మానవునితో
సఖ్యత - హృదయ పరివర్తనం -దేవునితో సఖ్యత
మొదటి
పఠనం: ఐగుప్తు అపకీర్తిని దేవుడు మన నుండి తొలగిస్తాడు . అంటే దాస్యాత్వం నుండి మనలను
విమోచించి స్వతంత్రులుగా జీవించే వారిగా మనందరిని
తీర్చిదిద్దుతాడు.
రెండవ
పఠనం , క్రీస్తునందు జీవిస్తే, క్రీస్తు మనలను తనతో సఖ్యపరచుకొని
నూతన సృష్టిగా మనలను మారుస్తాడు
సువార్త
పఠనము , తప్పిపోయిన
కుమారుడి ఉపమానం ద్వారా మన తప్పులను తీసుకొని, తండ్రి చెంతకు తిరిగి రావాలని,
ధర్మశాస్త్ర బోధకులకు పరిసయ్యులకు
వారి మనస్తత్వానికి
స్వస్తి చెప్పాలని, పెద్దకుమారుడిలాగా తండ్రి
దగ్గర ఉంటూ, దూరంగా జీవించే జీవితానికి సెలవు చెప్పి, దేవునితో మరియు తోటి మానవునితో సఖ్యతగా, సమాధానంగా జీవించాలని విశద పరుస్తుంది
ఈ
విధంగా ఈ నాటి మూడు పఠనాలు తండ్రి దేవుడు అవధులు లేని ప్రేమకలవాడని, మన తప్పులను తెలుసుకొని
పశ్చాత్తాప పడి పాపం అనే
బానిసత్వం నుండి దేవుని ప్రేమ అనే స్వతంత్ర జీవితానికి మరలి వచ్చి, నూతన సృష్టిగా మారమని ఈలాగున
దేవునితో, మానవునితో సఖ్యత పడమని
మనందరిని ఆహ్వానిస్తున్నాయి వీటిని మనం మూడు అంశాలా రూపేనా ధ్యానిస్తూ అర్ధం చేసుకుందాం.
1.
తండ్రి నుండి దూరంగా వెళ్ళడం
2.మన పాపపు స్థితిని గ్రహించి
తండ్రి చెంతకు తిరిగి రావడం
3.నూతన
సృష్టి – ఉత్సవం
ఈనాటి
సువార్త పఠణం లో తప్పిపోయిన కుమారుడి ఉపమానంలో మూడు ముఖ్య పాత్రలను చూస్తున్నాము 1. తండ్రి 2 .చిన్నకుమారుడు 3 .పెద్దకుమారుడు
చిన్న
కుమారుడు తన తండ్రితో తనకున్న సంబంధాన్ని తెంచుకోవాలనుకున్నాడు.
అందుకే తనకు రావాల్సిన ఆస్తిలో భాగాన్ని పంచిపెట్టామని, తన తండ్రిని బలవంతం చేసి తన బాగాన్ని నెగ్గాడు .
(లూకా 15 :12 )ఈ కుమారుడు తన తండ్రి
హద్దులు, అవధులు మరియు అంతం లేని ప్రేమను, చేతులారా ఇక అవసరం లేదుగా అనుకున్నాడు. తను సత్వహగా జీవితాన్ని జీవించవచ్చు అనుకున్నాడు . దూర
దేశంలో దీనికంటే ఇంకా ఎక్కువ ప్రేమ, ఆప్యాయత, భోగావీలాస జీవితం లభిస్తుందని, తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూర దేశాలకు వెళ్లి అక్కడ
భోగ విలాసాలకు అలవాటుపడి ఇదే సర్వస్వం అనుకోని, తన చిల్లర స్నేహితులే ప్రేపంచం అనుకోని , వాళ్ళు ఎళ్ళకాలం తనతో ఉంటారు అనుకోని, డబ్బు శాశ్వతం
అనుకోని భ్రమపడ్డాడు (లూకా 15 ;13 -14 ),అందుకే
తన ధనమును విచ్చల విడిగా ఖర్చుపెట్టి సుఖమయ జీవితానికి అలవాటుపడ్డాడు. కానీ కరువు దాపరించడం వళ్ళ, తన సుఖమయ జీవితానికి, భోగ విలాస
జీవితానికి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. తనతో
జీవితాంతం ఉంటారనుకున్న స్నేహితులు, ఇప్పుటి దాక తనతో ఉండి, ఈ దరిద్రపు స్థితిని చూసి వదిలేసారు, ఒంటరయ్యాడు. కనీసం తినడానికి తిండి లేదు ,ఉండటానికి ఇల్లులేదు, ఎంచేయాలో అసలు తెలియదు ,చివరికి ఒక యజమానిని ఆశ్రయించగా, తాను తన పొలంలో పందులను మేపుటకు పంపెను, తర్వాత చెసేది కూడా ఏమిలేదు, ఎంతో హీనా స్థితికి దిగజారి చివరకు పందులు తిను పొట్టుతో
తన పొట్టను నింపుకొని ఆశపడ్డాడు. కానీ ఎవరు
ఏమి ఇవ్వలేదు ,(లూకా 15 ;15 -
16 ),ఇదంతా ఓ తండ్రి ప్రేమమయ తండ్రి నుండి దూరంగా
వెళ్ళుట ఫలితమే. ఈ రోజు నీవు నేను తండ్రి ప్రేమ నుండి కరుణ నుండి,తండ్రి సాన్నిధ్యం నుండి దూరంగా వెళ్ళామా?
2. మన పాపపు స్థితిని గ్రహించి
తండ్రి చెంతకు తిరిగి రావడం :
తప్పిపోయన కుమారుడు ఎంతో
హీనా స్థితికి దిగజారుడు,కడుపు నింపుకోవడానికి
పందులు తిను పొట్టు మాత్రమే గతి, అన్నపుడు గుర్తుకొచ్చింది తండ్రి ప్రేమ. అప్పుడు తండ్రి నుండి తాను అనుభవించిన రాజసం, వైభవం, జాగ్రత్త, అనురాగం ఒక్కోక్కటి గుర్తుతెచ్చుకొని, నెమరు వేసుకుంటూ
బోరున ఏడువసాగాడు. ఇక అనుకున్నాడు: నా తండ్రి వద్ద ఎందరో
పనివారికి పుష్టిగా భోజనం దొరుకుతుంది కాని ఇక్కడ నేను ఆకలికి మల మల మాడుచున్న.(లూకా 15
;17 ) ఈలాగున తన పాపపు
స్థితిని గ్రహించాడు. ఇక లాభం లేదు! నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్లి,తండ్రి నేను పరలోకమునకును , నీకును ద్రోహం చేశాను ఇప్పుడు నేను ని కుమారుడను
అని అసలు అనిపించోకోదగను. నీ పని వారిలో ఒక్కరిగా
పెట్టుకోనుము అని చెప్పెదనని , ఆలోచించుకుంటూ
తండ్రి వద్దకు బయలుదేరెను.(లూకా 15 ;19). తన తండ్రి చెంతకు తిరిగి
వచ్చెను. తన తండ్రి చెంతకు తిరిగి రావాలి అనేది ఓ గొప్ప అభినందనీయ నిర్ణయం. ఎందుకు అంటే ఈ నిర్ణయం
ద్వారా తన తండ్రితో మరల జీవించాలి అనుకున్నాడు.
తన తండ్రి ప్రేమను తనివితీరా అనుభవించాలి అనుకున్నాడు. తన తండ్రి సాన్నిధ్యంతో తండ్రి
వద్ద ఉండాలి అనుకున్నాడు.
కాని
పెద్ద కుమారుడు తండ్రి సాన్నిధ్యంలో ఉన్న కానీ తండ్రికి దూరంగా జీవిస్తున్నాడు
ఇది ఎంతో దుర్లభమైన జీవితం. అటు తండ్రితో,
ఇటు
తమ్ముడితో సఖ్యత లేదు. స్వార్థం, నిరాకరణ, అసూయా అనే దుర్గుణాలతో నిండి ఉన్నాడు. ఇతరుల శ్రేయస్సును, ఎదుగుదలను మరు మనసును, తట్టుకోలేక పోయాడు.
ఈరోజు
మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను చిన్న కుమారుడని
పోలి ఉన్నానా, పెద్ద కుమారుడని పోలి
ఉన్ననా ?,పెద్దకుమారుడి లాగా ఈర్షతో
జీవిస్తే , జీవితానికి ఒక అర్ధం ఇవ్వలేం.
జీవితంలో నిజమైన సంతోషాన్ని పొందలేము,తండ్రి దేవుని ప్రేమను అనుభవించలేం. కాని చిన్న
కుమారుడిలాగా మన పాపపు స్థితిని గ్రహించి, పశ్చాత్తాపపడి హృదయ పరివర్తనం చెంది, దేవుని వద్దకు తిరిగి వస్తే
దేవుని అనుగ్రహాలు, అవధులు లేని ప్రేమని ,కరుణని
పొందగలం.
3 . నూతన సృష్టి ఉత్సవం
ఎవడైనను
క్రీస్తునందున్న యెడల అతడు నూతన సృష్టి. పాత
జీవితం గతించినది. క్రొత్త జీవితం ప్రారంభం అవుతుంది.(2 కోరింతి 5
:17
), అని ఈనాటి రెండో పఠనంలో మనం మనం చదువుతున్నాం. చిన్న కుమారుడు తన పాపపు స్థితిని గ్రహించి, ఒప్పుకున్నాడు పశ్చాత్తాప పడి దేవుని చెంతకు తిరిగి వచ్చి ఇక క్రీస్తునందు ఉండాలి అనుకొన్నాడు, తోటి వారితో దేవునితో సఖ్యత పడ్డాడు. ఒక నూతన సృష్టి
గా మారాడు.
పెద్ద
కుమారుడు మాత్రం తండ్రి వద్ద ఉన్నాడు, కాని తండ్రి నందు ఉండలేకపొయ్యాడు. తన స్వార్ధం,నిరాకరణ మరియు
అసూయా దానికి కారణం. తన జీవిత స్థితిని గ్రహించలేకపొయాడు.
తాను తండ్రికి తగిన కుమారుడు అనుకున్నాడు,
కానీ తండ్రితో సఖ్యతను సంపాదించుకోలేకపొయాడు.
ఓ పాతసృష్టిలానే మిగిలిపోయాడు. ఎంత దురదృష్టకరణం! పెద్ద కుమారుడిలా కాక, మనం మన పాపపు బానిసత్వం నుండి
విమొచించబడి దేవుని దగ్గరకు తిరిగి రావాలి. (యెహోషువ 5 ;9
-12 ), ఒక నుత సృష్టిగా మారాలి. అప్పుడు ఒక ఉత్సవం జరుగుతుంది. స్వయానా తండ్రి దేవుడే మనలను ఆహ్వానిస్తాడు .ఏవిధంగా అంటే పరుగున వచ్చి, కౌగలించుకొని
ముద్దు పెట్టుకుంటాడు. అంతటితో ఆగడు, మనకు
మేలిమి వస్త్రములను, వెలికి ఉంగరమును ,కాళ్ళకు చెప్పులను ఇస్తాడు. అంటే ఇక మనం బానిసలం కాదు,
స్వతంత్రులమని , తనకు చెందిన వారమని, తన రాజరికంలో వా రమని దానికి అర్ధం. క్రోవిన
దూడను వాదించి విందు ఏర్పాటు చేస్తాడు (లూకా 15 ;20 -23 ), ఎందుకు అంటే? తప్పిపోయన మనం తిరిగి తండ్రి వద్దకు వచ్చేం
. పాతజీవితానికి మరణించిన మనం నూతన జీవితానికి జన్మించం. ఈ తపసు కాల నాలుగవ ఆదివారం మనమందరం మన పాపపు స్థితిని గ్రహించి, ఒప్పుకొని పశ్చాత్తాప పడి ,దేవుని చెంతకు తిరిగి వద్దాం. నూతన సృష్టిగా మారుదాం. మన తోటి వారితో, దేవునితో, వెల్ల వేళలా సఖ్యతతో జీవిద్దాం .
BR. SUNIL INTURI
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి