22, ఫిబ్రవరి 2025, శనివారం

సామాన్యకాలపు ఏడవ ఆదివారము


1 సమూయేలు 26:2, 7-8, 12-13, 22-23; 
1 కొరింథీయులు 15:45-49
లూకా 6:27-38
క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ విశ్వసిని విశ్వాసులరా మరియు దేవుని బిడ్డలరా, ఈ దినమున మనమందరము సామాన్య కాలపు ఏడవ ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము, ఈ నాటి మూడు పఠనములలో మనం చుసినట్లయితే, ఈ మూడు కూడా మనకు ముఖ్యమైన మూడు అంశముల గురించి తెలియజేస్తున్నాయి. అవి ఏమిటంటే మానవుని  వినయం, క్షమాపణ మరియు ఆధ్యాత్మిక పరివర్తన యొక్క ముఖ్యమైన గుణల గురించి నేర్పిస్తున్నాయి.
ముందుగా మొదటి పఠనము చూసినట్లయితే 
1 సమూయేలు 26:2, 7-8, 12-13, 22-23
ఈ వచనలలో  దావీదు రోజు యొక్క వినయమును మనం గమనించ వచ్చు ఎందుకంటే దావీదు ఏవిధంగానైతే దేవుని పట్ల తన వినయమును కనబర్చాడో అదే విధమైనటువంటి వినయం ఈ రోజు దావీదు సౌలు పట్ల చూపిస్తున్నాడు. వినయం అనేది ఒక గొప్ప ముఖ్యమైనుటువంటి లక్షణం. ఇది మనల్ని ఇతరులతో కలిసిమెలిసి ఉండడానికి, వారిని గౌరవించడానికి దోహదపడుతుంది లేదా సహాయపడుతుంది. వినయం గల వ్యక్తి ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు మరియు ఇతరుల నుండి మంచిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇటువంటి వినయమును మనం దావీదులో చూస్తున్నాము. ఎందుకంటే దావీదును సౌలు రాజు వెంబడించే హతమార్చాలి అనుకున్న సమయంలో దావీదు అతనిని ఎదుర్కొంటాడు. దావీదుకు సౌలును చంపడానికి అవకాశం వచ్చినప్పటికి లేదా ఉన్నప్పటికీ, దావీదు సౌలు రాజును విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడ మనం గమనించలసింది దావీదు దేవుని అభిషిక్తుని పట్ల అతని వినయాన్ని మరియు భక్తిని చూపిస్తుంది. కొన్ని సార్లు మన స్వంత  నిర్ణయాలను తీసుకోవడానికి బదులుగా, దేవుని యొక్క న్యాయాన్ని విశ్వసించడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఇక్కడ చూపిస్తుంది. ఇది దేవుడు మానవునికి ఇచ్చినటువంటి అధికారాన్ని గౌరవించాలని మరియు మనకు కీడు చేసిన వారి పట్ల కూడా వినయం మరియు దయ చూపాలని మనకు నేర్పిస్తుంది. చివరిగా సౌలు రాజు దావీదును అసూయతో వెంబడించాడు. ఒక సందర్భంలో దావీదు సౌలును చంపడానికి అవకాశం వచ్చింది, కానీ దావీదు అలా చేయలేదు. ఎందుకంటే సౌలు దేవునిచే ఎన్నుకోబడిన రాజు అని దావీదుకు తెలుసు. దావీదు దేవుని పట్ల వినయం కలిగి ఉన్నాడు మరియు దేవుని నిర్ణయాలను గౌరవించాడు. మనము దావీదును ఒక ఉదాహరణగా తీసుకుంటూ మన జీవితాలను దేవునికి అనుకుగుణంగా మార్చుకుంటూ వినయంతో జీవించాలని మొదటి పఠనము మనకు నేర్పిస్తుంది.
సువిశేష గ్రంథ పఠనమును మనం ద్యానించినట్లయితే 
లూకా 6:27-38 చుసినట్లయితే యేసు ప్రేమ మరియు క్షమాపణ గురించి తన  బోధనలనలో బోదిస్తున్నాడు. ఏవిధంగానంటే మన శత్రువులను ప్రేమించమని, మనలను ద్వేషించే వారికి మంచి చేయమని మరియు మనలను శపించే వారిని దీవించమని ఆయన మనలను పిలుస్తాడు. యేసు మన శత్రువులను ప్రేమించమని మనకు తెలియజేస్తున్నాడు. సాధారణంగా మానవుని జీవితంలో క్షమించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం, ఎందుకంటే సహజంగా మనకు హాని చేసిన వారిని ప్రేమించడం అంటే మనకు అసలు నచ్చనటువంటి పని మరియు భయంకరమైనటువంటి కష్టం. కానీ ఈనాడు యేసు మనలను అలా చేయమని పిలుస్తున్నాడు, ఎందుకంటే ఆయన మనలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి.
మన శత్రువులను ప్రేమించడం అంటే వారిని క్షమించడం మరియు వారికి మంచి చేయడం. వారిని ద్వేషించకుండా, వారి పట్ల దయ చూపించాలి. ఇది చాలా కష్టమైన పని, ఒక్క సారి పేతురు గారు యేసు ప్రభుని ఇలా అడిగినపుడు నా సహోదరుడు నాయడల తప్పు చేసినప్పుడు ఎన్ని పర్యాయములు అతని క్షమించవలయునని  అడిగినప్పుడు యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం మనము చూసియున్నాము. దీనికి యేసు ప్రభువు మనకు ఒక గొప్ప ఉదాహరణగా చూపించాడు. ఆయన మన కొరకు సిలువపై మరణింంచాడు లేదా చనిపోయాడు, మనము ఆయనకు మన పాపల ద్వారా శత్రువులుగా ఉన్నప్పుడు కూడా. ఆయన మనలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టే అలా చేయగలిగాడు. ఈ సమయము నుండి మనము కూడా మన శత్రువులను ప్రేమించాలని యేసు కోరుకుంటున్నాడు. సాధారణముగా ఇది మనకు కష్టంగా అనిపించవచ్చు, కానీ దేవునీ సహాయం మనతో ఉంటే , మనము కచ్చితంగా ఈ క్షమాపణ అనేది నెరవేర్చగలము. ఎందుకంటే 
మన శత్రువులను ప్రేమించడం వలన మనము దేవుని ప్రేమను ఇతరులకు చూపించగలము. ఇది మన జీవితంలో సంతోషాన్ని మరియు సమాధానాన్ని కూడా కలిగిస్తుంది.
కాబట్టి, మన శత్రువులను ప్రేమించడానికి మనమందరము గట్టిగా ప్రయత్నించుదాం. ఇది కష్టమైన పని, కానీ చాలా విలువైనది. ఎందుకంటే దేవుడు మనలను క్షమించినట్లే మనం ఇతరులను క్షమించాలి.
రెండవ పఠనము 1 కొరింథీయులు 15:45-49 వచనలలో మనము చూస్తున్నాము. ఇక్కడ మన శరీరాల పరివర్తన గురించి మాట్లాడుతుంది. ఇది మన లౌకిక, నాశనకరమైనటువంటి శరీరాన్ని పునరుత్థానంలో మనం పొందే మహిమకరమైన శరీరంతో విరుద్ధంగా ఉంటుంది అని తెలియజేస్తుంది. అది ఏవిధంగానంటే మనము ఇప్పుడు చూద్దాము. మొదటి మనిషి అయినటువంటి ఆదాము జీవముగల ప్రాణిగా చేయబడ్డాడు మరియు తన శరీరమంత మట్టితో చేయబడింది మరియు అది ఆశాశ్వతమైనది. కానీ చివరి  ఆదాము అంటే క్రీస్తు ఆయన ఆత్మను ఇచ్చేవాడు. ఆయన శరీరము మహిమకరమైనది మరియు నాశనమయేటువంటిది కాదు. ఒక మానవునిగా మన ప్రస్తుత శరీరాలు ఆదాము నుండి వచ్చినవి. అవి అశాశ్వతమైనవి మరియు పాపానికి లోబడి ఉండేటువంటివి. కానీ పరలోక సంబంధమైనటువంటి శరీరము మనము క్రీస్తును విశ్వసించినప్పుడు, మనము పరలోక సంబంధమైన శరీరాన్ని పొందుతాము. ఇది మహిమకరమైనది మరియు శాశ్వతమైనది. ఈనాడు మనం మన ప్రస్తుత శరీరం గురించి మనం ఏవిధంగా ఆలోచిస్తున్నాము అని మనలను మనం ఒక్క సారి ద్యానిచుకుంటూ ప్రశ్నించుకుందాము.
కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా ఈనాడు మనమందరము దేవుని పట్ల మరియు మానవుని పట్ల వినయం చూపిస్తూ, క్షమాగుణం కలిగి ఇతరులకు పంచుతూ, క్రీస్తులో భాగమై జీవిస్తూ ఆయనతో ఒకటై ఉండాలని ఈ దివ్యబలిలో ప్రార్థిస్తూ పాల్గొందాము.

 ‌Fr. Johannes OCD

19, ఫిబ్రవరి 2025, బుధవారం

మార్కు 9:41-50

 February 27

సిరా 5:1-8

మార్కు 9:41-50

మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవ్వడు మీకు నా పేరిట చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగచెప్పుచున్నాను" అనెను. "నన్ను విశ్వసించు ఈ చిన్న వారిలో ఏ ఒక్కడైన పాపి అగుటకు కారకుడగుటకంటె, అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక్క చేతితో నిత్యజీవము పొందుట మేలు. నీ కాలు నీకు పాపకారణమైనచో, దానిని నరికి పారవేయుము. రెండుకాళ్ళతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కనులు నీకుపాప కారణమైనచో దానిని పెరికి పారవేయుము. రెండుకన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రతి ఒక్కనికి ఉప్పదనము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కాని అది తన ఉప్పదనమును కోల్పోయిన, తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతము చేయగలరు? కావున, మీరు ఉప్పదనమును కలిగి ఒకరితో ఒకరు  సమాధానముతో ఉండుడు" అనెను.  

క్రీస్తు సంబంధీకులు : ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు మిమ్ములను క్రీస్తు సంబంధీకులుగా గుర్తించి మీకు ఎవరు చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును పొందును అని అంటున్నారు. ఎవరు ఈ  క్రీస్తు సంబంధికులు అంటే సువిశేష భాగంలో యేసు ప్రభువుని అనుచరులు అని లేక శిష్యులు అని తెలుస్తుంది. ఇది కేవలం అప్పటి శిష్యులు లేక అనుచరులేనా  అంటే కాదు ఎందుకంటే యేసు ప్రభువుకు చెందిన వారు ఎవరో మనము ఈ అధ్యాయములోనే చూస్తాము. అంతకు ముందు ప్రభువు పేరిట ఒకడు దయ్యములను వదలకొడుతున్నప్పుడు శిష్యులు వాడిని వారించిన పిదప ఆయనకు ఆ విషయం చెప్పగా ప్రభువు అతనిని తనకి చెందిన వానిగానే చెబుతున్నాడు. తరువాత కూడా మీరు వెళ్లి లోకమున ఉన్న వారిని నా అనుచరులుగా చేయమని ప్రభువు చెబుతున్నాడు. ఎవరు అయితె ప్రభువు మాట ప్రకారం జీవిస్తారో వారు క్రీస్తు అనుచరులు, వారే క్రీస్తు సంబంధీకులు. అందుకే ప్రభువు నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడె నా సోదరుడు సోదరి, తల్లి అని ప్రకటించారు. ఈరోజు మనం ఆయన సంబంధీకులము కావాలంటే ఆయన మాటలను అనుసరించాలి. ఈ విధంగా జీవించిన క్రీస్తు సంబంధీకులను గౌరవించిన వారికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. ఎందుకంటే వారి ద్వారా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. ఇది వారి మాటల ద్వారా వారి ప్రేమ పూర్వక జీవితం ద్వారా జరుగుతుంది. 

పాపము చేసిన వారు నరకానికి వెళుతారు, నరకములో ఒక వ్యక్తి  చాలా ఘోరమైన బాధలకు గురవుతాడు.  అది నిత్యము బాధలతో ఉండే స్థితి.  నరకము అనేది దేవున్ని  తిరస్కరించి, ఆయనకు వ్యతిరేకమైన పనులు చేస్తు  పశ్చాత్తాప పడకుండా పాపములోనే  మరణించేవారు పొందే స్థితి.  నరకంలోఎల్లప్పుడు బాధ అనే స్థితి మాత్రమే ఉంటుంది. ఊరట కోసం ఎంత ప్రయత్నించిన అది అది వారికి అందదు. అందుకే ప్రభువు ఈ స్థితి మనకు రాకూడదు అని కోరుకుంటున్నారు. అందుకే మనిషిని నరకానికి పాత్రులుగా చేసే ఎటువంటి దానిని కూడా మన దగ్గర ఉండకూడదు అని కోరుకుంటున్నారు. 

ప్రభువు మనలను ఇతరులు పాపము చేయుటకు కారణం కాకూడదు అని చెబుతున్నారు. అటుల అగుటకంటె మనము మరణించుటయే మంచిది అని పలుకుతున్నారు. మనము పాపము చేయుటకంటే  మనము పాపము చేయుటకు మనలో  ఏదైన కారణమైతే  దానిని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండమని ప్రభువు చెబుతున్నాడు. ప్రభువు ఎందుకు ఇలా చెబుతున్నాడు?  ఎందుకంటే నిత్యం జీవం అనేది అత్యంత విలువైనది, ఏమి ఇచ్చిన కాని దానిని కొనలేము.  మంచి జీవితం జీవించే వారికి దేవుడు ఇచ్చే బహుమతి ఇది.  ఏ వ్యక్తి కూడా తన సొంత ప్రతిభ వలన సాధించదగినది కాదు. పాపము చేసిన వారు కూడా పశ్చాత్తాప పడి ప్రభువు ముందు క్షమాపణ అడిగితే వారికి కూడా ప్రభువు నిత్యజీవాన్ని అనుగ్రహిస్తాడు. అది ప్రభువును ముఖాముఖిగా దర్శించు భాగ్యం. ఎల్లప్పుడూ ఆనందముగా ఉండేటువంటి స్థితి.    అందుకే మనలో పాపకారణమైన భాగం ఉంటె దానిని  కోల్పోవడానికి అయిన సిద్దపడి నిత్యజీవం పొందుటకు సాధన చేయమని ప్రభువు చెబుతున్నాడు. 

ప్రార్ధన: ప్రభువా! మీ అనుచరులు ఎల్లప్పుడు మీమ్ములను ఆదర్శంగా తీసుకోవాలని, మీ వలె జీవించాలని కోరుకుంటున్నారు. మీ అనుచరులను గౌరవించిన వారికి తగిన ప్రతిఫలమును పొందుతారు అని చెబుతున్నారు.  మీ అనుచరులుగా మీకు సంబంధికులుగా ఉండుటవలన  మిమ్ము ఇతరులకు మా జీవితాల ద్వారా   చూపించు,వినిపించు అనుగ్రహం ప్రసాదిస్తున్నారు. దీనిని సద్వినియోగ పరచుకొని    చెడుమార్గంలో ప్రయాణించకుండ, మీ మార్గములో ప్రయాణిస్తూ, మాలో ఏదైనా పాపకారణమైనది ఉన్నచో దానిని తీసివేసి, మీ వలె జీవిస్తూ, నిత్యజీవానికి వారసులము అయ్యేలా అనుగ్రహించండి. ఆమెన్. 


16, ఫిబ్రవరి 2025, ఆదివారం

మార్కు 9:38-40

 February 26

సిరా 4:11-19

మార్కు 9:38-40

అంతట యోహాను యేసుతో "బోధకుడా! మనలను అనుసరింపని ఒకడు నీపేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి" అని పలికెను. అందుకు యేసు "మీరు అతనిని నిషేధింపవలదు, ఏలయన, నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధికానివాడు మన పక్షమున ఉండువాడు. 

యోహాను  యేసుతో, “బోధకుడా, దయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తిని మేము చూశాము. అతను మనల్ని అనుసరించడు కాబట్టి మేము అతన్ని ఆపడానికి ప్రయత్నించాము” అని చెప్పడంతో ప్రారంభమవుతుంది ఈనాటి సువిశేషం. ఆ  వ్యక్తి దయ్యాలను వెళ్ళగొట్టే సామర్థ్యం పట్ల శిష్యులు  అసూయపడుతున్నారా? వారు ఈ రకమైన శక్తిని కలిగి ఉండాలనుకుంటున్నారా?  అనే ప్రశ్నలను అడిగితే ఆ వ్యక్తి వలే వీరుకూడా చేయాలి అని అనుకోని ఉండవచ్చు. యేసు యోహానుతో, “అతన్ని నిరోధించవద్దు. ఎవరైనా నా నామంలో మంచి పని చేస్తే, నా గురించి వారు ఎలా  చెడుగా మాట్లాడరు” అని అంటాడు. తరువాత యేసు ఇలా అంటాడు: “మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్నాడు.”

ఈ రోజు యేసు ప్రభువు  మనకు ఒక ముఖ్యమైన సూచన ఇస్తున్నాడు. మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్నాడని ఆయన మనకు చెబుతున్నాడు. సాధారణంగా చాలా మంది మానవులకు ఏ వ్యక్తులు తమను ఆదరిస్తారో తెలుసు. అయితే, ఏ వ్యక్తులు మనతో పోరాడవచ్చు, మనల్ని ఇష్టపడకపోవచ్చు లేదా మనల్ని విస్మరించవచ్చు అని కూడా మనకు తెలుసు.  కాని ఈ రోజులలో మనతో మంచిగా మాటలాడి మనము లేని సమయంలో వ్యతిరేకంగా మాటలాడువారే ఎక్కువ మంది ఉండవచ్చు. 

యేసు ప్రభువును అనుసరించకుండా,  ఆయన నామమున ఒక వ్యక్తి దయ్యములను వెడలగొడుతున్నాడు అంటే ఆ వ్యక్తి యేసు ప్రభువును దేవునిగా , రక్షకునిగా అంగీకరించాడు. మరియు యేసు ప్రభువు మాటలను పాటించి జీవిస్తూ ఉండవచ్చు. ఎదో ఒక సమయంలో ప్రభువు మాటలను విని, ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. ప్రభువు చెప్పినట్లు ఆ వ్యక్తి ప్రార్థన, మరియు ఉపవాసములతో జీవించేవాడు అయివుండవచ్చు ఎందుకంటే ప్రభువే చెబుతున్నాడు ఇటువంటివి కేవలం ప్రార్ధన మరియు ఉపవాసంతోనే సాధ్యమని కనుక ఆ వ్యక్తి ప్రభువుతో ఉండకపోయినా  ప్రభువుని అనుచరుడే. 

 మానవులుగా, మనలో చాలామంది ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో దాని గురించి ఎక్కువగా శ్రద్ధ వహించవచ్చు. అయితే, యేసు తన శిష్యులు నిజంగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాడు. వారు ఇతరుల పట్ల అసూయపడటం లేదా మరొకరి సామర్థ్యాలు మరియు బహుమతులను కోరుకోవడం ఆయనకు ఇష్టం లేదు. తన శిష్యులు తమ సొంత బహుమతులను మరియు ఇతరుల బహుమతులను కూడా అభినందించాలని యేసు స్పష్టంగా కోరుకుంటున్నాడు.

Br. Pavan OCD

మార్కు 9:30-37

 February 25

సిరా 2:1-11

మార్కు 9:30-37

వారు ఆ స్థలమును వీడి గలిలీయ ప్రాంతమునకు వెళ్లిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికిని తెలియకూడదని ఆయన కోరిక. ఏలయన, "మనుష్యకుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును. వారు ఆయనను చంపుదురు కాని మరణించిన మూడవదినమున ఆయన పునరుత్తానుడగును" అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి. అయినను ఆయనను అడుగుటకు భయపడిరి. అంతట వారు కఫర్నామునాకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను "మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి?" అని అడిగెను. తమలో గొప్పవాడెవ్వడని మార్గమధ్యమున వాదించు కొనియుండుటచే వారు ప్రత్యుత్తరమీయలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి పన్నిద్దరు శిష్యులను చేరబిలిచి, "ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై, అందరకు సేవకుడుగా ఉండవలయును"అని పలికెను. మరియు ఆయన ఒక చిన్నబిడ్డను చేరదీసి వారి మధ్యనుంచి, వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో, "ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించినవాడగును. నన్ను  స్వీకరించినవాడు నన్నుకాదు , నన్ను పంపినవానిని స్వీకరించుచున్నాడు" అనెను. 

యేసు ప్రభువు , పన్నెండు మందిని పిలిచి, మీలో ఎవరైనా మొదటివారిగా  ఉండాలనుకుంటే, అతను చివరివాడిగా మరియు అందరికీ సేవకుడిగా ఉండాలని చెబుతున్నాడు.  అంతకు ముందు  యేసు ప్రభువు   తనకి  అత్యంత  సన్నిహిత శిష్యులను, తీసుకొని ఒక రహస్య ప్రదేశానికి ప్రార్ధించుటకు వెళ్ళాడు, తరువాత  వారు కఫర్నముకు వచ్చారు, యేసు ప్రభువు  వారిని దారిలో దేని గురించి వాదిస్తున్నారని అడిగాడు. ఎవరు గొప్పవారో వారు వాదించుకుంటున్నారని వారు అంగీకరించడానికి ఇష్టపడలేదు.  అది ప్రభువుకు వారు చెప్పలేక పోయారు. 

 మొదటివారిగా  ఉండాలనుకునే ఎవరైనా చివరివారై ఉండాలి, అందరికీ సేవకుడుగా  కావాలని ప్రభువు  చెప్పాడు. కేవలం అది చెప్పడంతో ఆగిపోకుండా  ఒక చిన్న బిడ్డను తీసుకొని , వారి మధ్య ఉంచి తన పేరు మీద ఒక బిడ్డను స్వాగతించేవాడు తనను స్వాగతిస్తాడని చెబుతున్నాడు. చిన్నవాడిని లేక ఇతరుల మీద ఆధారపడేవారిని ఆహ్వానించడం మనలను దైవ స్వభావం కలిగేలా చేస్తుంది. ప్రపంచం తరచుగా నాయకత్వాన్ని, అధికారంతో, శక్తితో సమానం చేస్తుంది. 

దేవుని రాజ్యంలో, అధికార సమీకరణం తారుమారు అవుతుంది. మనం సేవ చేయడం ద్వారా నాయకత్వం వహిస్తాము, దిగువకు మారడం ద్వారా ఉన్నతంగా వెళ్తాము, అత్యల్పంగా ఉండటం ద్వారా అధికారాన్ని ఉపయోగిస్తాము. స్వార్థపూరిత నాయకత్వానికి అలవాటుపడిన ప్రపంచంలో ఇది అర్ధవంతం కాదు. దేవుడిని ప్రేమించడం మరియు ఒకరినొకరు ప్రేమించుకోవడం అనే రెండు గొప్ప ఆజ్ఞలు ఉన్న సమాజ మాత్రమే లో, లోక  నియమాలను తిప్పికొట్టకలుగుతుంది. .

మనం ఇతరులకు సేవ చేసినప్పుడు నాయకత్వం వస్తుంది. ప్రజలకు సహాయం చేయడంలో ప్రభావం వస్తుంది.  అది మనం కోరుకునేది కాదు, ఎందుకంటే మనం కోరుకునేది సేవ చేయడమే. సేవ చేయడంలో అవకాశం నాయకత్వం వహించడానికి రావచ్చు.

Br. Pavan OCD

మార్కు 9:14-29

 February 24

సిరా 1:1-10

మార్కు 9:14-29

వారు తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జనసమూహము కూడియుండుట చూచిరి. ధర్మ శాస్త్ర బోధకులు క్కో శిష్యులతో తర్కించుచుండిరి. యేసును చూడగనే ప్రజలు ముగ్గుల ఆశ్చర్యపడి, పరుగునవచ్చి ఆయనకు నమస్కరించిరి. "వారితో ఏ విషయమునుగూర్చి తర్కించుచున్నారు?" అని యేసు శిష్యులను ప్రశ్నించెను. జనసమూహములో ఒకడు "బోధకుడా!మూగ దయ్యము పట్టిన నా కుమారుని తమయొద్దకు తీసుకొనివచ్చితిని. భూతము వీనిని ఆవేశించినపుడెల్ల నేలపై  పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నురుగులు క్రక్కుచు పండ్లు కోరుకుచు, కొయ్యబారిపోవును.  ఈ దయ్యమును పారద్రోలమీ శిష్యులను కోరితిని. అది వారికి సాధ్యపడలేదు" అని విన్నవించెను. యేసు వారితో "మీరు ఎంత అవిశ్వాసులు! నేను ఎంత కాలము మీ మధ్యనుందును? ఎంతవరకు  మిమ్ము సహింతును? ఆ బాలుని ఇటకు తీసుకొని రండు" అనగా, వారు అట్లే వానిని తీసికొని వచ్చిరి. యేసును చూచినవెంటనే ఆ దయ్యము వానిని విలవిలలాడించి నేలపై పడవేసి, అటుఇటు దొర్లించి, నురుగులు క్రక్కించెను. "ఈ  దుర్బరావస్థ ఎంత కాలము నుండి?" అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగెను. "పసితననము నుండి" అని అతడు బదులు   చెప్పి, "అనేక పర్యాయములు ఆ భూతము వీనిని నాశనము చేయవలెనని నీళ్లలోను, నిప్పులలోను పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేని మాపై కరుణించి సాయముచేయుడు" అని ప్రార్ధించెను. అందుకు యేసు "సాధ్యమగునేని' అనుచున్నావా! విస్వసించు వానికి అంతయు సాధ్యమే" అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి "నేను  నమ్ముచున్నాను. నాకు అవిశ్వాసము  లేకుండునట్లు తోడ్పడుము" అని ఎలుగెత్తి పలికెను.  అంతట జనులు గుమికూడి తనయొద్దకు పరుగెత్తుకొనివచ్చుట  చూచి యేసు "మూగ చెవిటి దయ్యమా! ఈ బాలుని విడిచిపొమ్ము, మరెన్నడును వీనిని ఆవహింపకుము" అని శాసించెను. అప్పడు ఆ  భూతము ఆర్భటించుచు, బాలుని విలవిలలాడించి వెళ్లిపోయెను. బాలుడు పీనుగువలె  పడిపోయెను. అనేకులు వాడు చనిపోయెననిరి. కాని, యేసు వాని చేతినిపట్టి లేవనెత్తగా వాడులేచి నిలుచుండెను. యేసు ఇంటికి వెళ్లిన పిదప శిష్యులు  ఏకాంతముగ ఆయనతో "ఈ దయ్యమును పారద్రోల మాకు ఏల సాధ్యపడలేదు?" అని ప్రశ్నించిరి. అందుకు ఆయన   వారితో, "ప్రార్ధనవలనతప్ప మరే విధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు" అని చెప్పెను. 

శిష్యులు  మూర్ఛరోగిని ‘ స్వస్థపరచలేక’ దుష్టాత్మను వెళ్లగొట్టలేకపోవుటను  చూసినప్పుడు, వారు తమ వైఫల్యానికి కారణాన్ని గురువును అడిగారు. ఆయన వారికి ‘సాతానుపై  శక్తి మరియు అధికారం, మరియు అన్ని వ్యాధులను నయం చేయడానికి శక్తిని ’ ఇచ్చాడు. వారు తరచుగా ఆ శక్తిని ఉపయోగించారు మరియు  వారికి సాతాను ఎలా లోబడి ఉన్నాడో సంతోషంగా చెప్పారు. అయినప్పటికీ, ఆయన కొండపై ఉన్నప్పుడు, వారు పూర్తిగా విఫలమయ్యారు. 

దేవుని చిత్తం లేకుండా విముక్తి ప్రసాదించడం, అయన అనుగ్రహం లేకుండా ఏదైనా సాధించడం సాధ్యం కాదు. క్రీస్తు ఆజ్ఞ మేరకు దుష్టాత్మ వెళ్ళిపోయింది.  మేమెందుకు చేయలేకపోయాము?’ అనే వారిప్రశ్న,  వారు కూడా ఆ దుష్టాత్మను వెళ్ళగకొట్టాలని   ప్రయత్నించారని స్పష్టంగా తెలుస్తుంది; వారి ప్రయత్నాలు ఫలించలేదు , ప్రజల ముందు వారి అశక్తి నిరూపితమైంది. దానికి వారు సిగ్గుపడ్డారు. 

విశ్వాసం ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత వ్యాయామం, ఇక్కడ మన ఆత్మ దేవుని ఆత్మకు పరిపూర్ణంగా స్వీకరించడంలో తనను తాను సమర్పించుకుంటుంది మరియు  అత్యున్నత కార్యాచరణకు బలపడుతుంది. ఈ విశ్వాసం పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిపై ఆధారపడి ఉంటుంది; ఇది బలంగా మరియు పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మన జీవితంలో పూర్తిగా ఆధిపత్యం చెలాయించినప్పుడు మాత్రమే, దాని శక్తివంతమైన పనులను చేయడానికి విశ్వాసమునకు  శక్తి ఉంటుంది. 

అందుకే యేసుప్రభువు సాతాను ఉపవాసం మరియు ప్రార్థన ద్వారా మాత్రమే పారద్రోలబడుతుంది.  ఈ దుష్టాత్మలో ఉన్న మొండి పట్టుదలను , ప్రతిఘటనను అధిగమించగల విశ్వాసం, దేవునితో  సన్నిహిత సహవాసంలో ఉండి మరియు లోకం దాని క్రియల నుండి సాధించవచ్చు.  విశ్వాసం పెరగడానికి మరియు బలంగా ఉండటానికి ప్రార్థన జీవితం అవసరం.  ప్రార్థన ఉపవాసం విశ్వాసాన్ని పెంచుతాయి. 

విశ్వాసం పెరుగుదల కోసం ప్రార్థన జీవితం అవసరం. ఆధ్యాత్మిక జీవితంలోని అన్ని విభిన్న భాగాలలో, దేవునితో ఎంత దగ్గర సంబంధం కలిగి ఉంటామో అంత పవిత్రత కలిగి ఉంటాము. భగవంతుడిని ఆరాధించడంలో, ఆయన కోసం వేచి ఉండటంలో, దేవుడు తనను తాను మనకు వెల్లడించడానికి సిద్ధపడేది మన విశ్వాసం ప్రకారముగానే తెలుసుకుంటాము. దాని దేవుడిని తెలుసుకునే మరియు విశ్వసించే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది.

Br. Pavan OCD

మార్కు 10:1-12

 February 28

సిరాకు 6:5-17

మార్కు 10:1-12

యేసు ఆ స్థలమును వీడి యొర్దాను నదికి ఆవాలనున్న యూదయా ప్రాంతమును చేరెను. జనులు గుంపులుగా ఆయనను  చేరవచ్చిరి. అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను. పరీక్షార్ధము పరిసయ్యులు ఆయనయొద్దకు వచ్చి, "భార్యను పరిత్యజించుట భర్తకు తగునా?" అని ప్రశ్నించిరి. అందుకు యేసు "మోషే మీకేమి ఆదేశించెను?" అని తిరిగి ప్రశ్నించెను. "విడాకుల పత్రమును వ్రాసియిచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే ఆదేశించెను?" అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు "మీ హృదయకాఠిన్యమునుబట్టి  మోషే ఇట్లు ఆదేశించెను. కాని, సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించియున్నాడు. ఈ హేతువువలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏకశరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులుకాక, ఏక శరీరులైయున్నారు. దేవుడు జతపరచిన జంటను మానవుడు వేరుపరుపరాదు" అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి  శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అపుడు ఆయన వారితో "తన భార్యను పరిత్యజించి, వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి, వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది" అని పలికెను.   

అన్ని వివాహాలు స్వర్గంలో జరగవు. కొన్ని బలవంతపు వివాహాలు మరియు మరికొన్ని ప్రేమలేని వివాహాలు. ఒక వివాహిత జంట రాత్రింబవళ్ళు ఒకరితో ఒకరు గొడవపడటం లేదా మూడవ వ్యక్తి లేదా నాల్గవ వ్యక్తితో, ఒకరి దాంపత్య జీవిత  సంబంధంలో నిరంతరం ముల్లుగా మారడం ఊహించుకోండి. కొన్ని కుటుంబాలు   ఎంత దురదృష్టకర జీవితాన్ని గడుపుతాయి! కాబట్టి క్రైస్తవ సమాజంలో  కూడా విడాకుల ప్రశ్న ప్రతిసారీ తలెత్తుతుంది. విరిగిన కుటుంబం యొక్క తక్షణ పరిణామం దాని సభ్యుల విచ్ఛిన్నమైన సంబంధం.విడాకుల తర్వాత కూడా మనం సంతోషకరమైన ముఖాలను చూడగలిగినప్పటికీ, విభజన యొక్క గాయం  ముఖ్యంగా విరిగిన కుటుంబం యొక్క మొదటి బాధితులైన పిల్లలలో కొనసాగుతుంది. 

కుటుంబంలో విచ్ఛిన్నం దేవునితో మన విచ్ఛిన్నమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజల హృదయ కాఠిన్యం కారణంగా మోషే విడాకులను అనుమతించాడని యేసు ప్రభువు  వివరించాడు. చాలా మంది ప్రవక్తల మాట మరియు యేసుప్రభువు  మాట వినకుండా  అదే హృదయ కాఠిన్యం కలిగి జీవిస్తుంటారు. ఈ రోజుల్లో ప్రజలు, ప్రేమ మరియు పశ్చాత్తాపం యొక్క సువార్త సందేశాన్ని వినకపోవడానికి ఇది కారణం ఈ హృదయ కాఠిన్యమే కావచ్చు. బహుశా భార్యాభర్తలు  ఒకరినొకరు వినడం నేర్చుకుంటే, ముఖ్యంగా దేవుని మాట వినడం నేర్చుకుంటే, విడాకుల సమస్యకూడా చర్చించబడకపోవచ్చు. వారు ఒకే శరీరంగా ఉండటం యొక్క అర్థాన్ని అర్థం చేసుకుని, వారి ఏకత్వాన్ని కొనసాగిస్తే, మానవాళి మొత్తం దేవుడు అందరికీ ఒకే తండ్రిగా ఉన్న నిజమైన కుటుంబంగా ఉంటుంది. ప్రతి కుటుంబం మనుగడ మరియు ఆనందం కోసం మనం ప్రార్థిస్తూ ఉండటం క్రైస్తవుల కర్తవ్యం. 

Br. Pavan OCD

15, ఫిబ్రవరి 2025, శనివారం

లూకా 6: 27-38

 February 23

మొదటి సమూయేలు 26: 2, 7-9, 12-13, 22-23

మొదటి కొరింథీయులు 15: 45-49

లూకా 6: 27-38

"కాని, మీతో నేను చెప్పునది ఏమన: మీ శత్రువును ప్రేమింపుడు. మిమ్ము ద్వేషించువారికి మేలు చేయుడు. మిమ్ము శపించువారిని ఆశీర్వదింపుడు. మిమ్ము బాధించువారికై ప్రార్ధింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టినవానికి రెండవ చెంపను కూడా చూపుము. నీ పై బట్టను ఎత్తుకొనిపోవు వానిని  నీ అంగీనికూడా తీసికొనిపోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొనిపోవు వానిని తిరిగి అడుగవలదు. ఇతరులు మీకు ఎట్లు చేయవలెనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు. మిమ్ము ప్రేమించినవారిని మాత్రమే మీరు ప్రేమించినచో యిందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అటుల చేయుటలేదా? తిరిగి ఈయగల వారికే ఋణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులును అటుల  పాపులకు ఇచ్చుటలేదా? కనుక, మీరు మీ శత్రువులను ప్రేమింపుడు. వారికి మేలు చేయుడు. అప్పు ఇచ్చి తిరిగిపొందవలెనని ఆశపడకుడు. అపుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు. ఏలయన, ఆయన కృతజ్ఞతలేని  వారికిని, దుష్టులకును మేలుచేయును. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై యుండుడు. "పరులను గూర్చి మీరు తీర్పుచేయకుడు. మిమ్మును గూర్చియు తీర్పుచేయబడదు. పరులను ఖండింపకుడు. అపుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు. మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు ఒసగుడు. మీకును ఒసగబడును, కుదించి, అదిమి, పొర్లిపోవు నిండుకొలమానముతో ఒసగబడును. మీరు ఏ  కోలతతో కొలుతురో, ఆ కొలతతోనే మీకును కొలవబడును" అని యేసు పలికెను. 

నేటి సువార్తలో యేసు ప్రభువు  మనల్ని “ఉన్నతమైన” ప్రేమకు పిలుస్తున్నాడు. ఆధ్యాత్మిక మినిమలిజాన్ని ఆచరించకుండా లేదా అనుసరించకుండా ఉండమని యేసు మనల్ని కోరుతున్నాడు, అంటే, అవసరమైన వాటిలో కనీసాన్ని మాత్రమే చేయాలని చూడటం లేదా “తగినంత మంచి” పద్ధతి ద్వారా జీవితాన్ని గడపడం - క్విడ్ ప్రో కో దానిని తగ్గించదు. యేసు ప్రభువుని  యొక్క “ఉన్నతమైన ప్రేమ” నిజంగా ఫ్రాన్సిస్ “భక్తి” భావన గుండెలో ఉంది. ఆయన ఇలా వ్రాశాడు: “నిజమైన, సజీవ భక్తి దేవుని ప్రేమను సూచిస్తుంది, కాబట్టి ఇది దేవుని నిజమైన ప్రేమ. అయినప్పటికీ అది ఎల్లప్పుడూ అలాంటి ప్రేమ కాదు. దైవిక ప్రేమ ఆత్మను అలంకరిస్తుంది కాబట్టి, దానిని కృప అంటారు, ఇది దేవుని దైవిక మహిమకు మనల్ని సంతోషపరుస్తుంది. మంచి చేయడానికి అది మనల్ని బలపరుస్తుంది కాబట్టి, దానిని దాతృత్వం అంటారు. అది పరిపూర్ణతకు చేరుకున్నప్పుడు, అది మనల్ని మంచి చేయడమే కాకుండా జాగ్రత్తగా, తరచుగా మరియు వెంటనే మంచిని చేయమని  చేస్తుంది.

