3, ఏప్రిల్ 2023, సోమవారం

ఐదవ పదం

ఐదవ పదం

"నాకు దాహమగుచున్నది" యోహాను 19:28
ప్రియమైన మిత్రులారా, సాధారణంగా మనం క్రీస్తు గురించి ఆలోచించినప్పుడు, మనం ప్రశాంతమైన మరియు నిర్మలమైన చిత్రాన్ని మదిలో తలచుకుంటాము, కానీ సిలువపై రక్తసిక్తమైన మరియు బాధతో ఉన్న రూపాన్ని తలచుకోము.
సందర్భము మరియు పరిస్థితి: క్రీస్తు ప్రభువు శిలువేయబడి చాల సేపు అవుతుంది, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది, వేలాడతీయబడిన చేతులు, భారంతో ఉన్న భుజాలు, పొరబడిన నాలుక(నోరు), సూర్యుని వేడికి అలసి సొమ్మసిల్లి పోతున్న దేహము, ఒక తీవ్ర విషాద కరమైన సమయము, యేసుక్రీస్తు మానవ జీవిత ముగింపు సమయము బాదమయము.
ఈ ఐదవ పదంలో రెండు ముఖ్యమైన అంశాలు మరియు సందేశము దాగిఉంది.
యేసు క్రీస్తు ప్రభుని మానవ (భౌతిక స్వభావము) - భౌతిక దాహము
యేసు క్రీస్తు ప్రభుని దైవ స్వభావము - ఆధ్యాత్మిక దాహము.
యేసు క్రీస్తు ప్రభుని మానవ (భౌతిక స్వభావము) - భౌతిక దాహము
అన్నిటికంటే మొదటిది, చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఈ పవిత్ర పదం క్రీస్తు యొక్క భౌతిక స్వభావాన్ని మరియు అతని మానవత్వాన్ని స్పష్టంగా గుర్తు చేస్తుంది.
మన జీవితంలో కూడా శారీరకంగ పని చేసిన తర్వాత లేదా ఎండలో ప్రయాణించినట్లైతే మనకు కూడా దాహమేస్తుంది, సొమ్మసిల్లిపోతాము. మనందరమూ అనుభవించినవాళ్ళమే. అందుకే దాహం తీర్చుకోవడం ఎంత ముఖ్యమో మనకు తెలుసు.
నాకు దాహమేస్తుంది అని యేసు చెప్పినప్పుడు, ప్రభువు కూడా అదే అనుభవించారు. యోహాను సువార్త 4 అధ్యాయం :5- 7 వచనాలలో చూసినట్లయితే, యేసు సుదూర ప్రయాణం చేసి అలసిపోయి, ఒక బావి వద్ద కూర్చొని, ఒక సమరయ స్త్రీని త్రాగడానికి నీళ్ళు అడిగారు. ఇక్కడ కూడా బాధతో మరియు మండుటెండలో శిలువను మోసిన తర్వాత, ప్రభువు అలసిపోయి, సొలసిపోయి తీవ్ర దాహ వేదనకు గురయ్యారు. అంటే, దీనిని బట్టి మనకు తెలిసేదేమిటంటే దైవ కుమారుడైన తన దైవత్వము రూపంలో దాక్కోలేదు, బాధలు అనుభవిస్తున్నట్లు నటించలేదు, ఎలాంటి నటన, నాటకాలు లేవు.
నిజముగా, వాస్తవికంగా శరీర రూపధారిగా బాధలను అనుభవిస్తున్నారు, నడవలేక పడిపోతున్నారు, రక్తము ధారలుగా కారుతుంది, ఇంతటి వేదనల వలన నిజముగా దాహము వేస్తుంది. త్రాగడానికి కొంచెం నీరు అడుగుతున్నారు.
క్రీస్తు నిజంగా బాధపడ్డారు మరియు తన మానవ రూపంలో మన పాపాల శిక్షను భరించాడు. అతను మన కోసం మరియు మన పాపాల కోసం శరీర దాహంతో మరణించాడని ఇది మనకు గుర్తుచేస్తుంది, దీనిని తిరస్కరించే ప్రసక్తే లేదు.
యేసు క్రీస్తు ప్రభుని దైవ స్వభావము - ఆధ్యాత్మిక దాహము.
ఈ దాహము ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. ఈ దాహము మనందరి కోసం, మన ఆత్మల కోసం ఉన్న దాహాన్ని వ్యక్తపరుస్తుంది. సిలువపై ఉన్నక్రీస్తు మానవాళి అంతా తనను తెలుసుకోవాలని మరియు ప్రేమించాలనే దాహమును తెలియపరుస్తుంది. పునీత అగస్టీన్ గారు చెప్పినట్లుగా మనమందరం దాహంతో ఉన్నాము, "మనం దేవుని కోసం దాహం తో ఉండాలని ముందుగా దేవుడే మనకోసం దాహంతో ఉన్నారు." (సత్యోపదేశ సంక్షేమము, 2560). ఆధ్యాత్మిక కోణంలో ధ్యానించి నట్లైతే క్రీస్తు దాహము దేనికి సూచిస్తుందంటే:
యేసు నీటి కోసం దాహంతో ఉన్నప్పటికీ, మన మోక్షం కోసం, దేవునితో సంబంధం కోసం ఎక్కువ దాహంతో ఉన్నారు.
యేసుకు మన పరిస్థితి తెలుసు, కాబట్టి మన విశ్వాస ప్రకటన కోసం మరింత దాహంతో ఉన్నారు.
మన జీవితం యొక్క మార్పు కోసం దాహంతో ఉన్నారు.
మన ఆత్మల సంరక్షణ కోసం దాహంతో ఉన్నారు..
మనలను సరైన దారిలో నడవాలనే దాహంతో ఉన్నారు.
మనకు జీవజలాన్ని బహుమతిగా అందించాలని దాహంతో ఉన్నారు.
మన శారీరక తృప్తి నుండి ఆధ్యాత్మికంగా ఎదగాలనే దాహంతో ఉన్నారు.
మనలను క్షమించాలని దాహంతో ఉన్నారు.
మనలను తన సువార్తికులుగా (ఆయన సందేశాన్ని పంచుకునేవారు) చేయడానికి ఆయన దాహంతో ఉన్నారు.
నిజానికి మన హృదయాలలో కూడా ఒక ఆధ్యాత్మిక దాహం ఉంది, జీవిత అర్థం మరియు నిజమైన ప్రేమ కోసం దాహంతో ఉన్నాము, యేసు ఒక సమారియా స్త్రీకి వాగ్దానం చేసిన జీవజలాన్ని వాగ్దానము వలె మన దాహాన్ని తీర్చగల ఏకైక వ్యక్తి యేసు.
"ఎవడైనా దప్పిక కొన్నచో నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకొనును గాక." యోహాను 7:37
లేఖనాలను నెరవేర్చడానికి మరియు అతని తండ్రి చిత్తాన్ని పూర్తి చేయడానికి.
ఈ మాట ద్వారా లేఖనాల మరియు ప్రవక్తల ప్రవచనాలు నెరవేరాయి. ప్రభువుకు లేఖనాలు తెలుసునని ఈ పదం ద్వారర నెరవేర్చి మనలను వాక్యము ద్వారా ఒకటి చేస్తున్నారు. నెరవేరిన కొన్ని వచనాలు:
"నా శక్తి పెంకు వలె ఎండిపోయినది. నా నాలుక అంగిటికి అంటుకొనుచున్నది. నేను చచ్చి దుమ్ములో పడిఉండినట్లు చేసితివి." (కీర్తన 22:15)
"అరచి అరచి నేను అలసిపోతిని. నా గొంతు బొంగురు పోయినది... వారు నాకు భోజనము మారుగా విషమును ఒసగిరి. నేను దప్పిక గొనిఉన్నపుడు ద్రాక్షాసవం ఇచ్చిరి". (కీర్తన 69:3, 21)
క్రీస్తు తనను తాను బలపరచుకోవాలని, తండ్రి అప్పగించిన చిత్తాన్ని పూర్తి చేయడానికి దాహంతో ఉన్నారు. క్రీస్తు భయంకరమైన నొప్పి, శారీరక అలసటతో బాధపడుతున్నప్పటికీ, మన కోసం, దేవునితో మనకు సంబంధం ఏర్పాటు చేయడం కోసం తనకు ఉన్న శక్తినంతా చేర్చి పలికారు.
ధ్యానము & మనస్సాక్షిపరీక్ష
మన పాపాల కోసం యేసు శారీరకంగా అనుభవించిన దప్పిక ఎంత బాదమయము మరియు గొప్పది ?
యేసు మానవ స్వభావము - ధ్యానము
నా జీవితంలో పరిశుద్ధ గ్రంధము యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
ఆయన ఆధ్యాత్మికంగా మన కోసం దప్పిక గొన్నట్లే మనం దేవుని కోసం దప్పికతో ఉంటున్నామా ? ముఖ్యంగా కీర్తన 42: 2 వాక్యంతో ధ్యానించుదాం. " సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాట పడుచున్నది. నీ దివ్యముఖమును నేనెపుడు దర్శింతునా అని తపించుచున్నది."
The Fifth Word
“I thirst.” John 19:28

Dear friends, usually when we think of Christ image, we picture a calm and serene picture, but we do not reflect on bloodied and cringing in pain and suffering on the Cross. But here in this situation Jesus utters his gift word, “ I THIRST”.

Situation: he is there on the cross for almost six hours now. It has become hard for him even to breathe, he must pull himself up as he is hung on the arms, the shoulder aches, his mouth parched and is clearly exhausted as the sun directly hits his head and body. The end of Jesus' human life.

It has two different levels to reflect on:

Physical nature (Jesus’ humanity)
First of all, it is very significant, because this word clearly reminds us of His physical nature and his humanity. We all can relate to being thirsty. After continuous work,we feel tired bodily and if we are under the sun for a long time, we feel dehydrated. We know how important it is to quench our thirst.

When Jesus said I Thirst, he too experienced the same. In John Chapter 4:5-7, we see Jesus tired from a long journey, sitting at a well, asking a Samaritan woman for water to drink. Here on the after carrying the cross in pain and under the sun, he is tired and wearied, dehydrated. That means, Jesus the Son of God, the God himself is not hiding under the veil of his Divinity, nor pretending to suffer. There is neither drama nor action. But in a real and tangible way in his bodily form undergoing the suffering, he is falling, bleeding and now thirsting for something to drink.

He truly suffered and bore the penalty of our sins in his humanity. This reminds us that He thirsted and died in the flesh for us and for our sins, there is no denying of this.

Spiritual Nature (Divinity)
The Thirst is also a spiritual reality, containing spiritual significance. It expresses his thirst for us all, for our souls. He thirsts on the cross for all mankind to know and love him. We all thirst for, as St. Augustine tells, “God thirsts that we may thirst for him” (Catechism, 2560). His thirst in spiritual sense: Although Jesus is thirsty for water, He is more thirsty for salvation, for a relationship with him.

Jesus knows her situation, so he was more thirsty for expression of faith
He was thirsty for conversion of life
He was thirsty for Soul.
He was thirsty to keep on right path
He was thirsty to offer gift of Living Water
He was thirsty to raise from physical satisfaction to spiritual nourishment
He was thirsty for to acknowledge her mistakes
He was thirsty to make us His evangelisers (sharers of His message)
Deep down even in our hearts, we have a spiritual thirst to be satisfied, we thirst for meaning in life and for true love, Jesus is the only one who can quench our thirst by giving the Living Water which he promised to a Samaritan woman at the well.

“Let anyone who is thirsty come to me, and let the one who believes in me drink.” John 7:37

2. To fulfil the Scriptures and complete His Mission.
There is also fulfilment of the Scriptures, and the prophecies which remind us that he knows the scriptures and is determined to fulfil that he is truly the One, who comes to save us from our sins and give us salvation. The scriptures fulfilled are:

My strength is dried up like a potsherd, and my tongue sticks to my jaws; you lay me in the dust of death. (Psalm 22:15)

I am weary with my crying out; My throat is parched, They gave me poison for food,

And for my thirst they gave me sour wine to drink. (Psalm 69:3, 21)

He thirsted to strengthen himself, to bring to completion the mission entrusted to Him by Father. He is both undergoing terrible pain, physical exhaustion but summoned all his strength to remind us that he Thirst for us, for our relationship with God.

Let us reflect
How much excruciating pain and suffering did Jesus undergo physically for our sins?

Why is it so important to reflect on Jesus' humanity?

What is the importance of Scriptures in life?

Do we thirst for God, as he thirst for us spiritually? Let us reflect with Psalm 42:2

The only way we satisfy our thirst is with the Living Water, the word made flesh, the Holy Spirit poured into our heart.

whoever drinks the water I shall never thirst; the water I shall give will become in him a spring of water welling up to eternal life.” (John 4:14)

Fr. Jayaraju Manthena OCD

నాల్గవ పదము

నాల్గవ పదము
"నా దేవా! నా దేవా! నన్ను ఎందుకు/ఏల విడనాడితివి?" మత్తయి 27:46 & మార్కు 15:34

ఈ నాల్గవ పదంలో, ఇంతటి దిగ్భ్రాంతికరమైన , అత్యంత వేదనతో కూడానా మాటలు యేసు నోటి నుండి రావడం ఎవరు ఊహించారు, ఆశ్చర్యమేస్తుంది మనకు. ఎందుకంటే దేవుని కుమారుడైన యేసును దేవుడు ఎలా విడిచిపెట్టగలరు, పైగా దేవుణ్ణి దేవుడే ఎలా విడిచిపెట్టగలడు మరియు వెలుగు తన వెలుగుని విడిచిపెట్టగలదా ?లేదు కదా.

ప్రధాన /సాధారణ పరిశీలన/అంశాలు:

ఈ పదం యొక్క లోతుగా అర్థం చేసుకోవడానికి, మొదట మనం దానికి సంబంధించి సాధారణ అర్థాన్ని తెలుసుకోవాలి, మొదటి గమనించినట్లయితే, ఇది ఒక వ్యక్తి యొక్క వేదనతో కూడిన ఏడుపును వివరిస్తుంది, అతను విడిచిపెట్టబడ్డాడని మరియు సహాయం కోసం చేసిన ప్రార్థన లేదా ఏడుపు ఎవరు వినలేదు అని మరియు విస్మరించబడి, తిరస్కరించబడి మరియు ఎవ్వరు లేక ఒంటరి వాడై పోయాననే బాధ స్పష్టం గ కనపడుతుంది.

ఒక ముఖ్యమైన ప్రశ్న "ఎందుకు"

ఎందుకు అని ప్రశ్న వేస్తె, దాని సమాధానం కనుకోవడానికి అవకాశం ఏర్పాటుతుంది.

ఒకసారి గమనించినట్లయితే, మన మానవ చరిత్రలో, "ఎందుకు" అనేది నిరంతరం వేధించే ప్రశ్న, మనం ప్రతికూల లేదా చెడు అనుభవాన్ని ఎదుర్కొన్నప్పుడు, మనం ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న అడుగుతాము, ఎందుకు నాకే? ఎందుకు ఈ చెడు ? ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ మరణం? మంచి వ్యక్తులకు ఎందుకు చెడు జరుగుతుంది? దేవుడు ఎందుకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు? అనేవి మనలో నిత్యం ఉండే ప్రశ్నలు.

ఇప్పుడు మానవ రూపంలో ఉన్న యేసుకు కూడా అదే ప్రశ్న "ఎందుకు" అని ధీనతతో తండ్రి ఎడబాటు భరించలేక విలపిస్తున్నారు, ఆర్చ్‌బిషప్ ఫుల్టన్ షీన్ గారు ఈ విధంగా అంటారు, ఈ ఒక్క సందర్భం లో క్రీస్తు, ఒక్కసారిగా రెప్పపాటులో దేవుడు కూడా నాస్తికుడిలా అనిపించే విధంగా అంతటి గోరమైన వేదన అనుభవించారు.

సమస్య మరియు సమాధానం : త్రిత్వైకం లో ఐక్యత

యేసు సంపూర్ణ మానవ రూపంలో ఉన్నపటికీ, తండ్రి దేవుడు రూపొందించిన దైవిక రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి స్వతహాగా మరియు జాగ్రత్తగా అమలు చేసారు క్రీస్తు ప్రభువు మానవ రూపం ద్వారా. అయినప్పటికీ విశ్వం సృష్టించబడక ముందే క్రీస్తు త్రిత్వైక సర్వేశ్వరుని ఐక్యతలో బాగస్తుడే.

యేసు తన పరిచర్యలో, సందేశాలలో ఈ విషయాన్నీ, ఈ ఐక్యతను నిరంతరం ధృవీకరించాడు, ఉదాహరణకు: “నేను, నా తండ్రి ఏకమైనున్నాము” (యోహాను 10:30), "ఆదిలో వాక్కు ఉండెను. ఆ వాక్కు దేవునితో ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను."(యోహాను 1:1). నేను తండ్రి యొద్దనుండి బయలుదేరి లోకములోనికి వచ్చితిని. మరల నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్లుచున్నాను అనెను. (యోహాను 16:28) “అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాదు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను" (యోహాను 16:7). దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్యజీవము పొందుటకై అట్లు చేసెను. (యోహాను 3:16)

ఒక మాటలో చెప్పాలంటే, యోహాను సువార్త అంత త్రిత్వైక సర్వేశరుని ఐక్యతకు సంబంధించి ఉన్న ఉదాహరణలతో నిండి ఉంది.

కాబట్టి ఈ ప్రశ్న తలెత్తుతుంది మరియు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది వస్తుంది, యేసు సిలువపై వేలాడుతున్నప్పుడు, శారీరక మరియు మానసిక వేదనతో పూర్తిగా బాధపడ్డాడు, "నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు?" అని పెద్ద స్వరంతో తన హృదయ వేదన అంత వ్యక్తపరిచారు,

కాని దేవుడై ఉండి ఈ బాధలు, మరియు నిస్పృహలను అధిగమించి పైకి రావాలి కదా, క్రుంగిపోకుండా, బలహీనమవ్వకుండా శక్తితో అధిగమించాలి కదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి మనకు. ఈ నిస్సహాయత, పరిత్యాగం మరియు నిరాశ యొక్క క్షణంలో ఏల రోదించగలడు అనే ప్రశ్న వస్తుంది. ప్రేమకు అవధులు లేని తండ్రి తన ఏకైక కుమారునికి అత్యంత అవసరమైన సమయంలో ఎలా విడిచిపెట్టగలడు? ఇలా ప్రశ్నలు మనకు వస్తాయి

సమాధానము: "విడనాడటం " యొక్క అర్థం మరియు ప్రాముఖ్యత

విడనాడటం అంటే, ప్రత్యేకంగా అవసరమైన సమయంలో ఎవరైనా లేదా దేనినైనా విడిచిపెట్టడం లేదా వదిలివేయడం. మన జీవితంలో ఏదైనా అవసరం లేదా కష్టం వచ్చినపుడు మన సన్నిహితులు, స్నేహితులు మనలను విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ అనుభవం ఎంత బాధను మిగిల్చిందో మనకు తెలిసిందే అదేవిధంగా మనకు అవసరమైనప్పుడు మరియు మనల్ని దేవుని నుండి దూరం చేసే పాపంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెడుతున్నాడని (అతను చేయనప్పటికీ) మనకు అనిపిస్తుంది. .

అలాగే యేసు ప్రభువు పరిస్థితిలో కూడా, తండ్రి అయిన దేవుడు తన కుమారుని బాధలో విడిచిపెట్టడం, ఏకాకిని చేశాడా అని అనిపిస్తుంది. కానీ తన కుమారుడిని విడిచిపెట్టలేదు, కానీ క్రీస్తు యొక్క మానవ స్వభావం లో మాత్రమే దైవిక పరిత్యాగ భావనను , ఎడబాటును అనుభవించడానికి అనుమతించాడు ఎందుకంటే యేసు మన పాపాల బరువును మోస్తూ, మన తరపున సిలువను మోస్తూ మరియు మన పాపాలకు వేతనాన్నిచెల్లించాడు మరియు ఆ విధంగా తండ్రి అయిన దేవుని నుండి పరిత్యజించిన భావనను అనుభవించారు, వాస్తవానికి మనం అనుభవించాల్సిన ఆ ఎడబాటు, శిక్ష, జరిమానా మనకు బదులుగా ప్రభువు అనుభవించారు. తద్వారా మనం దేవుని ముందు నీతిమంతులం అవగలం అని. పునీత పౌలు ఈ విధంగా అన్నారు. "క్రీస్తు పాపా రహితుడు. కానీ, దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలన, ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రోపొందవలెనని అట్లు చేసెను. (2 కొరింథీయులు 5:21). ఆ సమయంలో ఆ భారం ఎంత వేదనతో ఉందొ వర్ణించలేము.

క్రీస్తు నిజంగా సిలువ యొక్క బాధను మరియు వేదనను అనుభవించాడు అనడంలో అతిశయోక్తి లేదు, ఇంకా ఎటువంటి సందేహం లేదు, అయితే ఈ విధంగా చేయడం ద్వారా ముఖ్యంగా 22వ కీర్తన మరియు యెషయా 53 వివరించిన ప్రకారం ఎవరైతే తమ పాపాలలోఎం కన్నీటి లోయలలో, చీకటి బ్రతుకులతో ఉంటారో వారికిసం యేసు ఇంకా సర్వ మానవాళి కోసం వేడుకోవడం కోసం జరిగింది, ప్రభువు ఎడబాటు అనుభవించారు.

విలువైన వాక్యము: దేవుడు ఎప్పటికీ విడనాడడు

దేవుడు మనల్ని విడిచిపెట్టినట్లు అనిపిస్తే ఎప్పుడైనా, అది యేసు ప్రభువు కూడా అనుభవించారు అని గుర్తు పెట్టుకోవాలి. ఆ సిలువ వేదనలో ఆ ఎడబాటును అనుభవించారు. కానీ మనము గమనించవలసిన అంశము ఏమిటంటే దేవుడు ఎప్పటికీ మరచిపోడు లేదా విడిచిపెట్టడు అని వాక్యమే తెలియచేస్తుంది, యెషయా ప్రవక్త పుస్తకంలోని 49వ అధ్యాయంలో, “నేను నిన్ను మరచిపోను మరియు నేను అనాథలను వదిలివేయను….అందుకే దేవుడు ఎప్పటికీ అతనికి మొఱ్ఱపెట్టేవారి నుండి ఉపసంహరించుకోడు" కానీ అతను సమాధానం ఇస్తాడు. అందువల్ల, ఇది తండ్రిపై విశ్వాసంతో నిండిన మొర, ఆశ మరియు అతనిపై నమ్మకంతో కూడిన నివేదన, దేవుని వైపు నడిపించేలా ఉన్న ప్రార్థన అని మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభువు ని సమాధి నుండి జీవముతో లేపారు, ఆలకించే, సమాధానమిచ్చే ప్రభువు మన దేవుడు.

సిలువ పాదాల వద్ద, సైనికులు మరియు అన్యమత శతాధిపతి ఈ మొరను విన్నప్పుడు, వారు మొదట తీరనిమొరగ భావించినప్పటికీ, వెంటనే గ్రహించి, ఇది నిరాశతో కూడిన నివేదన కాదని గ్రహించారు, కానీ నిజంగా అతను దేవుని కుమారుడని తెలుసుకొన్నారు, వారి మార్పు మరియు పరివర్తన ఆ మొరనుంచే , క్రీస్తు సిలువ వేదనలనుంచే ప్రారంభమైంది.

కాబట్టి, ఈ రోజు మనజీవితానికి అన్వయించుకొని అడగవలసిన అసలు ప్రశ్న ఏమిటంటే, ఎవరు ఎవరిని విడిచిపెడుతున్నారు?

విడిచిపెట్టేది దేవుడు కాదు, మన స్వార్థ ప్రయోజనాల కోసం మరియు మన అనవసరమైన జీవనశైలి కోసం మనం భగవంతుడిని విడిచిపెడుతున్నాము, దూరం చేస్తున్నాము మరియు వదులుకుంటున్నాము, అందుకే మన జీవితాలు వినాశనానికి దారి తీస్తున్నాయి.

కాబట్టి ఈ పదం ద్వారా మన వలన క్రీస్తు పొందిన వేదన ధ్యానించుకొని, మరల అటువంటి వేదనకు, ఎడబాటుకు గురిచేయనని ప్రార్ధించుకుందాం, ప్రభుని వేడుకొందాం.

