12, ఫిబ్రవరి 2022, శనివారం

6 వ సామాన్య ఆదివారం ( ఏవరిని నమ్మాలి )

6 వ సామాన్య ఆదివారం 

యిర్మియా 17:5-8 1 కోరింథీ 15:12, 16-20, లూకా 6:17,20-26 

క్రీస్తు నాధుని యందు ప్రియ దేవుని బిడ్డలారా ఈనాడు తల్లి తిరుసభ  6 వ సామాన్య ఆదివారము లోనికి అడుగిడుతుంది. ఈనాటి దివ్య గ్రంధ పఠనాలు  అన్నీ దేవుని యందు విశ్వాసం గురించి భోదిస్తున్నాయి. ఈనాటి  మూడు పఠనాలు  మనము గమనించినట్లయితే మనకు ఒక సందేహము కలుగవచ్చు. అది ఏమిటంటే "ఎవరిని నమ్మాలి" అని ఎందుకంటే ఈనాటి మొదటి పఠనాన్ని గమనించినట్లయితే మొదటి పఠనం యిర్మియా గ్రంధము నుంచి తీసుకొనబడింది. యిర్మియా ఒక గొప్ప ప్రవక్త, దేవుని మాట కోసం తన జీవితాన్ని సైతం లెక్క చేయకుండ దేవుడు ప్రజలను  ఏవిధంగా శిక్షింపనున్నాడో , వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనభోతున్నారో తన జీవితం ద్వారా తెలిపిన  గొప్ప ప్రవక్త, ప్రజలను  దేవుని వైపు నడిపించడానికి తన ప్రాణములను సైతం పణంగా పెట్టిన గొప్ప ప్రవక్త. ఈ యిర్మియా  ప్రవక్త  రాజకీయంగా విఫలమైయాడు కానీ ఆధ్యాత్మికతలో మాత్రం దేవునికి ఏంతో దగ్గరయ్యాడు.  ఈనాటి మొదటి పఠనంలోని మాటలు యిర్మియా ప్రవక్త తానే స్వయంగా ప్రజలను హెచ్చరిస్తూ పలికిన మాటలు. ఎందుకంటే ఈ యూదా ప్రజలను దేవుడు బానిసత్వం  నుండి  తీసుకొని వచ్చి వారికి కావలసిన వన్ని ఇచ్చి వారికి అక్కున నిలిచాడు. 

ఈ యిస్రాయేలు  ప్రజలకు  ఏ ఆపదవచ్చిన వారికి సమీపమున లేదా సహాయముగా ఉండేది ఎవరు అంటే దేవుడు. దేవుడు వారికి అతి సమీప వ్యక్తి  పిలవగానే పలికే వ్యక్తి , వారికి ఏ ఆపద  వాటిల్లినా మొదటిగా తలచేది దేవుడినే చివరకు దేవుడు వారితో ఓడంబడిక కూడా  చేసుకున్నాడు. మీరు నా ప్రజలు , నేను మీ దేవుడను అని . ఈ ప్రజలకు  దేవుడు ఇంత చేసిన  తరువాత కూడా ఆపద వచ్చినప్పుడు దేవున్ని కాదని మానవుల సహాయం కొరకై వెళుతున్నారు. అది కూడా వారి శత్రువుల దగ్గరికి బాబిలోనియా రాజు యిస్రాయేలు ప్రజలను బానిసత్వమునకు తీసుకొని వెళ్ళాడు. ఆ బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించాడు. ఇప్పుడు బాబిలోనియా రాజు వారి మీదకు దండెత్తి వస్తున్నారని తెలిసి యిస్రాయేలు ప్రజలు ప్రాణముల మీద  తీపితో ఈజిప్టు దగ్గరకు సహాయముకై వెళుతున్నారు.  శత్రువులైన ఈజిప్టు రాజు నుండి కాపాడిన దేవుడిని మరచి ఈ ప్రజలు మానవుని సహాయము కొరకై పరుగు తీస్తున్నారు. 

దేవుడిని కాదని మానవుల మీద ఆధారపడిన వారు లేదా మానవులను నమ్మిన వారి గతి ఏ విధంగా ఉండునో దివ్య గ్రంధం చక్కగా వివరిస్తుంది. ఉదాహరణకు ఏసావు , యకొబును నమ్మితే, యాకోబు తన అన్న అయినటువంటి ఏసావును మోసం చేస్తున్నాడు. పాత నిభందనలోని యేసేపు తన అన్నలను నమ్మితే వారు యేసేపు చావుని కోరారు, సంసొను డెలీలా ను నమ్మితే డెలీలా సంసొనును మోసం చేసింది, ఇలా మనం నిజ జీవితంలో ఎన్నో చూస్తున్నాం, కొన్ని సార్లు అనుభవించే వుంటాం. కానీ దేవుడు మాత్రం వారు ప్రార్ధించిన ప్రతిసారీ, అడిగిన ప్రతిసారీ, మొరపెట్టుకున్న ప్రతిసారీ ఆలకించాడు,ఇచ్చాడు. వారి చెంతనే నిలిచాడు. పగలు మేఘ స్తంభం వలె రాత్రి అగ్ని స్తంభం వలె ఉంది కాపాడాడు. ప్రజలు ఎన్నిసార్లు మోసం చేసిన  దేవుడు మాత్రం దయ కలిగే ఉన్నాడు వారి యందు. ఈనాటి పఠనంలో కూడా తన ప్రవక్త అయిన యిర్మియాను పంపి తన ప్రజలను హెచ్చరిస్తున్నాడు. దేవునిపై నమ్మకము ఉంచి విశ్వసించువాడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టువలే ఎప్పుడు పచ్చగా ఉంటాడు, ఎప్పుడు ఫలిస్తూ ఉంటాడు, మానవులను నమ్మి వారిపై ఆధారపడువాడు  మరు భూమిలో ఉండు తుప్పలను పోలి ఉంటాడు అని హెచ్చరిస్తున్నాడు. కానీ యిర్మియా ప్రవక్త మాత్రం దేవుడిని చివరివరకు విడనాడలేదు  అందుకే యిర్మియాను ఒక గొప్ప ప్రవక్త గా భావిస్తుంటారు. 

ఈనాటి లూకా సువార్తలోని వచనాలు మనం మత్తయి సువార్తలో కూడా చూస్తాము. రెండు ఒకే విధంగా  ఉంటాయి. ఈ వచనాలు సరిగా చదివితే అవి విప్లవాత్మకంగా , సమాజ విలువలను గురించి  మాట్లాడినట్టుగా వుంటాయి. మత్తయి సువార్తికుడు ఆధ్యాత్మిక పేదరికం గురించి మాటలాడుతుంటాడు, కానీ లూకా సువార్తికుడు మాత్రం ఆనాటి కాలంలో జరుగుతున్న కలహాలు, హెచ్చుతగ్గులు గురించి మాట్లాడుతుంటాడు. నిజమైన పేదరికం గురించి వారు అనుభవిస్తున్న వాటి గురించి మాట్లాడుతున్నాడు. సువార్తలో ప్రభువు చెప్పినట్లు పేదరికం , ఆకలి, దాహం లాంటివి ఆనాటి కాలంలోని కలహాలు. ఆనాటి కాలం లోనే కాదు ఇప్పటికీ కొనసాగుతున్నావే ఇవి, మానవుడు దేవుని విలువలకంటే ప్రపంచ విలువులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందుకే ప్రభువు అంటున్నారు ఆకలికొని ఉన్న వారులారా ఆనందపడుడు అని ధనికులకు శాపగ్రస్తులు అని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వస్తువులకు, విలువులకి ప్రాధాన్యత ఇచ్చేవాడు దేవుని  విలువులకు ప్రాధాన్యత ఇవ్వలేడు. హృదయాన్ని దేని మీద అయితే కేంద్రీకృతం చేస్తామో దాని కొరకై పరుగెడుతాము. ప్రపంచ వస్తువుల మీద అయితే వాటి కొరకై పరుగెడతాము కానీ వాటిని ఎప్పటికీ సాధించలేము, దేవుని మీద  అయితే మనం సాధించగలం. ఎందుకంటే మనం ఆయన ప్రజలం ఆయన మన దేవుడు. ఎవరైతే దేవుని విలువలకు ప్రాధాన్యత ఇస్తారో అట్టి వారు ఏటి ఒడ్డున నాట బడిన చెట్టు వలె నిరంతరం పచ్చిగా ఫలిస్తుంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారులారా ధన్యులు దైవ రాజ్యం అట్టివారిది. 

రెండవ  పఠనంలో పునీత పౌలుగారు క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థానమును  గురించి పునరుత్థానము నందు  విశ్వాసము గురించి ప్రస్తావించుచున్నారు. మొదటి కోరింథీయులు 15 వ అధ్యాయము అర్ధము చేసుకోవడానికి కష్టముగా ఉండేటువంటిది. అందులోని మర్మము అర్ధం కాదు. కొరయిన్థియ ప్రజలు శరీరము యొక్క ఉత్తానమును  తీరస్కరిస్తున్నారు. కానీ ప్రభువు యొక్క పునరుత్థానమును కాదు. పౌలు గారు చెప్పేది ఏమిటి అంటే శరీర ఉత్తానమును తీరస్కరిస్తే ప్రభుని పునరుత్థానమును కూడా తీరస్కరించినట్లే. శరీర ఉత్థానమును నమ్మని వాళ్ళు ప్రభుని పునరుత్థానమును ఎలా నమ్ముతారు? ఇలా అపనమ్మకము ద్వారా క్రైస్తవ సత్యాన్ని, నిజాన్ని, సందేశాన్ని  కించపరిచినట్లే. ఇప్పటి వరకు భోధించినది వ్యర్ధమైనట్లే ప్రభువు పునరుత్థానము కాకపోతే చేసే బోధన, విశ్వాసం అంతా వ్యర్ధమే. 

ఎందుకు పౌలుగారు ప్రభుని పునరుత్థానమునందు విశ్వాసాన్ని ముఖ్యముగా భావిస్తారు, అందులో దాగిన విలువలు, సత్యము ఏమిటి అంటే ప్రభువు అనేక సార్లు తన శిష్యులకు దర్శనమిచ్చారు.  

*క్రైస్తవులను హింసించే సౌలుకు సైతం దర్శనమిచ్చ పౌలుగా మార్చారు. 

*శిష్యులతో కలసి భుజించాడు, ప్రయాణించాడు ఇలా ఎన్నో జరిగాయి. 

*పునరుత్థాన సత్యము యూదులు చేసే అసత్య వాదనకన్నా బలమైనది, నిజమైనది. 

* ప్రభుని పునరుత్థానము మంచి చెడు మీద ఎంత బలమైనది అని నిరూపిస్తుంది. 

*ప్రభుని పునరుత్థానం ప్రేమ  అసహ్యం కంటే ఎంత బలమైనది అని నిరూపిస్తుంది. 

*ప్రభుని పునరుత్థానము బ్రతుకు చావు కంటే ఎంత బలమైనది అని నిరూపిస్తుంది. 

చివరిగా పౌలుగారు చెప్పేది ఏమిట అంటే  ఒక వేళ క్రీస్తు ప్రభుని పునరుత్థానం నిజము కాకుంటే , భోదించే సందేశం అబద్ధం అయితే పునరుత్థానంను విశ్వసించి చనిపోయిన వారి చావు, విశ్వాసం  వ్యర్ధమే వారి యొక్క విలువలు వ్యర్ధమే. 

పునరుత్థానమును జీవితంలో నుంచి తీసివేస్తే మనకు అయిన  క్రైస్తవ విశ్వాసాన్ని  చెడిపివేసినట్లే. "నేను కాదు జీవించేది నాలో జీవించేది క్రీస్తే" అని పౌలు గారి వలె మనము మన పునరుత్థాన విశ్వాసాన్ని చాటి చెప్పాలి. మనం మనయందును లేక మానవుల యందు కాక  దేవుని యందు నమ్మకం  ఉంచుదాం. ఆయనయందు  విశ్వాసంలో ధృడపడుదాం. 

Br. Lukas 


4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

అయిదవ సామాన్య ఆదివారము (2)

అయిదవ సామాన్య ఆదివారము
 యెషయా   6:1-8
 1 కొరింతి 15:1-11
  లూకా  5:1-11

నేటి దివ్యపఠనాలు దేవుని సేవకు ఎన్నుకొనబడిన వారి జీవితం గురించి భోదిస్తుంది. ప్రభువు యొక్క సేవ చేయడానికి ఆయన యొక్క పవిత్ర వాక్యం బోధించడానికి అలాగే దేవుని ముంగిట నిలబడడానికి ఎన్నుకొన్న బడిన వారి యొక్క అయోగ్యత గురించి తెలుపు చున్నాయి.
అర్హత లేని వారిని ఎన్నుకొని, వారిని బలపరిచి తన యొక్క సేవకు వినియోగించిన విధానం నేడు మూడు పఠనాలు ద్వారావింటున్నాం.

ఈనాటి మొదటి పట్టణములో దేవుడు యెషయా ప్రవక్తను తన యొక్క పని నిమిత్తము  పిలిచినా విధానం తెలుసుకుంటున్నాం. దేవుని యొక్క ప్రణాళికలను, భోధనలనుతెలియజేయుటకు దేవుడు యెషయా ప్రవక్తను ఎన్నుకొంటున్నాడు. క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దములో దేవునియొక్క ప్రజలు రెండుగా విభజింపబడ్డారు. ఉత్తర రాజ్యమును ఇశ్రాయేలుగా, దక్షణ రాజ్యము యూదాగా విభజింపబడ్డాయి. యెషయాను దేవుడు క్రీస్తు పూర్వం 742 వ సంవత్సరములో పిలిచి, ప్రవక్తగా ఎన్నుకొంటున్నారు. ఆయన ప్రవక్తగా పిలుపుని పొందిన సమయములో అస్సిరియా సేనలు బలంగా ఉండేవి. దానితోపాటు సిరియా కూడా బలంగా ఏర్పడుచున్న సమయమది. అయితే అప్పటి యూదా, ఇశ్రాయేలు ప్రజలు పెద్దలు వారియొక్క రాజ్యములను సంరక్షించుకొనుటకు వారు భద్రముగా ఉండుటకు రాజకీయ పరంగా అస్సిరియులకు మిగతా బలంగా వున్నా సైనిక రాజ్యాలకు సహకరించి జీవించేవారు. దేవుణ్ణివారు నమ్మకుండా వేరే మానవ శక్తులను, బలాలను నమ్ముకొని వారిమీద ఆధారపడే సమయములో దేవుడు యెషయాను పిలిచి ఆయనయొక్క సందేశం అందించుటకు ఆయన్ను ఎన్నుకొంటున్నారు.

దేవునియొక్క విలువైన ప్రతిమాటను రాజులకు, మతపెద్దలకు, ప్రజలకు తెలియజేయుటకు దేవుడు ప్రవక్తను ఎన్నుకొంటున్నారు. యెషయా దైవపిలుపును అందుకొన్న సమయములో యూదా రాజ్యాన్ని యోతాము,ఆహాసు, హిజ్కియా రాజులు పరిపాలించేవారు.

యెషయా ప్రవక్త యొక్క ఎన్నిక ప్రత్యేకమైనది. ఎందుకంటే, స్వయముగా దేవుడు తన దర్శనం కలుగజేస్తూ, తనయొక్క మహిమను వెల్లడిస్తూ తనయొక్క పనికోసం ఎన్నుకొన్నారు. యెషయా ప్రవక్త యెరూషలేము దేవాలయములో ప్రార్ధిస్తున్నప్పుడు ఆయనకు ఈ దర్శనం కలిగినది. దేవునియొక్క సమక్షంలో తన యొక్క అయోగ్యతను గుర్తించాడు.

 యెషయా  ప్రవక్త  తనకు కలిగిన దర్శనంలో దేవుని యొక్క పవిత్రతను గుర్తించాడు 
ఎందుకంటే దేవదూతల విలువైన మాటలు చెవులారా విన్నాడు.
-పవిత్ర మూర్తి అయినా దేవుణ్ణి చూసినప్పుడు, దేవుణ్ణి గురించి విన్న స్తుతిగానాలు యెషయా ప్రవక్త దేవుని యొక్క సన్నిదిలో తాను ఎంత పాపియే తెలుసుకుంటున్నాడు.
-దేవుని ముంగిట నూలువబడటానికి ప్రజలు ఎంతటి అనర్హులో గ్రహిస్తున్నాడు, అయినప్పటికీ దేవుడు మరలా  బలహీనులను పాపాత్ములైన జనుల మధ్య నుండే తన సేవకు ఎన్నుకుంటున్నారు. 

మనం దేవునికి ఎంత దగ్గరవుతామో అప్పుడు అంట తెల్లగా మన యొక్క పాపపు జీవితం అర్థమవుతుంది. 
-ఇంకొక విధంగా చెప్పాలంటే మనము వెలుగులోనో లేక వెలుతురుకు దగ్గరగా వెళ్తే మన మీద వున్నా మరకలు, మచ్చలు, మురికి అంత స్పష్టంగా కనిపిస్తుంది. 
-అదేవిధంగా ఈ లోకానికి వెలుగైయున్న పవిత్ర మూర్తి అయినా దేవునికి దగ్గరగా వస్తే మనయొక్క అపవిత్రత తెలుస్తుంది.
-యెషయా దేవునికి దగ్గరగా వున్నాడు కాబట్టియే తనయొక్క పాపపు జీవితం గుర్తుకువచ్చింది. 
-ఆ సమయంలో దేవుని యొక్క సెరాఫీము దూతలు ఆయన్ను పవిత్రపరిచారు. 
-సెరాఫిక్ అంటే జ్వలితాలు, మండుచున్నవారు. వీరు నిత్యం పవిత్రతతో జ్వలించే వారు, పవిత్రతతో ప్రకాశించేవారు. 

-రెండవ పఠనంలో పునీత పౌలుగారు తన యొక్క ఎన్నిక గురించి బోధిస్తున్నారు. 
-పౌలుగారు కొరింతునగరంలో సువార్త పరిచర్య చేసే సమయంలో యేసు క్రీస్తు ప్రభుని పునరుత్తానం గురించి అనేక ప్రశ్నలు ప్రజలలో ఉండేవి. కొందరు క్రీస్తు పునరుత్తానం అవ్వలేదని మరికొందరు అయ్యారని అలాగే పౌలుగారి యొక్క సువార్త భోదన్ను కూడా ప్రశ్నించే వారు ఆ సందర్భంలో పౌలుగారు వారందరికీ సాక్ష్యములతో తెలియచేస్తున్నారు .
-క్రీస్తు ప్రభువు నిజంగా ఉత్తానమైనవారు ఆయన మొదటిగా పేతురుకు తరువాత ఆపోస్తులకు, ఐదువేలమందికి దర్శనం ఇచ్చారు అని వారికీ తెలియచేస్తున్నారు. 
-దేవుడు నిజంగా ఉత్తానమై ఉన్నారు దానికి సజీవ సాక్షులు మన మధ్య వున్నారు అని తెలుపుచున్నారు.
ఆయన  యొక్క  మరణ పునరుత్తానములను ప్రకటించుటకే నేను ఎన్ను కోన బడ్డాను అని పౌలుగారు తెలుపుచున్నారు. 
-ఆయన ఎన్నికలో తన యొక్క అయోగ్యతను గుర్తిస్తున్నారు తాను అపోస్తులుడుగా పిలువబడుటకు అర్హుడను కాని ఎందుకంటే దేవుని ప్రజలను హింసించాను కాబట్టి అయినా దేవుడు తన్ను ఎన్నుకొన్నారు అది ఆయన గొప్పతనం అని పలుకుచున్నారు.
-దేవునియొక్క పునరుత్తానం ప్రకటించుటకు దేవుని కృప తనకు తోడుగా ఉందని తెలుపుచున్నారు. దేవుని కృపవలెనే నేను ఇప్పుడు న్న స్థితిలో  వున్నాను అని తెలుపుచున్నారు. 1 కొరింతి 15: 10 
-పౌలు గారు అర్హతలేని నన్ను దేవుడు ఎన్నుకొన్నారు, ఆయన పునరుత్తానమునకు నేనే నిజమైన సాక్షి అని తెలుపుచున్నారు. 

ఈ నాటి సువిశేష పఠనంలో దేవుడు శిష్యులను ఎన్నుకొనే విధానం చూస్తున్నాం. ఆ యన ఎంతో మంది గొప్పవారిని జ్ఞానులను, సమాజంలో పేరున్న వారిని విడిచి పెట్టి ఏమి లేనటువంటి సాధారణమైన ప్రజలను తన సేవకు ఎన్నుకొంటున్నారు.
 
-సామాన్యమైన చేపలు పట్టేవారిని దేవుడు ఎన్నుకొని మనుష్యులను పట్టేవారినిగా చేస్తున్నారు. 
- ఈ సువిశేష భాగంలో చాల విషయాలు మనం ధ్యానించుకోవచ్చు.
- గెన్నేసరేతు ప్రజలయొక్క విశ్వాస జీవితం - ఆ ప్రజల దేవుని యొక్క పవిత్రమైన మాటలను ఆలకించటానికి నెట్టుకొనుచు వస్తున్నారు. దేవునియొక్క మాటలు నిత్య జీవం ఇచ్చే మాటలు అని గ్రహించారు అందుకే నెట్టుకొంటున్నారు . ఇది వారి యొక్క విశ్వాస జీవితానికి నిదర్శనం. 
-మార్కు 6 :53 - 56 వచనాలలో వింటాం యేసు ప్రభువు వారి మధ్యకు వచ్చారని విని ఊరిలో ఎక్కడెక్కడో వున్నా అనారోగ్యులను ప్రభువు చెంతకు తీసుకొనివస్తున్నారు. వచ్చిన అవకాశం కోల్పోకూడదని భారమైన, కష్టమైన రోగులను , యేసుప్రభువు దగ్గరకు మోసుకొని వచ్చారు. వారికి స్వస్థత కావాలి ఆ స్వస్థత దేవుడే ఇస్తారు అని గ్రహించి యేసు ప్రభువు దగ్గరకు వచ్చారు అలాంటి  గొప్ప విశ్వాసం కలిగి వున్నా వారు గెన్నేసరేతు ప్రజలు.

-గెన్నేసరేతు ప్రజలకు విశ్వాసం ఎక్కువగా ఉన్నదియే కాబట్టి ఆయన వాక్కు ఆలకించటానికి నెట్టుకొని పోతున్నారు.
-ఏం సమయంలో మనం నెట్టుకొని పోతాం? మనకు ఏదైనా ముఖ్యమైనది పొందాలంటే అందరికన్నా ముందే వెళ్తా అని తక్కువుగా ఉంటె నెట్టుకొని పోతాం.
-ఇంకా మనం పలానా సమయంలో వెళ్లకపోతే ఇక ఇది మనకు దొరకదు అనే సమయంలో నెట్టుకొని పోతాం. 
-ఉదా; 2020 లో కరోనా వచ్చినప్పుడు కొన్ని నెలలు ముందు పాపులు శ్రమలేదు ఎప్పుడైతే ఆ షాపులు ఓపెన్ చేశారో జనాలు ఒకరినొకరు నెట్టుకుంటూ రెండు మూడు కిలోమీటర్ల వరకు క్యూలో వున్నారు. 
-ఎందుకంటే ఆ టైయంలో వెల్లకపోతే ఇక ముందు దొరకదు అని వారు భావించిన సందర్భంలో నెట్టుకుంటున్నారు. 
-క్రొత్త సినిమా రిలీజ్ అయినా అదే సంగతి. 
-గెన్నేసరేతు ప్రజలు విశ్వాసంతో జీవించే ప్రజలు. వారు నెట్టుకొని వచ్చింది కేవలం దేవుని యొక్క వాక్కును ఆలకించటానికి వస్తున్నారు. 

- ఈ ప్రజలు దేవుని యొక్క వాక్కు ఆ సమయంలో ఆలకించక పోతే ఎదో మేము కోల్పోతాం అని భావించారు. కాబట్టియే దాని   కోసం నెట్టుకొని పోతున్నారు.
-యేసు భోదన, మాటలు కొత్తగా ఉంది ఆ సందేశం ప్రేరణగా ఉంటుంది, ఆ సందేశం చాల గొప్పదని భావించారు. కాబట్టియే ఆ వాక్కు కోసం ఆలా తహ తహ లాడుచున్నారు. 