దేవా, ఈ ఉన్నత ప్రేమను జీవించడానికి మాకు సహాయం చేయండి. జీవితంలో వచ్చే కొన్ని సమస్యలు, బాధలు కష్టాల నుండి తప్పించుకోవడానికి లేదా “పారిపోవడానికి” ప్రయత్నించకుండా ఉండటానికి మాకు సహాయం చేయండి; నిజంగా జీవించడం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి.

ప్రతిఫలం ఏమీ ఆశించకుండా మంచి చేయడం. మన శత్రువుల పట్ల  ప్రేమ కలిగి ఉండటం ఎప్పుడూ ఆదరణ పొందిన ఆజ్ఞ కాదు.  కానీ యేసు ఇలా చెప్పినప్పుడు చాలా ఖచ్చితముగా చెప్పాడు. అందుకే ఆయన అనుచరులు దానిని చాలా స్పష్టంగా ఆచరించారు. తొలి క్రైస్తవులు  యేసు ప్రభువు చెప్పినట్లుగా జీవించారు. శిష్యులు వారు పొందిన శ్రమలకు ప్రతీకారం తీసుకోలేదు.  శిష్యుల హింసలన్నింటిలోనూ  ప్రతీకారం తీర్చుకున్నారని లేదా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించారని మనకు ఏవైనా ఆధారాలు ఉన్నాయా? నాకు ఏమీ తెలియదు.. శత్రువుల పట్ల ప్రేమను బోధించినప్పుడు యేసు తన దైవిక మూలాల్లోకి లోతుగా చేరుకున్నాడు. ఇది విమోచన యొక్క అంతర్గత తర్కానికి విజ్ఞప్తి చేస్తుంది. దేవుడు పాపాన్ని క్షమించినట్లే, మనం కూడా క్షమించాలి.

సువార్త యొక్క తర్కం చాలా సులభం, ద్వేషం ద్వేషాన్ని పుట్టిస్తుంది, క్షమాపణ క్షమాపణను పుట్టిస్తుంది మరియు ప్రేమ ప్రేమను పుట్టిస్తుంది; చూడటం సులభం, కానీ జీవించడం కష్టం. మనం ఎక్కడ ప్రారంభించాలి? మీరు ఏమి చేయగలరు? మీకు నచ్చని లేదా బాధపెట్టిన లేదా మీరు పోరాడిన వ్యక్తి కోసం ప్రార్థించడం ఒక సాధారణ ప్రారంభం. మీరు రాజీపడటానికి ప్రయత్నించడానికి ధైర్యం, విశ్వాసం కనుగొనవచ్చు. కోపం మరియు ద్వేషం అలసిపోయేవి మరియు చీకటిగా ఉంటాయి. యుద్ధం అలసిపోయేది. ప్రేమ శక్తినిస్తుంది మరియు ఉత్సాహపరుస్తుంది మరియు ప్రకాశవంతంగా ఉంటుంది. క్రీస్తు క్షమించే స్వభావాన్ని మనం కూడా అలవరచుకుందాం. 

Br. Pavan OCD

14, ఫిబ్రవరి 2025, శుక్రవారం

మత్తయి 16: 13-19

 February 22

మొదటి పేతురు 5: 1-4

మత్తయి 16: 13-19

వారు ఇద్దరు తిరిగివచ్చి తక్కినవారికి ఈ విషయమును తెలియపరచిరి. కానివారు నమ్మలేదు. తదుపరి పదునొకండుగురు శిష్యులు భోజనము చేయుచుండగా, యేసు వారికి ప్రత్యక్షమై,  సజీవుడై లేచివచ్చిన తనను చూచిన వారి మాటలను కూడ నమ్మనందున వారి అవిశ్వాసమునకును, హృదయకాఠిన్యమునకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను: "మీరు ప్రపంచమందంతట తిరిగి, సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును. విశ్వసింపనివానికి దండన విధింపబడును. విశ్వసించు వారు ఈ అద్భుత శక్తులను కలిగియుందురు. నా నామమున దయ్యములను వెళ్లగొట్టెదరు. అన్యభాషలను మాట్లాడెదరు. పాములను ఎత్తిపట్టుకొందురు. ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములనుంచిన  వారు ఆరోగ్యవంతులు అగుదురు." ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని  కుడిప్రక్కన కూర్చుండెను. 

తన మొదటి లేఖలో, పునీత  పేతురు విశ్వాసులను చూసుకోవడానికి బాధ్యత వహించే వారికి ఒక మతసంబంధమైన లేఖ ద్వారా తన అధికారాన్ని ఎలా ఉపయోగించాడో మనకు చెబుతాడు. ఈ భాగంలో పేతురు తాను క్రీస్తు బాధలకు సాక్షిగా ఉన్నానని మాట్లాడుతుంటాడు - తాను ప్రభువుతో ఉన్నానని మరియు మానవ క్రీస్తును తెలుసుకున్నానని తన పాఠకులకు గుర్తు చేస్తున్నాడు.

ప్రభువు తమకు అప్పగించిన వారికి నిజమైన కాపరులుగా ఉండాలని మరియు సువార్తకు సజీవ సాక్షులుగా పరిపూర్ణ ఉదాహరణలుగా ఉండాలని పెద్దలందరినీ ఆయన ఎలా వేడుకుంటున్నాడో కూడా ఈ లేఖ మనకు చెబుతుంది. క్రీస్తు తర్వాత పేతురు మందకు ప్రధాన కాపరిగా ఉన్నందున, నేటి కీర్తన ప్రభువు నిజమైన కాపరి అని మనకు గుర్తు చేస్తుంది.

 పునీత  మత్తయి సువార్త భాగం పేతురుకు  క్రీస్తుపై గొప్ప విశ్వాస ప్రకటన తర్వాత క్రీస్తు  సంఘానికి  నాయకుడిగా నియమించబడ్డాడని చూపిస్తుంది. అతను కొత్తగా వచ్చిన సమూహానికి నాయకుడిగా ఉన్నప్పటికీ, అతను సంఘ  ఐక్యతకు శక్తివంతమైన చిహ్నంగా కూడా ఉన్నాడు, ఇది నేటి వరకు కొనసాగుతోంది.

పునీత పేతురు  అపోస్తులిక పరంపరను  మరియు పునీత పేతురు రోము మొదటి పీఠాధిపతిగా   క్రైస్తవ సంఘ నాయకునిగా తెలుపుతుంది ఈనాటి దైవార్చన. . పునీత పేతురు  అసలు పేరు సైమన్. అతనిని  శిష్యులలో  మరియు యేసు పన్నెండు మంది అపొస్తలులలో ఒకరిగా ఉండమని పిలిచినప్పుడు కఫర్నములో జాలరిగా నివసిస్తున్నాడు . యేసు ప్రభువు  పేతురుకు అపొస్తలులలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు. క్రీస్తు రూపాంతరం మరియు గెత్సేమనే తోటలో వేదన వంటి ప్రత్యేక సందర్భాలలో క్రీస్తుతో ఉన్న ముగ్గురిలో అతను ఒకడు. పునరుత్థానం తర్వాత మొదటి రోజున క్రీస్తు కనిపించిన ఏకైక అపొస్తలుడు ఆయన.

పేతురు తరచుగా అపొస్తలుల తరపున మాట్లాడేవాడు.మనం  తిరుసభలో , సంఘంలో “పేతురు స్థానాన్ని ”  ప్రత్యేకమైనదిగా జరుపుకుంటున్నప్పుడు, దేవుని రాజ్య పనిని కొనసాగించడంలో యేసు మనలో ప్రతి ఒక్కరికీ ఒక కుర్చీని - ఒక స్థలాన్ని, ఒక పాత్రను - సిద్ధం చేశాడని మర్చిపోకూడదు. . పేతురులాగే, నేడు మన స్థానాన్ని తీసుకునే ధైర్యం మనకు ఉందా? అని ఆలోచిస్తూ , దేవుడు మనకు ఏర్పరచే స్థానాన్ని ఎల్లపుడు కాపాడుకొనుటకు ప్రయత్నించుదాం. 

Br. Pavan OCD

మార్కు 8: 34 – 9:1

 February 21

ఆదికాండము 11: 1-9

మార్కు 8: 34 – 9:1

అంతట యేసు జనసమూహములను, శిష్యులను చేరబిలిచి, "నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని, తన సిలువను మోసికొని, నన్ను అనుసరింపవలయును. తన ప్రాణమును కాపాడుకొనచూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము, తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి, తన ఆత్మను కోల్పోయిన, వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఈయగలడు? నన్ను గూర్చి నా సందేశమును గూర్చి ఈ పాపిష్టి వ్యభిచారతరములో సిగ్గుపడువానిని గూర్చి, మనుష్య కుమారుడు కూడ దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును" అని పలికెను. మరియు ఆయన వారితో, "దేవునిరాజ్యము శక్తి సహితముగ సిద్దించుట చూచువరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణించరని నేను నిశ్చయముగాఆ  చెప్పుచున్నాను" అని పలికెను. 

ఆదికాండము పుస్తకాన్ని చదివినప్పుడు, ప్రజలు ఒడంబడిక నుండి ఎలా దూరమయ్యారో మరియు వారి గర్వంతో స్వర్గం వరకు చేరుకునే గోపురాన్ని నిర్మించడం ద్వారా దేవుని వలె శక్తివంతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారని మనం చూస్తాము. వారి అహంకారంతో, దేవుడు ఆ గోపురాన్ని నాశనం చేస్తాడు మరియు ప్రజలు ఒకరి భాష ఒకరు   అర్థం చేసుకోలేని విధంగా వారికి వివిధ భాషలను ఇవ్వడం ద్వారా వారిని గందరగోళానికి గురిచేస్తాడు. 

వాస్తవానికి మనం పరలోకంలో మన స్థానాన్ని పొందేందుకు కృషి చేస్తున్నప్పుడు ఈ ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నించడం వ్యర్థమని యేసు సువార్తలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. యేసును నిజాయితీగా మరియు నిశ్చయమైన హృదయంతో అనుసరించేవారు మాత్రమే రాజ్యంలోకి మరియు వారి నిజమైన వారసత్వంలోకి ప్రవేశిస్తారు.

భవనాన్ని నిర్మించడం ఒక విషయం, కానీ దానిని నిర్వహించడం మరొక విషయం. వివేకవంతమైన నిర్మాణకులు/యజమానులు తాము నిర్మించే దాని  నిర్మాణం కోసం వనరులను కేటాయించడమే కాకుండా, భవనం యొక్క నిరంతర నిర్వహణ కోసం వనరులను కూడా కేటాయించారు. ప్రధాన నిర్మాణకర్త అయిన దేవుడు - మనలో ప్రతి ఒక్కరినీ తన స్వరూపంలో మరియు పోలికలో నిర్మించాడు. మనం వస్తువులను నిర్మించడం ద్వారా - ముఖ్యంగా సంబంధాలను - నిర్మించడం ద్వారా దేవుని నిర్మాణాన్ని జరుపుకుందాం, దీని ముఖ్య లక్షణాలు వినయం మరియు దాతృత్వం. అలా చేయడం ద్వారా, మనం మనకే కాదు, దేవునికే మహిమ తెచ్చుకుందాం! . 

Br. Pavan OCD

మార్కు 8: 27-33

 February 20

ఆదికాండము 9: 1-13

మార్కు 8: 27-33

యేసు శిష్యులతో కైసరయా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్లుచు, మార్గ మధ్యమున "ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు?" అని వారిని అడిగెను. అందుకువారు, "కొందరు స్నాపకుడగు యోహాను అనియు, మరికొందరు ఏలీయా అనియు, లేదా మరియొక ప్రవక్త అనియు చెప్పుకొనుచున్నారు" అనిరి. అప్పుడు యేసు "మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు? అని వారిని ప్రశ్నింపగా, పేతురు, "నీవు క్రీస్తువు" అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతట ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు "మనుష్యకుమారుడు అనేక శ్రమలను అనుభవించి, పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి, చంపబడి, మూడవదినమున ఉత్తానమగుట అగత్యము" అని ఉపదేశించి, వారికి ఈ విషయమును తేటతెల్లము చేసెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు తీసికొనిపోయి, "అటుల పలుకరాదు" అని వారింపసాగెను. యేసు శిష్యులవైపు తిరిగి పేతురును చూచి, "సైతానూ!నీవు నా వెనుకకు పొమ్ము   నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని, దేవునికి సంబంధించినవికావు" అనెను

ఆదికాండము మొదటి పఠనంలో దేవుడు నోవతో ఒక నిబంధన చేస్తాడు మరియు ఆదాము హవ్వలతో  నిబంధనను రూపొందించడంలో ఆయన ఉపయోగించిన పదాలను ఇక్కడ ఉపయోగిస్తాడు. ఆ నిబంధనను గుర్తుచేసేందుకు ఆకాశంలో ఇంద్రధనస్సును ఉంచుతాడు, అయినప్పటికీ కొద్దిమంది మాత్రమే ప్రభువుతూ సఖ్యత కలిగి ఉంటారు. పునీత  మార్కు సువార్తలో, క్రీస్తు శిష్యులతో  తాను తీవ్రంగా హింసించబడతానని  చెబుతున్నాడు, అపుడు ప్రభువును  యెరూషలేముకు వెళ్లకుండా నిరోధించడానికి పేతురు ప్రయత్నిస్తున్నాడు,  అది ప్రభువును బాధపెడుతుంది. అందుకు కొన్ని క్షణాల ముందు నీవు క్రీస్తువు; అనే మాటలతో పేతురు తన విశ్వాసాన్ని గొప్పగా ప్రకటించినప్పటికీ, క్రీస్తు సాధించిపెట్టె రక్షణ అయన పొందే శ్రమల మరణ పునరుత్తనాల ద్వారా వస్తుందనే విషయాన్ని మాత్రము జీర్ణించుకోలేకపోతున్నాడు పేతురు.    ప్రభువు వాటిని అధిగమించి  జయిస్తాడు అని అర్ధం చేసుకోలేకపోయాడు పేతురు.  క్రీస్తుతో చేసుకొనే రక్షణ నిబంధన శాశ్వత నిబంధన. 

పునీత  పేతురు చేసినట్లుగా మనం ఆయనపై విశ్వాసం ఉంచాలని మరియు ప్రతిరోజూ ఆయన “నీవు క్రీస్తు” అని గుర్తుంచుకొని జీవించుటకు  పిలువబడ్డాము. యేసు పేతురును “రాయి” అని పిలిచి ఉండవచ్చు, కానీ రక్షకుడికి పేతురు అనే రాయికి  పగుళ్లు ఉన్నాయని తెలుసు. పేతురును అప్పుడప్పుడు  ప్రభువు మార్గమునుకు భిన్నముగా ప్రవర్తిస్తున్నాడు అని తెలుసు. అయితే, పేతురు ఎంత అసంపూర్ణుడైనా, దేవుడు రాజ్యం యొక్క తాళాలను అతనికి అప్పగించాడు, ఎందుకంటే ఆయనను ప్రభువు పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చుతాడు.  మనం ఎంత అసంపూర్ణులమైన, మనకు కొన్ని బాధ్యతలను అప్పగిస్తున్నాడు మనలను సంపూర్ణులను చేయుటకు ప్రభువు ఇలా చేస్తుంటాడు. వాటిని అవకాశముగా మార్చుకొని ప్రభువు వలే పరిపూర్ణమైన వ్యక్తులుగా మారుటకు ప్రయతించుదాం. 

Br. Pavan OCD

8, ఫిబ్రవరి 2025, శనివారం

సామాన్యకాలపు 5 వ ఆదివారం

సామాన్యకాలపు 5 వ ఆదివారం 

యెషయా 6:1-6
 1కొరింథీయన్స్ 15:3-8,11
లూకా 5:1-11

క్రీస్తునాదునియందు  ప్రియా సహోదరి సహోదరులా, ఈనాడు మనమందరమూ కూడా సామాన్య కాలపు ఐదవ  ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ నాటి మూడు దివ్యాగ్రంధ పఠనలను ధ్యానించినట్లయితే, ఈ మూడు పఠనలు కూడా మనకు విశ్వాసం, దైవ పిలుపు మరియు విధేయత యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తాయి.  దేవుని పరిశుద్ధతను గుర్తించి, మన పాపాలను ఒప్పుకొని, ఆయన పిలుపుకు ప్రతిస్పందించాలి.  క్రీస్తు పునరుత్థానంపై మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి.  యేసును విశ్వసించి, ఆయన పిలుపుకు విధేయత చూపాలి అని బోదిస్తున్నాయి.

ముందుగా మొదటి పఠనము యెషయా గ్రంధములో చుసినట్లయితే, దేవుని పరిశుద్ధత మరియు పిలుపు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక్కడ మనము వినె,  దర్శనం క్రీ.పూ. 740 ప్రాంతంలో, ఉజ్జియా రాజు మరణించిన సంవత్సరంలో సంభవించింది. ఉజ్జియా మరణం యూదా రాజ్యానికి ఒక అస్థిరమైన సమయం.  ఈ సమయంలో యెషయాకు కలిగిన దివ్య దర్శనం ప్రజలకు దేవుని యొక్క శక్తిని, పరిశుద్ధతను గుర్తుచేసి, వారికి ధైర్యాన్ని, నమ్మకాన్ని అందించింది.  రాజకీయ అస్థిరత, సామాజిక అన్యాయం ప్రబలంగా ఉన్న సమయంలో, దేవుని సర్వాధిపత్యం, పరిశుద్ధతను చాటి చెప్పడం ఎంతో ముఖ్యం. యెషయా ప్రవక్తకు కలిగిన దర్శనం మరియు దేవుని యొక్క పరిశుద్ధతను, మహిమను మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది.  అది ఏవిధంగానంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే సెరాఫీయుల గానం దేవుని సర్వోన్నతత్వాన్ని చాటి చెబుతుంది.  

ఈ దర్శనం యెషయాను తన పాపపు స్థితిని గుర్తించేలా చేస్తుంది.  నేను అపవిత్రమైన పెదవులు గల వ్యక్తిని అని అతను  దేవుని ముందు విలపిస్తాడు.  ఎందుకంటే దేవుని పరిశుద్ధత ముందు మన పాపపు స్థితిని గుర్తించడం మనకు చాలా ముఖ్యం. మన పాపపు స్థితిని దేవుని ముందు ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకు క్షమాపణ మరియు శుద్ధీకరణను అందిస్తాడు.  కాల్చిన బొగ్గుతో యెషయా పెదవులను తాకడం ద్వారా అతని పాపం పరిహరించబడుతుంది.  ఆ తరువాత అతనికి దేవుని పిలుపు అనేది వస్తుంది: నేను ఎవరిని పంపాలి?  అని దేవుడు అన్నపుడు యెషయా వెంటనే నేను ఇక్కడ ఉన్నాను; నన్ను పంపండి అని సమాధానం ఇస్తాడు.  ఇక్కడ మనకు రెండు విషయాలు కనిపిస్తాయి:  మొదటిది, దేవుని పిలుపుకు సిద్ధంగా ఉండాలంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి.  రెండవది, దేవుని పిలుపుకు వెంటనే స్పందించాలి. 

చివరిగా ఈ మొదటి పఠనములో దేవుని పరిశుద్ధతను, మన పాపపు స్థితిని, దేవుని పిలుపును మనకు గుర్తు చేస్తుంది. యెషయా వలె, మనము కూడా దేవుని పరిశుద్ధతను గుర్తించి, మన పాపాలను ఒప్పుకొని, ఆయన పిలుపుకు స్పందించాలి.  ఎందుకంటే దేవుని పిలుపుకు సిద్ధంగా ఉండాలంటే, మనల్ని మనం మొదటిగా శుద్ధి చేసుకోవాలి. దాని ద్వారా యెషయాను దేవుడు తన సేవకునిగా, ప్రతినిధిగా మార్చుతున్నారు. 

రెండొవ పఠనము యొక్క ప్రధాన సందేశం ఏమిటంటే యేసు క్రీస్తు మన పాపముల కొరకు మృతిపొంది, సమాధి చేయబడి, మూడవ దినమున లేపబడెను. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను. అటుపిమ్మట ఐదు వందల సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను. తరువాత  పౌలుకు కూడా కనబడెను. పౌలు, ఇతర అపొస్తలలు ప్రకటించేది ఒకటే అది క్రీస్తు జీవితం గురించి. కొరింథీయ ప్రజలు కూడా ఆవిధంగానే క్రీస్తును విశ్వసించాలని పౌలు అంటున్నాడు. క్షమాపణ మరియు రక్షణ ఒక భ్రమ అయితే, వారి విశ్వాసం వారిని రక్షించదు.క్రీస్తు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి పునాది అని, అది లేకపోతే మన విశ్వాసం వ్యర్థమని పౌలు గారు కొరింథీయ ప్రజలకు నొక్కి చెబుతున్నాడు. క్రీస్తు పునరుత్థానం మన విశ్వాసానికి కేంద్ర బిందువు. మన పాపములు క్షమించబడ్డాయని, మనకు నిత్యజీవం ఉందని ఈ పునరుత్థానం ద్వారానే మనకు తెలుస్తుంది అని రెండొవ పఠనము తెలియజేస్తుంది. 

చివరిగా సువిశేష పఠనములో యేసు గెన్నెసరెతు సరస్సు దగ్గర నిలబడి ఉండగా, జనులు దేవుని వాక్యాన్ని వినడానికి ఆయనను చుట్టుముట్టారు. ఆయన ఒడ్డున ఉన్న రెండు పడవలను చూశాడు; జాలరులు వాటినుండి వెళ్ళిపోయి తమ వలలు కడుగుతున్నారు. యేసు సీమోను యొక్క పడవ ఎక్కి, ఒడ్డు నుండి కొంచెం దూరంగా వెళ్లమని అతనిని అడిగాడు. అప్పుడు ఆయన పడవలో కూర్చుని ప్రజలకు బోధించాడు.

బోధించడం ముగించిన తరువాత, యేసు సీమోనుతో లోతుకు వెళ్లి చేపలు పట్టడానికి నీ వలలు వేయి అన్నాడు. సీమోను జవాబిస్తూ, గురువా, మేము రాత్రంతా కష్టపడి పనిచేసినా ఏమీ దొరకలేదు, కానీ మీరు చెప్పినందున నేను వలలు వేస్తాను అన్నాడు. వారు అలా చేసినప్పుడు, వారు చాలా చేపలు పట్టారు, వారి వలలు చిరిగిపోవడం ప్రారంభించాయి. వారు సహాయం కోసం ఇతర పడవలో ఉన్న తమ తోటి వారిని కూడా సహాయం చేయమనీ పిలిచారు. వారు వచ్చి రెండు పడవలు నిండేలా చేపలు పట్టారు.
       సీమోను పేతురు అది చూసి, యేసు పాదాల దగ్గర పడి ప్రభువా నన్ను విడిచి వెళ్లు, నేను పాపాత్ముడను అన్నాడు. యేసు సీమోనుతో, భయపడకు; ఇప్పటి నుండి మీరు మనుష్యులను పట్టుకుంటారు అన్నాడు. వారు పడవలను ఒడ్డుకు చేర్చి, ప్రతిదీ విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. లూకా 5 లో, క్రీస్తు జనసమూహానికి బోధించాడు మరియు సీమోను పేతురు మరియు అతని తోటి జాలరికి చేపల అద్భుతాన్ని ఇచ్చాడు. క్రీస్తు తన వాక్యము మరియు పరిచర్య ద్వారా దేవుని కొరకు గెలిచిన విశ్వాసుల యొక్క గొప్ప సమూహమును  క్రీస్తు అనుచరులుగా చేయడం  ఈ గొప్ప చేపలు సూచనగా ఉన్నాయి. లూకాలో, ఈ మత్స్యకారులను శిష్యరికానికి   పిలుపు 1) యేసు బోధ నుండి నేర్చుకోవడం మరియు 2) దేవుని చర్యలను చూడటం మధ్యలో వస్తుంది.
        కాబ్బటి ప్రియా దేవుని బిడ్డలరా ఈ మూడు పఠనలు కూడా మనకు దేవుని పట్ల విశ్వాసం, విధేయత, దేవుని పిలుపు గురించి ముఖ్యమైన పాఠాలను బోధిస్తాయి. వీటిని ధ్యానించడం ద్వారా మన విశ్వాసాన్ని బలపరచుకోవచ్చు.

Fr. Johannes OCD

మార్కు 8: 14-21

 February 18

ఆదికాండము 6: 5-8; 7: 1-5, 10

మార్కు 8: 14-21

శిష్యులు తమవెంట రొట్టెలను తెచ్చుకొనుటకు మరచిపోయిరి. పడవలో వారియొద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను. "పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు, హేరోదు పులిసినపిండిని గూర్చియు, హేరోదు పులిసినపిండిని గూర్చియు, జాగరూకులై ఉండుడు" అని యేసు శిష్యులను హెచ్చరించెను. "మనయొద్ద రొట్టెలులేనందున ఆయన ఇట్లు పలికెనేమో" అని వారు తమలోతాము అనుకొనిరి. యేసు దానిని గ్రహించి, "రొట్టెలులేవని మీరు ఏల విచారించుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? తెలుసుకొనలేదా? మీరు హృదయకాఠిన్యము గలవారైయున్నారా? మీరు కనులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞప్తికి తెచుకోలేరా? ఐదు రొట్టెలను ఐదువేలమందికి పంచి పెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్నిగంపలు  నింపితిరి?" అని ప్రశ్నింపగా, "పండ్రెండు గంపలనింపితిమి" అని వారు సమాధానమిచ్చిరి. "అట్లే ఏడు రొట్టెలను నాలుగువేలమందికి పంచిపెట్టినపుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్నిగంపలకు ఎత్తితిరి?" అని అడుగగా "ఏడు గంపలకు" అని సమాధానమిచ్చిరి. "ఎంతమాత్రము అర్ధము కాలేదా?"  అని యేసు శిష్యులను మందలించెను.  

ఆదికాండములోని మొదటి పఠనం దేవుడు తన నుండి మరింత దూరం వెళ్ళిన స్త్రీ పురుషుల పట్ల నిరాశ చెందాడని చెబుతుంది, మరియు అందువల్ల అతను వారిని గొప్ప జలప్రళయం ద్వారా భూమి నుండి తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. నోవ మరియు అతని కుటుంబం మాత్రమే భూమిని తిరిగి నింపడానికి మిగిలి ఉంటారు. సువార్తలో యేసు తన శిష్యులను హేరోదు మరియు పరిసయ్యుల మధురమైన మాటలకు మోసపోవద్దని హెచ్చరించాడు, వారు  దేవుణ్ణి నమ్మకంగా ఆరాధించరు, కానీ ప్రజలను వారి సొంత  ప్రయోజనాల కోసం ఆదేశిస్తారు. రెండు పఠనాలు మన విశ్వాసం స్వచ్ఛంగా ఉండాలని మరియు దేవుని వాక్యంపై ఆధారపడి ఉండాలని మనకు గుర్తు చేస్తాయి. మనం ఆయన మాట ప్రకారం జీవిస్తే, సరైన చర్య తీసుకోవడానికి ఏమి చేయాలో మనకు తెలుస్తుంది మరియు మనం నమ్మితే తదనుగుణంగా వ్యవహరిస్తాము.

 మన జీవితాల్లో మనం నిర్మించాలని ప్లాన్ చేసుకునే అనేక ఓడలు ఉన్నాయి, అవి ఎప్పటికీ పూర్తి కావు. మనకు అవసరమని మనం నమ్మే ఇతర ఓడలు మన జీవితాల్లో ఉన్నాయి, అవి ఎప్పటికీ ఉపయోగించబడవు. వాస్తవం తర్వాత వరకు మనం అవసరాన్ని గుర్తించలేదు కాబట్టి మనం స్పష్టంగా నిర్మించాల్సిన - కానీ ఎప్పుడూ చేయని - ఇతర ఓడలు ఇంకా ఉన్నాయి. అయితే, భవిష్యత్తు కోసం సిద్ధం కావడంలో ఎటువంటి హాని లేదు - అది స్వల్పకాలికంగా లేదా దీర్ఘకాలికంగా అయినా - రేపటి కోసం మనం ప్రణాళిక వేసుకోగల ఏకైక స్థలంలో నివసించే మన సామర్థ్యాన్ని అది దెబ్బతీయదు. జలప్రళయం వచ్చిన రోజు వరకు నోవ సమకాలీనులలో చాలామంది అతన్ని ఎగతాళి చేశారు.

Br. Pavan OCD

మార్కు 8: 22-26

 February 19

ఆదికాండము 8: 6-13, 20-22

మార్కు 8: 22-26

అంతట వారు బేత్సయిదా గ్రామము చేరిరి. అచట కొందరు ప్రజలు ఒక గ్రుడ్డివానిని యేసు వద్దకు తీసికొనివచ్చి, వానిని తాకవలయునని ఆయనను ప్రార్ధించిరి. యేసు వానిని చేయిపట్టుకొని, ఉరి వెలుపలకు తీసికొనిపోయి, వాని కన్నులను ఉమ్మి నీటితో తాకి, తన చేతులను వానిపై ఉంచి, "నీవు చూడగలుగుచున్నావా?" అని ప్రశ్నించెను. వాడు కనులెత్తి "నాకు మనుష్యులు కనిపించుచున్నారు. కాని, నా దృష్టికి వారు చెట్లవలెయుండి నడచుచున్నట్లు కనిపించుచున్నారు" అని సమాధానమిచ్చెను. యేసు మరల వాని కన్నులను తాకి సూటిగా వానివైపు చూడగా, వాడు స్వస్థుడై అంతయు స్పష్టముగా చూడగలిగెను. "తిరిగి ఆ ఊరు  వెళ్ళవద్దు" అని యేసు వానిని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేసెను. 

మొదటి పఠనంలో మనం జలప్రళయం ముగింపు మరియు నోవ దేవునికి చేసిన కృతజ్ఞత బలి  గురించి చదువుతాము. కీర్తన కృతజ్ఞతా స్తుతి  ఈ ఇతివృత్తాన్ని కొనసాగిస్తుంది. సువార్తలో యేసు ప్రభువు  ఒక అంధుడిని స్వస్థపరుస్తున్నట్లు చూస్తాము మరియు ఇది కాలక్రమేణా విశ్వాసం పెరుగుతుందని మరియు కాలక్రమేణా మనం ప్రభువును మరింత ఎక్కువగా అంగీకరిస్తామని మనకు గుర్తు చేస్తుంది. 

జీవితంలో మనం పొందిన ప్రతిదానికీ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలని మనకు గుర్తు చేయబడుతుంది, అది ఎంత అల్పమైనదిగా అనిపించినా, జీవిత బహుమతికి దేవునికి  కృతజ్ఞతలు చెప్పాలని కూడా గుర్తుంచుకోవాలి. కాలక్రమేణా విశ్వాసం పెరుగుతుంది కానీ మనం దాని కోసం ఎల్లప్పుడూ పని చేయాలి. మనుష్యకుమారుడు నీతిమంతులను దేవుని రాజ్యంలోకి స్వాగతిస్తాడని యేసు జనసమూహానికి చెబుతూ, “నేను ఆకలిగా ఉన్నాను మరియు మీరు నాకు ఆహారం ఇచ్చారు, నేను దాహంగా ఉన్నాను   మీరు నాకు త్రాగడానికి నీరు  ఇచ్చారు, నేను అపరిచితుడిగా  ఉన్నాను  నన్ను స్వీకరించారు, నగ్నంగా ఉన్నారు మరియు మీరు నాకు బట్టలు ఇచ్చారు, అనారోగ్యంతో ఉన్నారు మరియు మీరు నన్ను ఆదరించారు, జైలులో ఉన్నారు మరియు మీరు నన్ను సందర్శించారు.” అని, నీతిమంతులు ఎప్పుడు ఇలా చేసారో అడుగుతారు, అపుడు ప్రభువు   ఇలా సమాధానం ఇస్తాడు, “నా ఈ చిన్న సోదరులలో ఒకరికి మీరు ఏమి చేశారో, మీరు నా కోసం చేసారు.”

దేవుడు  పొరుగువారి పట్ల మన ప్రేమ యొక్క పరస్పర సంబంధం గురించి యేసు బోధన యొక్క శక్తివంతమైన ఉద్ఘాటన ఇది. దేవుని పట్ల సంపూర్ణ ప్రేమ మన తోటి మానవులను ప్రేమించాలని చెబుతుంది.  ఎందుకంటే దేవుడు అనేక మందిలో ఒకడు కాదు, కానీ మన ఉనికికి ఆధారం. మన ఆధ్యాత్మిక మార్గం అనిశ్చితితో నిండి ఉండవచ్చు. మన కోసం దేవుని ప్రణాళిక ఆశ్చర్యాలతో నిండి ఉండవచ్చు: కొంత ఓదార్పునిస్తుంది మరియు కొంత మనకు అర్ధం కాకపోవచ్చు. మన మనస్సులు, మన హృదయాలు - మన జీవితాలు - మనం కోరుకున్నంత ప్రశాంతంగా లేదా ఊహించదగినవిగా ఉండకపోవచ్చు.  కాని ప్రభువు సహాయంతో అన్నింటిని ఎదుర్కోవచ్చు మరియు మనము ఎదగవచ్చు. 

Br. Pavan OCD

మార్కు 8: 11-13

 February 17

ఆదికాండము 4: 1-15, 25

మార్కు 8: 11-13

కొందరు పరిసయ్యులు యేసువద్దకు వచ్చి ఆయనను శోధించుచు "పరలోకమునుండి ఒక గురుతును చూపుము" అని ఆయనతో వాదింపసాగిరి. అందులకు ఆయన వేదనతో నిట్టూర్చి, "ఈ తరము వారు ఏల ఒక గురుతును కోరుచున్నారు? వారికి ఎట్టి గురుతును ఈయబడదని నిశ్చయముగ చెప్పుచున్నాను" అనెను ఆయన అచటనుండి  పడవనెక్కి సరస్సు ఆవలితీరమునకు సాగిపోయెను. 

ఆదికాండము పుస్తకం నుండి నేటి పఠనంలో, ఆదాము హవ్వలు  ఏదెను తోట నుండి బహిష్కరించబడ్డారని మనం చూస్తాము. వారు ఒక కుటుంబాన్ని ప్రారంభిస్తారు మరియు హవ్వ కయీను మరియు హేబెలుకు జన్మనిస్తుంది - మొదటివాడు భూమిని సాగు చేయగా, రెండవవాడు గొర్రెల కాపరి అయ్యాడు. హేబెలు కయీను కంటే ఎక్కువగా అభివృద్ధి చెందాడని మరియు ఇది చివరికి కయీను తన తమ్ముడిని చంపడానికి దారితీసిందని మనకు చెప్పబడింది. దేవుడు కయీనును అతని పాపానికి శిక్షిస్తాడు కానీ కయీను ప్రాణం తీసే వారిని ఇంకా ఎక్కువగా శిక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. 

పఠనం ముగింపులో, హవ్వ తన మూడవ కొడుకు సేతుకు జన్మనిస్తుంది. సువార్తలో, యేసు మళ్ళీ పరిసయ్యులతో విభేదిస్తున్నాడు ఎందుకంటే వారు   ప్రభువు  చేసినదంత చూచిన  తర్వాత కూడా, ప్రభువును నమ్మాలంటే క్రీస్తు నుండి ఒక సంకేతాన్ని కోరారు. మనం నమ్మే ముందు ఒక సంకేతాన్ని కోసం వేచి ఉంటే మనకు ఎప్పటికీ విశ్వాసం ఉండదు. దేవుడు అన్నీ చూస్తాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలని మరియు అసూయ లేదా ఆగ్రహం మన చర్యలను పాలించనివ్వకూడదని మనకు గుర్తు చేయబడింది.

యేసు శుభవార్తను ప్రకటించడానికి మరియు ఆచరించడానికి చేసిన ప్రయత్నంలో చెడును మంచితో పాటు తీసుకున్నాడు. యేసు ఇబ్బంది కోసం వెతకకపోయినా, అది కూడా ఇబ్బంది కలిగించదు, ముఖ్యంగా దేవుని రాజ్యం యొక్క న్యాయం మరియు శాంతిని ప్రోత్సహించే విషయానికి వస్తే. కొన్ని వర్గాల నుండి ఆయనకు ఎదురైన ప్రతిఘటనను బట్టి చూస్తే, యేసు “తన ఆత్మ లోతుల్లో నుండి నిట్టూర్పు విడిచాడు” అనేదానికి సువార్తలు మరిన్ని ఉదాహరణలు అందించకపోవడం ఆశ్చర్యకరం! భక్తితో జీవించడానికి మన రోజువారీ ప్రయత్నాలలో మనం యేసుతో  నిరాశ సంబంధం కలిగి ఉండవచ్చు. మన ఆత్మల లోతుల్లో నుండి నిట్టూర్చే విధంగా మనమందరం ప్రతిఘటనను ఎదుర్కొన్నాము. కష్టం మనల్ని కనుగొన్నప్పుడు మనం అంతగా ఆశ్చర్యపోకూడదు. యేసులాగే, కష్టం మన దారికి వచ్చినప్పుడు, అది ఇతరుల జీవితాల్లో మంచి చేయకుండా - మరియు మంచిగా ఉండకుండా - మనల్ని నిరోధించకుండా ఉండటానికి మన వంతు కృషి చేద్దాం.

Br. Pavan OCD

లూకా 6: 17, 20-26

 February 16

యిర్మీయా 17: 5-8

మొదటి కొరింథీయులు 15: 12, 16-20

లూకా 6: 17, 20-26

 అటు పిమ్మట యేసు వారితో గూడ కొండ దిగివచ్చి, పెక్కు మంది అనుచరులతో మైదనమున నిలుచుండెను. యూదయా దేశమంతట నుండియు, యెరూషలేమునుండియు, తూరు సీదోను అను సముద్రతీరపు పట్టణములనుండి ప్రజలు అనేకులు అచట చేరియుండిరి. యేసు కనులెత్తి శిష్యులవైపు చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను: "పేదలగు మీరు ధన్యులు. దేవరాజ్యము మీది. ఇపుడు ఆకలిగొనియున్న మీరు ధన్యులు. మీరు సంతృప్తి పరపబడుదురు. ఇపుడు శోకించు మీరు ధన్యులు మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము, మనుష్యులు మిమ్ము ద్వేషించి , వెలివేసి, నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆరోజున మీరు ఆనందపడుడు. మహానందపడుడు. ఏలయన, పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తలపట్ల  ఇట్లే ప్రవర్తించిరి. అయ్యో! ధనికులారా! మీకనర్ధము. మీరు మీ సుఖములను అనుభవించియున్నారు. అయ్యో! ఇపుడు కడుపునిండినవారలారా! మీరు అనర్ధము. మీరు  ఆకలితో అలమటింతురు. అయ్యో! ఇపుడు నవ్వుచున్నవారలారా! మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరు మిమ్ము ప్రశంసించినపుడు మీకు అనర్ధము. వీరి పితరులు కపట ప్రవక్తల   పట్ల ఇట్లే ప్రవర్తించిరి. 

