మత్తయి 4:13-21
క్రిస్తునాధునియందు ప్రియమైన స్నేహితులారా ! ఈనాడు మనం మొదటి పఠనములో యాజకుడైన పషూరు యిర్మీయా ప్రవక్తను బాధించినప్పుడు యిర్మీయా తన బాధను, కష్టాన్ని దేవునికి పిర్యాదు చేస్తున్నాడు. మనము పషూరు యిర్మీయా చెప్పిన ప్రవచనములు విని యిర్మీయాను కొట్టించి, బంధించాడు. అప్పుడు ప్రభువు యాజకుడైన పషూరుతో ఇట్లాంటున్నాడు. శత్రువులు నిన్నును నీ కుటుంబమును బంధీలనుఁగా కొనిపోవుదురు. నీవచటనే చత్తువు అచటనే నిన్ను పాతి పెట్టుదురు. నీవు ఇన్ని కల్లబోల్లి ప్రవచనములు చెప్పి మోసపుచ్చిన నీ ఈ మిత్రులకు ఇదే గతి పట్టును.
యిర్మీయా ప్రవక్త తనకు జరిగిన అవమానం మరియు ఆయన ప్రభువు సందేశమును వినిపించగా జనులు ఆయనను గెలిచేయుచున్నారని ఎగతాళి చేస్తున్నారని ఎంతో బాధతో, కోపంతో దేవుణ్ణి దూషిస్తున్నారు. దేవునిపై గొంతెత్తుహి అరుస్తూ ఇలా అంటున్నాడు. ప్రభూ!నీవు నన్ను చెరచితివి, నేను చెడితిని. నీవు బలవంతుడవైనన్ను వశము చేసుకొంటివి. నీ సందేశమును చెప్పినందుకుగాను దినమెల్ల నన్ను చూసి నవ్వుచు గెలిచేస్తున్నారు. నేను ఇక నిన్ను జ్ఞప్తియందు ఉంచుకొనను. నీ పేరు మీదుగా మాట్లాడను అని అంటూ నేను ఎంత ప్రయతామ్ చేసిన నా వాళ్ళ కావటంలేదు. నీ వాక్కు నా హృదయంలో అగ్నివలె మండుచున్నది దానిని నేనిక ఆపుకోజాలను. ప్రభువు నీవు నా పక్షమున ఉండుము. నా వ్యాజ్యెమును నీకు అప్పగించితిని, దుష్టుల బారి నుండి నన్ను విడిపించుము అని యిర్మీయా ప్రవక్త దేవునికి మనవి చేసుకుంటున్నాడు. మరి మన జీవితాలలో మంకు కష్టాలు బాధలు అవమానాలు హేళనలు వచ్చినప్పుడు మనము నవ్వుల పాలు అయినప్పుడు చాలా సార్లు మనము కూడా యిర్మీయా వాలే దేవుణ్ణి నిందిస్తాం. దేవునిపై కోపపడుతాం, దేవునిపై అరుస్తూ ఉంటాం. కానీ మన దేవుడు బలాఢ్యుడని, సైన్యములకు అధిపతిఅని ఆయన నరులను న్యాయబుద్ధితో పరిశీలిస్తాడని మర్చిపోతాం. మనము ఏమి చేయాలంటే మన సమస్తాన్ని దేవునికి అప్పగించి ప్రార్ధిస్తే దేవుడు మనలను రక్షించి మన శత్రువులను శిక్షిస్తారు.
సువిశేష పఠనములో మనము వింటున్నాం. ప్రజలు కాలినడకన క్రీస్తుప్రభువును వెంబడించారు. కాపరిలేని మందవలె ఉన్నవారిని చూసి జాలిపడి వారిలో వ్యాధిగ్రస్తులను స్వస్థ పరిచారు. అంతే కాకుండా వారికి ఆధ్యాత్మిక ఆహారాన్ని అనగా దేవుని వాక్కుని అందించి వారికి భౌతిక ఆహారాన్ని అందించాడు. ఓకే చిన్న బాలుడు తన కొరకు తెచ్చుకొన్న ఐదుచేపలను రెండుచేపలను తీసుకొని వచ్చి అర్పించాడు. క్రీస్తు ప్రభువు ఐదు రొట్టెలను రెండు చేపలనూ తీసుకొని ఆశీర్వాదించి వారందరు సంతృప్తు చెందినంతగా వడ్డించగా 12 గంపలు ముక్కలు మిగిలాయి. భుజింహ్సి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు ఐదువేల మంది పురుషులు ఉన్నారు.
మనము ఏమి అర్ధం చేసుకోవాలంటే మనము క్కూడా దేవుని యొద్దకు వచ్చి తన సన్నిధిలో ఉంటామో క్రీస్తు ప్రభువుని యొక్క జాలి, దయ మనపై మన కుటుంబాలపై ఉంటుంది. అయన మం వ్యాధి బాధలనుండి మనలను స్వస్థపరుస్తాడు. మనము ఆత్మల ఆహారాన్ని మం ఆధ్యాత్మిక ఆహారాన్ని మనకు అందిస్తాడు అని మనము తెలుసుకోవాలి. మానవుడు కేవలము రొట్టె వలనకాక దేవుని నోటినుండి వచ్చు ప్రతిమాట వలన జీవిస్తాడు అని వాక్యయమ్ తెలియజేస్తుంది.
మంకు ఉన్న దానిని దేవుని చేతిలో ఉంచితే దేవుడు దానిని ఏంటో మందికి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చుతాడు అని ఈనాటి సువిశేష పఠనములో మనాకు విశదమొనర్చుచున్నారు దేవుడు. కాబట్టి ప్రియ మిత్రులారా మనము మంకు ఉన్న దానిని దేవునికి మరియు మన తోటి వారికి ఇట్సె అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఆనాడు నాయుడు రొట్టెలు రేణు చేపలు ఐదు వేళా మందికి ఆశీర్వాదంగా మారెను, మనం మన జీవితాల ద్వారా ఎంతో మందికి ఆశీర్వాదాహముగా మారాలి. అవిద్యాగం మారడానికి ప్రయత్నించుదాం.
ప్రార్ధన : ఓ కరుణామయుడా!ఎన్నో సార్లు మేము కూడా మా బాధల్లో, కష్టాలలో నిందలలో అవమానంతో నిన్ను దూషించి ఉన్నాము. మమ్ము క్షమించండి. ప్రభువా నీవు నా పక్షమున ఉన్నవని మార్చిపోయి భయపడిపోతున్నాం. మాకు బలాన్ని ధైర్యాన్ని దయచేయండి,అప్పుడు మేము నీసేవను ధైర్యంగా చేయగలము. ప్రభువా! నీవు దయమయుడవు కాబట్టి మాపై దయచూపి మమ్ము స్వస్థ పరచి, ఆశీర్వదించుము, మా జీవితాలు ఇతరులకు ఆశీర్వాదంగా మార్చుము. ఆమెన్
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి