9, ఏప్రిల్ 2022, శనివారం

మ్రాని కొమ్మల ఆదివారం

 యేసు ప్రభువు తన యొక్క వైభవాన్ని పబ్లిగ్గా చాటడానికి అంగీకరించిన రోజు. యేసు ప్రభువు మరణానికి ఒక జాతి కాకుండా , మానవ జాతి అంతా బాధ్యత వహించింది. 

క్రీస్తు నాధునియందు ప్రియ దేవుని బిడ్డలారా మరియు క్రైస్తవ విశ్వాసులారా, ఈనాడు తల్లి శ్రీ సభ మ్రాని కొమ్మల ఆదివారం కొనియాడుతుంది. మ్రాని కొమ్మల ఆదివారం నాడు యేసు క్రీస్తు ఒక గొప్ప రాజుగా బేతానియ  నుండి యెరుషలేము దేవాలయంలోనికి ప్రవేశించటం. అదే విధంగా ఈ రోజు నుండి యేసు ప్రభువు జీవితంలో కష్టాలు మరియు  శ్రమలు ప్రారంభం అవుతాయి.  

ఈ రోజున మూడు పఠనాలు కూడా శ్రమలన్నీటిని,  ప్రేమతో ఎలా స్వీకరించటమో చూస్తున్నాము. 

మొదటి పఠనములో  యోషయా ప్రవక్త తెలియచేస్తున్నాడు, సేవకుడు అంటే, దేవుని సేవకుడు శ్రమలన్నీటిని కూడా ప్రేమతో ఇతరుల కోసం అనుభవించటం మనము గమనిస్తున్నాము. సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు మనందరి రక్షణ కొరకై తనను తాను బలివస్తువుగా సీలువపై సమర్పించుటను గురించి చూస్తున్నాము. రెండవ పఠనంలో  పిలిప్పీయులకు వ్రాసినటువంటి లేఖలో  క్రీస్తు ప్రభువు మానవుల రక్షనార్ధమై తనను తాను తగ్గింపు తనముతో ఆ సీలువపై మనస్పూర్తిగా అంగీకరించి, మనందరి కొరకై బలిగా సమర్పించుకున్నారు. అని పునీత పౌలుగారుఅంటున్నారు.  

మొదటి పఠనం 

సేవకుని యొక్క జీవితం : 

సేవకుడు అందరికి ఒ సేవకుని వలె జీవించాలి. అంటే తగ్గింపు తనముతో జీవించాలి. దీనిని  క్రీస్తు ప్రభువు జీవితంలో చూస్తున్నాము. తనను తాను తగ్గించుకొని , ఒక సేవకుని వలె తనను తాను సీలువపై బలిగా మానవులందరి కొరకు సమర్పించుకున్నాడు.  . అలాగే మనం జీవించాలి. 

సేవకుని జీవితంలో కష్టాలు, సుఖాలు 

: మనం ఎప్పుడైతే సేవకుని వలె జీవిస్తామో అప్పుడే మన యొక్క జీవితంలో కష్టాలు, సుఖాలు సంభవిస్తాయని యోషయా ప్రవక్త తన యొక్క జీవితం ద్వారా  తెలియజేస్తున్నాడు. 50:5-7. 

ఈ యొక్క సేవకుడుతగ్గింపు  జీవితం జీవించాలి : జీవితంలో ఎన్ని ఇబ్బందులు కష్టాలు, శ్రమలు వచ్చిన కూడా తగ్గింపు జీవితం జీవించాలని యోషయా ప్రవక్త , క్రీస్తు శిష్యులు  మరియు క్రైస్తవులందరు కూడా తమ యొక్క జీవితం ద్వారా చూపిస్తున్నారు. 

అలా జీవించాలంటే సేవకుడు ఏమి చేయాలి :

 ఈ యొక్క తగ్గింపు జీవితం జీవించాలంటే సేవకుడు అనేవాడు యజమాని యొక్క అడుగుజాడల్లో నడవాలి అంటే క్రైస్తవులమైన మనమందరం కూడా క్రీస్తు యొక్క అడుగుజాడలలో నడవాలి. ఏవిధంగానైతే యోషయా ప్రవక్త  మరియు క్రీస్తు ప్రభువు తండ్రి దేవుని మాటలను అనుసరించి జీవించారో అదే విధంగా మనమందరం కూడా జీవించాలి. 

సేవకునిగా జీవించడం ద్వార వచ్చే లాభాలు :

 క్రైస్తవులమైన  మనం సేవకునిగా జీవించడం ద్వారా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశం పొందుతాం. మరియు ఇతరులకు ఒక గొప్ప ఉదాహరణగా ఉంటాము. ఈ ఐదు అంశాలను  ఈనాటి మొదటి పఠనంలో యోషయా  యొక్క జీవితం ద్వారా చూస్తున్నాము. యోషయా మరియు క్రీస్తు ఏ విధంగా జీవించారో  తమ యొక్క జీవితాలను ఇతరుల కొరకు ధార పోసి అనేకమైనటువంటి బాధలను, ఇబ్బందులను అవమానములను పొంది మన యొక్క జీవితాలకు  ఒక గొప్ప మేలుగా మరియు  మార్గధర్శులుగా ఉన్నారు. అధేవిధంగా  మనమందరం వారి ఇద్దరి వలే  జీవించాలని మొదటి పఠనం మనకు తెలియచేస్తుంది. 

రెండవ పఠనం 

రెండవ పఠనములో పునీత పౌలు గారు క్రీస్తు మొక్క వినయము , ఆ యొక్క వినయము ద్వారా పొందినటువంటి అత్యున్నత స్థానము గురించి తెలియజేస్తున్నాడు. ఎందుకంటె క్రీస్తు ప్రభువు దేవుని యొక్క బిడ్డ అయినకాని  తనను తాను తగ్గించుకొని ఒక సేవకుని వలె మానవ రూపం దాల్చి ఈ యొక్క  లోకంలో ఉన్నటువంటి పాపాత్ములమైన  మనందరి కొరకు ఈ భూలోకంలోనికి వచ్చి యున్నారు. 

ఏ విధంగానైతే మొదటి పఠనములో యోషయా ప్రవక్త జీవితం గురించి చూసియున్నామో అదే విధంగా పౌలుగారు క్రీస్తు యొక్క జీవితం గురించి పిలిప్పు ప్రజలకి తెలియజేస్తున్నాడు. ఈ యొక్క యోషయా ప్రవక్త మరియు పౌలుగారు ఇద్దరు కూడా దేవుని చేత ఎన్నుకోబడినవారు . అంతే కాకుండా దేవుని యొక్క మాటలను తు. చ తప్పకుండా వారి యొక్క జీవితంలో జీవించి యున్నారు. 

వీరు ఇద్దరు కూడా ఈ రెండు పఠనాలలో క్రీస్తు యొక్క జీవితం గురించి ప్రస్తావించడం మనకందరికీ కూడా ఆశ్చర్యం. ఎందుకంటే యోషయా 50:6 వ వచనంలో చూస్తున్నాము. నన్ను మోదువారికి నా వీపును అప్పగించితిని, నా మొగము మీద ఉమ్మి వేసినప్పుడు నేనూరకుంటిని, నన్ను అవమానించుచుండగా నేనురకుంటిని, ఇది అంతా కూడా క్రీస్తు యొక్క జీవితంలో అక్షరాల  నెరవేరింది. ఎందుకంటే పిలిప్పీ 2:8 వ వచనంలో చూస్తున్నాము, క్రీస్తు  మరణము వరకు , సిలువ మరణము వరకు విధేయుడయి జీవించేను. 

అందుకే పునీత పౌలుగారు అంటున్నారు. క్రీస్తు ఏ విధంగానైతే  వినయవంతుడై  జీవించాడో ఆ యొక్క జీవితం ద్వారా అత్యున్నత స్థానాన్ని  పొందియున్నాడు. అదేవిధంగా  క్రైస్తవులమైన మనం  క్రీస్తు యొక్క అడుగుజాడలలో నడుస్తూ, క్రీస్తు యొక్క వినయము మనకందరికీ రావాలని , ఒక తగ్గింపు జీవితం జీవించాలని  ఈనాటి రెండవ పఠనం తెలియజేస్తుంది. 

సువిశేష పఠనం 

సువిశేష పఠనంలో లూకా సువార్తికుడు  క్రీస్తు ఏ విధంగా శ్రమలను అనుభవించాడు, ఆ యొక్క శ్రమల ద్వారా మానవులకు  ఏ విధంగా  రక్షణ కలిగిందో తెలియజేస్తున్నాడు.  ఈ యొక్క లూకా సువార్తికుడు తన యొక్క సువార్తను అన్యుల కోసం రాశారు. ఎందుకంటే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చింది కేవలం యూదుల కోసం మాత్రమేకాదు,  సర్వమానవాళి కోసం వచ్చారు అని లూకా గారు వివరించారు. తండ్రి అయిన దేవుని దయ , ప్రేమ , పాప మన్నింపు అన్నవి పవిత్ర   గ్రంధంలో ప్రధానాంశాలు. అటువంటి దేవుని సిలువ వేయటం మనం చూస్తున్నాం. 

యేసు యొక్క సొంత ప్రజలే ఆయన్ను తృణీకరించి ఆయనను మట్టుపెట్టాలనుకున్నారు, అంటే క్రీస్తు యొక్క రూపంలో వచ్చినటువంటి రక్షణను త్యజించారు. మరియు తృణీకరించారు. యేసుని సిలువ వేయుడు అని ఒక్కటిగా డిమాండు చేశారు పిలాతుని.  వారి బెదిరింపులుకు బయపడినటువంటి పిలాతు క్రీస్తుకు సిలువ మరణంను  ఆమోదించాడు. 

ప్రభువైన క్రీస్తు మానవుని యొక్క రక్షనార్ధం కొరకై ఆ యొక్క సిలువ మరణంను అంగీకరించాడు. మరియు మానవుల యొక్క పాప పరిహారమునకై ఆ యొక్క సీలువను మనస్పూర్తిగా అంగీకరించాడు. ఏ విధంగానైతే  క్రీస్తు మన యొక్క జీవితాలకు రక్షణ కల్పించాడో  అదే విధంగా  మనమందరము కూడా ఇతరులకు మన యొక్క ప్రార్దన జీవితం  ద్వారా రక్షణ కల్పించాలని ఈనాటి సువిశేష పఠనం  ,మరియు  రెండు పఠనాలు  కూడా మనలను ఆహ్వానిస్తున్నాయి. 

Br. Johannes OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...