ఈరోజు మనం ప్రవక్త యిర్మీయా పుస్తకం నుండి చదివిన మొదటి పఠనం, మనం ఎల్లప్పుడూ దేవునిపై నమ్మకం ఉంచాలని గుర్తు చేస్తున్నది. జీవితంలో  మన తోటి వారిపట్ల   నమ్మకం ఉంచాలి.  మనం మొదటగా దేవునిపై నమ్మకం ఉంచాలి,  ఎందుకంటే దేవుడు మనకు శాశ్వత జీవితాన్ని ఇవ్వగలిగినప్పుడు,  మన తోటి పురుషులు మరియు స్త్రీలు మన కోసం చేయగలిగేది చాలా ఎక్కువ. ఈ ఇతివృత్తం కీర్తనలో కొనసాగుతుంది. సువార్తలో, మనకు సెయింట్ లూకా యొక్క శుభవార్తల వృత్తాంతం ఉంది - లూకా వివరించినట్లుగా జీవించడానికి క్రీస్తు  గొప్ప బ్లూప్రింట్. యేసు ప్రభువు చేసిన ప్రతి క్రియకు   లేదా బాధపడ్డ ప్రతిదానిలో, దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు, మనిషి కాదు. క్రీస్తు మృతులలో నుండి లేచాడు కాబట్టి ఇదంతా జరుగుతుంది.

కొరింథులోని క్రైస్తవులకు రాసిన మొదటి లేఖలోని రెండవ పఠనంలో, క్రీస్తు పునరుత్థానం ఈ జీవితంలోనే కాదు, నిత్య జీవితంలోనూ ప్రభావం చూపుతుందని మనకు గుర్తు చేయబడింది. అలాగే, మనిషిపై నమ్మకం ఉంచడం ఈ జీవితానికి మాత్రమే కావచ్చు, దేవుణ్ణి నమ్మి సువిశేష ప్రకారం  జీవించడం మరియు సువార్త సూత్రాలు అందరికీ శాశ్వత జీవితాన్ని తెస్తాయి. మన అంతిమ నమ్మకం ఎల్లప్పుడూ నమ్మదగిన దేవునిపై ఉండాలి. మన అంతిమ నమ్మకం ;ఎప్పుడూ మోసం చేయని లేదా ద్రోహం చేయని నమ్మకమైన స్నేహితుడు అయిన దేవునిపై ఉండాలి. మన ప్రాథమిక నమ్మకం ఈ జీవితాన్ని జీవించడానికి మాత్రమే కాకుండా, దానిలో వృద్ధి చెందడానికి అనుమతిస్తుంది, ముఖ్యంగా మన స్వంత అపరిపూర్ణతలు మరియు ఇతరుల అసంపూర్ణతలుఎదురైనప్పుడు.  ఇతరులు మన లోతైన కోరికలు, మన లోతైన అవసరాలు, మన లోతైన కోరికలు మరియు మన లోతైన కలలను తప్పకుండా తీర్చాలని మనం ఆశిస్తే మనం శాపగ్రస్తులు. అలాంటి అంచనాలు చేదు, ఆగ్రహం మరియు నిరాశకు దారితీస్తాయి.

మానవులు ఎవరు  అలా లేనప్పుడు కూడా, ఎల్లప్పుడూ నమ్మదగిన దేవునిపై మనం నమ్మకం ఉంచి ఆ ప్రభువు దగ్గర  ఓదార్పు తీసుకుంటే మనం ధన్యులం. దేవునిపై మనకున్న నమ్మకం జీవితంలోని అనివార్య నిరాశల నుండి (- మనం పొందేవి, మనం కలిగించేవి - )మనల్ని తప్పించకపోయిన,  అది వాటిని అధిగమిస్తూ  పని చేయడానికి మరియు చివరికి వాటిని దాటి ముందుకు సాగడానికి వీలు కల్పిస్తుంది. దేవునిపై మనకున్న నమ్మకం మనం నమ్మదగిన  మార్గాలను   కనుగొనుటకు, వాటిలో ప్రయాణించుటకు  వీలు కల్పిస్తుంది. అదేవిధంగా, దేవునిపై మనకున్న నమ్మకం ఒకరినొకరు క్షమించుకోవడానికి వీలు కల్పిస్తుంది.

Br. Pavan OCD 

7, ఫిబ్రవరి 2025, శుక్రవారం

మార్కు 8: 1-10

 February 15

ఆదికాండము 3: 9-24

మార్కు 8: 1-10

మరియొకమారు  మహాజనసమూహము ఆయన యొద్దకు వచ్చెను. కాని, వారు భుజించుటకు ఏమియు  లేనందున, ఆయన తన శిష్యులను పిలిచి, వారితో, "నేటికీ మూడుదినములనుండి వీరు నాయొద్దఉన్నారు. వీరికి భుజించుటకు ఏమియులేదు. అందు వలన నాకు జాలి కలుగుచున్నది. పస్తులతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున సొమ్మసిల్లి పోవుదురు. ఏలయన, వీరిలో కొందరు చాలదూరము నుండి వచ్చిరి" అని పలికెను. అందులకు ఆయన శిష్యులు, "ఈ ఎడారిలో మనము ఎక్కడనుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తిపరచగలము?" అని ప్రత్యుత్తరమిచ్చిరి. "మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి?"అని ఆయన ప్రశ్నింపగా, "ఏడు రొట్టెలున్నవి" అని వారు సమాధానమిచ్చిరి. అంతట యేసు ఆ జనసమూహమును అచట కూర్చుండ ఆజ్ఞాపించి, ఆ ఏడు రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి, వానిని త్రుంచి, వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారట్లే వడ్డించిరి. వారియొద్దనున్న  కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి, వానినికూడ వడ్డింప ఆజ్ఞాపించెను. వారెల్లరు సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగుచేసి, రమారమి నాలుగు వేలమంది. పిమ్మట ఆయన వారిని   పంపివేసి, వెంటనే ఒక పడవను ఎక్కి శిష్యులతో 'దల్మనూతా' ప్రాంతమునకు వెళ్లెను. 

యేసు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయనను అనుసరిస్తూనే ఉన్నారు. పైన చదివిన సువార్త ప్రకారం, వారు మూడు రోజులుగా అలాగే చేస్తున్నారు. ఇప్పుడు వారికి ఆహారం అయిపోయింది. ఆకలితో ఉన్న ఈ వేలాది మందిని ఎలా పోషించాలో శిష్యులకు ఒక పెద్ద ప్రశ్న, కానీ ప్రభువు వారికి తన శక్తిని మరియు కరుణను  చూపించడానికి ఇది ఒక అవకాశం. ఎవరో ఒకరు ఏడు రొట్టెలు మరియు మరొకరు కొన్ని చేపలను అందిస్తారు. యేసు వారిని ఆశీర్వదించిన తర్వాత, ఈ చిన్న పని పెద్ద  అద్భుతంగా గుణించబడింది, తద్వారా ప్రతి ఒక్కరూ సంతృప్తిగా భుజించారు.  మరియు ఏడు బుట్టలు నిండా మిగిలిన వాటిని నింపారు.  

మన దేవుడు దయగలవాడు. ప్రజలు ఆకలితో ఉండటం ఆయనకు ఇష్టం లేదు. ఈనాటి సువిశేష భాగంలో , యేసు జాలిపడ్డాడు. నిర్గమకాండ సమయంలో ఎడారిలో ఉన్న ఇశ్రాయేలీయుల మాదిరిగా ప్రజలు ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ ప్రభువు వారి సమస్యను తెలుసుకొని  మరియు వారి అవసరాన్ని తీర్చడానికి ఆయన వేగంగా కదిలాడు. వారి ఆకలిని తీర్చుతున్నారు.

ఎటువంటి సందేహం లేకుండా, మన దేవుడు ఉదారవంతుడు.   యేసు ప్రభువు గుణకారానికి దేవుడు. రొట్టెలు మరియు చేపల గుణకారం యొక్క ఈ కథ మన ఆశ మరియు బలానికి మూలం. యేసు కొరతను మిగులుగా మార్చడాన్ని మనం చూశాము. మన దగ్గర ఉన్నదాన్ని అర్పిద్దాం మరియు వాటిని ఆశీర్వదించి గుణించమని ప్రభువును వేడుకుందాం. ఆయన శక్తి మరియు దాతృత్వాన్ని మనం విశ్వసిస్తే మనం ఆకలితో అలమటించము. యేసు మన పట్ల దయగలవాడు మరియు ఉదారంగా ఉన్నట్లే, మనం ఇతరుల పట్ల ఉదారంగా మరియు దయగలవాడుగా ఉండటం నేర్చుకుందాం. మన పొరుగువారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ మార్గాలను కనుగొనుటకు ప్రయత్నిద్దాం. 

Br. Pavan OCD

మార్కు 7: 31-37

 February 14

ఆదికాండము 3: 1-8

మార్కు 7: 31-37

పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి, సీదోను, దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలీయ సరస్సు తీరమును చేరెను. అపుడు అచటి జనులు మూగ, చెవిటివానిని ఆయనయొద్దకు తీసికొని వచ్చి, వాని మీద ఆయన హస్తమునుంచుమని ప్రార్ధించిరి. యేసు వానిని జనసమూహమునుండి ప్రక్కకు తీసికొనిపోయి, వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి, ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి, ఆకాశమువైపు కన్నులెత్తి, నిట్టూర్చి"ఎప్ఫతా" అనెను. అనగా "తెరువబడుము" అని అర్ధము. వెంటనే వాని చెవులు తెరువబడెను. నాలుక పట్లుసడలి వాడు తేలికగా మాటాడసాగెను. "ఇది ఎవరితో చెప్పరాదు" అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్నకొలది మరింత ఎక్కవగా దానిని వారు ప్రచారముచేసిరి. "చెవిటివారు వినునట్లుగా, మూగవారు మాటాడునట్లుగా సమస్తమును ఈయన చక్కపరచియున్నాడు" అని అందరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. 

మార్కు సువార్తలోని ఈరోజు  సువిశేష భాగం కొన్ని   విషయాలను మన దృష్టిలో ఉంచుతుంది. యేసు తన చేతి స్పర్శతో ఒక వ్యక్తి చెవిటితనాన్ని మరియు వాక్కు  లోపాన్ని నయం చేసి అతనికి పూర్తిగా కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఈ కథ క్రీస్తు మన జీవితాలపై ఎంత ప్రభావం చూపగలదో  మనకు గుర్తు చేస్తుంది. ఆయన ప్రతిరోజూ మనకు పంపే  ఆశీర్వాదాలను లేదా ఆయన మన జీవితాల్లో చేసే చిన్న అద్భుతాలను మనం గ్రహించకపోవచ్చు. బహుశా అది స్నేహితుడి నుండి వచ్చిన తీపి గమనిక, పనిలో ఊహించని పదోన్నతి లేదా బహుమతి కష్టాలను అధిగమించడం లాంటిది కావచ్చు. దేవుణ్ణి నమ్మి  మరియు విశ్వాసం కలిగి ఉండి జీవిస్తున్నపుడు  ఆయన మన ప్రార్థనలన్నింటికీ సమాధానం ఇస్తాడు. విశ్వాస స్ఫూర్తి జీవితాన్ని, సంఘటనలను, చరిత్రను దేవుడు ప్రత్యక్షమయ్యే ప్రదేశాలుగా చూడమని మనల్ని ఆహ్వానిస్తుంది. ఇక్కడ మనము  విశ్వాసం యొక్క వెలుగులో, దేవుని వెలుగులో ప్రతిదానిని చూడటం గురించి, ఆయన వాక్యంలో, స్త్రీ పురుషులలో, పేదవారిలో, ప్రకృతిలో, చరిత్రలో మరియు మనలో ఆయన ఉనికిని కనుగొనడం గురించి మాట్లాడుతున్నాము. మన సమాజానికి మనం వెలుగు మరియు నిప్పురవ్వలం.

“ప్రభువైన యేసు, నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపుము మరియు నా హృదయాన్ని ప్రేమ మరియు కరుణతో నింపుము. ఇతరుల అవసరాల పట్ల నన్ను శ్రద్ధ వహించువిధంగా దీవించండి. అపుడు  ఇతరుల పట్ల   దయ మరియు శ్రద్ధ చూపించగలను. ఇతరులు నీలో స్వస్థత మరియు సంపూర్ణతను కనుగొనడంలో నేను సహాయపడేలా నన్ను నీ దయ మరియు శాంతి యొక్క సాధనంగా చేయుము.” ఆమెన్.

Br. Pavan OCD

మార్కు 7 : 24 - 30

 February 13

ఆది 2 : 18 -25

మార్కు 7 : 24 - 30

అపుడు ఆయన ఆ స్థలమును వీడి, తూరు, సీదోను ప్రాంతములకు వెళ్లెను. ఆయన ఒక గృహమున ప్రవేశించి,  అచట ఎవ్వరికి  తెలియకుండా ఉండగోరెను. కాని అది సాధ్యపడలేదు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తెగల ఓకే స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి, ఆయన పాదములపై బడెను. దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరుప ప్రార్ధించెను. ఆమె గ్రీసు దేశీయురాలు సిరోపేనిష్యాలో పుట్టినది. అందుకు యేసు "పిల్లలు మొదట తృప్తిచెందవలెను. పిల్లలరొట్టెను తీసి కుక్కపిల్లలకు వేయుటతగదు" అని పలికెను. అప్పుడు ఆమె " అది నిజమే స్వామీ! కాని, పిల్లలుపడవేయు రొట్టెముక్కలను భోజనపు బల్లక్రింద ఉన్న కుక్కపిల్లలును తినునుగదా!" అని బదులు పలికెను. అందుకు ఆయన, "నీ సమాధానము మెచ్చదగినది. నీ కుమార్తె స్వస్థత పొందినది. ఇక నీవు పోయిరమ్ము" అని చెప్పెను. అంతట ఆమె ఇంటికి వెళ్లి దయ్యము వదలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరుండియుండుటను చూచెను. 

ఓ స్త్రీ, నీ విశ్వాసం గొప్పది. నీ ఇష్టప్రకారమే నీకు జరగాలి” (మత్తయి 15:28).  ఆమెకు తగినంత విశ్వాసం ఉంది, ఎందుకంటే ఆమెకు పురాతన అద్భుతాలు, ఆజ్ఞలు మరియు ప్రవక్తల వాగ్దానాలు లేదా ప్రభువు ఇటీవల చేసిన వాగ్దానాలు తెలియవు. అదనంగా, ఆమె ప్రభువుచేత విస్మరించబడినప్పుడల్లా, ఆమె తన ప్రార్థనలలో పట్టుదలతో ఉండేది మరియు ఆయన రక్షకుడని ప్రజాదరణ పొందిన అభిప్రాయం ద్వారా మాత్రమే ఆమెకు తెలుసు అయినప్పటికీ, ఆమె ఆయనను అడగడం,  తట్టడం మానలేదు. దీని కారణంగా, ఆమె తాను వేడుకున్న గొప్ప లక్ష్యాన్ని సంపాదించుకుంది. 

మనలో ఎవరికైనా దురాశ, గర్వం, వ్యర్థ మహిమ, కోపం,  లేదా అసూయ మరియు ఇతర దుర్గుణాల మరకతో కలుషితమైన మనస్సాక్షి ఉంటే, అతనికి కనానీయ స్త్రీలాగా “దయ్యం వల్ల తీవ్రంగా బాధపడే కుమార్తె” ఉన్నట్లు. అతను ప్రభువు వద్దకు త్వరపడి వెళ్లి, ఆమె స్వస్థత కోసం ప్రార్థన చేయాలి. తగిన వినయంతో విధేయత చూపిస్తూ, అటువంటి వ్యక్తి తనను తాను ఇశ్రాయేలు గొర్రెల సహవాసానికి (అంటే స్వచ్ఛమైన ఆత్మలకు) అర్హుడని నిర్ధారించుకోకూడదు, బదులుగా, అతను స్వర్గపు అనుగ్రహాలకు అనర్హుడని అభిప్రాయపడాలి. అయినప్పటికీ, అతను తన ప్రార్థన యొక్క శ్రద్ధ నుండి నిరాశ చెందకుండా, సందేహం లేకుండా తన మనస్సుతో, సర్వోన్నత దేవుని మంచితనాన్ని విశ్వసించాలి, ఎందుకంటే దొంగ నుండి ఒప్పుకోలుదారునిగా చేయగలవాడు (లూకా 23:39f.), హింసకుడి నుండి అపొస్తలుడుగా చేయగలవాడు (అపొస్తలుల కార్యములు 9:1-30, సుంకరి నుండి సువార్తికుడుగా (మత్తయి 9:9-13) మరియు అబ్రహం కోసం రాళ్ళతో కుమారులను చేయగలవాడు, అత్యంత అల్పమైన దానిని  కూడా ఇశ్రాయేలు(పవిత్రం) గొర్రెగా మార్చగలడు.

ఓ దయగల దేవా, మా బలహీనతలో మాకు రక్షణ కల్పించుము, నిర్మలమైన దేవుని తల్లి జ్ఞాపకార్థం జరుపుకునే మేము, ఆమె మధ్యవర్తిత్వం సహాయంతో, మా దోషాల నుండి బయటకు వచ్చి, అనేక   బాధలతో ఉన్న వారికి  మా జీవితాలు బహుమతులుగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. ఆమెన్.

Br. Pavan OCD

మార్కు 7: 14-23

 February 12

ఆదికాండము 2: 4-9, 15-17

మార్కు 7: 14-23

పిదప, ఆయన  జనసమూహమును తిరిగి  పిలిచి "మీరు విని, గ్రహించుకొనగలరు. వెలుపల నుండి లోపలికిపోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియును లేదు. కాని, లోపలి నుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును. వినుటకు వీనులున్నవారు విందురుగాక!" అని అనెను. ఆయన ఆ జనసమూహమును వీడి గృహమున ప్రవేశించినపుడు అయన శిష్యులు ఈ ఉపమాన భావమును వివరింపమని అడిగిరి. అంతట యేసు శిష్యులనుఁ చూచి, "మీరును ఇంతటి మందమతులా? మానవుడు భుజించునది ఏదియు అతనిని మాలిన్యపరచదు. ఏలయన, అది హృదయములో ప్రవేశింపక, ఉదరములో ప్రవేశించి, ఆ పిమ్మట విసర్జింపబడుచున్నది. అన్ని పదార్ధములు  భుజింపదగినవే? అని అయన పలికెను. "మానవుని మాలిన్యపరచునది వాని అంతరంగమునుండి వెలువడునదియే. ఏలయన, హృదయమునుండి దురాలోచనలు, వేశ్యాసంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నియు మానవుని అంతరంగమునుండియే వెలువడి అతనిని మలినపరచును" అని పలికెను. 

యేసు మరియు ఆయన శిష్యులు చుట్టూ  యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు మరియు  ధర్మ శాస్త్ర బోధకులు    చుట్టుముట్టబడ్డారు. యేసు శిష్యులు “పెద్దల సంప్రదాయాన్ని” ఉల్లంఘించడాన్ని పరిసయ్యులు చూస్తున్నారు. యేసు శిష్యులు చేతులు కడుక్కోకుండా తినడం మరియు ఇతర సంప్రదాయాలను పాటించకపోవడం పరిసయ్యులను తీవ్రంగా బాధపెట్టింది మరియు వారు యేసు నుండి వివరణ కోరారు. మనం తినే దాని నుండి (పాత నిబంధనలోని మోషే ధర్మశాస్త్రంలో ఉన్నట్లుగా) అపవిత్రత రాదు అని యేసు ప్రతిస్పందించాడు; “మనిషి నుండి వచ్చేవి అతన్ని అపవిత్రం చేస్తాయి.” మరో మాటలో చెప్పాలంటే, యేసు, “పాతదానితో బయటకు వెళ్లి, కొత్తదానితో లోపలికి!” అని చెబుతున్నాడు. ఆయన పాత ఆచారాలను  తొలగించి, తనను తాను కొత్త నిబంధన యొక్క స్వరూపిగా పరిచయం చేసుకుంటున్నాడు. పది ఆజ్ఞలను పాటించడంతో పాటు, తనను తాను తెలుసుకోవడం, ప్రేమించడం మరియు సేవ చేయడం నుండి వారిని నిరోధించే ప్రతిదాని నుండి అంతర్గతంగా శుద్ధి చేసుకోవాలని యేసు కోరుతున్నాడు. 

 పరిసయ్యులు తమ హృదయాలకు హాని కలిగించేలా “పెద్దల సంప్రదాయాన్ని” కఠినంగా పాటించడంపై చాలా దృష్టి పెట్టారు. కొత్త నిబంధనలో, యేసు తన ధర్మశాస్త్రాన్ని మన హృదయాలపై వ్రాస్తాడు. కలుషితం చేయగల వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవాల్సిన స్థలం హృదయం అని ఆయన చెప్పారు. “చెడు విషయాల” జాబితాను వెల్లడించి,  అవి “లోపల నుండి వస్తాయి మరియు అవి మనిషిని అపవిత్రం చేస్తాయి” అని చెప్పాడు. నేడు,   మనలో చాలా మంది పరిసయ్యుల వలె ప్రవర్తించడానికి శోదించబడుతున్నారు. నియమావళిని పాటించని ప్రతి ఒక్కరి నుండి తిరుసభను “స్వచ్ఛంగా” ఉంచడానికి మనం మనల్ని మనం వేరుచేసుకోవడానికి ప్రయత్నిస్తాము.

ప్రభూ, నేను పరిసయ్యుడిగా మారిన సమయాలకు నన్ను క్షమించు. నా పొరుగువారిని వెతకడంలో మరియు ప్రేమించడంలో “పెదవుల సేవ” జీవితాన్ని గడపడం మానేసి, నా విశ్వాసాన్ని జీవం పోయగల రోజువారీ మార్గాలను కనుగొనడంలో దయచేసి నాకు సహాయం చేయండి.

Br. Pavan OCD

మార్కు 7: 1-13

 February 11

ఆదికాండము 1: 20 – 2: 4

మార్కు 7: 1-13

అంతట యెరూషలేమునుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మ శాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుటను చూచిరి. పూర్వుల సంప్రదాయము ప్రకారము యూదులకు, ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగుకొనక భుజించు ఆచారములేదు. అంగటి నుండి కొనివచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్దిచేయక భుజింపరు. అట్లే పానపాత్రలను, కంచుపాత్రలను శుభ్రపరుపవలయునను ఆచారములు ఎన్నియో వారికి కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు "తమ శిష్యులు పూర్వుల  సంప్రదాయములను లెక్క చేయక మలినహస్తములతో భుజించుచున్నారేమి?" అని  యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన  వారితో "కపటభక్తులారా!మిమ్ము గుర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. 'ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు కాని వీరి హృదయములు నాకు దూరముగానున్నవి. మానవులు ఏర్పరచిన నియమములను దైవ ప్రబోధములుగా  బోధించుచున్నారు. కావున వారు చేయు  ఆరాధన వ్యర్ధము.' దేవుని ఆజ్ఞను నిరాకరించి , మానవనియమములను అనుసరించుచున్నారు" అని పలికెను. మరియు ఆయన వారితో " ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు. 'తల్లిదండ్రులను గౌరవింపుడు తల్లిదండ్రులను దూషించువాడు మరణదండనకు గురియగును.' అని మోషే ఆజ్ఞాపించేనుగదా! ఎవ్వడేని  తన తండ్రితోగాని, తన తల్లితోగాని 'నానుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది' అని చెప్పినచో అట్టి వాడు తన తండ్రినిగాని, తల్లినిగాని ఆదుకోను అవసరంలేదని మీరు బోధించుచున్నారు. ఈ రీతిని మీరు పూర్వసంప్రదాయమును అనుసరించు నెపమున దైవవాక్కునే అనాదరము చేయుచున్నారు. ఇట్టివి అనేకములు మీరు చేయుచున్నారు" అని చెప్పెను. 

ఈరోజు మనం సృష్టి యొక్క ఏడు రోజుల ముగింపు గురించి చదువుతాము మరియు  మానవులు చివరిగా సృష్టించబడ్డారని మనం చూస్తాము, కానీ వారు దేవుని సృష్టి కిరీటంలో కూడా రత్నం. చివరిగా సృష్టించబడినందున, దేవుని తరపున భూమిని చూసుకోవడానికి మనకు భూమి యొక్క నిర్వాహకత్వం కూడా అప్పగించబడింది. సృష్టిలో దేవుని పాత్ర మరియు దేవుడు ఉద్దేశించిన విధంగా ఆ సృష్టిని పరిపాలించడానికి మానవుల పాత్ర గురించి ఈ పుస్తకం ఒక ముఖ్యమైన జ్ఞాపిక. కీర్తనలు  దేవుని అద్భుతమైన సృష్టిని  స్తుతిస్తుంది. పునీత  మార్కు నుండి ఈనాటి సువిశేషంలో, ధర్మశాస్త్రం గురించి అతిగా శ్రద్ధ వహిస్తున్న పరిసయ్యులతో యేసు విభేదిస్తున్నట్లు మనం చూస్తాము. దేవుని చట్టం గురించి పట్టించుకోకుండా మానవ సంప్రదాయాలను అంటిపెట్టుకుని ఉన్నందుకు, ఆయన వారిని హెచ్చరిస్తున్నాడు. మనం ఏమి చేయాలనుకుంటున్నామో లేదా మనకు తగిన విధంగా సంప్రదాయాలను సృష్టించడంలో ఆసక్తి చూపడం కంటే దేవుని వాక్యాన్ని వినడం మరియు మన జీవితాల్లో దాని నియమాలను అమలు చేయడం నేడు మనకు సవాలుగా ఉంది.

1858లో, పద్నాలుగేళ్ల బెర్నాడెట్ సౌబిరస్ దక్షిణ ఫ్రాన్స్‌లోని లూర్డ్స్ పర్వత గ్రామం సమీపంలో మరియమాత నుండి ఒక దర్శనం పొందింది. ప్రారంభంలో, ప్రజలు ఆమెను నమ్మడానికి నిరాకరించారు కానీ దర్శనాలు కొనసాగాయి. బెర్నాడెట్  ఆమెను  ఎవరు అని అడిగినప్పుడు ఆమె తాను ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ అని సమాధానం ఇచ్చింది. కాలక్రమేణా, ఆమె దగ్గరకు   రావడానికి మరియు స్వస్థత పొందాలనే ఆశతో ప్రజలు అక్కడకు  తరలిరావడంతో ఆ  దర్శన స్థలం ప్రార్థన కేంద్రంగా మారింది. ఇక్కడ అనేక అద్భుతాలు జరిగాయి. దీనిని గుర్తించి, 1992లో పోప్ జాన్ పాల్ II ఈ ప్రత్యేక రోజుకు ;ప్రపంచ అనారోగ్య దినోత్సవంఅని పేరు పెట్టారు. ఈ రోజున, రోగుల అభిషేకం యొక్క మతకర్మతో సహా ప్రత్యేక ప్రార్థనలను జరుపుకోవచ్చు.

Br. Pavan OCD

మార్కు 6 : 53 -56

 February 10

ఆది 1 : 1 -19

మార్కు 6 : 53 -56

వారు సరస్సును దాటి, గెన్నెసరెతు ప్రాంతము చేరి, పడవను అచట కట్టివేసిరి. వారు పడవ నుండి వెలుపలికి వచ్చినవెంటనే, అచటి జనసమూహము ఆయనను గుర్తించెను. పిమ్మట వారు పరిసరప్రాంతములకెల్ల పరుగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడకలపై రోగులను మోసికొనివచ్చిరి. గ్రామములలోగాని, పట్టణములలోగాని, మారుమూల పల్లెలలోగాని, యేసు ఎచట ప్రవేశించినను జనులు సంతలలో, బహిరంగ స్థలములలో రోగులనుంచి, ఆయన వస్త్రముల అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్ధించుచుండిరి. ఆ విధముగా ఆయనను తాకిన వారందరును స్వస్థతపొందుచుండిరి. 


సువార్త యేసు మరియు గెన్నెసరెత్ ప్రజల మధ్య, వారి విశ్వాసం ద్వారా లోతైన సంబంధాన్ని వర్ణిస్తుంది. వారి విశ్వాసం వారిని వారి అనారోగ్యం నుండి రక్షించింది—దుస్తుల అంచు యేసు యొక్క అంతులేని కృపను సూచిస్తుంది. గెన్నెసరెత్ ప్రజలు మన జీవితాలను యేసు ముందు ప్రదర్శించడానికి మరియు ఆయన మనకు మంచి చేస్తాడని ఆయనపై నమ్మకం ఉంచడానికి ఒక నమూనాగా మారాలి. దేవుని సువార్తను మనం ఏ విధంగా అందరికీ వ్యాప్తి చేస్తాము మరియు పంచుకుంటాము? “దేవుని చిత్తాన్ని అమలు చేసేటప్పుడు లేదా గ్రహించేటప్పుడు ఆయన ప్రేమపూర్వక సన్నిధి మరియు ప్రొవిడెన్స్‌ను నమ్మండి” ఎందుకంటే ఆయన సన్నిధిని నమ్మడం మనల్ని రక్షిస్తుంది. సువార్తకు సంబంధించి, మన జీవితంలో దేవుని మార్గాలు మరియు ప్రణాళికలను నిస్సందేహంగా విశ్వసించమని మనం ప్రోత్సహించబడ్డాము. మనం వారికి ఏ సేవలు ఇచ్చినా అది మన చర్యలన్నింటికీ విస్తరించాలి.

కరుణామయుడైన తండ్రీ, మా ప్రార్థన ద్వారా, మేము నమ్మకంగా  మీ పుత్రత్వ స్ఫూర్తిని కాపాడుకోగల శక్తిని  ప్రసాదించండి, మీ  ద్వారా మేము పిలువబడటము  మాత్రమే కాదు, నిజంగా మేము మీ  బిడ్డలము. ప్రభువుని  ప్రేమ మరియు విశ్వాసాన్ని అనుకరించడానికి మాకు సహాయం చేయండి, మీ ఆజ్ఞలకు, మా నిజమైన విశ్వాసానికి మా నిబద్ధత ద్వారా వ్యక్తచేసేలా చేయండి. శోధనలలో నీ కృపను అనుగ్రహించండి, పాప సందర్భాలను నివారించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ,  మేము పడిపోయినట్లయితే మమ్ము కాపాడండి. ఆమెన్ 

Br. Pavan OCD



లూకా 5: 1-11

 February 09

యెషయా 6: 1-2a, 3-8

మొదటి కొరింథీయులు 15: 1-11

లూకా 5: 1-11

యేసు ఒక పర్యాయము గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచియుండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయనయొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. ఆయన అచట రెండు పడవలను చూచెను. జాలరులు వానినుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి త్రోయమని, అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో "మీరు పడవను ఇంకను లోతునకు తీసుకొని వెళ్లి చేపలకై వలలను వేయుడు " అనెను అందుకు నీమోను "బోధకుడా! మేము రాత్రి అంతయు శ్రమించితిమి. కాని ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము" అని ప్రత్యుత్తరము ఇచ్చెను. వల వేయగనే,  వల చినుగునన్ని చేపలు పడెను. అంతట జాలరులు రెండవ పడవలోనున్న తమ తోటివారికి, వచ్చి సహాయము చేయుడని ప్రాధేయపడగా, వారు వచ్చి రెండు పడవలను చేపలతో నింపగనే పడవలు మునుగునట్లు ఉండెను. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి "ప్రభూ! నేను పాపాత్ముడను. నన్ను విడిచిపొండు" అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూచి సీమోను, అతని తోటివారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న  జెబదాయి కుమారులు యాకోబు, యోహానులును అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అపుడు  సీమోనుతో " భయపడవలదు. ఇక నుండి నీవు  మనుష్యులను పట్టువాడవై ఉందువు" అనెను. ఆ జాలరులు పడవలను ఒడ్డునకుచేర్చి తమ సమస్తమును విడిచి పెట్టి యేసును అనుసరించిరి. 

యేసు తన శిష్యులను పిలిచిన ఈ కథ ఇతర సువార్తల కంటే లూకా సువార్తలో కనిపిస్తుంది. ఈ నేపథ్యం గలిలయ సముద్రం, దీనిని లూకా గెన్నెసరెతు సరస్సు అని పిలుస్తాడు. ఇది మార్కులోని రెండు కథలకు సమాంతరంగా ఉంటుంది: మార్కు 1:16–20, యేసు తన శిష్యులను పిలిచిన కథ; మరియు మార్కు 4:1–2, యేసు తన బోధనా పరిచర్యను ప్రారంభించిన కథ.

ఈ భాగాన్ని మూడు భాగాలుగా విభజించారు.  మొదటి భాగంలో, లూకా ఈ నేపథ్యాన్ని పరిచయం చేస్తున్నాడు. యేసు జనసమూహంచే ఒత్తిడి చేయబడుతున్నాడు. యేసు జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించగల మరియు బోధించగల ఒక పడవను  వేదికగా ఇవ్వమని ఒక జాలరిని అడుగుతాడు. తరువాత లూకా ఒక అద్భుతాన్ని వివరిస్తాడు. ఆ రోజు చేపలు పట్టలేకపోయినప్పటికీ, జాలర్లు తమ వలలను నీటిలో వేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తారు. వలలు చేపలతో నిండిపోతాయి.

వారు ఇతర పడవల్లో ఉన్న తమ స్నేహితులను పిలిచి ఆ బహుమతిలో పాలుపంచుకుంటారు. చివరగా యేసు మరియు జాలర్ల మధ్య సంబంధం ఏర్పడటం మనం చూస్తాము. జాలర్లు తమ వలలను వదిలివేసి, ప్రజలను కూడా పట్టుకుంటారని తన ప్రోత్సాహకరమైన మాటలతో యేసును అనుసరిస్తారు. వారు యేసు చేత “పట్టుకోబడ్డారు” మరియు ఈ అద్భుతమైన రూపకంలోవారికి కొత్త వృత్తి ఇవ్వబడింది.

ఈ వాక్యాన్ని  మనం ఆలోచిస్తున్నప్పుడు, పేతురు పిలుపు రెండవ వృత్తాంతం (అపొస్తలుల కార్యములు) లోని మరొక ప్రధాన పాత్ర అయిన పౌలుతో పోల్చవచ్చు. పేతురు మరియు పౌలు ఇద్దరూ తమ సాధారణ జీవితాలు మరియు వృత్తుల నుండి ఒక అద్భుతం  ద్వారా పిలువబడ్డారు. యేసును అనుసరించడం అంత సులువైన మార్గం ఏమి కాదు.  ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. కాని వారు అందుకు సిద్ధపడ్డారు.  

 ఈ రెండు పిలుపుల యొక్క లక్షణాలు నేటికీ చాలా మంది సాక్ష్యాలలో కనిపిస్తాయి. ఈ వచనాన్ని లూకాలో కేంద్ర ఇతివృత్తమైన యేసును మెస్సీయగా ప్రకటిస్తున్నట్లుగా ఆలోచిస్తూ, యేసు ఆత్మచే అభిషేకించబడ్డాడు, మోషే (మన్నా), ఏలీయా (మాంసం మరియు నూనె) మరియు ఎలీషా (రొట్టెలు) వంటి చర్యలను అద్భుత మార్గాల్లో చేస్తున్నాడు. దైవ రాజ్య పని సమృద్ధిగా దైవ కృప మరియు దాతృత్వంతో కూడి ఉందని లూకా చెబుతున్నాడు. కరుణ, ఆహ్వానం, న్యాయం మరియు దయ అనే మిషన్‌లో క్రీస్తును అనుసరించిన వారికి మరిన్ని ఆశీర్వాదాలు రావాలనే వాగ్దానం ఇది.

మన జీవితాల్లో మనం ఖాళీగా ఉన్నామని, దేవుని ప్రేమకు అర్హులం కాదని భావించే క్షణాలు ఉంటాయి, కాని  అక్కడ ఉండి దేవుని ప్రేమ ద్వారా రూపాంతరం చెందిన మరొకరి కరుణ ద్వారా మనం పునరుద్ధరించబడతాము. మరియు మన స్వంత విరిగిన స్థితి ద్వారానే మనం కరుణతో మరొక వ్యక్తిని దేవుని ప్రేమను అంగీకరించమని ప్రోత్సహించగలము.

Br. Pavan OCD

6, ఫిబ్రవరి 2025, గురువారం

మార్కు 6 : 30 -34

 Frbruary 08

హెబ్రీ 13 : 15 -17 , 20 -21

మార్కు 6 : 30 -34

శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను, బోధలను తెలియచేసిరి. గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే, ఆయన వారితో "మీరు ఏకాంత స్థలమునకు వచ్చి, కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు" అని చెప్పెను. అంతట వారందరు ఒక పడవనెక్కి సరస్సును దాటి, ఒక నిర్జనస్థలమునకు వెళ్లిరి. అయినను వారు వెళ్లుచుండగా చూచి అనేకులు అన్ని దిక్కులనుండి వారికంటే ముందుగా ఈ స్ధలమునకు కాలినడకతో వచ్చిచేరిరి. యేసు పడవనుదిగి, జనసమూహమును చూచి కాపరిలేని గొఱ్ఱెలవలెనున్న వారిపై కనికరము కలిగి, వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. 

ఒక స్త్రీ తన అనేక సమస్యలకు సలహా కోసం తన పొరుగువారి వద్దకు వెళ్ళింది. పొరుగువారు ఆ సమస్యలో ఉన్న స్త్రీని ఈ ప్రశ్న అడిగారు: “యేసు మీ జీవితంలో అంతర్భాగమా? ఉదాహరణకు, మీరు ఎల్లప్పుడూ ప్రభువుకు ప్రార్థిస్తారా? మీరు ఎల్లప్పుడూ పవిత్ర ప్రార్థనకు హాజరవుతారా?” ఆ స్త్రీ లేదు అని చెప్పింది, ఆపై పొరుగువారు యేసు కోసం సమయం కేటాయించమని ఆమెకు సలహా ఇచ్చారు. సువార్తలో, యేసు వారి జీవితాలను సరిచేస్తాడని వారికి తెలుసు కాబట్టి ఒక పెద్ద సమూహం యేసు వెంట పరుగెత్తుతోంది (మార్కు 6:34). వారు స్వస్థత పొంది, ఆహారం తీసుకోవాలనుకున్నందున మాత్రమే వారు యేసును అనుసరించలేదు. కొందరు బహుశా ఆయనను చూడాలని కోరుకున్నందున ఆయనను వెంబడించి ఉండవచ్చు మరియు అది వారి శరీరాన్ని మరియు ఆత్మను స్వస్థపరచడానికి సరిపోతుంది. యేసు ఎక్కడికి వెళ్ళినా ఆయనను వెంబడిస్తున్న విస్తారమైన జనసమూహం యేసులో మంచి గొర్రెల కాపరిని చూసింది,

అతను వారికి ఆహారం ఇచ్చి స్వస్థపరచడమే కాదు. వారికి విలువైన సలహా మరియు మార్గదర్శకత్వం ఇచ్చే వ్యక్తిని కూడా వారు యేసులో చూశారు. దీని అర్థం మీకు దీని అర్థం ఏమిటి? జీవితంలో మనకు సమస్యలు మరియు ఆందోళనలు పరిష్కరించడం కష్టంగా అనిపించినప్పుడు, మనము ప్రార్థనలో యేసు వద్దకు వెళ్లాలి. ఆయన ముందు మోకాళ్ళను వంచి ఆయన సహాయం మరియు మార్గదర్శకత్వం కోసం అడగాలి. ఎందుకంటే మన జీవితంలోని అనేక సవాళ్లను మీరు ఎదుర్కొన్నప్పుడు మిమ్మల్ని నడిపించడానికి మరియు సహాయం చేయడానికి యేసు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు.

సర్వశక్తిమంతుడు, శాశ్వతమైన దేవా, నిజమైన వెలుగు యొక్క వైభవం మరియు, మీ రాజ్యం కోసం మేము చేసే  ప్రయత్నం స్వార్థం లేదా భయం ద్వారా తగ్గకుండ, విశ్వం మొత్తం ఆత్మతో సజీవంగా ఉండేల  మరియు మా గృహాలు ప్రపంచ విమోచనకు హామీగా ఉండేలా,  మా కళ్ళు చూడనివ్వండి మరియు మా హృదయాలు మాకు అందరిని  కరుణించేల చేయనివ్వండి. ఆమెన్.

Br. Pavan OCD

5, ఫిబ్రవరి 2025, బుధవారం

మార్కు 6 : 14 – 29

 February 07

హెబ్రీ 13 : 1 - 8

మార్కు 6 : 14 – 29

ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో నుండి లేచెను. అందువలననే ఇతనియందు అద్భుత శక్తులు కార్యరూపములు తాల్చుచున్నవి" అని కొందరు "ఇతడు ఏలీయా" అని మరికొందరు, "ఇతడు ప్రవక్తలలో ఒకనివలె ఉన్నాడు" అని ఇంక కొందరును చెప్పుకొనుచుండిరి. కాని, అది వినిన హేరోదు "నేను శిరచ్చేదనము గావించిన యోహానే మృతములనుండి లేపబడెను" అని పలికెను. తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హేరోదియా నిమిత్తము హేరోదు యోహానును పట్టి, బంధించి, చెరసాలలో పడవేసెను. ఏలయన, అతడు హేరోదియాను వివాహమాడియుండెను. అంతే కాక యోహాను "నీవు నీ సహోదరుని భార్యను వివాహమాడుట సరికాదు" అని హేరోదును హెచ్చరించుచుండెను. హేరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను. కాని, ఆమెకు అది సాధ్యము కాకపోయెను. ఏలయన , యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతనిని కాపాడచూచెను. అతని హితోపదేశములకు హేరోదు కలతచెందినను వానిని ఆలకింప మనస్సు కలవాడై ఉండెను. తుదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశం కలిగెను. హేరోదు తన జన్మ దినోత్సవము కొలువులోని ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలీయ సీమలోని ప్రముఖులకు విందు చేయించెను. హేరోదియా కుమార్తె లోనికి వచ్చి, హేరోదు ప్రభువునకు, ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను. అపుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి "నీ ఇష్టమైన దానిని కోరుకొనుము.  ఇచ్చెదను. నీవు ఏమి కోరినను, నా అర్ధ రాజ్యము నైనను ఇచ్చెదను" అని ప్రమాణ పూర్వకముగా పలికెను. అపుడు ఆమె వెలుపలకు పోయి, తన తల్లితో "నేనేమి కోరుకొనవలెను?'' అని అడుగ ఆమె " స్నాపకుడగు యోహాను తలను కోరుకొనుము" అని చెప్పెను. అంతట ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి, "స్నాపకుడగు యోహాను శిరమును ఇప్పుడే ఒక పళ్ళెములో పెట్టి ఇప్పింపుము" అని కోరెను. అందులకు రాజు మిగుల బాధపడెను. కాని, అతిధుల ఎదుట శపథము చేసినందున  ఆమె కోరికను కాదనలేకపోయెను. కనుక, అతడు "యోహాను తలను తీసికొనిరమ్ము" అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను. వాడు అట్లే పోయి చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి, ఒక పళ్ళెములో పెట్టి ఆ బాలికకు ఈయగా, ఆమె తన తల్లికి ఇచ్చెను. ఈ సంఘటనను వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి, ఆ భౌతిక దేహమును తీసికొనిపోయి సమాధిచేసిరి.  

ఈనాటి పఠనాలు మనలను సత్యము కోసము నిలబడే వ్యక్తులుగా మలచుకోవాలి అని బోధిస్తున్నాయి. బాప్టిజం ఇచ్చే యోహాను ఒక ప్రవక్త. ప్రభువు మార్గాన్ని సరళంగా చేసే అధికారం అతనికి ఇవ్వబడింది. తన జీవితాంతం, అతను తన లక్ష్యాన్ని సాధించేలా చూసుకున్నాడు. అతను పశ్చాత్తాపం మరియు సత్య సువార్తను ప్రకటించాడు. తన జీవితాంతం, అతను సరళత మరియు పవిత్రతతో జీవించే మార్గాన్ని మనకు చూపించాడు. అన్నింటికంటే ముఖ్యంగా, అతను ధైర్యం యొక్క అర్థాన్ని మనకు చూపించాడు. 

హేరోదు ఒక శక్తివంతమైన వ్యక్తి. అతను కోరుకున్నది ఏదైనా చేయగలడు, మరియు అతను చేశాడు. అతను తన సొంత సోదరుడి భార్యను వివాహం చేసుకున్నాడు మరియు ప్రవక్త యోహాను దానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, అతను పేద యోహానును అరెస్టు చేసి, హేరోదియ   కుమార్తె ద్వారా అతని అక్రమ భార్య మధ్యవర్తిత్వంపై అతని శిరచ్ఛేదం చేయించాడు. యోహాను భయంతో కుంగిపోలేదు దానికి  బదులుగా, తన చర్య యొక్క పర్యవసానాన్ని ఎదుర్కొన్నాడు.

 హింసించబడిన లేదా అమరవీరుడైన బోధకుడికి లేదా నిజం మాట్లాడటానికి ప్రయత్నించే ఏ వ్యక్తికైన బాప్టిజం ఇచ్చే యోహాను ఉత్తమ ఉదాహరణలలో ఒకడు. నిజం నిజంగా బాధిస్తుంది మరియు చాలా మంది నిజం కంటే అబద్ధంలో జీవించడానికి ఇష్టపడతారు. సత్యం కోసం నిలబడటానికి ధైర్యం అవసరం మరియు బాప్టిజం ఇచ్చే యోహాను దాని కోసం తన ప్రాణాలను అర్పించాడు. ధైర్యాన్ని పక్కన పెడితే, బాప్తిస్మమిచ్చు యోహాను నుండి నేర్చుకోవలసిన మరో ముఖ్యమైన పాఠం విశ్వాసం. మన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ మన లక్ష్యానికి నమ్మకంగా ఉందాం. అవిశ్వాసం కంటే తల లేకుండా ఉండటం మంచిది. మూర్ఖులైన భూరాజుల కంటే నీతిమంతుడైన దేవునికి నమ్మకంగా ఉండటం మంచిది. పేతురు మరియు ఇతర అపొస్తలుల మాదిరిగానే, మనం మానవుల కంటే దేవునికి లోబడాలి (అపొస్తలుల కార్యములు 5:29).

ప్రభువా! యోహాను ద్వారా సత్యానికి ఎలా సాక్ష్యమివ్వాలో నేర్పిస్తున్నారు. యోహాను వలే ఎప్పుడు మీకు నిజమైన సాక్షులుగా జీవించుటకు కావలసిన అనుగ్రహములు మాకు  దయచేయండి. ప్రభువా! కొన్ని సార్లు మేముకూడా హేరోదియా వలె మేము కోరుకున్నదే జరగాలనే విధంగా జీవిస్తుంటాము.  దానికోసం సత్యాన్ని మరుగున పరచాలని, దానికి సాక్ష్యంగా ఉన్న వారిని నాశనము చేయాలనని చేసే వారిలా ప్రవర్తిస్తుంటాము. అటువంటి సమయాలలో మమ్ము క్షమించి  సత్యానికి సాక్షులుగా జీవించేలా చేయండి. ఆమెన్ 

3, ఫిబ్రవరి 2025, సోమవారం

మార్కు 6 : 7 – 13

 February 06

హెబ్రీ 12 : 18 - 19 , 21 - 24

మార్కు 6 : 7 – 13

యేసు పన్నిద్దరు శిష్యులను తనచెంతకు పిలిచి, బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. "ప్రయాణములో మీరు చేతికఱ్ఱను తప్ప మరి ఏమియు తీసికొనిపోరాదు. రొట్టెగాని, జోలెగాని, సంచిలో ధనమునుగాని వెంటతీసుకొని పోరాదు. పాదరక్షలు తొడుగుకొనుడు కాని, రెండు అంగీలను తీసుకొనిపోవలదు . మీరు ఎచ్చట ఒక ఇంట పాదము మోపుదురో, అచటినుండి వెడలి పోవునంతవరకు ఆ ఇంటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో, మీ బోధను ఎవరు ఆలకింపరో, వారికి తిరస్కారసూచకముగా మీ కాలి  దుమ్మును అచట దులిపి, వెళ్లిపోండి" అని యేసు తన శిష్యులతో చెప్పెను. అంతట ఆయన శిష్యులు  పోయి, ప్రజలు పశ్చాత్తాపముతో హృదయపరివర్తనము పొందవలెనని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలిరి. రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరిచిరి. 

సువార్తలో ప్రభువు మనకు ఇలా ఆజ్ఞాపించాడు: “జాగ్రత్తగా ఉండండి, అన్ని రకాల దురాశలకు, దురాశలకు దూరంగా ఉండండి”. “ఈ లోక చింతలకు, ఈ జీవిత చింతలకు దూరంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి” (మత్త 6:25; లూకా 21:34). కాబట్టి, ఏ సహోదరుడు కూడా, అతను ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ కారణం లేకుండా, బట్టలు లేదా పుస్తకాలు లేదా ఏదైనా పనికి చెల్లింపు కోసం డబ్బు లేదా నాణేలను తీసుకెళ్లకూడదు, స్వీకరించకూడదు లేదా స్వీకరించకూడదు - వాస్తవానికి, అది అనారోగ్య సోదరుల స్పష్టమైన అవసరం కోసం తప్ప, డబ్బు లేదా నాణేలు రాళ్ల కంటే గొప్ప విలువను కలిగి ఉన్నాయని మనం అనుకోకూడదు. మరియు అపవాది దానిని కోరుకునే వారిని లేదా రాళ్ల కంటే మెరుగైనదిగా భావించే వారిని అంధుడిని చేయాలనుకుంటాడు. కాబట్టి, అన్నిటినీ విడిచిపెట్టిన మనం, పరలోక రాజ్యాన్ని అంత తక్కువ ధరకు కోల్పోకుండా జాగ్రత్త వహించాలి ( మత్త 19:27; మార్క్ 10:24.28). మరియు మనం ఎక్కడైనా నాణేలను కనుగొంటే, మన పాదాలతో మనం చూర్ణం చేసే దుమ్ము కంటే వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు, ఎందుకంటే ఇదంతా “వ్యర్థాలలో వ్యర్థం మరియు అంతా వ్యర్థమే” (ప్రసంగి1:2).

ప్రభువా, మాకు రక్షణను గూర్చిన నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించుము, తద్వారా భయం నుండి మరియు మా శత్రువుల శక్తి నుండి విముక్తి పొంది, మేము ఎటువంటి లోకసంబంధమైన బంధాలచేత అడ్డంకులు లేకుండా, నీ ప్రేమగల మరియు నడిపించే చేతిని మాత్రమే నమ్ముకుని నిన్ను సేవించగలము. మా హృదయాలను, మనస్సులను, శరీరాలను, మా సమస్తమును నీకు అప్పగించుటకు మాకు సహాయం చేయుము, మా జీవితకాలమంతయు నమ్మకంగా సేవ చేయుము. నీ నమ్మకమైన సేవకుడైన సెయింట్ ఫ్రాన్సిస్కో స్పినెల్లి ప్రార్థనలు మాకు బలాన్ని ఇస్తాయి. మా ప్రభువైన యేసు ద్వారా పరిశుద్ధాత్మతో, దేవునితో మేము మా ప్రార్థనను శాశ్వతంగా చేస్తాము, ఆమెన్.

Br. Pavan 

మార్కు 6 : 1 -6

 February 05

హెబ్రీ 12 : 4 -7 , 11 -15

మార్కు 6 : 1 -6

ఆయన అక్కడనుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్ధనామందిరములో ఆయన బోధింప ఆరంభిచెను. ఆయన భోదనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి, "ఈయనకు ఇవి అన్నియు  ఎట్లు  లభించినవి? ఈయనకు  ఈ జ్ఞానము ఎట్లు కలిగినది. ఈయన ఇట్టి అద్భుతకార్యములను ఎట్లు చేయుచున్నాడు? ఈయన వండ్రంగి కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, యూదా, సీమోను అనువారల సోదరుడుకాదా? ఈయన అక్కచెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా?" అని చెప్పుకొనుచు తృణీకరించిరి. "ప్రవక్త తన పట్టణమునను , బంధువులమధ్యను, తన  ఇంటను తప్ప ఎచటనైనను గౌరవింపబడును" అని యేసు వారితో పలికెను. ఆయన అచట కొలదిమంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరచెను కాని, మరి ఏ అద్భుతమును అచట చేయజాలకపోయెను. వారి అవిశ్వాససమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్లి, ప్రజలకు బోధింపసాగెను.


యేసు అంత జ్ఞానవంతుడు మరియు శక్తివంతమైన వక్తగా ఎలా మారాడు? ఆయన ఒక వడ్రంగి కుమారుడు, రబ్బీ కుమారుడు కాదు. ఆయన స్వస్థలంలో అనేక మంది యేసును మరియు ఆయన సందేశాన్ని తిరస్కరించారు. వారు ఆయన మాట వినడానికి నిరాకరించారు. అన్నింటికంటే, తనను పుట్టినప్పటి నుండి తెలిసిన ప్రజలకు తాను ఎవరని ప్రకటించాలని యేసు భావించాడు? యేసు కోపం తెచ్చుకోలేదు. బదులుగా, సాధారణంగా ఒక ప్రవక్త తనను పుట్టినప్పటి నుండి తెలిసిన వ్యక్తులచే గౌరవించబడరని యేసు వారి వ్యాఖ్యలకు సమాధానమిస్తూ చెప్పాడు. తాను వారికి చాలా సుపరిచితుడని యేసు గ్రహించాడు. వారు చూడాలనుకున్న వాటిని మాత్రమే ఆయనలో చూశారు. అందువల్ల యేసు అక్కడ గొప్ప కార్యాలు చేయలేకపోయాడు ఎందుకంటే వారికి ఆయనపై విశ్వాసం లేదు. మీ గురించి ఏమిటి, యేసు గురించి మీరు ఏమి చెప్పగలరు అని మనలను మనం ప్రశ్నించుకోవాలి?

ప్రభూ, సాధారణ సంఘటనలలో, మీ ఉనికిని మేము గుర్తించగలమని మరియు మాకు పోషణ మరియు జీవితాన్ని ఇవ్వాలనుకునే మార్గాలను గమనించగలమని మేము ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే మీరు అన్ని విషయాలలో ఉన్నారు. పక్షపాతాలు మరియు సందేహాల నుండి మమ్మల్ని విడిపించండి. మీతో చేరడానికి మరియు మిమ్మల్ని మరింత తెలుసుకోవడానికి మా హృదయాలను తెరవడానికి మేము మీ బలాన్ని కోరుకుంటున్నాము. మేము దీనిని యేసు నామంలో అడుగుతున్నాము. ఆమెన్.

బ్ర. పవన్ 

మార్కు 5 : 21 – 43

 February 04

హెబ్రీ 12 : 1 - 4

మార్కు 5 : 21 – 43

పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్లగా, జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అటుల ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా, ప్రార్ధనామందిరపు అధికారులలో ఒకడైన యాయీరు అనువాడువచ్చి, ప్రభువు పాదములపై పడి, "ప్రభూ!నా కుమార్తె మరణావస్థలో ఉన్నది. తాము వచ్చి, ఆ బాలికపై తమ హస్తముల నుంచిన ఆమె స్వస్థతపొంది, జీవింపగలదు" అని మిగుల బ్రతిమాలెను. అంతట ఆయన అతనితో వెళ్లుచుండగా గొప్పజనసమూహము ఆయనను వెంబడించుచు పైపైబడుచుండెను. పండ్రెండు సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు ఉన్నదంతయు వెచ్చించినను, ఆ వ్యాధి ఏ మాత్రము తగ్గకపోగా పెచ్చుపెరిగెను. ఆమె యేసును గూర్చి విని, జనసమూహములోనుండి ఆయన వెనుకగా వచ్చి, "ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలనగుదును" అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె  రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె  తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థతపొందినట్లు  గుర్తించెను. అపుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి "నా వస్త్రములను తాకిన వారెవ్వరు? "  అని  ఆ జన సమూహమును ప్రశ్నించెను. "ఈ జనసమూహము తమపై పడుచుండుట  చూచుచున్నారుగదా! 'నన్ను తాకినదెవరు ' అని ప్రశ్నించుచున్నారేల?" అని శిష్యులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలిసికొనవలెనని ఆయన నలుదెసలు తేరిపారజూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడవణకుచు, ఆయన పాదములపైబడి జరిగినదంతయు విన్నవించెను. అందుకాయన ఆమెతో "కుమారీ! నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము" అని పలికెను. ఇంతలో పార్ధనా మందిరాధ్యక్షుడగు యాయీరు ఇంటినుండి కొందరు వచ్చి "నీ కుమార్తె మరణించినది. గురువును ఇంకను శ్రమపెట్టనేల?" అనిరి యేసు వారి మాటలను లక్ష్య పెట్టక, ఆ మందిరాధ్యక్షునితో, "నీవు ఏ మాత్రము అధైర్యపడకుము. విశ్వాసమును కలిగియుండుము." అని చెప్పెను. పిదప పేతురును, యాకోబును, అతని సోదరుడగు యోహానును మాత్రము తన వెంట తీసుకొని, ఆ అధికారి ఇంటికి వెళ్లెను. అచట జన సమూహము గొల్లున ఏడ్చుటయు, ప్రలాపించుటయు చూచి, ఆయన లోపలి ప్రవేశించి "మీరు ఏల ఇట్లు గోలగా ఏడ్చుచుచున్నారు! ఈ బాలిక నిద్రించుచున్నదిగాని, చనిపోలేదు" అని వారితో పలికెను. అందులకు వారు ఆయనను హేళనచేసిరి. అయినను, యేసు అందరిని వెలుపలకు పంపి, ఆ బాలిక తల్లిదండ్రులతోను, తన  శిష్యులతోను బిడ్డ పరుండియున్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చెయ్యిపట్టుకోని "తలితాకూమీ" అనెను. "ఓ బాలికా! లెమ్మని నీతో చెప్పుచున్నాను" అని ఈ మాటలకు  అర్ధము. వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను. ఆమె పండ్రెండేండ్ల ప్రాయముగలది. అది చూచిన   జనులెల్లరు ఆశ్చర్యచకితులైరి. "దీనిని ఎవరికిని వెల్లడింపకుడు" అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి, "ఆమెకు తినుటకు ఏమైన పెట్టుడు" అని చెప్పెను.   

పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ ఆలోచనలు మరియు అనుభవాలు ఇవే. ఆమె చాలా మంది వైద్యులను ఆశ్రయించింది మరియు స్వస్థత పొందే ప్రయత్నంలో తన వద్ద ఉన్నదంతా ఖర్చు చేసింది. విచారకరంగా, ఏదీ పని చేయలేదు. దేవుడు ఆమె బాధను ఆ సంవత్సరాలన్నీ కొనసాగడానికి అనుమతించి ఉండవచ్చు, తద్వారా ఆమెకు అందరూ చూసేలా తన విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి ఈ అవకాశం ఇవ్వబడుతుంది. ఆసక్తికరంగా, ఈ భాగం ఆమె యేసును సమీపిస్తున్నప్పుడు ఆమె అంతర్గత ఆలోచనను వెల్లడిస్తుంది. “నేను అతని దుస్తులను తాకితే...” ఈ అంతర్గత ఆలోచన, విశ్వాసం యొక్క అందమైన ఉదాహరణ. ఆమె స్వస్థత పొందుతుందని ఆమెకు ఎలా తెలుసు? ఇంత స్పష్టత మరియు నమ్మకంతో ఆమెను ఎందుకు నమ్మేలా చేసింది? ఆమె అనేకమంది  వైద్యులతో పన్నెండు సంవత్సరాలుగా చికిత్స పొందిన  తర్వాత, స్వస్థత పొందడానికి యేసు దుస్తులను తాకడమే తనకు అవసరమని ఆమె అకస్మాత్తుగా గ్రహిస్తుంది. ఎందుకు? అంటే  సమాధానం సులభం. ఎందుకంటే ఆమెకు విశ్వాసం అనే బహుమతి ఇవ్వబడింది. మరో మాటలో చెప్పాలంటే, ఆమె స్వస్థత పొందుతుందని ఆమెకు తెలుసు, మరియు ఈ స్వస్థత గురించి ఆమెకున్న జ్ఞానం దేవుడు ఇచ్చిన బహుమతిగా ఆమెకు వచ్చింది.

ఒకసారి ఆమెకు ఈ జ్ఞానం ఇచ్చిన తర్వాత, ఆమె ఈ జ్ఞానంపై చర్య తీసుకోవాలి మరియు అలా చేయడం ద్వారా, ఆమె కథను చదివే వారందరికీ, ఆమె అద్భుతమైన సాక్ష్యాన్ని ఇచ్చింది. ఆయన నిరంతరం మాట్లాడుతూ, తన ప్రేమ యొక్క లోతును మనకు వెల్లడిస్తూ, స్పష్టమైన విశ్వాసం యొక్క జీవితంలోకి ప్రవేశించమని పిలుస్తున్నాడు. మన సొంత  విశ్వాసం మన జీవితాలకు పునాదిగా ఉండటమే కాకుండా ఇతరులకు శక్తివంతమైన సాక్షిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ స్త్రీకి ఉన్న విశ్వాసం యొక్క అంతర్గత దృఢ నిశ్చయాన్ని ఈరోజు ఆలోచించండి. దేవుడు మాట్లాడటం వినడానికి ఆమె తనను తాను అనుమతించినందున దేవుడు ఆమెను స్వస్థపరుస్తాడని ఆమెకు తెలుసు. దేవుని స్వరానికి మీ సొంత  అంతర్గత శ్రద్ధను  కలిగి ఆలోచించండి, మరియు ఈ స్త్రీ చూసిన అదే లోతైన విశ్వాసాన్నీ కలిగిఉండటానికి   ప్రయత్నించండి.

ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు నిన్ను తెలుసుకోవాలని మరియు మీరు ప్రతిరోజూ నాతో మాట్లాడటం వినాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి నా విశ్వాసాన్ని పెంచుము, తద్వారా నిన్ను మరియు నా జీవితానికి నీ చిత్తం ఏమిటని  నేను తెలుసుకుంటాను. ఇతరులకు విశ్వాస సాక్షిగా ఉండటానికి, నీవు కోరుకున్న విధంగా నన్ను ఉపయోగించుకో. యేసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమెన్.

Br. Pavan OCD

2, ఫిబ్రవరి 2025, ఆదివారం

మార్కు 5 : 1 - 20

 February 03

హెబ్రీ 11 : 32 - 40

మార్కు 5 : 1 - 20

పిదప వారు సరస్సునకు ఆవలనున్న  గెరాసేనుల దేశమును చేరిరి. యేసు పడవనుండి దిగినవెంటనే దయ్యము పట్టినవాడు ఒకడు సమాధులలోనుండి ఆయనయొద్దకు వచ్చెను. సమాధులలో నివసించుచున్నవానిని గొలుసులతో కూడ  బంధింప ఎవరికీ సాధ్యము కాకుండెను. అనేక పర్యాయములు వానిని ఇనుప  గొలుసులతో త్రెమ్పివేయుచుచుండెను. కనుక, వాడు ఎవ్వరికిని స్వాధీనము కాక పోయెను ఇట్లు వాడు రేయింబవళ్లు సమాధులయందును, కొండకోనలయందును నివసించుచు, అరచుచుండెను. రాళ్లతో తనను తాను గాయపరచుకొనుచుండెను. వాడు దూరమునుండియే యేసును చూచి, పరుగెత్తుకొనివచ్చి పాదములపైబడి, ఎలుగెత్తి 'సర్వోన్నతుడవగు దేవుని కుమారా! యేసూ! నా జోలినీకేల? నన్ను హింసింపవలదు. దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను" అని మొరపెట్టెను. "ఓరీ! అపవిత్రాత్మ! వీని నుండి వెడలిపొమ్ము" అని ఆయన శాశించినందున అతడట్లు మొరపెట్టెను. పిమ్మట ఆయన "నీ పేరేమి?" అని వానిని ప్రశ్నించెను. వాడు అందులకు "నా పేరు దళము. ఎందుకనగా మేము అనేకులము" అని జవాబిచ్చెను" "మమ్ము ఈ దేశము నుండి తరిమివేయవలదు" అని ఆయనను మిక్కిలి వేడుకొనెను. అపుడు ఆ కొండప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయుచుండెను. "మమ్ము అందరిని ఆ  పందులమందలో ప్రవేశింప అనుమతి దయచేయుడు" అని ఆ దయ్యములు ఆయనను ప్రార్ధించెను. ఆయన అట్లే అనుమతించెను. అంతట ఆ దయ్యములు ఆ పందులలో ప్రవేశించెను. రమారమి రెండువేల సంఖ్యగల ఆ మంద నిట్టనిలువుగానున్న మిట్టనుండి సరస్సులోపడి మునిగి ఊపిరాడకచచ్చేను. అపుడు పందులను మేపువారు పరుగెత్తి పట్టణములలో పరిసర పల్లెపట్టులలో ఈ సమాచారమును ప్రచారము చేసిరి. ఆ దృశ్యమును  చూడజనులు గుమిగూడి వచ్చిరి.  దయ్యము పట్టిన వాడు వస్త్రములు ధరించి, స్వస్థుడై కూర్చుండి ఉండుటను చూచి వారు భయపడిరి. పందుల సంఘటనను, దయ్యములు పట్టినవానికి జరిగినది చూచిన వారు ఇతరులకు దానిని తెలియజేసిరి. తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయనను ప్రార్ధించిరి. అంతట యేసు పడవ నెక్కునపుడు "నన్ను మీ వెంటరానిండు" అని దయ్యముపట్టినవాడు ప్రార్ధించెను. అదనుకు ఆయన సమ్మతింపక, "నీవు నీ ఇంటికి, నీ బంధువులయొద్దకు పోయి, ప్రభువు నిన్ను కనికరించి, నీకు చేసిన మేలును గూర్చి వారికి తెలియచెప్పుము" నాయి వానిని ఆజ్ఞాపించెను. వాడు పోయి, యేసు తనకు చేసిన ఉపకారమును గూర్చి దెకపొలి (అనగా పది పట్టణములు) ప్రాంతమున ప్రకటింపసాగెను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. 

తండ్రి కుమారుడును  పంపినట్లే, కుమారుడు  కూడా అపొస్తలులను పంపాడు (యోహాను 20:21), “మీరు వెళ్లి, సమస్త జనములను శిష్యులనుగా చేయుడి; తండ్రి నామమున కుమారుని నామమున పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని  వారికి బోధించుడి. ఇదిగో లోకసమాప్తి వరకు నేను మీతో ఉన్నాను” అని చెప్పాడు. (మత్తయి 28:19) అపొస్తలుల వలె  రక్షణ సత్యాన్ని ప్రకటించాలనే క్రీస్తు ఆదేశాన్ని తల్లి తిరుసభ పొందింది.  మరియు దానిని భూమి చివరలకు కూడా ప్రకటించాలి. ఎందుకంటే, దేవుని ప్రణాళిక పూర్తిగా నెరవేరేలా, క్రీస్తును ప్రపంచానికి, రక్షణకు మూలంగా ఆయన ఏర్పాటు చేసిన విధంగా, పరిశుద్ధాత్మ తన వంతు బాధ్యతను నిర్వర్తించమని, చర్చిని బలవంతం చేస్తుంది. సువార్త ప్రకటన ద్వారా ఆమె తన శ్రోతలను విశ్వాసాన్ని స్వీకరించడానికి మరియు ప్రకటించడానికి సిద్ధం చేస్తుంది. ఆమె వారికి బాప్టిజం కోసం అవసరమైన స్వభావాలను ఇస్తుంది, వారిని తప్పుడు క్రియలు  మరియు విగ్రహాల బానిసత్వం నుండి తొలగించి క్రీస్తులో చేర్చుతుంది, తద్వారా దాతృత్వం ద్వారా, వారు క్రీస్తులో పూర్తి పరిపక్వతకు పొందుతారు. దీని పని ద్వారా, మానవుల మనస్సులలో మరియు హృదయాలలో ఉన్న మంచి , విభిన్న ప్రజల మతపరమైన ఆచారాలు మరియు సంస్కృతులలో ఏదైనా మంచి దాగి ఉంటె , అది నాశనం నుండి రక్షించబడటమే కాకుండా, దేవుని మహిమ కోసం, అపవాది యొక్క గందరగోళం నుండి మరియు మనిషి యొక్క ఆనందం కోసం శుద్ధి చేయబడి,  పరిపూర్ణం చేయబడుతుంది.

విశ్వాసాన్ని వ్యాప్తి చేసే బాధ్యత క్రీస్తు యొక్క ప్రతి శిష్యుడిపై అతని స్థితి ప్రకారం విధించబడింది. అయితే, విశ్వాసులందరూ బాప్తిస్మం తీసుకోగలిగినప్పటికీ, గురువు  మాత్రమే దివ్యబలి   చేయగలడు. “సూర్యుడు ఉదయించినది మొదలుకొని అస్తమించేది వరకు నా నామము అన్యజనులలో గొప్పది మరియు ప్రతి స్థలములోను నా నామమున ఒక పవిత్రమైన నైవేద్యము బలి అర్పించబడి అర్పించబడును” అని దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు ఈ విధంగా నెరవేరుతాయి. (మలాకీ 1:11) ఈ విధంగా తల్లి తిరుసభ  ప్రపంచం మొత్తం దేవుని ప్రజలుగా, ప్రభువు శరీరంగా మరియు పరిశుద్ధాత్మ ఆలయంగా మారాలని ప్రార్ధిస్తుంది మరియు శ్రమిస్తుంది.”

 మేము మీ కుమారుని మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు, విశ్వాసం, నమ్మిక మరియు ప్రేమతో   పవిత్రాత్మతో మమ్మల్ని నింపండి. సర్వశక్తిమంతుడైన దేవా, మీరు బ్రిట్టోకు చెందిన సెయింట్ జాన్‌ను సువార్త  ప్రముఖ బోధకుడిగా చేసారు. అతని ప్రార్థనల ద్వారా మమ్మల్ని ప్రేమతో మరియు ఆత్మల పట్ల ఆయనకు ఉన్న  ఉత్సాహంతో ప్రేరేపించండి, తద్వారా మేము నిన్ను మాత్రమే సేవించగలము. బ్రిట్టోకు చెందిన సెయింట్ జాన్, మా కొరకు ప్రార్థించండి! ఆమెన్ 

Br. Pavan OCD

1, ఫిబ్రవరి 2025, శనివారం

దేవాలయంలో బాల యేసుని సమర్పించుట

 February 02

 దేవాలయంలో బాల యేసుని  సమర్పించుట 

మొదటి పఠనం – మలాకీ 3:1-4

రెండవ పఠనం – హెబ్రీయులు 2:14-18

 లూకా 2:22-40

మోషే చట్ట ప్రకారము వారు శుద్ధిగావించు కొనవలసినదినములు వచ్చినవి. 'ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పించబడవలయును'  అని ప్రభువు ధర్మశాస్త్రములో  వ్రాయబడినట్లు  మరియమ్మ  యోసేపులు  బాలుని యెరూషలేమునకు తీసికొనిపోయిరి. చట్ట ప్రకారం "ఒక జత గువ్వలనైనను, రెండు పావురముల పిల్లలనైనను"  బలిసమర్పణ చేయుటకు అచటకు వెళ్లిరి. యెరూషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు, దైవభక్తుడు ఉండెను. అతడు యిస్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుండెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ  తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అపుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచారవిధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసికొనిరాగా, తీసికొని దేవుని ఇట్లు  స్తుతించెను: "ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానంతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు  ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు; నీ ప్రజలగు  యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు." బాలుని గురించి ఈ మాటలు విని అతని తల్లియు , తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి, ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను: "ఇదిగో ! ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడియున్నాడు. అనేకులా మనోగతభావములను భయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది." అపుడు అచట అన్నమ్మయనెడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫానూయేలు పుత్రిక. ఆమె కడువృద్ధురాలు. వివాహమైన పిదప ఏడు సంవత్సరములు సంసారము చేసి, ఆ తరువాత ఎనుబది నాలుగు సంవత్సరములుగా విధవరాలై దేవాలయముచెంతనే ఉండిపోయెను. ఉపవాసములు, ప్రార్ధనలు చేయుచు, రేయింబవళ్లు దేవుని సేవలో మునిగియుండెను. ఆమె ఆక్షణముననే దేవాలయములోనికి వచ్చి, దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి, గలిలీయప్రాంతములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగివచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై, పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. 

ప్రభువు సమర్పణ, మన జీవితాంతం దేవుణ్ణి నమ్మడం అంటే ఏమిటో మనకు చూపిస్తుంది. మరియ మరియు యోసేపు యేసును దేవాలయానికి తీసుకువచ్చారు, చట్టం కోరినట్లుగా దేవునికి ఆయనను అర్పించారు. యేసు దేవుని కుమారుడని వారికి తెలిసినప్పటికీ వారు వినయంగా మరియు విధేయులుగా ఉన్నారు. ఆయన ఎవరో చెప్పడానికి వారికి ధర్మశాస్త్రం అవసరం లేదు,

కానీ వారు దేవుని మార్గాలను అనుసరించాలని ఎంచుకున్నారు. ఇతరులకు అర్థం కానప్పుడు కూడా మనం కూడా దేవునికి విధేయతతో ఎలా జీవించవచ్చో ఇది మనకు చూపిస్తుంది. మరియ మరియు యోసేపు విశ్వాసం దేవుడిని పూర్తిగా విశ్వసించడానికి ఒక ఉదాహరణ.

సిమియోను మరియు అన్న కూడా ఈ కథలో భాగం. దేవుని వాగ్దానం నెరవేరడం చూడటానికి వారు తమ జీవితాంతం వేచి ఉన్నారు. మెస్సీయ యొక్క సూచన లేనప్పుడు కూడా వారు దేవాలయంలో ప్రార్థిస్తూ మరియు ఆశతో ఎన్నో సంవత్సరాలు గడిపారు. చివరకు యేసు వచ్చినప్పుడు, వారు ఆయనను చూశారు మరియు ఆయన ఎవరో వెంటనే అర్థం చేసుకున్నారు. వారి ఓర్పు మరియు విశ్వాసం దేవుని వాగ్దానాలను నెరవేర్చడానికి చాలా సమయం పట్టినా, వాటిపై నమ్మకం ఉంచాలని మనకు గుర్తు చేస్తాయి. వారు దేవునికి దగ్గరగా ఉన్నందున వారు యేసును గుర్తించగలిగారు.

ఈ సంఘటన దేవునికి మన స్వంత జీవితాలను అర్పించడం గురించి కూడా మనకు బోధిస్తుంది. మరియ మరియు యోసేపు యేసును దేవాలయంలో సమర్పించారు, మరియు మన జీవితాలను కూడా దేవునికి సమర్పించమని మనం ఆహ్వానించబడ్డాము. దీని అర్థం చర్చికి వెళ్లడం మాత్రమే కాదు, ప్రతిరోజూ మన హృదయాలను, మనస్సులను మరియు చర్యలను ఆయనకు సమర్పించడం. వారిలాగే, మనం వినయంగా, బహిరంగంగా మరియు దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలి. దీని అర్థం త్యాగాలు చేయడం, సులభమైన దానికంటే సరైనది ఎంచుకోవడం లేదా దేవుడు మనల్ని నడిపించమని అడగడం.

చివరగా, ఈ సమర్పణ మనకు ప్రపంచంలో వెలుగుగా ఎలా ఉండాలో చూపిస్తుంది. సిమియోను యేసును “ప్రకటనకు వెలుగు” అని పిలిచాడు. యేసు ప్రపంచానికి వెలుగు, మరియు ఆయన మాదిరిని అనుసరించడం ద్వారా మనం ఆ వెలుగును పంచుకోవాలి. మన మాటలు మరియు చర్యలు ఇతరులకు ఆశ, శాంతి మరియు ప్రేమను తీసుకురాగలవు. ప్రతి చిన్న దయ చర్య, మనం క్షమించిన ప్రతిసారీ లేదా అవసరంలో ఉన్నవారికి సహాయం చేసినప్పుడు, మనం యేసు వెలుగును ప్రతిబింబిస్తూ జీవిద్దాం. 

బ్ర. పవన్ గుడిపూడి OCD

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...