The Fourth Word

“My God, My God, why have you forsaken me?” Matthew 27:46 & Mark 15:34

It is surprising to see that in the Fourth word, Jesus utters the most shocking words which no one would have imagined from his mouth because being a Son of God, how could Jesus be forsaken moreover how can God forsake God and Can light forsake the light? The Answer is No.

General observations:

In order to understand the deeper meaning of it, first we need to establish some general connotation to it. Upon first observation it illustrates the anguished cry of a person, who feels is being forsaken and whose prayer or cry for help is not heard and whose situation is being ignored, rejected and left alone to die with no one to lean on.
The important question of “Why”

Therefore, In our human history, we have a constant haunting question of “why”, when we go through a negative or bad experience, we ask the question why, as in Why me? Why evil? Why suffering? Why death? Why do bad things happen to good people? Why does God seem so distant from everything happening?
Now even Jesus identifying with the man seems to have the same question “why” The Archbishop Fulton Sheen made the intriguing observation that in this one line of Christ, for a twinkling of an eye, even God sounded like an atheist.

The Difficulty: the Unity in Trinity

Jesus Is, although fully human who carefully and wilfully implemented God, the Father’s beautifully orchestrated divine plan of salvation, is also fully Divine in Union with the Trinity even before the creation of the universe.
Jesus indeed has constantly confirmed this Unity in his life on earth, for example: “the Father and I are One” (Jn 10:30), “In the beginning was the Word, and the Word was with God, and the Word was God.” In the beginning was the Word, and the Word was with God, and the Word was God.(John 1:1). I came forth from the Father and have come into the world; I am leaving the world again and going to the Father.” (John 16:28) “Nevertheless I tell you the truth; It is expedient for you that I go away: for if I go not away, the Comforter will not come unto you; but if I depart, I will send him unto you” (John 16:7). For God so loved the world that he gave his one and only Son, that whoever believes in him shall not perish but have eternal life. (John 3:16)
In simple words, the Gospel of John is full of examples of Jesus' unity with the Trinity.

Therefore the question arises and difficulty in understanding, Jesus while hanging on the Cross, utterly tormented by physical and mental suffering and pain cries out in a loud voice, "My God My God, why have you forsaken me?", but shouldn’t be strong to rise above the pain and despair?, how could he cry out what seems to be a moment of hopelessness, abandonment and despair.? How can a Father, whose love has no bounds forsake His only Son at the time of his greatest need?

The Fact: The Meaning and significance of “Forsaken”

Forsaken means, being abandoning or leaving someone or something especially in the time of need. As we feel abandoned by our close family and friends in the time of need we know the experience of it and also when we need and are in sin which distances us from God but we feel that God is abandoning us (even though he does not).

So also in Jesus' situation, God the Father did not abandon his Son in his Son’s suffering but allowed him in his humanity to experience the sense of divine abandonment because Jesus carried the weight of our sins, carried the cross on behalf of us and paid the penalty for our sins and thus felt a sense of abandonment from God the Father which in fact we rightfully deserve so that we become righteous before God that’s St. Paul tells us For our sake he made him to be sin who knew no sin, so that in him we might become the righteousness of God. (2 Corinthians 5:21). This must have been exceedingly heavy at that point.

hence, there is no doubt, he really felt the pain and anguish of the cross but He does this is to fulfil the scriptures especially Psalm 22 and Isaiah 53 where it is described about the suffering servant now personified in Jesus and to beseech for the humanity, who feels abandoned by God in their sins, in the darkness of the valley of tears.

Final thoughts : God Never abandons

If you've ever felt like God has forsaken you, always remember that Jesus knows what that's like. He experienced that in his human nature on the cross, but he also assures that God will never forget nor abandon, in the chapter 49 of book of prophet Isaiah, “I will not forget you and I will not leave orphaned….therefore God never withdraws from those who cry out to him” but he will answer. Therefore, we can understand this is a cry full of faith in father, a cry of hope and in trust in him, A cry of prayer, which is directed towards God. God answers, indeed God the father raised Jesus from Dead, God answers our prayers.

We also notice, at the foot of the cross, when the soldiers and pagan centurion heard this cry, though they thought first as desperate cry but soon realised and said this is no cry of desperation but truly he was the Son of God, Just. The change and transformation has begun right at the cross itself.

So, today the real question is who is abandoning or forsaking who?

It is not God who is forsaking but we are forsaking, distancing and abandoning God for our vested interests and lifestyle, that’s why our lives are in utter destruction.

Let us offering ourselves, our lives, our families, let us promise today that we will never do things again that will crucify Jesus and that will torture him physically and mentally.

Fr. Jayaraju Manthena OCD

2, ఏప్రిల్ 2023, ఆదివారం

మూడవ పదం

మూడవ పదం

“యేసు శిలువ చెంత అయన తల్లి, ఆమె సోదరి, క్లోఫా భార్యయగు మరియమ్మ, మాగ్దలా మరియమ్మ నిలువబడి ఉండిరి. తన తల్లి తానూ ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండుట చూచి, యేసు తన తల్లితో, “స్త్రీ" ఇదిగో నీ కుమారుడు!” అనెను. ఆ తరువాత శిష్యునితో " ఇదిగో నీ తల్లి" అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకోని పోయెను. (యోహాను 19:25-27)
మూడవ పదం తన తల్లి మరియు శిష్యుల పట్ల అతనికి ఉన్న ప్రేమ మరియు శ్రద్ధను సంపూర్ణంగా వెల్లడిస్తుంది. అన్యాయం మరియు అమానవీయత మధ్య, గుండె పగిలిన తల్లి మరియు చితికిపోయిన శిష్యుడు శిలువ దగ్గర నిలబడి, యేసు వారిని చూస్తూ ఒకరికొకరు తన ప్రేమ మరియు ఆప్యాయత, తానూ ప్రేమించిన వారి పట్ల ప్రేమను, శ్రద్ధను వ్యక్తపరుస్తారు.
సిలువ వద్ద నిలబడి: హృయాడా వేదనకు గురైన తల్లి & బాధలో ఉన్న శిష్యుడు
మరియ తల్లి శిలువ వద్ద మరియు కల్వరి ప్రయాణంలో ఉన్నందున, ఆమె జరిగినదంతా చూసిందని మనం భావించవచ్చు. ఆమె కూడా తన కొడుకును అరెస్టు చేయడం, తీర్పు విధించడం మరియు అన్యాయంగా ఖండించడం చూసి ఆత్మీయంగా బాధపడింది; క్రీస్తుని అవమానించి దారుణంగా గాయపరిచారు. ఆ విధంగా సిమియోన్ ప్రవచనం ఇక్కడ నెరవేరింది, "ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది." (లూకా 2:35). యేసును శిలువ వరకు అనుసరించిన ఇతర స్త్రీలు ఉన్నారు, వారిలో ఒకరు పునీత యోహాను గారి తల్లి.
పునీత యోహాను జబాధాయి కుమారుడు, ఇతర శిష్యులందరూ చెల్లాచెదురు అయినపుడు మరియు రోమన్లు ​​మరియు ఇతర ప్రజలు ఖండిస్తారు మరియు ఎగతాళి చేస్తారనే భయంతో యేసుతో పటు ఉన్న సహవాసాన్ని చెప్పుకోవడానికి ధైర్యం చేయలేకపోయారు. పునీత పేతురు గారు రహస్యంగా వెంబడించడానికి, ప్రయత్నించినప్పటికీ, అతను విజయం సాధించలేకపోయాడు మరియు భయపడ్డాడు, అతని మూడు సార్లు తిరస్కరించడం ద్వారా యేసుకి దూరంగా ఉన్నారు. కానీ పునీత యోహాను గారు మాత్రమే క్రీస్తు శిలువ వద్ద తన గురువు యేసు యొక్క బాధలను చూసి బాధపడుతూ నిలబడ్డాడు.
ప్రియమైన తల్లికి - " స్త్రీ! ఇదిగో నీ కుమారుడు!"
యేసు తన తల్లితో ఇలా అంటారు , “ఇదిగో నీ కుమారుడు”, ఈ దృశ్యాన్ని మన మనస్సులో చిత్రించుకున్నప్పుడు, యేసు తన శిష్యుని సంరక్షణను తన తల్లికి అప్పగిస్తున్నారు. పరిశుద్ధగ్రంధం చూసినట్లయితే పునీత యోహాను గారి తల్లి కూడా అక్కడ శిలువ వద్ద ఉంది, కాబట్టి అతనిని తల్లి మరియ సంరక్షణకు అప్పగించడం ద్వారా ఆధ్యాత్మిక కోణం కలిగిఉంది. మన జీవితంలో మన తల్లులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.
మరియ మా తల్లిగా ఇప్పుడు మన విశ్వాస జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆమె మనకు తోడుగా ఉంటుంది మరియు మన ప్రయాణంలో మాకు మద్దతు ఇస్తుంది, ఆమె మన కోసం ప్రార్థిస్తుంది, మన రోజువారీ జీవితాలు సత్యం, మార్గం, జీవము అయినటువంటి తన కుమారుని వైపు నడిపిస్తుంది. ఆమె ప్రార్థన చేసే స్త్రీ, ఆమె మొదటి శిష్యులతో కలిసి ప్రార్థిస్తుంది, కాబట్టి గౌరవం మరియు ప్రశంసలకు అర్హమైనది (అపొస్తలుల కార్యాలు 1:12-14)
ఈ కోణంలో, శిష్యులమైన మనం ఇప్పుడు ఆమె కుమారులు మరియు కుమార్తెలుగా మారాము మరియు ఆమె సంరక్షణ మరియు మార్గదర్శకత్వంలో మనం యేసు వైపుకు నడిపించబడాలి.
ప్రియమైన శిష్యుడికి - "ఇదిగో నీ తల్లి"
శిష్యుని ప్రేమకు కదిలి, శిలువ వరకు ఆయనను నమ్మకంగా అనుసరించిన శిష్యుల దుఃఖానికి చలించి, తన స్థానంలో క్రీస్తు తన తల్లిని ఇచ్చారు, ఆమె ఆ శిష్యుడిని యేసు నిర్దేశించిన మార్గంలో నడిపిస్తుంది.
యేసు కూడా, ఒక తల్లికి ప్రియమైన కొడుకుగా, తన తల్లి క్షేమాన్ని మరచిపోడు, కాబట్టి అతను తన ప్రియమైన శిష్యునికి ఆమె సంక్షేమం, ఆమెను చూసుకోవడం, సేవ చేయడం మరియు రక్షించడం వంటి బాధ్యతలను అప్పగించాడు. పునీత యోహాను గారు సంతోషంగా ఆమెను తన ఇంటికి తీసుకొనివెళ్ళారు. "ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి, ఈ శిష్యుడు ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు." (యోహాను 19:27). ఇది తన తల్లి పట్ల కుమారునికి గల గొప్ప ప్రేమను చిత్రీకరిస్తుంది.
రెండు పాఠాలు:
క్రీస్తు సిలువకు దగ్గరగా ఉండడం
క్రీస్తు యొక్క శిలువ మనకు నిత్యజీవం యొక్క ప్రేమ మరియు దయ యొక్క అత్యున్నత వ్యక్తీకరణ, మనము దుఃఖముతో మరియు నిశబ్దంగా సిలుగా దగ్గర ఉండటం మాత్రమే కాదు, తల్లి మరియమ్మ అదేవిధంగా పునీత యోహాను వలె విశ్వాసాన్ని వ్యక్తపరచాలి, తద్వారా క్రీస్తు బాధలను మన స్వంతం చేసుకోవాలి.
మనము ఎగతాళి చేయబడినప్పుడు మరియు విడిచిపెట్టబడినప్పుడు కూడా మనము యేసుతోనే ఉండగలుతున్నామా!
మన భయాలు మరియు ఆందోళనలు, శారీరక, ఆధ్యాత్మిక మరియు మానసిక బాధలలో కూడా, మనము క్రీస్తు సిలువపై నమ్మకాన్ని మరియు నిరీక్షణను ఉంచుతున్నామా!
కుటుంబం మరియు దగ్గరి & ప్రియమైన వారి పట్ల ప్రేమ మరియు బాధ్యత
నాల్గవ ఆజ్ఞ మనకు "మీ తండ్రిని మరియు మీ తల్లిని గౌరవించండి" అని బోధిస్తుంది, ఏది ఎదురైనా మన జీవితంలో, సంతోషాలు లేదా దుఃఖం వచ్చినా వారిని ప్రేమించాలని మరియు శ్రద్ధ వహించాలని మాకు పిలుపునిస్తుంది. యేసు తన శిష్యుడికి తన తల్లినీ అప్పగించడం ద్వారా భూమిపై తన జీవితం ముగిసిన తర్వాత కూడా కుమారుని పాత్రను సంపూర్ణంగా నెరవేర్చాడు. అందువల్ల, మన కుటుంబ బాధ్యతలకు మనం బాధ్యత వహించాలని మరియు వాటిని నెరవేర్చాలని ఇది మనకు బోధిస్తుంది. దేవునికి విధేయత మొదట వస్తుంది అనేది నిజం, అయితే ఇది కుటుంబం పట్ల బాధ్యతను తిరస్కరించదు లేదా తగ్గించదు, బదులుగా కుటుంబాన్ని దేవునికి దగ్గరగా చేయడానికి దానిని ఎక్కువ ప్రోత్సహిస్తుంది. ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు ఇలా పేర్కొన్నాడు: "కానీ ఎవరైనా తన బంధువులను గూర్చి, అందును విశేషించి తన కుటుంబమును గూర్చి శ్రద్ద వహింపనిచో అతడు ఈ విశ్వాసమును విడినట్లే. అట్టి వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు." (1 తిమోతి 5:8)
చివరి మాటలు:
ప్రియమైన స్నేహితులారా, ఈ మూడవ పదం మన దృష్టిని సిలువ నుండి మరియ తల్లి మరియు శిష్యుల వైపుకు మళ్లిస్తుంది, కుమారుడు లేని మరియ తల్లికి, అలాగే గురువు లేని శిష్యుడికి కూడా ఇకపై జీవితం సులభం కాదని మనమందరం ఊహించవచ్చు. అందుకే, వారి దుఃఖ పరిస్థితిని చూసి, ఒకరికొకరు బాధ్యత అప్పగించడం ద్వారా తన ప్రేమను చూపిస్తూ వారిని ఓదార్చారు మరియు ఉరటనిచ్చారు . ఇక్కడ:
యేసు కుటుంబ పరమైన అనుబంధాన్ని ఏర్పరుస్తున్నారు.
యేసు మరియ తల్లికి మరియు శిష్యులకు కొత్త దైవ చిత్తాని అప్పగిస్తున్నారు.
యేసు ఓదార్పును అందచేస్తున్నారు, తల్లిని శిష్యుడికి మరియు శిష్యుడిని తల్లికి బహుమతిగా అవ్వడం ధ్వారా మనకు కూడా విశ్వాసంతో ఆయన శిలువ వద్ద మనం నిలబడితే దేవుడు మన అవసరాలను తీర్చగలడని ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది.

The Third Word
“Standing by the cross of Jesus were his mother and his mother’s sister, Mary the wife of Clopas, and Mary of Magdala. When Jesus saw his mother* and the disciple there whom he loved, he said to his mother, “Woman, behold, your son.”Then he said to the disciple, “Behold, your mother.” And from that hour the disciple took her into his home.” (John 19:25-27)

The Third Phrase/Word perfectly reveals the love and concern he has for his mother and disciple. In the midst of injustice and inhumanity, the heart broken mother and distraught disciple stand near the cross, Jesus looking at them entrusts to each other expressing his love and affection, care and concern for his loved ones.
Standing at the Cross : Devastated Mother & Distressed Disciple
Since she was at the cross and on the calvary journey, we can assume that Mother Mary had witnessed everything that happened. She too had suffered spiritually looking at her son being arrested, tried and condemned unjustly; insulted and injured him cruelly. Thus the prophecy of Simione is fulfilled here, "And a sword will pierce your own soul too." (Luke 2:35). There are other women who followed Jesus to the cross, one among them was St. John’s mother.
St. John, the son of Zebedee, when all other disciples scattered and could not dare to identify with Jesus for the fear of being condemned and mocked by Romans and the other people. Although St. Peter tried to accompany secretly but he could not succeed and feared therefore, betrayed Jesus in his denials. Only St. John accompanied and stood at the cross of Christ, distressed looking at the suffering of his Master, Jesus.
To Beloved Mother - Behold your son
Jesus says to Mother, “behold your son”, when we picture this scene in our minds, Jesus is entrusting the care of his disciple to His Mother. Literally St. John’s mother is also there at the cross, therefore by entrusting him to her care is something spiritual in nature. Our mothers play a significant role in our lives.

Mary as our mother now plays a significant role in our faith life. She accompanies us and supports us in our journey, she prays for us, for our daily lives to lead us to her Son, who is the way, the truth and the life. she is a woman of prayer, She prays with the first disciples, therefore worthy of respect and praise(Acts of the Apostles 1:12-14)

Thus in this sense, we the disciples now become her sons and daughters and in her care and guidance we are led to Jesus.

To Beloved Disciple - Behold your Mother
Touched by love and moved by the sadness of the disciples who faithfully followed him to the cross, in his place Christ gives him His Mother who will guide him on the path laid down by Jesus.
Jesus is also, being a beloved son to a mother, does not forget the welfare of His mother, thus he entrusts to his beloved disciple the responsibility of her welfare, to care for her, to serve and protect her as Jesus would have fulfilled. St.John happily receives her into his home. "From that time on, this disciple took her into his home." (John 19:27). It pictures the great love of a Son towards his Mother.
Two Lessons:

Staying close to the Cross of Christ
The Cross of Christ is the highest expression of love and grace of eternal life for us, we need to stay close in sorrow and silence more than that need to express faith like Mother and St. John, thereby making Christ’s sufferings our own.
Even when I am ridiculed, and abandoned am I remaining with Jesus

Even in my fears and anxieties, physical, spiritual and emotional sufferings, I am placing my trust and hope in the Cross of Christ.

Love and Responsibility towards family and near & dear ones
The fourth commandment teaches us to “honour your father and your mother”, which calls upon us to love and care for them no matter what comes in our way, be it joys or sorrows. Jesus has perfectly fulfilled the role of a Son to a Mother after his life ended here on earth, by entrusting to his disciple. Therefore, it teaches us that we are to be responsible for our family obligations and fulfil them. It is true that obedience to God comes first, but this does not negate or lessen the responsibility towards family rather intensifies it in order to make a family closer to God. The Apostle Paul in this regard states: "If anyone does not provide for his relatives, and especially for his immediate family, he has denied the faith and is worse than an unbeliever." (1 Timothy 5:8)

Final Thoughts:

Dear Brothers and sisters, This third word turns our gaze from the Cross to Mother Mary and the Disciple, we all can imagine hereafter life will not be easy for Mother Mary without son, so also to the disciple without Master. Hence, looking at their inconsolable situation, he consoles and comforts them showing his concern by entrusting to each other. here:

Jesus establishes a filial relationship
Jesus entrusts a new mission to Mother and Disciple.
Jesus provides consolation, gifting Mother to disciple and the disciple to mother, it encourages us that God will provide for us in our needs if we stand by him at his cross in faith.

Fr. Jayaraju Manthena OCD

1, ఏప్రిల్ 2023, శనివారం

 

తపస్సు కాలం 6వ ఆదివారం

మ్రానికొమ్మల ఆదివారం

యెషయా 50: 4-7

ఫిలిప్పి 2: 6-11

మత్తాయి 26: 14-27: 66

ఈరోజు తల్లి శ్రీసభ మ్రానికొమ్మల ఆదివారంను కొనియాడుచున్నది. దీనినే క్రీస్తుపాటులు ఆదివారం అని కూడా పిలుస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోష సమయాలు కొన్నివుంటాయి. ఈ మ్రానికొమ్మల రోజు కూడా ప్రభువు యొక్క జీవితంలో ప్రత్యేకమైనది, సంతోషకరమైనది  ఎందుకంటే ప్రజలు ఆయన్ను రాజుగా గుర్తించి 'హోసన్నా' పాడారు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని అనుభవించినట్లే తరచుగా దుఃఖాన్ని గూడు పొందుతుంటాం. విచారం కలిగినట్లే ఆనందం కూడా కలుగుతుంది. 

ఈ రోజు మనందరం పవిత్ర వారంలోకి అడుగుపెడుతున్నాం/ ప్రవేశిస్తున్నాం. మన యొక్కా రక్షణ సంఘటనలు ధ్యానించుకోబోతున్నాం. యేసు ప్రభువు యొక్క రక్షణ ఘట్టాలను ధ్యానించుకోబోతున్నాం. ఆయన యొక్క సిలువ శ్రమలు మరణం పునరుత్తానం అదే విధంగా క్రీస్తుతో మన మరణ, పునరుత్తనాలు కూడా ధ్యానించుకోవాలి.

ఈ పవిత్ర వారం యొక్క ఘట్టాలు మనం శ్రద్ధగా ధ్యానిస్తే మనకు దేవునితో వున్నసంబంధం పెరుగుతుంది. దేవునిలో వున్న విశ్వాసం పెరుగుతుంది. దేవుని పట్ల ప్రేమ పెరుగుతుంది. మనలో కూడా హృదయ పరివర్తనం కలుగుతుంది. ప్రభువు నా కోసమే మరణించారు అనే  ఆలోచన మన జీవితాలను మార్చుతుంది.

ఈ మ్రానికొమ్మల ఆదివారం రోజుల రెండు ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

1.  ఆయన మహిమా సంఘటన

2.  ఆయన శ్రమల సంఘటన

మహిమా సంఘటన ఏమనగా ప్రజలు ప్రభువును రాజుగా గుర్తించి ఆయన్ను యెరూషలేముకు ప్రేమతో ఆహ్వానించారు. శ్రమల సంఘటన ఏమనగా ప్రభువును ద్రోహిగా నిందించి ఆయన్ను సిలువవేయుటకు పన్నాగం చేయుట.

ఒకటి సంతోషంకరమైనది రెండవది భాధాకరమైనది. మన శరీరంలో రక్తం నీరు ఎలాగైతే కలసివుంటాయో మన యొక్క జీవితంలో కూడా బాధ, సంతోషం కలసివుంటాయి. ఈరోజు మ్రానికొమ్మలతో ప్రదక్షణలో వచ్చే సమయంలో ఒక సువిశేష భాగం చదువుతాం, పూజలో శ్రమల వృతాంతం చదువుతాం. యేసు ప్రభువు అనేకసార్లు యెరూషలేము వెళ్లారు కానీ అన్ని సార్లు ఆయనకు ఆంత గొప్ప ఆహ్వానం ఇవ్వలేదు. కేవలం ఈ రోజున మాత్రమే వారు గుర్తిస్తున్నారు.

యేసు ప్రభువు పేదవారి పట్ల పోరాడిన విధానం, వారి పక్షమున నిలబడి వారికోసం జీవించే విధానం ప్రజల్లో ఒక నమ్మికను కలుగజేసింది. ఇతడు మాకోసం జీవిస్తాడు. అధికార బంధముల నుండి మమ్మల్ని విడిపిస్తాడు అనే ఆలోచన, నమ్మకం వారిలో కలిగింది.

ఈనాటి మొదటి పఠనంలో బాధామయ సేవకుని యొక్క జీవితం గురించి చదువుకున్నాం. యెషయా గ్రంధంలో  40 -  55 అధ్యాయాలలో నాలుగు బాధామయ సేవకుని గీతాలు మనం వింటున్నాం.  ఈనాటి మొదటి పఠనం 3 గీతం గురించి చదువుకుంటున్నాం.  క్రీస్తుపూర్వం 7 వ శతాబ్దంలో దేవుడు యెషయాను ప్రవక్తగా నియమించారు.

సోలోమోను రాజు తరువాత యిస్రాయేలు రెండుగా విభజించబడింది ప్రతి ఒక్క రాజ్యంకు వారి వారి ప్రవక్తలు, నాయకులు, మత పెద్దలు ఉండేవారు. యెషయా ప్రవక్త యెరూషలేములో పనిచేసిన ప్రవక్త . ఆయన అనేక మంది రాజులకు దేవుని యొక్క ప్రవచనాలు తెలిపారు. ఆయన కాలంలో అస్సిరియులు యిస్రాయేలును నాశనం చేసిన దానిని ఆయన కనులారా చూశాడు. అలాగే అస్సిరియులు యూదా మీదకు యుద్ధముకు రావటం చూశాడు. అప్పుడు హిజ్కియా రాజును లొంగిపోవద్దు అని తెలిపారు, దేవునికి ప్రార్ధించి ముప్పు తొలగించారు.