1. దేవుని యొక్క వాక్కు అయస్కాంత వాక్కు, అయస్కాంతం ఇనుమును ఆకర్షించిన విధముగానే దేవుని యొక్క వాక్కు విశ్వాసులను ప్రజలను అకార్చిస్తుంది. చాల సందర్భాలలో అన్యులు యేసు అనుచరులుగా మారటం చూస్తాం ఎందుకంటే వాక్కు వారిని ఆకర్శించింది కాబ్బటి 
ఉదా: సాధు సుందర్ సింగ్ 

2. దేవుని యొక్క వాక్కు పుట్టించే వాక్కు లూకా 8 : 4 
దేవుని యొక్క వాక్కు మనలో ప్రేమను పుటిస్తుంది
దేవుని యొక్క వాక్కు మనలో క్షమా పుటిస్తుంది 
దేవుని యొక్క వాక్కు మనలో ప్రేరణ పుటిస్తుంది 
దేవుని యొక్క వాక్కు మనలో హృదయ పరివర్తన పుటిస్తుంది 
దేవుని యొక్క వాక్కు మనలో దయను పుటిస్తుంది 
దేవుని యొక్క వాక్కు మనలో క్రొత్త జీవితం పుటిస్తుంది.

3 దేవుని వాక్కు నేర్పించే వాక్కు మనం ఎలా జీవించాలన్నది నేర్పిస్తుంది. 

4 దేవుని వాక్కు స్వస్థతను ఇచ్చే వాక్కు అనేక మందికి మాటలతో స్వస్థతను ఇచ్చారు దేవుడు
గన్నేసరెతు ప్రజలు ఈ వాక్యం యొక్క గొప్ప తనం తెలుసుకొని  ఈ వాక్యం వినకపోతే అలాగే ఈ వాక్యం ప్రకారం జీవించకపోతే మేము ఎదో కోల్పోతామని భావించారు కాబ్బటియే అంత అతృతతో ఉన్నారు.
వారి యొక్క వాక్యం యొక్క ఆకలి తీసివేయబడింది ఇప్పుడు ఉన్న రోజులో దేవుని యొక్క వాక్కు కోసం అంతగా ఆకలితో ఉన్నామా? ఎదురు చుస్తున్నామా? ఆసక్తిగా ఉన్నామా?
ii వారు తమ యొక్క వలలు శుభ్రపరుస్తున్నారు, ఆ సమయంలో దేవుడు వారి పడవలో ప్రవేశిస్తునాడు, మన జీవితంలో పాపమును కడిగివేస్తే పాపాలు ఒప్పుకొని పచ్చాత్తాపం పడితేనే దేవుడు మన జీవితంలోకి ప్రవేశిస్తాడు.
iii విశ్వాస జీవితంలో దేవుని ఆశీర్వాదాలు దొరకాలంటే, మన యొక్క విశ్వాస జీవితంలో లోతుగా వెళ్ళాలి.
- ఒడ్డున వలవేస్తే ఏమి జరగదు, దొరకదు అలాగే నమ మాత్రపు క్రైస్తవ జీవితం జీవిస్తే మనకు అనుగ్రహాలు కూడా దొరకవు. 
- దేవునితో ప్రయాణం చేసినప్పుడు లోతుగా వెళ్ళాలి గాఢమైన విశ్వాసం కలిగి ఉంటె అలాగే దేవునితో ఆ అనుబంధం కలిగి ఉంటేనే దేవుడు మనలను దివిస్తాడు.
- మనం కూడా ప్రార్థనలో లోతుగా వెళ్ళాలి, కష్టపడాలి అప్పుడే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు.
- విధేయత చూపుట ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి. పేతురును అన్ని తెలిసినాకూడా దేవుడు చెప్పిన మాట విని నమ్మకం ఉంచి వాలా వేసాడు, తన జీవితంలో అద్భుతం దేవిని శక్తి చూశాడు అందుకే వాలా చినిగే అన్ని చేపలు బడ్డాయి. 
- నోవా విదేయించాడు - రక్షణ పొందాడు 
- అబ్రాహాము విదేయించాడు - దీవెనలు పొందాడు 
-కాన పల్లి సేవకులు విదేయించాడు - వారు దీవెన పొందారు 
- మరియా తల్లి విడియించారు - దేవుని తల్లి అయారు
- మనం విదేఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు.
 -సెరెఫాతు వితంతువు విడియించింది- నూనె సంవృద్ధిగా పొందింది.  (1 రాజు :17 :8 -16 )

మనం కూడా విధేయులై జీవిస్తే మనలోకూడా దేవుని ఆశీర్వాదాలు సంవృద్ధిగా వస్తాయి. నిరాశలో వుండే వారికి దేవుడు తనయొక్క ఓదార్పునిస్తాడు. పేతురుగారిని దేవుడు తనయొక్క సువార్తా  పనికోసమై ఎన్నుకొంటున్నారు. పేతురు దేవునితో సంభాషించే వేళలో తనయొక్క పాపపు జీవితం గుర్తుకు తెచ్చుకొని తనయొక్క అయోగ్యతను గుర్తించి నేను పాపాత్ముడను అని ఒప్పుకొంటున్నారు. పేతురు హన సంభాషణ ద్వారా తనకు దగ్గరైన కొలది తనయొక్క పాపపు జీవితం గుర్తుకుతెచ్చుకొని నన్ను వదలిపొండు అని ప్రభువుతో అంటున్నాడు.  దేవుడు అతడ్ని విడిచిపెట్టడంలేదు. మనంకూడా దేవునితో సంభాషిస్తే అయన సాన్నిధ్యం మనజీవితములో అనుభవిస్తే, మన పాపాలు గుర్తుకు వస్తాయి.మనంకూడా పశ్చాత్తాపపడతాం. పేతురుగారిని దేవుడు ఎన్నుకొని పవిత్రపరచి తనయొక్క రాజ్య స్థాపనకై నాయకుడిగా నియమిస్తున్నారు. తన వాక్యాన్ని, తన రాజ్యాన్ని స్థాపించుటకు దేవుడు సామాన్యమైన వారిని ఎన్నుకొని బలపరిచి, దీవించి వారికి కావలిసిన వరములను ఇస్తున్నాడు. అయోగ్యులైనాకూడా  వారిని తన ప్రేమతో ఎన్నుకొని వారిని నియమించిన గొప్పదేవుడు ప్రభువు. ప్రభువు.

     ఈ మూడు పఠనాల ద్వారా తెలియజేయబడిన వ్యక్తులు యెషయా, పౌలు, పేతురు గార్లు దేవునికి విధేయులై దేవుని కొరకు జీవించిన విధంగా మనం కూడా జీవించాలి.
Rev. Fr. Bala Yesu OCD

5 వ సామాన్య ఆదివారం (మూడవ సంవత్సరం )

 దైవ పిలుపు- దైవ పిలుపునకు మన స్పందన -దైవ పిలుపు ఉద్దేశం 

యోషయా 6:1-8,     1 కోరింథీ 15:1-11             లూకా 5:1-11 

ఈనాడు  తల్లి తిరుసభ 5 వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈనాటి మూడు పఠనాలు దైవ పిలుపు  గురించి ప్రస్తావిస్తున్నాయి. వీటిని వివరంగా మూడు అంశాల రూపేనా ధ్యానిస్తూ, అర్థం చేసుకొని మన జీవితాలకు అపాదించుకుందాం. 

1. దైవ పిలుపు 

2. దైవ పిలుపునకు మన స్పందన 

3. దైవ పిలుపు ఉద్దేశం 

1 . దైవ పిలుపు -

 దైవ పిలుపు  చాలా పవిత్రమైనది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క  విధంగా పిలుస్తుంటారు. దేవుని యొక్క పిలుపు మరియు ఎన్నిక మానవ మేధస్సుకు అతీతంగా వుంటుంది. దేవుడు సామాన్యులను నిరాక్షరాసులను , అయోగ్యులను , మానవ దృష్టిలో  దేనికి పనికిరారు అన్నటువంటి అతి సాధారణమైన వ్యక్తులను పిలిచి, ఎన్నుకొని, వారిని తనకు తగిన వారీగా మలిచి ,అభిషేకించి తన ప్రేషిత కార్యాన్ని వారి ద్వారా నెరవేరుస్తారు. దేవుడు అల్పులను పిలిచి అత్యదికులను చేస్తారు.  బలహీనులను పిలిచి బలవంతులను చేస్తారు. అయోగ్యులను పిలిచి యోగ్యులనుగా చేస్తారు. 

మనము పవిత్ర గ్రంధంలో  ఎంతో మందిని పిలవడం ,మరెంతో మందిని ఎన్నుకోవడం చూస్తున్నాం. ముఖ్యముగా ఈనాటి మొదటి పఠనంలో అతి సామాన్యమైన యోషయాను పిలిచి ప్రవక్తగా మలుస్తున్నారు.(యోషయా 6:8). రెండవ పఠనంలో సౌలును పౌలుగా అంటే హింసకుడిని , సువార్త సేవకై పిలిచిన దేవుడు తన సువార్త వ్యాప్తికై ఒక సాధనముగా వాడటం చూస్తున్నాం.(1 కోరింథీ 15:10-11), మరియు చేపలు పట్టువాడైన సీమోనును ప్రేరేపించి పిలిచి మనుషులు పట్టువానిగా మలచడం చూస్తున్నాం.(లూకా 5:1-11). 

 ఈరోజు అత్యల్పులమైన,  అతి సామాన్యులమైన , అయోగ్యులమైన మనందరిని ప్రభువు పేరు పెట్టి పిలుస్తున్నారు. కొందరిని తన సువార్త సేవకై  మరి కొందరిని కుటుంబ జీవితానికి పిలుస్తున్నారు. పిలువబడిన వారు వారి జీవిత అంతస్తుకు తగిన విధంగా జీవించాలి. కానీ మనం ప్రభువు పిలుపునకు స్పందిస్తున్నామా ? సరిగా స్పందిస్తే ఈ పిలుపు మన జీవితాలను మలచకలదు,  మన జీవితాలను మార్చ కలదు. మన జీవిత ఉద్దేశాలను కార్యసాధనకు చేర్చకలదు. 

2 . దైవ పిలుపునకు మన స్పందన 

దేవుడు మనలను పిలవడం ఒకెత్తయితే దానికి స్పందించడం మరొక ఎత్తు . దైవ  పిలుపునకు స్పందించడం అంటే కేవలం కాళ్ళ నడక ద్వారా దేవుని అనుసరించడం కాదు. కానీ పిలుపునకు అనుగుణంగా  మన జీవిత మార్పు ద్వారా  దేవుని అనుసరించడం. మనం దేని నుండి దేనికి పిలవబడ్డాం అని గ్రహించాలి. ఎవరి చేత పిలవబడ్డాం, అని తెలుసుకోవాలి మరియు దానికి అనుగుణంగా  స్పందించాలి. అంటే 

1. మన పాపపు స్తితిని గ్రహించాలి: -నేను హా !చేడితిని కదా ! నా నోటి నుండి వెలువడునవన్నియు  అపవిత్రమైన మాటలే.  అపవిత్రమైన మాటలు పల్కు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. అని యోషయా ప్రవక్త తన పాపపు స్థితిని గ్రహించాడు. (యోషయా 6:5). ఏలయన అపోస్తులందరిలో  నేను అల్పుడను. దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తులుడని  పిలువబడుటకు నేను అయోగ్యుడను" అని పౌలు తన జీవిత స్థితిని  గ్రహించాడు. (1 కోరింథీ 15:9).  ప్రభూ ! నేను పాపాత్ముడను నన్ను విడిచి పొండు అని పేతురు గారు కూడా తన పాప స్థితిని గ్రహించారు.(లూకా 5:8). ఈనాడు నీవు నేను కూడా మన పాపపు స్థితిని గ్రహించాలి.

 2. పాపాన్ని విడిచి పెట్టాలి :- పాపాపు స్థితిని గ్రహించడమే కాదు . పాపాన్ని పరి పూర్తిగా విడిచిపెట్టాలి. మన జీవితాన్ని పవిత్రీకరించమని దేవుని అర్థించాలి. మనము పాప కార్యముల నుండి వైదొలగి నూత్న హృదయమును,నూతన మనస్సును పొందాలి. ఎవడు చనిపోవుట వలన  ప్రభువునకు సంతోషం కలగదు. కనుక మీరు మీ పాపముల నుండి వైదొలగి బ్రతుకుడు. ఇది యావే ప్రభు వాక్కు. యోహేజ్కేలు 18:31-32. 

3. మనలని మనం దేవుని చిత్తానికి అప్పగించాలి:-  దౌర్జన్యమునకు సాధనముగా మీ శరీరములందు ఏ అవయములను పాపమునకు అర్పింపకుడు. అంతేగాక , మృత్యువు నుండి జీవమునకు కొనిరాబడినవారుగా మిమ్ము మీరు దేవునికి  అర్పించుకొనుడు. మీ శరీరమునందలి అవయములను నీతికి సాధనములుగా ఆయనకు సమర్పించుకొనుడు. (రోమి 6:13). దేవుని  పిలుపునందుకున్న మనమందరము దేవునికి మనలను మనం సంపూర్ణముగా అప్పగించుకోవాలి. అంటే దేవుని చిత్తమే మన చిత్తం కావాలి. దేవుని చిత్తానుసారంగా ఆలోచించాలి, మాట్లాడాలి, కార్యాలు చేయాలి. ఈ విధంగా దేవుని పిలుపునకు  స్పందిస్తే దేవుని అనుగ్రహాలను పొందగలము, ఆ అనుగ్రహాలకు సాధనాలుగా మారగలము. 

3. దేవుని పిలుపు  యొక్క ఉద్దేశము

  దేవుడు  తన ప్రజలను ఓ గొప్ప ఉద్దేశంతో పిలిచి వారిని పవిత్రులుగా , నిర్దోషులుగా  చేస్తారు. (ఏపేసి 1:4) పవిత్రులుగా , నిర్దోషులుగా మలచబడినవారు, దైవ పిలుపు ఉద్దేశమైన సువార్త వ్యాప్తిద్వారా ఇతరులను పవిత్రులుగా, నిర్దోషులుగా  తయారుచేయాలి. ఈ ప్రేషిత కార్యం కొరకై మనము ప్రభుని సొంత ప్రజలుగా ఎన్నుకోబడతాము. (ద్వీతి14:2 ), అదే యోషయా  ప్రవక్త (6:8) , పౌలు గారు (1 కోరింథీ 15:10) మరియు పెతురు (లూకా 5:10 ) వీరి జీవితాలలో జరగడం   ఈనాటి పఠనాలలోమనం చూస్తున్నాం . 

దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క జీవిత శైలికి పిలిచియున్నారు. కొంతమందిని సువార్త  వ్యాప్తికై , మరి కొంత మందిని భర్తలుగా, భార్యలుగా , పిల్లలుగా మరియు ఇతర జీవిత శైలికి పిలిచారు. ప్రతి ఒక్కరు వారి జీవిత అంతస్తుకు తగిన విధంగా జీవించాలి. ఆ విధంగా జీవించాలంటే మనకు కావల్సిన మొట్ట మొదటి  ఆయుధం విశ్వాసం. విశ్వాసం లేకపోతే దైవ పిలుపు యొక్క ఉద్దేశం నెరవేర్చలేము. పునీత పౌలుగారు ఈనాటి రెండవ పఠనములో చాలా చక్కగా చెప్తున్నారు. "మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప ,నేను మీకు భోదిం చిన విధంగా మీరు దానిని గట్టిగా అంటి పెట్టుకొని ఉంటిరేని , మీరు రక్షింపబడుదురు." (1 కోరింథీ 15:2). పేతురు గారు ప్రభువు మాట యందు విశ్వాసించాడు, వల చినుగునన్ని చేపలు పట్టగలిగాడు. లూకా 5:6 . మనము కూడా విశ్వసించాలి, ప్రభువునకు ప్రార్ధించాలి. తద్వారా మన విశ్వాసాన్ని  బలపరచుకోవాలి. మన జీవితాలలో ప్రభువు కార్యాలను చవి చూడాలి. 

రెండవది ప్రేమ. యోహను 3:16 . 15:12. ప్రభువు కాపరికి అప్పగించిన తన మందను , కుటుంబ పెద్ద సభ్యులను ఎటువంటి పక్షపాతం లేకుండా అందరిని సమానంగా  ప్రేమించాలి. ప్రేమ అనే ఆయుధం ద్వార పరలోకాన్ని భూలోకంలోనే సృజించవచ్చు. ఎప్పుడైతే కాపరులు తమ స్వార్ధనికి ,ఆనందాలకు, ఇహలోక జీవిత శ్రేయస్సుకు, వస్తువులకు మరణించి, తన ఆలోచనలను, శక్తిని మాటలను మరియు కార్యాలను  దైవ చిత్తానికి  దైవ రాజ్య  వ్యాప్తి ఉపయోగార్దం జన్మిస్తారో. అప్పుడు  ప్రేమ ద్వార ఇహలోక  జీవియతం పరలోక జీవితంగా మారుతుంది. 

మూడవ ఆయుధం ఓర్పు , సహనం. ఈ సద్గుణాలు ఉన్నటువంటి వారు ఎటువంటి బేరుకు లేకుండా  దేవునితో నడవగలరు. సంఘంలో  కుటుంబంలో  ప్రజలందరు ఒకే విధంగా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క  తీరుతో  ప్రవర్తిస్తుంటారు. కానీ దైవ పిలుపు స్వీకరించిన మనం  ఓర్పు సహనం కలిగి అందరిని ఒక తాటిపై  నడిపించగలగాలి. ఇది దేవునితో మనం ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దేవుడు లేనప్పుడు పేతురుగారు ఒక్క చేపనైన పట్టలేక పొయ్యాడు. కాని దేవుడు తనతో ఉన్నప్పుడు వల చినిగే చేపలను పట్టగలిగాడు. (లూకా 5:5,6 ), దేవుడు మనతో ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలలో కూడా ఎటువంటి కొరతలు ఉండవు. అన్నీ సమృద్దిగా ఒసగపడుతాయి. 

ఏ విధంగా దైవ పిలుపు అందుకున్న కుటుంబ అంతస్తుకు చెందినవారు సువార్తను భోధించగలరు ? దివ్య వాక్కు  వినడం, పఠించడం, పాటించడం ద్వారా. దైవ వాక్కు మన జీవితాలకు  ఆధ్యాత్మిక  భోజనం. భోజనం భుజింపకపోతే ఏ విధంగా  భౌతిక ఆరోగ్యాన్ని కోల్పోతాము. అధేవిధంగా ఆధ్యాత్మిక భోజనం  అయినటువంటి దేవుని వాక్యం పఠించక,వినక, పాటించక పోయిన ఆధ్యాత్మిక అనుగ్రహాలను కోల్పోతాము. కాబట్టి దేవుని వాక్యం చదువుదాం , విందాం, ఆచరిదాం. తద్వారా  దైవ పిలుపును గ్రహించి , ఆ పిలుపునకు సరిగ్గా స్పందించి, ఆ పిలుపును జీవిస్తూ ముందుకు సాగుదాం. ఆమెన్ 

 Br. Sunil Inturi  OCD

   


29, జనవరి 2022, శనివారం

4 వ సామాన్య ఆదివారము

 4 వ సామాన్య ఆదివారము

యిర్మీయా 1 : 4-5, 17-19., 1కొరింతి 12: 31-13: 13., లూకా 4: 21-30.

-నేటి దివ్య పఠనాలు సువార్త వ్యాప్తిలో దేవుని అనుసరణలో ఎదురయ్యే తిరస్కరణలను దైర్యంగా ఎదుర్కోవాలి అని తెలుపుతుంది. 
- మన జీవితంలో ఎన్ని తిరస్కరణలు వచ్చినా గాని దేవుని మీద నమ్మకం ఉంచి, దైవ సేవ ప్రేమతో చేయాలనీ ఈ పఠనాలు భోదిస్తున్నాయి.
-చాలా సందర్భాలలో విశ్వాసానికి  సంభందించిన  తిరస్కరణలు, హింసలు ఎదురవుతాయి అయితే వాటన్నింటిని ఎదుర్కొని విశ్వాస సాక్ష్యం మిగతా వారికీ ఇవ్వాలి.
-ఈ నాటి మొదటి పఠనంలో దేవుడు యిర్మియా ప్రవక్తను తన యొక్క సేవకి ఎన్నుకొని ఆయన్ను బలపరిచిన విధానం తెలుసుకుంటున్నాం.
-దేవునిసేవలో ఎదురయ్యే కష్టాలను ముందుగానే ప్రవక్తకు తెలుపుచున్నారు.
-దేవుడు యిర్మీయాను పిలిచి తన ప్రవక్తగా నియమించారు. యిర్మియా తన తల్లి గర్భమున రూపొందకమునుపే దేవుడు తన్ను ఎన్నుకున్నారు అని పలుకుచున్నారు.
-ఆయన ఈ లోకంలో ఇంకా పుట్టక మునుపే అభిషేకించారు, అని తెలుపుచున్నారు. ఆయన్ను ఎన్నుకొన్నది ఒక ప్రవక్తగా జాతులకు తోడుగా ఉండుటకు.
-ప్రవక్త అంటే దేవుని స్వరం. దేవుడు పలకమన్న మాటనే పలుకుతూ దేవునికి మానవునికి మధ్యవర్తిగా నిలబడే దైవ సేవకుడే ప్రవక్త.
-దేవుడు యిర్మియాను పిలిచి, ఎన్నుకొని ఆయన్ను పవిత్ర పరచుచున్నారు. పవిత్ర పరచినది ఎందుకంటే, నిస్వార్థ సేవ చేయుటకు.
-పవిత్ర పరచినది దేవునితో వ్యక్తిగత సన్నిహిత సంబంధం కలిగి జీవించడానికి.
-పవిత్ర పరచినది దేవుణ్ణి సేవించుటకు, ఆయన మాటలను, వినుటకు, ఆయనలో ఐక్యమై జీవించుటకు దేవుడు యిర్మియాను ఎన్నుకొన్నారు, పవిత్ర పరిచారు.
-మనందరినీ దేవుడు జ్ఞాన స్నానం ద్వారా పవిత్ర పరుస్తున్నారు. అయితే మనం ఆయనలో ఐక్యమై జీవిస్తున్నామా, దేవునితో బంధం కలిగి పాపం, విడిచి దైవ చిత్తాన్ని నెరవేర్చుతున్నామా?
-యిర్మియా ప్రవక్త జీవితంలో దేవుడు ఆయన్ను జాతులకు ప్రవక్తగా ఉండుటకు అభిషేకిస్తున్నారు. కేవలం తన సొంత ప్రజల కోసం మాత్రమే కాదు అన్ని జాతుల వారికోసం అని ప్రభువు సుస్పష్టంగా తెలియచేస్తున్నారు.
-యిర్మియా మాత్రమే కాదు అన్య జాతులు వద్దకు పంపబడినవారు ఏలీయా, ఎలీషా, యోనా, లాంటి వారు కూడా అన్య జాతి జనులకు సేవలందించారు. 
-దేవుడు తన యొక్క ప్రవక్తను పరిచర్యకు ముందుగానే ఎదుర్కొన బోయే సమస్యలకు, హింసలకు, తిరస్కరణలకు, సిద్ధంచేస్తున్నారు.
-ప్రవక్తను పిలిచినప్పుడు వారి జీవితం పులపాన్పువలె సంతోషంగా ఉంటుందని వాగ్దానం చేయలేదు, వారి జీవితంలో కష్టాలు ఉంటాయి అని తెలిపారు.
-కష్టాలు, నిందలు, భాదలు, ఎదురైనా సరే నేను నీకు తోడుగా ఉంటాను అనే అభయం ఇస్తున్నారు.
-ప్రవక్తతో అంటున్నారు 1: 7   నీవు నడుము కట్టుకొని నిలబడి నేను ఆజ్ఞాపించిన సంగతులెల్ల వారితో చెప్పుము, నీవు వారికి భయపడ వలదని తెలుపుచున్నారు.
-ప్రవక్త లేదా దేవుని సేవకులు మాట్లాడే ప్రతి యొక్క మాట దేవుని యొక్క సందేశమే, దేవుడు తెలియచేయ మన్న మాటలే గురువులు, ప్రవక్తలు తెలుపుతారు.
-దేవునియొక్క సత్యమైన మాటలు మాట్లాడితే చాలామందికి నచ్చదు. ఎందుకంటే వారు మార్పు అంగీకరించలేరు. కాబట్టి వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజల్లో మనం ఇలాంటి స్వభావాలు చూస్తున్నాం.
-ఇశ్రాయేలు ప్రజల్ని దేవునిలో ఐక్య పరచటానికి ప్రవక్త ప్రయత్నిస్తున్నారు అలాగే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో శుద్ధీకరణ కోసం కృషి చేస్తున్నారు, వారి పాపపు జీవితం విడిచి పెట్టి, నీతిమంతమైన జీవితం జీవించాలని, దేవునికి విధేయులై జీవించాలన్న సత్యమైన దేవుని మాటలు ప్రజలతో పలికినప్పుడు అవి చాల మందికి నచ్చలేదు, ఎందుకంటే వారు మార్పును అంగీకరించలేక పోయారు అలాగే వారికి నచ్చిన సొంత జీవితం జీవించాలనుకున్నారు. అందుకే ప్రవక్తలను తిరస్కరిస్తున్నారు.
-ప్రభువు అంటున్నారు “నా మాటలు పలుకుటకు, నా సేవ చేయుటకు సిద్ధంగా ఉండుమని తెలుపుచున్నారు. నిజంగా మన జీవితాలను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటే ఎటువంటి ఇబ్బందులకు భయపడనవసరంలేదు” .
-దేవుడే అంటున్నారు 'బయపడనవసరం లేదు '. స్వార్థ పరులైన ఇశ్రాయేలు రాజకీయ,మత నాయకులు అనేక ఆటంకాలు పరిచర్యకు  కలిపిస్తారు, అలాంటి తరుణంలో నిర్భయంగా ముందుకు సాగమని దేవుడు అభయం ఇస్తున్నారు.
- దేవుడు తనకు తోడుగా ఉంటానని తెలుపుచున్నారు. యెషయా 41 : 10 
- ఎవరు ఎదురించినా సరే దేవుడు తోడుగా ఉంటాననే అభయం ఇస్తున్నారు.
-వారికి తోడుగా ఉండే విధానంలో దేవుడు మూడు ప్రతీకలను ఉదాహరిస్తున్నారు;
1. సురక్షిత నగరం.
2. ఇనుప స్తంభం 
3. ఇత్తడి తలుపు.
1. సురక్షిత నగరం- భద్రతకు గుర్తు. ఎంతమంది శత్రువులు దాడి చేసినా సరే చెక్కు చెదరకుండా, పడిపోకుండా, దృడంగా నిలబడుతుంది. 
2.ఇనుప స్తంభం - బలానికి, మహా శక్తికి గుర్తు. దేవుని యొక్క అభిషేకం ద్వారా మహాశక్తి ప్రతిఒక్కరిలో దాగి ఉంది, కాబట్టి ఆ శక్తి తో ఎన్ని సమస్యలైనా ఎదుర్కొని దైర్యంగా ఉండుమని తెలుపుతుంది.
3. ఇత్తడి తలుపు- భాదలు, అవమానాలు తట్టుకొని నిలబడే ఒక ఆయుధం, సాధనం.
-యిర్మియా తో దేవునియొక్క సంరక్షణ గురించి ప్రభువు తెలుపుచున్నారు. ఆయన ఒక రక్షణ కవచంగా ఉంటానని వాగ్దానం ఇస్తున్నారు.
- చాలా సందర్భాలలో దైవ సేవ చేసేటప్పుడు మనం భయ పడుతూ ఉంటాం. కొంతమంది ప్రవక్తలు కూడా ఉదాహరణగా మనకు నిలుస్తారు. 
మోషే, యిర్మియా, యోనా, ఏలీయా. 
-మోషే ప్రవక్త నత్తివాడినని   సాకులు చెబుతూ తప్పించుకోవాలని అనుకున్నాడు. 
-యిర్మియా - చిన్నవాడినని భయపడ్డాడు. 
-యోనా - అన్యులు అంగీకరిస్తారా లేదా అని భయ పడ్డాడు. 
-ఏలీయా - ఎసెబేలు రాణికి భయ పడ్డారు.
- వారిజీవితంలో ఎదురవ్వబోయే పరిణామాలకు ప్రవక్తలని భయపడ్డారు. దానికి తోడుగా ఇశ్రాయేలు ప్రజలు కూడా అనేక మంది ప్రవక్తలను నిరాకరించింది కాబట్టి వారు భయ పడ్డారు. 
- హోషేయా 9: 7, యిర్మియా 2: 30 
-2 వ రాజుల దిన 36: 16, ఆమోసు 2: 12 
-లూకా 13: 34, మత్తయి 23: 37, హెబ్రీ 11: 32, 1 థెస్స 2; 15 
-ప్రవక్తలు తమ జీవితంలో దేవుని కొరకు మాత్రమే పనిచేసారు. వారు అధికారులకు భయపడలేదు, మత పెద్దలకు, నాయకులకు, భయపడలేదు ఎందుకంటే వారు దేవునికి సంపూర్ణ, విధేయత చూపించారు. దేవుని చిత్తం నెరవేర్చారు, సొంత స్వార్థం చిత్తం చూసుకోలేదు. 
-మనం కూడా గుర్తించు కోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని సేవ చేసినప్పుడు అంగీకారం మరియు తిరస్కారం అనేవి సర్వ సాధారణ అనుభవాలు అయితే తిరస్కరింప బడినప్పుడు క్రుంగి పోనవసరంలేదు ఎందుకంటే యేసేపు అన్నల చేత తిరస్కరించబడ్డారు, అయినా దేవుడు తన పక్షాన వున్నారు, ఆయన మాత్రం దైర్యంగా వున్నాడు, అభివృద్ధిలో ముందుకు సాగరు. ఆది ఖా: 37 .
-యేసు ప్రభువు నిరాకరించబడ్డారు, యోహాను 15: 18, మార్కు 3: 21 
ప్రభువు మాత్రం తండ్రి చిత్తం నెరవేర్చారు. 
- యిర్మియాను నిరాకరించారు అయినా దైవ సేవ చేశారు. నిరాకరించిన సరే దైవ వాక్కు తనను నిశబ్దంగా ఉంచుటలేదు, ఆయన దేవుని మాటలు దైర్యంగా ప్రకటిస్తున్నారు. 
-మన జీవితంలో తిరస్కరించ బడినప్పుడు మనకు దేవుడు తోడుగా ఉంటారని తెలుసుకొని దేవుడ్ని నమ్ముకొని ముందుకు సాగిపోవాలి.
- రెండవ పఠనంలో పౌలు గారు దైవ వారములు పొందిన విశ్వాసులు ప్రేమతో కూడిన జీవితం జీవించాలని తెలుపుచున్నారు.
-కొరింతు క్రైస్తవ సంగంలో ప్రేమ అనే వరము కొరవడింది. దేవుని యొక్క వారములు పొందినవారు వేవుణ్ణి, పొరుగు వారిని ప్రేమిస్తూ జీవించాలని పౌలు గారు పలుకుచున్నారు .
-పౌలు గారు తనయొక్క సువార్త పరిచర్య మొత్తం కూడా ప్రేమతో చేశారు.
-దేవుణ్ణి ప్రేమించారు కాబట్టే ఆయన సందేశమును ప్రజలకు ప్రకటించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు, హింసలు , ఎదురైనా  ఆయన మాత్రమూ దైవ సేవ చేశారు.
- ప్రేమకు ఏదైనా సాధించే బలం ఉంది అలాగే ఎంత శ్రమైన భరించే ఓర్పుకు, ప్రేమ ఉంది.
-దేవుని యొక్క కుమారుని యొక్క జీవితంలో మనకు అర్ధమయ్యే విషయం అదే. ఆయన ప్రేమతోనే మన కోసం ఈ లోకంలో జన్మిమ్చారు. 
-ప్రేమవలనే సుంకరులతో, పాపులతో కలిసి భోజనం చేశారు.
-ప్రేమవలనే అన్ని ప్రాంతాలవారికి సువార్త ప్రకటించారు.
-ప్రేమతో అద్భుతాలు చేశారు.
-ప్రేమ వల్లనే ఆయన్ను నిరాకరించిన కానీ మళ్ళీ వారిని అంగీకరించారు.
-ప్రేమ వల్లనే మోసం చేసినా క్షమించరు
-ప్రేమ వల్లనే తన జీవితం త్యాగం చేశారు
-ప్రేమ వల్లనే మనలను రక్షించారు
-ఆయన ప్రేమను గుర్తించిన పౌలు గారు ఈ విధంగా దేవుని యొక్క ప్రేమ జీవితం గురించి తెలుపుచున్నారు. 
- దేవుడు ప్రేమ స్వరూపి అని యోహాను గారు కూడా వ్రాశారు. 1 వ యోహాను 
-దేవుడు తన వారిని శాశ్వత మైన ప్రేమతో ప్రేమించారు. యిర్మియా 31 : 3  కాబట్టియే తిరస్కరించిన సమయాలలో క్రుంగి పోకుండా దైర్యంగా తన యొక్క పరిచర్యను కొనసాగించారు.
-ప్రేమలో స్వార్థం ఉండదు 
-ప్రేమ ఎదుటి వారి మేలు కోరుకుంటుంది. 
-ప్రేమకు ఎలాంటి చెడుగుణములు లేవు.
-దేవుడు మనలను ప్రేమించిన విధంగానే మనం ఒకరినొకరు ప్రేమించుకొని దైవ సేవ చేద్దాం. దేవుని ప్రేమను పంచుకుందాం.
-నేటి సువార్త పఠనంలో యేసు ప్రభువును తన సొంత ప్రజలే నిరాకరించిన విధానం మనం చూస్తున్నాం.
-సువిశేష భాగంలో రెండు విషయాలు మనం గుర్తించాలి. 
- ప్రజల యొక్క ఆశ్చర్యం 
-సొంత వారి యొక్క నిరాకరణ 
1. ఎప్పుడైతే యేసుప్రభువు యెషయా ప్రవక్త  గ్రంధం ను చదివి లేఖనము నెరవేరింది అని పలికారో అపుడు వారందరు ఆశ్చర్య పడుతున్నారు. 
-ఆయన మాటల్లో నూతనత్వం వున్నదని గ్రహించారు. ఆయన యొక్క భోధన యధార్థమైనదని గ్రహించారు. 
-ఆశ్చర్య పోయినతరువాత ఆయన యొక్క కుటుంభంతో ఆయన్ను పోల్చుతున్నారు. అయన యేసేపు కుమారుడు కాదా అని వారి ఆశ్చర్యం, ద్వేషంగా మారిపోతుంది ఇక్కడ.
-చాలా సందర్భాలలో మనంకూడా కొంతమందిని పోల్చుతారు.
-సమాజంలో పేరు ప్రతిష్టలున్న వారి అబ్బాయి కన్నా ఒక  పేద వానికి  వున్నత ఉద్యోగం వస్తే ఇదెలా అని ఆలోచిస్తూ వ్యత్యాసాలు చూసుకుంటారు.
-వారి అభిప్రాయమేమిటంటే వారికన్నా మిగతా వారందరు తక్కువ వారే, లేని వారే అనే భావన. ఇక్కడ యూదులు కూడా చేసినది అదే, ఆయన్ను (యేసు ప్రభువును) తన తండ్రితో పోల్చుతున్నారు. ఈ పేదవాని కుమారుడు ఎలాగా ఇలా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తున్నారు .
-ఆయన బోధనలు అంగీకరించుటకు బదులుగా ప్రశ్నించుకొంటున్నారు.
-సొంత వారు ఎప్పుడు తమ సొంత ప్రవక్తల గొప్పతనం అంగీకరించలేరు, ఎందుకంటే మన మధ్యలో పుట్టి, పెరిగిన వ్యక్తి, వారికన్నా ఎక్కువగా మంచి చేస్తుంటే, భోదిస్తుంటే ఎవరు కూడా అంగీకరించలేరు. వారిలో ఎక్కువ అసూయా ఉంటుంది.
- ప్రజలు ఎందుకు నిరాకరించారంటే 
1. తన బోధనల ద్వారా వారికి కోపం తెప్పించారు, మరీ ముఖ్యంగా వారి విశ్వాసం అన్యుల కన్నా చిన్నది అని చెప్పారు. 
2. వారి మధ్య అద్భుతాలు చేయుటకు నిరాకరించారు.
3.నాయకులను, మత పెద్దలను ప్రతి నిత్య కపట ప్రవక్తలని సంబోధించినందులకు 
4. తానే మెస్సయ్య అని చెప్పుకున్నందుకు
5. అసూయా వల్ల ప్రభువును నిరాకరించారు చంపాలనుకున్నారు.
6. ఆయన (క్రీస్తు) ప్రజలు అనుకున్న విధంగా నడవలేదు.
7. ప్రజలకు ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడలేదు అందుకే వారు కోప పడ్డారు, నిరాకరించారు. 
-దానికి ప్రతి ఫలంగా దేవుడు వారి విశ్వాస జీవితాలను పరీక్షించుటకు రెండు ఉదాహరణలు ఇస్తున్నారు.
1. ఏలీయా - సెరాఫథ్ వితంతువు- 1 రాజు 17: 7 - 24 
2. ఎలిశా - నామాను కుష్టి రోగి (సిరియా) 2 రాజు 7: 3 -10 
ఏలీయా ప్రవక్త సెరాఫత్ లో వున్న వితంతువద్దకు వెళ్లారు. అక్కడ ఆమె ప్రవక్త మాటలను  విశ్వసించింది.
- ఆయన మాటప్రకారం నడుచుకొన్నది.
- నామాను కూడా అన్యుడే అయినప్పటికీ ప్రవక్త మతాల మీద విశ్వాసం ఉంచి విధేయత చూపారు కాబట్టియే స్వస్థత పొందారు. 
-వితంతువు, నామాను, ఇద్దరు కూడా ప్రవక్తలను అంగీకరించారు వారిద్దరిలో ప్రవక్తలో దైవ శక్తి దాగి ఉందని గ్రహించారు. అందుకే వారి మాటలను ఆలకించి వినయంతో వారు చెప్పినది చేసారు. అందువల్ల అద్భుతాలు పొందారు.
-ప్రభువు ప్రేమ అందరికి ఇవ్వబడుతుంది దానిని స్వీకరించకపోతే అది మన లోపమే.
-యూదులకు మొదటి ప్రాముఖ్యత నిచ్చారు కానీ వారు తృణీకరించారు. మనం కూడా అలాగే చేస్తున్నామా?
-అసూయా ఉంటే ఎవరియొక్క గొప్పతనం, మంచితనం, మనం అంగీకరించలేము. ప్రేమ ఉంటే ఎవరినైనా అంగీకరిస్తాం, భరిస్తాం. కాబట్టి మన జీవితంలో అంగీకారం , తిరస్కారం ఉంటూనే ఉంటాయి . కాబట్టి మనం ప్రేమతో అని తెలుసుకొని ప్రవక్తలను యేసుప్రభువును  ఉదాహరణ గా తీసుకొని ముందుకు సాగాలి. వారు నిరాకరించబడిన కానీ గమ్యం మరువలేదు, సువార్త  సేవ ఆపలేదు , క్రుంగి పోయి వెనుకంజ వేయలేదు. దైవ ప్రేమతో సోదరుల మంచికోసం ఎన్ని తిరస్కరణలైన ఎదుర్కోగలిగారు. మనం కూడా ప్రేమ ఉంటె ఎంత కష్టమైన ఇష్టంగా ఏదైనా సాధించవచ్చు.
-దేవుడు అందరిని సువార్త వ్యాప్తి కోసం పిలుస్తున్నారు కాబట్టి ప్రభువు యొక్క వాక్యం అనుసారం జీవించుదాం.
Rev. Fr. Bala Yesu OCD

22, జనవరి 2022, శనివారం

మూడవ సామాన్య ఆదివారం

 మూడవ సామాన్య ఆదివారం 

నెహెమ్యా  8:2-4,5-6,8-10 1 కోరింథీ 12:12-30 లూకా 1:1-4,4:14-21 

నేటి దివ్య పఠనాలు  దేవుని  యొక్క వాక్కు వినేటటువంటి  ప్రజలు ఎలాంటి జీవితం జీవించాలి అనే అంశం గురించి తెలుపుతున్నాయి.  దేవుని యొక్క వాక్కు యొక్క గొప్పతనం  శక్తిని  గ్రహించి దేవుని ప్రజలు ఐక్యత, సక్యత  కలిగి  జీవిస్తూ దేవున్ని అంటి పెట్టుకొని  జీవిస్తూ  దేవుని సేవ చేయాలని కూడా  ఈనాటి పఠనాలు  మనకు తెలుపుచున్నాయి. 

ఈనాటి  మొదటి పఠనంలో  దేవుని వాక్కు యొక్క గొప్పతనం గురించి చదువుకుంటున్నాము. మొదటి పఠనం యొక్క చరిత్ర మనం గ్రహిస్తే, ఆనాటి  పర్షియా రాజు కోరేషు బాబిలోనియా ప్రజలను  జయించిన తరువాత బానిసత్వంలో  దాదాపు 70 సంవత్సరాలు గడిపిన యూదులను  వారి సొంత భూమి అయిన యెరుషలేముకు పంపించారు. 

తిరిగి వచ్చిన యూదులు యెరుషలేము  దేవాలయంణు పునర్నిమించారు. ఎజ్రా 6:15-17 అదే విధంగా ఆ పట్టనపు గొడలు కూడా కట్టడం ముగించిన  పిదప  దేవుని యొక్క వాక్యం చదువుచున్నారు.  దేవుని యొక్క వాక్యం చదువుచున్నారు. దేవుని యొక్క వాక్యం చదివినది ఎజ్రా. ఆయన  ధర్మ శాస్త్ర భోధకుడు , యాజకుడు అదే విధంగా  మత సంబంధిత నాయకుడు (నెహెమ్యా 8:9)

అదేవిధంగా నెహెమ్యా  రాష్ట్ర పాలకుడు  దేవునితో మంచి  అనుభందం  కలిగిన వ్యక్తి, దైవ భయం  వున్న వ్యక్తి ,దేవుడు ఎజ్రాకు  మరియు నెహెమ్యాకు  ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పజెప్పారు. ఆదేమిటంటె  దేవుని యొక్క  వాక్కును ప్రకటించుట, ప్రకటించుట మాత్రమే కాదు ప్రజలను ప్రేరేపించాలి. 

ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు  విషయాలు గుర్తు పెట్టుకోవాలి. దేవుని వాక్కు మనం ప్రకటించాలి, ఇతరులను దైవ వాక్కుతో ప్రేరేపించాలి. ఈ మొదటి పఠనంలో యిస్రాయేలు  ప్రజలు దేవుని యొక్క వాక్కును వినుటకు కనబరిచిన ఆసక్తి గొప్పది. 

దేవుని యొక్క వాక్కు వినాలని ఎంతో ఆశతో వున్నారు. దేవుని యొక్క వాక్కు దేవునితో సమానమని భావించారు. బానిసత్వంలో  బహిరంగంగా దేవుని వాక్కు ఆలకించే  అవకాశం లేదు అందుకే ఇప్పుడు  దొరికిన  అవకాశంను  బట్టి వారు ఆ వాక్కుకై తయారై వున్నారు. ఎజ్రా దేవుని వాక్కు చదివినప్పుడు ఉదయం నుండి  మధ్యాహ్నం వరకు అందరుకూడా సావదానంగా విన్నారు. వారు విసుగు చెందక, అలసట పొందకు  అదే పనిగా ఎలాగా  వినగలిగారు. అంటే ఆ వాక్కులు  ఆ ప్రజలకు వినసొంపుగా వున్నాయి.  ఆ వాక్కు వల్ల  దేవుని తెలుసుకోవచ్చు అం గ్రహించారు. కీర్తన 119:103 

ఆ వాక్యములు  వారికి  వెలుగును , చూపేలా ఉన్నాయి. అందుకే వాటిని వినడానికి చాలా ఇష్టపడుతున్నారు. దేవుని వాక్కు  యొక్క  ఔనత్యాన్ని తెలుసుకున్నారు. అందుకే  ఎటువంటి  ఇబ్బంది లేకుండా విన్నారు. వారి యొక్క  ఆధ్యాత్మిక జీవితంకు  దైవ వాక్కే ఆహారం. దేవుని యొక్క వాక్కు  సృష్టించే వాక్కు అని. దేవుని యొక్క వాక్కు  ఆదరించే  వాక్కు అని ,దేవుని యొక్క వాక్కు నేర్పించే వాక్కు అని , దేవుని యొక్క వాక్కు పుట్టించే వాక్కు అని , దేవుని యొక్క వాక్కు స్వస్థత నిచ్చే వాక్కు అని వారు గ్రహించారు.

మనం దేవుని  వాక్కుకు  ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాం? దేవుని యొక్క వాక్కును ఆలకించడానికి చదవడానికి  ఎంత మందికి ఆసక్తి ఉంది.  యూదుల కాలంలో అందరి దగ్గర దేవుడు మోషే ద్వార ఇచ్చిన  ధర్మ శాస్త్రం  లేదు అయినప్పటికీ అయినప్పటికీ అవకాశం ఉన్న చోటల్లా దేవుని వాక్కు వింటున్నారు. మనందరికీ  ఇప్పుడు బైబుల్  గ్రంధం ఉంది. ఎంత మంది  చదువుతున్నారు? చదువు లేకపోయినా చదువుకున్న బిడ్డల దగ్గర ఎంతమంది చదివించుకొని వింటున్నారు. 

గుడికి వచ్చినప్పుడు యాజకులు బైబుల్ గ్రంధం మొత్తం  వివరించలేరు ప్రసంగంలో , అందుకే  దేవున్ని  తెలుసుకోవాలంటే మన జీవితాలు సన్మార్గంలో నడిపించు కోవాలంటే మనం దేవుని వాక్కు చదవాలి, వినాలి. 

చదివితే మరియు వింటేనే మనలో విశ్వాసం పెరుగుతుంది. రోమి 10:17. ఆనాటి యూదా ప్రజలు సమయం గురించి ఆలోచించలేదు. దేవుని వాక్కు గురించి మాత్రమే  ఆలోచించారు. మనం కూడా పవిత్ర గ్రంధం చదువుట ద్వారా దేవుని ప్రేమ, క్షమా, త్యాగం చాల విషయాలు నేర్చుకోవచ్చు.

అలంటి ఆసక్తి మనలో ఉందా?

2. రెండవది గా దేవుని ధర్మ శాస్త్రమునకు ఇచ్చిన గౌరవం అందరం ధ్యానించుకోవాలి.

నెహెమ్యా 8: 5-6  ఎప్పుడైతే ఏజ్రా గ్రంధమును విప్పారో అప్పుడు అందరుకూడా లేచి నిలబడ్డారు, దేవుణ్ణి స్తుతించి అదేవిధంగా ఆ ప్రభువుని ఆరాధించారు.

- ఆ గ్రంధం గురించి వారికి తెలుసు కాబట్టియే ఆ పుస్తకం కు అంత ప్రాధాన్యత ఇచ్చారు.

-మరి ఈ రోజు మనం పవిత్ర గ్రంథం ను ఎలాంటి స్థలాల్లో ఉంచుతున్నాం?

-కొంతమంది ఎక్కడెక్కడో పెడతారో. అది కాదు మనం చేయాల్సింది, ఆ గ్రంధం దేవుడే కాబట్టి మనం మంచి స్థలం ఇవ్వాలి.

- విలువ గ్రహిస్తే ప్రాధాన్యత ఇస్తాం. ఇశ్రాయేలు ప్రజలు గ్రహించారు కాబట్టియే  అది చేయగలిగారు.

-చర్చిలో నిలబడ్డ సమయంలో కొన్నిసార్లు బైబిలు మన కాళ్ళ దగ్గరఉంటుంది. అది కూడా మనం పట్టుకొని నిలబడితే అప్పుడు ఆ వాక్కు కు మనం గౌరవం ఇచ్చినట్లు అవుతుంది.

