారానని ఎవరు తెచ్చారంటే సాతాను, సాతానుకు మరియు మారానని కి సంభందం ఏమిటి అని చుస్తే, దవుడు మరియు మానవులు ఏవిధంగానైతే సమానంగా జీవిస్తున్నారో అంటే కాకుండా మానవుడు దేవునికి అనుగుణంగా జీవిస్తున్నాడని చుసిన సాతాను, ఎలాగైనా దేవుని మరియు మానవుని వేరు చేయాలనుకున్న చేదు ఆలోచనతోటి పన్నాగం పొంది మానవుని ఈ యొక్క లోక ఆశలకు బానిసగా చేసి పాపని ఈ యొక్క లోకం లోనికి ప్రవేశపెటింది. ఈ యొక్క పాపం ద్వారా మానవుని దేవునికి దూరం చేసి ఈ యొక్క ఆత్యాద్మిక మరణానికి కారకుడయ్యాడు. 
ఈ విధంగా సాతాను చేసిన పనికి ఈ యొక్క లోకంలోని మానవ జాతికి ఆధ్యాత్మిక మరణం సంభవించి దేవుడు ఇచ్చినటువంటి నిత్యా జీవ భాగ్యాన్ని కోల్పోయారు. ఈ యొక్క ఆద్యద్మిక మరణం ఏమిటి అంటే మానవుడు తన స్వార్థం కొరకు తాను బాగుండాలన్న ఆలోచనతోటి ఇతరులను నాశనం చేసి పాపముల ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక మారానని కొని తెచ్చుకున్నాడు.
మరణం అనేది మూడు రకాలు 
1 ) మానవునికి మరణం తథ్యం 
2 ) మరణము పాప ఫలితమే 
3 ) ఆధ్యాత్మిక మరణము
జీవము 
దేవుడు సృష్టించినపుడు మానవుని, జంతువులను అన్నిటిని కూడా జీవముతోనే సృష్టించియున్నాడు, ఈ యొక్క జీవం ద్వారా మానవునికి అంతం లేదు.
మనము మొదటిపఠనములో చుసిన విధంగా మృత్యువును దేవుడు కలిగింపలేదు, సాతాను అసూయా వలన అది లోకం లోనికి ప్రవేశించియున్నది అని మనకు మొదటి పఠనము స్పష్టం చేస్తోంది. కానీ జీవం ప్రసాదించగల శక్తి యేసు ప్రభువుకు ఉందని సువార్త పఠనం తెలియజేస్తుంది.
మరణం తరవాత జీవం పొందినవారిని మన చూసినట్లయితే నూతన నిభందనలో నలుగురి వ్యక్తులు  ఉన్నారు వారు  ఎవరు అంటే   
1 ) యాయిరు కుమార్తె 
2 ) నాయిని విధవరాలి కుమారుడు 
3 ) లాజరు 
4 ) దొర్కా 
1 ) యాయిరు కుమార్తె :- యాయిరు అనే వ్యక్త్తి  ప్రార్థన మందిర అదేక్షుడు యేసు వద్దకు వచ్చి, యేసు పాదాలపైపడి మరణావస్థలో ఉన్నటువంటి తన కుమార్తెను స్వస్థత పరచడానికి తన ఇంటికి యేసును రమ్మని ప్రాధేయపడ్డాడు, తన యొక్క విశ్వాసాన్ని చూసినటువంటి యేసు తన యొక్క ఇంటికి వెళ్లి బాలిక యొక్క గదిలోనికి ప్రవేశించి మరణించినటువంటి బాలికను చాయి పట్టుకొని "తలీతాకుమీ" అన్నారు, దాని అర్థం ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అర్తం. వెంటనే బాలిక లేచి తన పడకపైనుంచి దిగి తనకేమి జరగనట్లుగా వ్యవహరించింది. ఎందుకంటే లెమ్మంటా అనేది పునరుతనా జీవనానికి సమానం ఈ యొక్క జీవం అనేది యేసుక్రీస్తు యొక్క పునరుత్తానికి గుర్తు.
కాబ్బటి ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవులమైన మనమందరం కూడా విశ్వాసంతో జీవిస్తామో అప్పుడే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడని ఈ నటి పఠనములు మనకు తెలియజేస్తున్నాయి.
                                                                                                               - BR. JOHANNES