యెషయా ప్రవక్త ఈ సేవకుని యొక్క గీతము వ్రాసేటప్పుడు ఆయన మనస్సులో వున్నది ఇద్దరు వ్యక్తులు

1 యిస్రాయేలు ప్రజలు - ఎన్నుకొనబడిన ప్రజలు

2 మెస్సయ్యా

మెస్సయ్యా తాను అందరికోసం శ్రమలు అనుభవించి మరణిస్తారని ముందుగానే ప్రవక్త ప్రవచించారు అందుకే అంటారు ప్రవక్తలు ప్రవచనాలు నిజమేనని.

యిస్రాయేలు ప్రజలు కూడా తమ యొక్క జీవితంలో సేవకుల వలే బానిసత్వంలో అనేక శ్రమలు అనుభంవించారు. మరీ ముఖ్యంగా బాధామయ సేవకుని జీవితం  మెస్సయ్యా గురించి ఉద్దేశించబడినది.

ఈనాటి మొదటి  పఠనంలో రెండుభాగాలున్నాయి

1.  సేవకునికి అప్పజెప్పిన బాధ్యత

2. సేవకుని యొక్క త్యాగ జీవితం

సేవకునికి అప్పజెప్పిన బాధ్యత ఏమిటంటే ప్రకటించుట, బోధించుట దేవుని యొక్క రాజ్యం  గురించి, దేవుని ప్రేమ గురించి, ఆయన క్షమ గురించి రక్షణ గురించి ప్రకటించే శక్తిని దయచేశారు. ఆయన అలసిపోయిన వారికి ఓదార్పు దయచేస్తారు. మత్తయి 11 : 28

బాధలలో, కష్టాలలో, నిరాశలో, జీవితంలో అన్ని  సమస్యలు పడే వారిని దేవుడు ఈ సేవకుని ద్వారా ఓదార్చుతున్నారు. సహాయంలేని వారికి ఒక సహాయంగా ఉండుటకు ఎన్నుకొనబడినారు. ప్రేమలేని వారికి ప్రేమను పంచుటానికి ఎన్నుకొనబడిననారు. జీవితంలో ఆశలు కోల్పోయిన వారికి ధైర్యం నిచ్చుటకు ఈ సేవకుడు ఓదార్పును దయ చేస్తాడు.  సేవకుడు తన జీవితంలో దేవునికి  ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఆయన తండ్రి చిత్తము నెరవేర్చుటకు వచ్చియున్నారు. హెబ్రీ 10 : 7 , 5 : 8 .

ఆయన మరణం వరకు తండ్రికి అడ్డు చెప్పలేదు ఫిలిప్పి 2 : 8 .  ఆయన మాటను ఎల్లప్పుడూ నెరవేర్చారు. తనకు అప్పజెప్పిన పరిచర్య బాధ్యత సక్రమంగా నెరవేర్చాడు ఈ సేవకుడు.

రెండవ భాగంలో తన యొక్క సేవక బాధ్యతలు నెరవేర్చుటలో ఈ సేవకుడు ఎంతగానో శ్రమలను అనుభవించాడు, నిందలు భరించాడు. ఆయనను మొదువారికి వీపును అప్పగించారు అని 6 వ వచనంలో చెప్పబడింది అంటే ఎన్ని దెబ్బలైన భరించటానికి తనను తాను సమర్పించుకున్నారు. ఆయన ఎవ్వరికీ ఎదురు చెప్పలేదు మౌనంగా భరించాడు.

ఆయన గడ్డపు వెంట్రుకలు లాగేసారు, ఉమ్మివేసారు, ఆవమానించారు. ఇవన్నీ కూడా భరించటానికి కష్టం అయినా భరిస్తున్నారు. ఇది కేవలం ప్రేమ వలనే సాధ్యం. ప్రేమ సమస్తమును భరించును 1  కొరింతి 13 : 7 .

·         యేసుప్రభువు యొక్క జీవితంలో ఇవన్నీ జరిగాయి, ఆయన వస్త్రములు లాగారు. యెహాను 19 : 23 .

·         ఆయన మొహం మీద ఉమ్మివేశారు. మత్తయి 26 : 67

·         ఆయన్ను కొరడాలతో కొట్టారు. మార్కు 15 : 15 , యోహాను 19 : 1 .

ఇన్ని రకాలైన అవమానాలు తాను ఎదుర్కొన్నప్పటికీ ఆయన కృంగిపోలేదు, పారిపోలేదు అన్ని సహనంతో భరించాడు. ఇంత భాధలు పొంది వాటిని భరించాలంటే నిజంగా దైవశక్తి మనకు అవసరం.  బాధామయ సేవకుడు తండ్రిమీద వున్న గాఢమైన ప్రేమ వలన అదేవిధంగా తన ప్రజలను కాపాడాలనే ఉద్దేశం వలన ఎంతో భాధను భరించాడు. ఒక క్రొవొత్తి తాను కరుగుతూ ఎలాగైతే ఇతరులకు వెలుగునిస్తుందో అదే విధంగా ఈ సేవకుడు తన జీవితం, ప్రాణత్యాగం చేస్తూ ఇతరులకు రక్షణనిచ్చాడు.

రెండవ పఠనంలో పునీత పౌలుగారు యేసు ప్రభువు యొక్క సేవా జీవితం గురించి తెలుపుచున్నారు. యేసు ప్రభువు తండ్రి,  పవిత్రాత్మతో  అన్నింటిలోనూ సరిసమానంగా ఉన్నప్పటికీ తనను తాను తగ్గించుకొని జీవించారు. ఈ వాక్యాలలో పౌలు గారు దేవుని యొక్క వినయ జీవితం  గురించి మాట్లాడుతున్నారు. ఎవరు కూడా ఆయన వలే తగ్గించుకొని జీవించలేదు.

ఆయన దేవుడు అయినా మనిషిగా మన మధ్య జన్మించారు. పరలోకంలో జీవించే దేవుడు భూలోకంలో జీవించుటకు ఇష్టపడ్డారు. పరలోక మహిమను విడిచిపెట్టారు. భూలోక సిలువను మోశారు. పవిత్రమైన పరలోకంలో జీవించే దేవుడు పాపమలినం శోకిన ప్రజలు మధ్యకు వచ్చారు. అధికారం కలిగినప్పటికీ  అణిగిమణిగి వినయంతో జీవించారు.

ఆయన దేవుడే అయినప్పటికిని అన్నీ విడిచిపెట్టారు. మన మధ్యకు వచ్చారు ఫిలిప్పి 2 : 7 .

- సేవించబడాల్సిన దేవుడు సేవచేస్తున్నారు

- ప్రేమించబడాల్సిన దేవుడు మన మంచికై అని చేస్తున్నారు

- మనం ఎవరికోసం, ఎవరి రాక కోసం ఎదురు చూడాలో ఆయనే మనం కోసం ఎదురు చూస్తున్నారు.  మనం వెదికే దేవుడు మన కోసం వెదకుచున్నారు.

ఆయన అన్నింటిని త్యజించుకుని మన మధ్యకు వచ్చి జీవించారు. యేసు ప్రభువు అంతటి వినయమును చూపుతూ మన మధ్యలో  జీవించి తన  ప్రాణత్యాగం చేశారు. ఆయన స్వార్ధం వెదకలేదు సేవకుని వలే జీవించి  అంత దేవుని కొరకు ప్రజల కొరకు చేశారు.

యేసు ప్రభువు తండ్రి మాత్రమే  కాదు వినయం చూపినది మానవులకు, అధికారులకు వినయం చిపించారు. తనను హింసించిన వారికి,  చంపిన వారికి కూడా ప్రభువు వినయం చూపించారు.  ఆయనకు అధికారం ఉంది, ఆయన  సృష్టికర్త  అయినా కానీ అంతటి వినయం చూపించారు. యెహాను 10 : 18 , రోమి 5 19, హెబ్రీ 10 : 9

వినయం వలన ప్రాణత్యాగం చేశారు తనను తాను తగ్గించుకొని నిందలు మోశారు. తనను తాను  తగ్గించుకొని శత్రువుల చేతికి అప్పగింపబడినారు. తనను తాను తగ్గించుకొని అందరి పాపాలు తన మీద మోసుకున్నారు.

తనను తాను తగ్గించుకొని సిలువ భారం మోశారు, ఘోరమైన సిలువ మీద మరణం అంగీకరించారు. ఆయన పాపరహితుడైనప్పటికీ మన పాపాలకోసం అన్నీ భరించారు, మనల్ని రక్షించారు - 2  కొరింతి  5 : 12 , గలతి 3 : 13 , 1  పేతురు 2 : 24 , 1  పేతురు  3 : 18 .

యేసు ప్రభువు తన్ను తాను రిక్తుని  చేసుకున్నారు కాబట్టి తండ్రి కుమారుడిని అంతగా  సన్మానించారు.  చివరి వరకు సంపూర్ణ విధేయతను, వినయంను  చూపిన కుమారుడ్ని తండ్రి మిక్కిలిగా ప్రేమించారు. ఆయనకు సమస్తము ఇచ్చియున్నారు. ఎఫెసీ 1 : 22 , 1  పేతురు 3 : 22 , రోమా 14 : 11 .

 మనం ఒకరి ముందు తలవంచటానికి ఇష్టపడం కానీ యేసు ప్రభువు వినయంతో అందరిముందు తనను తాను తగ్గించుకొని జీవించారు.

ఈనాటి సువిశేష పఠనంలో ప్రభువు యొక్క సిలువ శ్రమలు ధ్యానించుకుంటున్నాం. ఈ రోజు ముఖ్యంగా మనందరం ధ్యానించుకోవాల్సిన అంశం ఏమిటంటే యేసు ప్రభువును ప్రజలు రాజుగా గుర్తించారు.

యేసు ప్రభువు చాలాసార్లు యెరూషలేము దేవాలయంకు వెళ్లారు. కానీ ఈ సమయంలో ఆయన్ను గొప్పగా ఆహ్వానించారు. 

ప్రభువు యెరూషలేమునకు వెళ్లిన సమయాలు:

1.       యెరూషలేము దేవాలయమును శుభ్రం చేసిన సమయం - యోహాను 2 : 13

2.       యెరూషలేములో కోనేటి వద్ద స్వస్థత నిచ్చినప్పుడు - యోహాను 5 :1

3.       యెరూషలేములో ఆయన దేవుని కుమారుడని ప్రకటించినవేళ - యెహాను 7 : 16 -17

4.       జీవజలపు ఊట అని చెప్పినప్పుడు - యోహాను 7 : 37 -39

5.       లోకానికి వెలుగు అని చెప్పినప్పుడు కూడా ప్రభువు యెరూషలేములో వున్నారు- యోహాను 8 : 12 , 9 : 5

ఇలా చాలా సందర్భాలలో ప్రభువు యెరూషలేములోని ఉన్నారు. కానీ ఇప్పుడు దానికి ప్రత్యేకత ఉంది.

ప్రభువు ఈ లోకంలో తండ్రి క్రియలు నెరవేర్చారు, అద్భుతాలు చేశారు. 

యూదుల విశ్వసం పెంచటానికి 7  అద్భుతాలు చేశారు.

1.       1. నీటిని ద్రాక్షారసముగా మార్చారు - యోహాను 2: 1-11

2.      2.  ప్రభుత్వ ఉద్యోగి కుమారునికి ్వస్థతనిచ్చుట  - యోహాను 4: 46-54

3.      3.  బేత్సయిదా వద్ద పక్షవాత రోగికి స్వస్థతనిచ్చుట - యోహాను 5: 1-15

4.      4.  5000 మందికి ఆహారం పెట్టుట - యోహాను 6: 5-14

5.       5.  నీటిమీద నడచుట - యోహాను 6: 16-24

6.       6. పుట్టు గ్రుడ్డివానికి చూపును దయచేయుట - యోహాను 9: 1-7

7.       7.  లాజరును జీవంతో లేపుటయోహాను 11: 1-45

ఇవన్నీ చేసిన తరువాత ప్రజలయొక్క ఆత్మ విశ్వాసం  పెరిగింది. ఆ కాలంలో ప్రభువు బలహీనులపట్ల, ప్రజల పట్ల పోరాడుచున్నారు కాబట్టి ఇతడు నిజంగా ప్రజల కోసం వచ్చారని, ప్రజల సమస్యలనుండి కాపాడుతారని నమ్మకం.

అందుకే ఆయన్ను రాజును చేయాలనుకున్నారు.  ఆయనయే తమ రాజాని ఆయన్ను స్తుతించారు. మాకోసం నిలబడే వ్యక్తి అని మాకోసమే పుట్టిన ప్రభువు అని అందరూ భావించారు. అందుకే ఆయన తమ యొక్క రాజాని గుర్తించారు. ఆ సందర్భంలోనే ఆయన్ను ఘనంగా ఆహ్వానించారు.

ప్రజలు యేసుప్రభువునకు హోసాన్నా పాడారు.  హోసాన్న అనగా 'మమ్ము ఇప్పుడు రక్షించు' అని అర్ధం. ఆయన వారిని రక్షిస్తాడని తెలుసుకున్నారు. పాపములనుండి రక్షిస్తాడని తెలుసుకొని రక్షించామన్నారు. అదేవిధంగా ఈ లోక బంధములనుండి, అధికారుల క్రిందనుండి రక్షించమని కోరారు. ఆయన ద్వారానే రక్షణ వస్తుందని రాజ్యాధికారం  ఈ లోక అధికారం కన్నా బిన్నంగా ఉంటుంది.

 ఈ రాజు రాజ్యాలు గెలిచే రాజుగా రావటం లేదు. ప్రజల యొక్క మనస్సు గెలిచే రాజుగా వస్తున్నారు. మన రాజు శ్రమలు అనుభవించారు, సుఖ సంతోషాలు విడిచిపెట్టారు. ఈ రాజు అందరికంటే ముందుగా నిలబడి తన ప్రజల కోసం పోరాడతారు.

ప్రభువు స్వయంగా గాడిదను ఎన్నుకొంటున్నారు ఎందుకంటే పూర్వం రాజులు యుద్ధం చేయటానికి వెళ్ళేటప్పుడు గుర్రం మీద వెళ్లేవారు. శాంతిని నెలకొల్పేటప్పుడు గాడిదమీద వెళ్లేవారు.

గాడిద వినమ్రుని, శాంతిపరుని సూచిస్తుంది. యేసు ప్రభువు ప్రపంచానికి శాంతి ప్రదాత. ఆయన ఇహలోక సంబంధమైన రాజు కాక పరలోక సంబంధమైన రాజు. ఆయన అందరికి రాజు. ప్రజలందరి పాపలు తన మీద మోసుకొని మరణించిన గొప్ప రాజు.

సొలొమోను తన తండ్రి గాడిద మీద వచ్చారు, సింహాసనాన్ని అధిష్టించే రోజును – 1 రాజు 1: 38-41

గాడిద మీద వచ్చిన వారు - న్యాయా 10: 4, 2 సమూ 17: 23, 2 సమూ 19: 26

ఈ లోకమును తన తండ్రితో సమాధానపరచుటకు ఆయన గాడిద మీద వస్తున్నారు - ఎఫెసీ 2: 13-18

గాడిదను ప్రభువు ఎన్నుకొనుటకు కారణాలు :

1.       గాడిద బరువు మోస్తుంది - అందరి భారం మోస్తుంది

2.       గాడిద సేవ చేస్తుంది - అందరికి సేవ చేస్తుంది

3.       గాడిద శాంతికి గుర్తు

4.       గాడిద పవిత్రతకు గుర్తు- వస్తువులను జంతువులను దేవునికి సమర్పించుటకు వాడతారు కాబట్టి అవి పవిత్రమైనవి

సంఖ్య 19: 2,  ద్వితీ 21: 3, 1 సమూ 6: 7

యేసు ప్రభువు వాడిన గాడిదను ఎవ్వరు ఎన్నడూ వాడలేదు. అది పవిత్రమైనది. మనం దేవుని ప్రేమను తెలుసుకొని ఆయన కొరకు మంచి జీవితం జీవించాలి.

                                                                                                                  Fr. Balayesu OCD                          

 

 

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...