- ప్రతి ఒక్కరు పవిత్ర గ్రంధమును దేవాలయానికి తీసుకురావాలి.

-దేవునియొక్క వాక్కును చదివిననప్పుడు వారియొక్క హృదయాలు చలించి పోయాయి. అందుకే దుఃఖం పట్టలేక ఏడ్చిరి . నెహెమ్యా 8:9

- దేవుని ఆజ్ఞలు మీరు జీవించినందుకు ఏడ్చి ఉండవచ్చును.

- వారు బోరున ఏడ్చారు. దేవుని వాక్కును విన్న సమయంలో దేవుడి ప్రేమ వారికి గుర్తుకు వచ్చింది.

-దేవుడు వారిని ఒక కాపరిగా, తండ్రిగా నడిపించిన విధానం గుర్తుకు వచ్చింది.

-వారికి బానిసత్వం వచ్చింది ఆయన యొక్క వాక్కును ధిక్కరించడం వల్లే అని గ్రహించి ఉండవచ్చును.

- వారికి ఇచ్చిన మన్నా, పూరేడు పిట్టలు, సమృద్ధిగా స్వేచ్ఛ జీవితం గుర్తుకు వచ్చింది.

- వారు దైవమును కాదని అన్య దైవములను ఆరాధించిన పాపపు జీవితం గుర్తుకు వచ్చింది.

-దేవుని యొక్క వాక్కు వారి జీవితాలకు అన్వయించారు కాబట్టియే వారియొక్క బలహీనతలు, పాపపు మచ్చలు గుర్తుకు వచ్చాయి.

మనం కూడా దేవుని వాక్కును మన జీవితాలకు అన్వయించుకుంటేనే  మనలో కూడా హృదయ పరివర్తనం అనేది కలుగుతుంది.

- కొన్నిసార్లు మనం కొంతమందిని చూస్తాం ప్రసంగం చెప్పేటప్పుడు ఏడుస్తారు ఎందుకంటే ఆ వాక్యం వారిని తాకింది.

అదేవిధంగా వారియొక్క పాపపు జీవితం గుర్తుకు వచ్చినప్పుడు, ఏడుస్తారు.

-పాపపు జీవితం ద్వారా, స్వార్ధపు జీవితం ద్వారా ఇతరులను దేవుడిని బాధ పెట్టిన సమయాల గురించి వాక్యంతో భోదించినప్పుడు సాధారణంగా అందరూ ఏడుస్తారు. మనం కూడా ప్రభువు యొక్క వాక్కు విన్న సమయంలో భాద కలిగి మార్పు కలగాలి.

1.సౌలు విన్నాడు హృదయ పరివర్తనం చెందాడు. (పౌలు)

2.దావీదు నాతాను ప్రవక్త యొక్క దైవ వాక్కులు విన్నాడు పశ్చాత్తాప పడ్డారు.

3.నినెవె  పట్టణ  వాసులు విన్నారు దుఃఖం తో జీవితాలు సరిచేసుకున్నారు

4.అగస్టీను దేవుని యొక్క వాక్కు విన్నాడు -హృదయ పరివర్తనం చెందాడు. మనం కూడా  అలాగే  మన జీవితాలు మార్చుకోవాలి.

-వాక్యం చదవటానికి, వినటానికి సమయం కేటాయించాలి. అప్పుడే దేవుని గురించి తెలుసుకొని జీవిస్తాము.

-దేవుని వాక్కు చదివితే ఆ వాక్యమే మనలను నడిపిస్తుంది, ప్రేరేపిస్తుంది. మనం ఎలా జీవించాలి అని తెలుపుతుంది.

- దేవుని యొక్క వాక్కు లేని లోపం వారు తెలుసుకున్నారు. అందుకే ఎంత సమయమైనా కాని పట్టించుకోకుండా శ్రద్ధగా విన్నారు, ప్రభువునందు ఆనందించారు. అలాంటి విశ్వాసం, ఆశ మనలో కూడా ఉండాలి.

రెండవ పఠనంలో

దేవుని బిడ్డలు, దేవుని వాక్కు వినేవారు చదివేవారు జీవించవలసిన విధానం గురించి పౌలుగారు తెలుపుచున్నారు.

-కొరింతు ప్రాంతంలో భిన్నమైన ప్రజలు జీవిస్తుండేవారు వారిలో బేధాభిప్రాయాలు ఎక్కువగానే ఉండేయి. ఐతే పౌలు గారు వారందరు కూడా ఐక్యంగా కలిసి జీవించుటకు శరీరం మరియు దానిలో వున్నా అవయవములు ఉదాహరణ తీసుకొని ఐక్యతను గురించి తెలుపుచున్నారు.

-జ్ఞానస్నానం పొందిన ప్రతి యొక్క విశ్వాసి దేవుని యొక్క పవిత్రమైన శరీరంలో భాగమే.

- జ్ఞాన స్నానం స్వీకరించుటకు ముందు మనలో ఎన్నోరకాలైన భావాలూ భేదాలు ఉన్నప్పటికీ వాటన్నింటిని జ్ఞానస్నానం పొందిన తరువాత విడిచిపెట్టాలి అని పౌలుగారు వివరిస్తున్నారు. (1కొరింతి12: 12-13 )

-మన శరీరంలో వున్న ప్రతియొక్క అవయవం ముఖ్యమైనది ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంటుంది. కొన్ని అవయవాలు పెద్దవి అయివుండవచ్చును కొన్ని చిన్నవి అయి ఉండవచ్చు, అయినప్పటికీ దేని ప్రాముఖ్యత దానికి ఉంది.

-కాబట్టి ఒక్క అవయవం ఇంకొక్క దానికి సహకరిస్తూ జీవిస్తే అక్కడ మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది.

-మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం పనిచేస్తేనే మనందరం బాగుంటాం. ఏది బాగా లేకపోయినా మనం సంతోషం గా ఉండలేము. అలాగే మనందరం కూడా దేవుని శరీరంలో  భాగస్తులం మరి మనం కూడా ఐక్యంగా జీవించాలి.

చేయి నోటికి సహకరించకపోతే మనం తినలేం

-కన్ను కాలికి సహకరించకపోతే మనం నడవలేం

-నోరు చెవులకు సహకరించకపోతే మనం వినలేం.

అందుకే ప్రతి ఒక్క అవయవం అవసరం, ప్రతి అవయవం శరీర అభివృద్ధి కోసం, మానసిక, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడాలి.

-ప్రతి ఒక్క వ్యక్తి తాను శ్రీసభ (శరీరం) కోసం తన వంతు తాను కష్టపడాలి. అప్పుడే శ్రీసభ  ఆనందంగా ఉంటుంది.

- శ్రీ సభ శిరస్సు క్రీస్తుప్రభువే ఆయన లేకుండా మనం లేము. కాబట్టి ఆ శరీరం గొప్పతనం గ్రహించి , సహకరించి జీవించాలి.

-మనందరం కూడా ఐక్యత కలిగి జీవించాలి. పౌలుగారు అంటారు జ్ఞానస్నానం పొందినవారందరు దేవుని బిడ్డలే అందుకే వారు ఐక్యంగా జీవించాలి.

-సాధారణంగా సమాజంలో మనం చుస్తే ఇంకా చాలామందికి జాతి, మత, కుల భేదాభి ప్రాయాలు వున్నాయి. బహుశా ఇంకా వారిని దేవుని యొక్క వాక్కు తాకలేదు.

-స్వయంగా యేసు ప్రభువే తనను తాను తగ్గించుకొని పాపులతో, సుంకరులతో కలిసి జీవించారు.

-పౌలు పరిసయ్యుడు అయినప్పటికీ అన్యులకు సేవచేసారు. ఆయన్ను దేవుని వాక్కు మార్చింది.

-దేవుని వాక్కు అతనికి వివేకాన్ని అందించింది అందుకే భేదాభి ప్రాయాలు లేకుండా జీవించారు.

-మనం దేవుని బిడ్డలం, ఆయన మన తండ్రి మనందరం ఒకే కుటుంబంలో ని బిడ్డలం కాబట్టి అందరితో కలిసి మెలసి ఐక్యంగా జీవించాలి.

-శ్రీ సభ అభివృద్ధి కోసం సహాయపడాలి. అందరుకూడా విలువైన వారే ధనిక -పేద వ్యత్యాసం లేకుండా .

-మనందరం దేవుని వాక్కు చదివి, ధ్యానించి ఆ వాక్కు అనుసారం జీవించాలి, ఎలాంటి భేదాలు మనలో వుండవు. వాక్యమును చదువుకొని జీవించుద్దాం, ఐక్యంగా కృషిచేద్దాం.

-ఈనాటి సువిశేష పఠనంలో యేసు క్రీస్తు ప్రభువు యొక్క పంపబడిన విధానం తెలుసుకుందాం.

-ప్రభువు ఎందుకు ఈ లోకానికి పంపించబడ్డారు అని తెలుపుచున్నారు.

సువార్త ప్రారంభంలో లూకా గారు ఈ సువార్త తెయోఫిలుకు వ్రాస్తున్నారు. అదేవిధంగా అందరి విశ్వాసుల కోసం వ్రాస్తున్నారు.

-తెయోఫిలు బహుశా నీటి గలిగిన వ్యక్తి అయి ఉండవచ్చు, మంచి పేరు కలిగిన వ్యక్తి కావచ్చు, లేకపోతే దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగి లూకా గారిని యేసు ప్రభువు గురించి వ్రాయమని అడిగివుండవచు.

-బహుశా దేవునియందు విశ్వాసం ఉంచి క్రొత్తగా జ్ఞానస్నానం పొందిన వ్యక్తి అయి ఉండవచ్చు.

-తెయోఫిలు అంటే (a friend of God) దేవునికి స్నేహితుడు, దేవుణ్ణి ప్రేమించువాడు అని అర్థం.

-దేవుణ్ణి ప్రేమించు ప్రతిఒక్కరికి లూకా గారు ఈ సువార్తను వ్రాస్తున్నారు.

-వారియొక్క విశ్వాసంలో దృడంగా ఉండటానికి ఈ విధంగా వ్రాస్తున్నారు.

-సువార్తలో మనం వింటున్నాం లూకా 4:14-15 యేసు ప్రభువు చేసినా సువార్త పరిచర్య గురించి

-ఆయన కేవలం ప్రార్థించుటకు మాత్రమే కాకుండా వీలైన ప్రతి సమయంలో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు.

-ప్రకటించిన వాక్యంకు ప్రతి ఫలం ఉండాలి. యేసుప్రభువు తండ్రి గురించి సువార్తలో తెలిపారు. ఆయన యొక్క జీవిత లక్ష్యం, ప్రణాళిక తెలిపారు.

-ప్రభువు ప్రతి ప్రాంతమునకు వెళ్ళేది అందరూ కూడా దేవున్ని తెలుసుకొని, హృదయ పరివర్తనం చెంది, రక్షణ పొందాలి అనే ఉద్దేశంతోనే.

యేసు ప్రభువు చదివిన మాటలు యెషయా 61:1-2 నుండి తీసుకొనబడినవి.

- ఈ మాటలు మోషే ఎన్నికకు దగ్గరగా వున్నాయి. నిర్గమ 3:7-10 మోషేను ఎందుకు ప్రభువు ఎన్నుకున్నారు అని తెలుపుచున్నారు.

-18 వచనం ద్వారా దేవుని ఎన్నిక దేని నిమిత్తం అని అర్థమవుతున్నది.

1. దేవుని  ఆత్మ  ఆయన పై ఉన్నది.

2. పేదలకు సువార్తను భోధించుటకు అభిషేకించారు.

3. చెరలో వున్న వారికి విడుదలను దయచేయుటకు.

4. గ్రుడ్డివారికి చూపును నిచ్చుటకును

5. పీడితులకు విమోచనం కలిగించుటకును

6. ప్రభు హిత సంవత్సరమును ప్రకటించుటకు ఆయన్ను అభిషేకించారు.

-దేవుని కార్యముల కోసం, సువార్త వ్యాప్తి కోసం మూడు రకాల ప్రజలు అభిషేకించబడ్డారు.

