13, ఆగస్టు 2022, శనివారం

20వ సామాన్య ఆదివారము (2)

  20 సామాన్య ఆదివారము 

  యిర్మీయా  38 : 4 - 6 , 8 -10
 హెబ్రీ 12 :1 -4
లూకా 12 : 49 -53

క్రీస్తు నాధుని యందు ప్రియ స్నేహితులారా,

ఈనాడు మనమందరము కూడా సామాన్యకాలపు 20 ఆదివారములోనికి ప్రవేశించియున్నాము.ఈనాటి పఠనాల ద్వారా తల్లి తిరుసభ మనందరినీ కూడా క్రీస్తు ప్రభువు వలెయిర్మీయా ప్రవక్తవలె దేవాదిదేవునికి సాక్ష్యులుగా ఉండమని ఆహ్వానిస్తుందిఅవమానాలు వచ్చినప్పుడు, ద్వేషించబడినప్పుడు, తిరస్కరింపబడినప్పుడుహింసించినప్పుడువిశ్వసాన్ని కోల్పోవద్దు , నిరాశ చెందవలదు అని ఆహ్వానిస్తుంది విధంగా అంటే

మొదటిపఠనములో చూస్తున్నాముదేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా యూదా రాజైనటువంటి సిద్కియాకు మరియు యూదా ప్రజలకు  విధంగా దైవ సందేశాన్ని చెబుతున్నారు."ఇప్పటివరకు మీరు నా ఆజ్ఞలను పాటించలేదుమీ ఇష్టానుసారము జీవించారుదేవాది దేవుడు మీకు వ్యతిరేకముగా ఉన్నారుమీరు అవిధేయులైనందువలన  ఆయన మిమ్ములను నాశనము చేయుటకు సిద్ధముగా ఉన్నారుఎందుకు దేవుడు  మాటలు పలుకుతున్నారు దీని యొక్క సందర్భం మనము యిర్మీయా 38:1-3 ముందు వచనాలను పరిశీలించినట్లయితే  దేవుని రాజ్యాన్ని దేవుడు సృష్టించిన సృష్టినంతటికిని అధిపతిని నేనేనేనే సర్వశక్తిమంతుడను భూమిని అంతటినికూడా తాను ఇష్టము వచ్చిన వారికి ఇస్తాను అని అంటున్నారు. యిర్మీయా 27:1-10 వచనాలలో 35:18  వచనంలో చుస్తే రేబాకీయుల వశం చేస్తాను అని అంటున్నారుఎందుకు  విధంగా అంటున్నాడంటేఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయత చూపుట వలన వారి ఇష్టానుసారముగా జీవించడం వలన దేవునికి కోపం కలిగిస్తున్నారు.

 మొదటి పఠనాన్ని మనము పరిశీలించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు గర్వంమరియు అవిధేయతలను మనం గమనించవచ్చుయిర్మీయా ప్రవక్త దేవుని ప్రణాళిక ప్రకారం సిద్కియా రాజు చెంతకు వెళ్లి ఇప్పుడు శ్రాయేలు ప్రజలకు పెద్ద సంశయ వచ్చినదిబాబిలోనియా రాజు  రాజ్యాన్ని నాశనం చేయుటకు సిద్ధముగా ఉన్నారుమీరు మాత్రం దేవునికి వ్యతిరేకముగా జీవించడం వలన ఆయన మీద కోపంతో ఉన్నారుఅంతేకాక మీ పక్షాన యుద్ధం చేయుటలేదు . మిమ్మల్ని చుస్తే  మీరు   ఐగుప్తీయులు  మీకు సహాయంగా వస్తారని నమ్మి మోసపోతిరివారు దేవాతి దేవుడు పూర్వ కాలములో ఐగుప్తులో చేసిన ఆశ్చర్య క్రియలుఅద్భుతాలు గుర్తుకుతెచ్చుకొనిదేవుడికి భయపడి పారిపోయారుమీకు సహాయంగా ఎవరు రారుమీరు కచ్చితంగా నాశనమవుతారు.

కావున మీరు మీ ప్రాణాలుప్రజల ప్రాణాలువారి క్షేమం  దక్కాలంటే  మీరు దేవుని మాట  విని అవమానమైన కూడా కొంతకాలంమీ ప్రాణాలు నిలబెట్టుటకు బాబిలోనియా రాజుకు లొంగిపోండు అని దేవుని మాటగా యిర్మీయా ప్రవక్త సిద్కియా రాజుకు తెలియ చేసాడుకానీ సిద్కియా రాజు కపట ప్రవక్తల అంటే బాలు ప్రవక్తల మాటలు విని గర్వానికి పోయి ఎవరు ఏమి చేయలేరనే ధీమాతో యిర్మీయా ప్రవక్తను హింసించి బావిలో పాడత్రొసారుచివరికి అమీ జరిగిందో మనందరికీ తెలుసుబాబిలోనియా రాజు ఇశ్రాయేలుపై దండెత్తి వచ్చి  అందరిని నాశనం చేసి యెరూషలేము ధ్వంసం చేసి వెళతారుకాబట్టి మనం గమనించవలసినది ఏమిటంటే మనము దేవునికి వ్యతిరేకంగా గర్వానికి వెళితే మన జీవితంలో కూడా ఇలాంటి వినాశనానికి ఎదురవుతాము.  

             సువిశేష పఠనాన్ని ధ్యానించినట్లైతే ఇక్కడ కూడా మొదటి పఠనం నేపథ్యంలనే ఉందిమొదటి పఠనంలో ఇశ్రాయేలు ప్రజలుఅవిధేయతకు దేవుని నిరాకరణకు దేవుని సేవకుని నిరాకరణ వలన తండ్రి దేవుని కోపానికి  బాధకు గురి అవటం మనం చూస్తున్నంఅలాగే ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభువు ఎదో కోపంతోఎదో బాధలో ఉండటం మనం గమనించవచ్చుఒకసారి మనము ఈనాటి పఠనాని ముందు వచనాలను గమనించినట్లయితే సిద్ధముగా లేదా నమ్మిన బంటు వంటి శిష్యునికి పడే శిక్ష గురించి తెలియ చేస్తున్నటువంటి సందర్భంలోనిది.  ఎందుకంటే   యూదా ప్రజలు క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని నమ్మడంలేదుఅయన దేవాది దేవుని కుమారుడని నమ్మడంలేదుహేళన చేస్తున్నారుతిరస్కరిస్తున్నారుతన ప్రజలే క్రీస్తుని తిరస్కరించడం క్రీస్తుకు ఏంటో బాధను కలుగ చేస్తుందిఅయినా కూడా తాను అవమానాలను పొందిననుహింసించబడిననుప్రజల కోసం తండ్రి దేవుని మాట మేరకు గర్వం చూపక విధేయతతో శ్రమలు పొందిసిలువలో మరణించారుతిరిగి జీవంతో దేవాది దేవుని కుడి ప్రక్కన కూర్చొనియున్నారు.

       మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలిక్రీస్తుప్రభుని మన జీవితాలలో విశ్వసిస్తున్నామా లేక నిరాకరిస్తున్నామా అని ఆలోచన చేయాలి.     

రెండొవ పఠనాన్ని ధ్యానించినట్లయితే   గ్రంథ రచయిత కూడా హెబ్రియా ప్రజలకు క్రీస్తు ప్రభువు చేసిన గొప్ప త్యాగాన్ని మరియు క్రీస్తు ప్రభువు పేరిట ధైర్యాన్ని ఓర్పును ఒసగుతున్నాడుమనం రెండొవ పఠనంలో మొదటి రెండు వచనాలలో చుసిన విధంగా క్రీస్తు ప్రభువే మన విశ్వాసమునకు కారకుడుపరిపూర్ణతను ఒసగువాడుమనము మన జీవితాలలో వచ్చెడి  అవమానాలనుశ్రమలనుచింతలను లక్షపెట్టక  ఇవన్నీ తొలగించే క్రీస్తునందు ద్రుష్టి పెట్టుము అని రచయిత హెబ్రియా ప్రజలకు ధైర్యాన్ని మరియు ఊరటను ఒసగుతున్నాడువిశ్వాసముతో ఓపికతో జీవించమని గుండె ధైర్యము ఇస్తున్నారు.

మన వ్యక్తిగత జీవితాలతో కుటుంబ జీవితాలలో మరియు సమాజ జీవితంలో ఎప్పుడైనా మనము  మంచి చేసేటప్పుడు  లేదా  సత్యాన్ని మాట్లాడినప్పుడు ఇలాంటి అవమానాలుతిరస్కరణలు వస్తుంటాయిఇలాంటి సందర్భాలలోనే మనము గర్వముఅవిశ్వముతో సిద్కియా రాజు  మరియు ఇశ్రాయేలు ప్రజల వలె కాక  ప్రజల క్షేమం కోసం మరియు కుటుంబాల క్షేమం కోసం వినయము,విధేయత మరియు దేవునియందు  విశ్వాసము నమ్మిక కలిగినటువంటి యేసు క్రీస్తువలె యిర్మీయా ప్రవక్తవాలె మనల్ని కూడా జీవించమని దేవుని దీవెనలు పొందమని తల్లి తిరుసభ ఈనాటి మూడు పఠనాల ద్వారా ఆహ్వానిస్తుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...