19, జూన్ 2021, శనివారం

12 వ సామాన్య ఆదివారం

 


యోబు: 38 : 1 , 8 - 11

2 కొరింతి 5 : 14 - 17

మార్క్ 4 : 35 – 41

 

క్రీస్తునాధునియందు ప్రియా సహోదరి సహోదులారా ఈనాడు మనమందరం 12 సామాన్య ఆదివారం లోనికి ప్రవేశించియున్నాము. నాటి మూడు దివ్య పఠనములను మనము ధ్యానించినట్లైతే, ఎవరైతే దేవుని యందు మరియు క్రీస్తుయందు విశ్వాసం ఉంచుతారో అటువంటివారికి ఎన్ని కష్టాలు, ఇబందులు, ఆటంకాలు వచ్చిన కూడా వారి యొక్క విశ్వాసమే వారిని రక్షిస్తుందని, మరియు దేవుడు వారికీ తోడుగా ఉంటాడని నాటి మూడు పఠనాలు తెలియజేస్తున్నాయి.

నాడు మనమందరం మన యొక్క జీవితాలను ఒక పడవ ప్రయాణంలాగా సాగించాలి ఎందుకంటే పడవ యొక్క ప్రయాణం ఒక తీరం వరకు కాదు, పడవ యొక్క ప్రయాణం అనేది అది దానియొక్క గమ్యాన్ని చేసుకునేంతవరకు, ఎందుకంటే ఎప్పుడైతే మన జీవితాలను యొక్క పడవ ప్రయాణంలాగా రెండు విషయాలను గమనించాలసింది మరియు చేయాలసింది.

1 . మనం చేప్పట్టిన దానిని కొనసాగించలేక చేతగానితనంగా తిరిగి మరల వెన్నకి రావటం.

2 . మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించి ఒక అంకిత భావంతో మరియు కష్టపడి మన యొక్క గమ్యాన్ని చేరుకోవటం.

ఇందుట్లో మూడో మార్గం అనేది లేదు ఎందుకంటే మూడో మార్గం ఉంది అంటే అది మనయొక్క వినాశనం యందుకంటే పడవ ఏవిధంగానైతే తన యొక్క గమ్యాన్ని చేరుకోలేక మరియు తిరిగి వెన్నక్కి రాలేక మార్గం మధ్యలో నశించి పోతుందో అదే విధంగా మన యొక్క జీవితం కూడా అదే విధంగా జరుగుతుంది.

మానవుని యొక్క జీవితం నీటిలో ఉన్నటువంటి పడవవంటిది, ఇక్కడ మనకు జీవితం అనగానే గుర్తుకు రావలసింది ఏమిటంటే జీవితం అనేది ఒక అద్భుతం. జీవితం అనేది సాగుతూ ఉండాలి తప్ప ఒక్క సరిగా ఆగిపోకూడదు, ఒక్క సరి ఆగిందా అంతటితో మన జీవితం నీటిలో కూలిపోయినటువంటి పడవ వంటిది.

ఒక్కసారి మనం జీవితాన్ని సాగించినాము అది ఇలాగె సాగాలి తప్ప, ఓటమి వచ్చిందని బాధపడకుండా ఓడిపోయిన పర్వాలేదు కానీ అయొక్క ఓటమితో మనయొక్క జీవితం ముగిసిపోకూడదు.

అందుకే ఈనాటి మొదటి పఠనము మనకు తెలియజేస్తుంది (యోబు 38 : 10) లో చూస్తున్నాము, దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే సముద్రము గీత దాటాడు, అయన ఆజ్ఞతోనే గర్జించు సముద్రం కూడా శాంతించును అని (మార్క్ 5 : 39) లో చూస్తున్నాము. ఏవిధంగానైతే ఆకాశంలో ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు పిల్లలు బయపడి తమ తండ్రి లేదా తల్లి దగ్గరకు పరుగెట్టుకొని వస్తారో, అదేవిధంగా ఈనాటి సువిశేష పఠనంలో (మార్క్ 5 : 38) లో శిస్యులు తుఫానును చూసి ప్రాణ భయంతో భయపడుతూ యేసు వద్దకు పరుగెట్టుకొని వచ్చి మేము చనిపోవుచున్నాము అని చెప్పినపుడు.

యేసు ప్రభు లేచి గాలిని శాంతింపుము అన్ని సముద్రంతో చెప్పినపుడు అది శాంతించింది, అప్పుడు ప్రభు వారితో ఇట్లు అనుచున్నాడు మీరింత భయపడితీరేలా? మీకు విశ్వాసం లేదా? అన్నదానిని మనం గమనించినట్లయితే శిష్యులు అల్ప విశ్వటంతో ఉన్నపుడు వారు తుఫాను గాలికి భయపడ్డారు. అంతే కాకుండా లోక రక్షకుడు వారితో ఉన్నాడని వారు, లోకాని తాను సృష్టించి తన ఆదీనంలో ఉంచుకున్నాడని, తన హస్తం వారిపై ఉన్నాడని తెసిలి కూడా, వారికీ వచ్చిన సమస్య గురించి వారు అందుకు ఆలోచించాలి మరియు భయపడాలి. దేవుడు మనతో ఉన్నపుడు మనం దేనికి కూడా బయపడకూడదని ఈనాటి నాలు మనకు తెలియజేస్తున్నాయి.

పూర్వ నిభందనములో చూసినట్లయితే విశ్వాసమునకు తండ్రి ఐనటువంటి అబ్రహం గారు. తన ప్రాణం కొరకై తన భార్య అయినటువంటి సారాను తన చెల్లి ని రాజుతో చెప్పి తన ప్రాణాలను కాపాడుకోవాలని అనుకున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహంతో ఉన్న కూడా తాను ఈయొక్క లోకానికి సమందించినటువంటి మానవునికి భయపడుతూ తనకుంటువంటి విశ్వాసాన్ని కోల్పోవడం మనం చూస్తున్నాము. కానీ తండ్రి దేవుడు మాత్రం అబ్రాహామును విడువలేదు. తనయొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా తిరిగి సారాను అబ్రాహామునకు అప్పగించటం మనం చూస్తున్నాము.   

అదే విధంగా ఈనాటి సువిశేష పఠనంలో చూస్తున్నాము శిష్యుల యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా వారికీ తిరిగి విశ్వాసాన్ని యేసు ప్రభు దయచేయటం మనం చూస్తున్నాము.

కాబట్టి మన యొక్క జీవితంలో మీ జరుగుతుందని మనం శిష్యుల వాలే  కంగారు పడకూడదు, ఎందుకంటే యేసు క్రీస్తు యొక్క హస్తన్ని  మనతో ఉంచుతున్నారు, అందుకే (రొమాన్స్ 8 : 31) లో చూస్తున్నాము క్రీస్తు మనతో ఉండగా ఇంకెవరు మనకు వెతిరేకంగా నిలుస్తారని. మనమందరం కూడా భయంతో జీవించకుండా విశ్వాసంతో జీవించాలని ఈనాటి సువార్త పఠనంలో చూస్తున్నాము. క్రీస్తు నిద్రిస్తున్నకాని నిజానికి యేసు క్రీస్తుకు తెలియకుండా లోకంలో మీ జరగదు.

మనము అనేక సార్లు లోకంలో ఉన్నటువంటి అనేక ప్రాణులకూ కానీ, మనుషులకు గాని బయపడుతుంటాము, ముఖ్యంగా కొన్ని మన జీవితాలలో వస్తున్నటువంటి సందర్భాలలో ఈవన్నీ కూడా వచ్చేది మనతో దేవునిపై విశ్వాసం లేనందువల్లనే, ఎందుకంటే విశ్వాసంలేనిదే మనము మీ చేయలేము. ఎప్పుడైతే మనం విశ్వాసంతో జీవిస్తామో అప్పుడే మనకున్నటువంటి భయం అనేది తొలగిపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా ఈనాడు మనమందరం కూడా అయొక్క దేవాతి దేవునికి మొరపెట్టుకుందాం మనలో గొప్ప విశ్వాసాన్ని దయచేయమని మరియు క్రీస్తుపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలని కోరుకుందాం.

   by .Br . JOHANNES

 

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...