1.రాజులు

2.యాజకులు

3.ప్రవక్తలు

1.సమువేలు సౌలును, దావీదును రాజులుగా అభిషేకిస్తున్నారు. దేవుని యొక్క ప్రతినిధులు వుంది దేవుని కార్యములు నెరవేరుచుటకు.

2. యాజకులు ప్రతి ఒక్క యాజకున్ని దేవుడు అభిషేకిస్తారు దేవుని యొక్క యాజకులు ఆరోను దేవుని యొక్క యాజకులు ఆరోను అతని కుమారులు దేవుని సేవకోసం ప్రత్యేకంగా కేటాయించబడిన వారు - 2 రాజులు 29, 30 అధ్యాయాల్లో చెప్పబడినవి.

3. ప్రవక్తలు - దేవుడే  వారికి స్వయంగా పిలుపునిస్తున్నారు. దేవునికి మానవులకు మధ్యవర్తులుగా ఉండటానికి దేవుడు ఏలియాతో ఏలిషాను అభిషేకించడానికి చెప్పారు. 1 రాజులు 19:16-19 వీరందరూ దేవుని యొక్క పనికోశం అభిషేకించబడిన వారే, వారికి అధికారం , శక్తి, ఆత్మ వరములు ఇవ్వబడ్డాయి. కాబట్టి వారు చేసే సువార్త  అంగీకరించి  జీవించాలి. 

1. దేవుని ఆత్మ అభిషేకించబడిన వారి మీద ఉన్నది. దేవుని ఆత్మచె వారు నడిపించబడాలి. యేసు ప్రభువు నాపై ప్రభుని  ఆత్మ ఉన్నది అని పలికారు. ఆ ఆత్మ శక్తిచే శోదనలు  జయించారు, ఆత్మ శక్తిచే  సువార్తను ప్రకటించారు. కష్టలు ఓదార్చుకున్నారు. దేవుని ఆత్మ  తనను పరిచర్యకు సంపూర్ణంగా సిద్దం చేసింది. 

దేవుడు తాను పిలిచిన వారిని బలపరుస్తారు. దేవుని యొక్క ఆత్మ వారిని నడిపిస్తుంది. 

2. పేదలకు సువార్తను భోధించారు. పేదలు అనగా లేని వారు. దేవుని గురించి అవగాహన లేనివారు. దైవ ప్రేమ లేని వారు, దేవుని సుగుణాలు లేని వారు ,దేవుని యొక్క ఆత్మ లేనివారు, దేవుని యొక్క మంచి తనం, గొప్పతనం తెలియని వారికి సువార్తను ప్రకటించుటకు యేసు ప్రభువును తండ్రి దేవుడు అభిషేకించారు. గురువులను కూడా అందుకే  అభిషేకించారు. 

3. చెరసాలలో ఉన్న వారికి విడుదల దయచేయుటకు ఈ లోక ఆశతో , వ్యామోహంతో బంధీలుగా ఉన్నవారిని పాప సంకీర్తనల ద్వారా విడుదల దయ చేయుటకు దేవుని యొక్క పరిశుద్ద వాక్కు ద్వారా విడుదల దయ చేయుటకు ఎన్నుకొనబడ్డారు. 

4. గ్రుడ్డి వారికి చూపు నిచ్చుటకు 

ఎవరైతే దేవుని యొక్క కార్యాలు చూడలేక పోతున్నారు. దేవున్ని తమ జీవితంలో గుర్తించలేక పోతున్నారు. ఎదుటి  వారిలో ఉన్న  ప్రేమను చూడలేని గ్రుడ్డి వారు కొంతమంది కనులుండి గ్రుడ్డి వారిగా ఉండే వాళ్ళు ఉన్నారు. వారు అనుకున్నదే సత్యం అనుకుంటారు అట్టి వారికి దేవుడు మాత్రమే చూపు నివ్వగలరు. 

కొందరికి దేవుడు ఆధ్యాత్మిక చూపు దయ చేస్తారు. 

5.  పిడితులకు  -విమోచనం -ఎవరైతే శారీరకంగా , మానసికంగా ,ఆధ్యాత్మికంగా పీడించబడుతున్నారో అలాగే దయాల చేత పీడించబడేవారికి ,విమోచనం కలిగిస్తారు. మానసిక గాయాలవల్ల పీడించబడే వారు , అణచి వేయబడినవారు , ఎదుటి వారి పట్ల హర్ట్ అయినవారికి  విమోచనం కలుగ చేయుటకు పంపించబడ్డారు. 

6.దేవుని సంవత్సరం ప్రకటించుటకు - దేవుని యొక్క రక్షణ సంవత్సరం అని అర్ధం లేక మెస్సీయ్య యొక్క రాక అని అర్ధం. దేవుడు వారి మధ్యలో ఉన్నారు, అని తెలిపే సంవత్సరం అది. కాబట్టి మనందరం కూడా  దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి, అనుసరించి ఆ వాక్కు చేత స్వతత్రం పొందుతు సన్మార్గంలో నడుస్తూ దేవునికి అంగీకార జీవితం జీవిద్దాం. సాధ్యమైనంత వరకు సువార్త వ్యాప్తి కోసం కృషి చేద్దాం, దేవుని రాజ్య స్థాపనకు కృషి చేద్దాం. 

REV.FR.BALAYESU OCD



15, జనవరి 2022, శనివారం

రెండవ సామాన్య ఆదివారం

రెండవ సామాన్య ఆదివారం 

 యోషయా 62:1-5,  1 కోరింథీ 12:4-11 యోహను 2:1-11 

ఈనాటి దివ్య పఠనాలు దేవునితో దేవునిలో  ఒక క్రొత్త జీవితం  జీవించాలి అనే అంశం గురించి  భోదిస్తున్నాయి. దేవుడు  మనలో ఉన్న  అలాగే మనం దేవునితో ఉన్న అప్పుడు  మన యొక్క జీవితంలో  నూతనత్వం కలిగి జీవించాలి. ఈనాటి మొదటి పఠనంలో  దేవుడు యిస్రాయేలు ప్రజలను  దీవించిన  విధానంను  అదే విధంగా వారి  పునరుద్దరణను గురించి తెలుపుతుంది. 

దేవునికి విరుద్దముగా పాపం  చేసినందువల్ల  యిస్రాయేలు ప్రజలు  బాబిలోనియాకు పంపబడ్డారు. అయితే దేవుడు వారిని అక్కడితో మరచి పోలేదు, విడిచి పెట్టలేదు. వారు క్రొత్త జీవితం జీవించడానికి మరలా పిలుస్తున్నారు. 

మొదటి పఠనంలో దేవునికి మరియు యిస్రాయేలు ప్రజలకు ఉన్న బంధం ఒక వివాహ బంధం వంటిదని తెలుపుచున్నారు. యోషయా 62:5 యిస్రాయేలును  వధువుగా సంభోధీంచుట ద్వార ఇక యిస్రాయేలు ఒంటరి కాదని, వదలివేయ బడదని , అలాగే చేయి విడచి పెట్టబడదని తెలుపుచున్నారు. 

ఒక వరుడు  ఏ విధంగా  తన యొక్క వధువు  పక్షమున నిలబడతాడో అదే విధంగా దేవుడు కూడా యెరుషలేము కొరకు నిలబడతాడు. ఇక వారిద్దరు  సంతోషముగా జీవిస్తారు. వారు జీవించబోయే  ఒక నూతన జీవితం పూర్తిగా  అది ఒక క్రొత్త అనుభందంతో  ముడివేయబడుతుంది. 

దేవుడు తనలో  ఉంటే  ఎంతో లాభం కలుగుతుంది. ఎందుకంటే యోషయా 62:1 చివరి భాగంలో ఆ నగరపు విజయము వేకువ  వెలుగు వలె ప్రకాశించును,  ఆ పట్టణ రక్షణము చీకటిలో దీపమువలే మెరయును. 

వారి జీవితంలో  ఎప్పుడు కూడా విజయము ఉంటుంది. ఈ వెలుగు సంతోషానికి గుర్తు, వారు ఎప్పుడుకూడా సంతోషముగా ఉంటారు. వారి జీవితం బానిసత్వం, అనే అంధకారం నుండి తొలగించ బడుతుంది. 

యెరుషలేము పట్టణం రక్షణము పొందును వారి యొక్క వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుంది. యిస్రాయేలు ప్రజలు దేవునితో ఒక క్రొత్త నిబంధనా జీవితాన్ని జీవించినప్పుడు వారిద్దరి మద్య అన్యోన్య ప్రేమ , విధేయత విశ్వాస పాత్రులుగా ఉంటారు. దేవుడు క్రొత్త  జీవితాన్ని ఒకరికి దయచేసినప్పుడల్లా వారి యొక్క పేరును కూడా మార్చుతున్నారు. ఉదాహరణకు అబ్రాముకు  అబ్రహము అని, యాకోబుకు యిస్రాయేలు అని , సీమోనుకు పేతరు అని మార్చుతున్నారు.  ఈ విధంగా దేవుడు క్రొత్త జీవితాన్ని యెరుషలేము ప్రజలకు దయచేస్తున్నారు. దానిని దాంపత్య బంధంతో పోల్చుతున్నారు. వారిరువురు కూడా ఇక ఒకే జీవితం పంచుకోబోతున్నారు. అది ప్రేమ జీవితం. 

యోషయా ప్రవక్త,  దేవుడు  ఎప్పుడు కూడా వారితో ఉంటారు అనే భరోసా ఇస్తున్నారు. దేవుడు ఎల్లప్పుడు యెరుషలేముకు  మంచిని చేస్తూ  విశ్వాస పాత్రుడైన వరుడుగానే ఉన్నారు. యిస్రాయేలు మాత్రం అవిధేయత వలన , అవిశ్వాసనీయత వలన దేవునికి దూరమయ్యారు, కాని మరలా దేవుడు తనను క్షమించి, అంగీకరించి ఒక క్రొత్త  జీవితానికి  ఆహ్వానిస్తున్నారు. 

వాస్తవానికి  వివాహ బంధంలో కూడా కొన్నిసార్లు  ఎవరైనా బలహీనతవలన తప్పు చేస్తే  క్షమించి అంగీకరించి ఒక క్రొత్త జీవితం జీవించాలే కాని ఒకరినొకరు నిందించుకోకూడదు. దేవుడు  యిస్రాయేలుతో మెలిగిన విధానం అలాంటిదే  ఆయన వారి బలహీనతను అర్ధం చేసుకున్నారు. పవిత్ర గ్రంధం  ఒక వివాహ బంధం ద్వారా ప్రారంభమౌతుంది. అదే విధంగా క్రీస్తు ప్రభువు జీవితం కూడా ఒక వివాహం తోనే  ప్రారంభమగుచున్నది. యేసు ప్రభువే స్వయంగా కానా పల్లెలో జరిగిన పెండ్లి లో వరుడు వధువును ఆశీర్వధించారు. 

రెండవ పఠనంలో పౌలు గారు  దేవుని యొక్క ఆత్మ వరములను గురించి  భోధిస్తున్నారు. దేవుడిచ్చిన వరాలు మనం ఇతరులతో పంచుకోవాలి. 

దేవుడు ప్రతి ఒక్కరికి దీవెనలు ఒసగివున్నారు ఆ  దీవెనలు అందరితో మనం పంచుకోవాలి, అని పౌలుగారు తెలియచేసారు. కృపా వరములు చాలా వున్నాయి కాని  వాటిని ఇచ్చేవాడు మాత్రము దేవుడు. ఈ కృపా వరముల యొక్క ఉద్దేశం ఒక్కటే అది  మంచి చేయడానికి. 

దేవుడు తన జీవితాన్ని మనకు ఇచ్చారు అంటే తన వద్ద ఉన్న కృపా వరములు అన్నీ మనతో పంచుకుంటున్నారు. అలాగే   దేవుడు ఉచితంగా ఇచ్చిన జీవితం మనం కూడా మంచిని చేయడానికి వినియోగించాలి. మన జీవితాలు అభివృద్ది చెందడానికి కారణం  దేవుడు అన్నీ ఇచ్చింది ఆయనయే. మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు  ఏమి తీసుకొని రాలేదు. కాబట్టి మన జీవితంలో మనం ఏమి సంపాదించిన అది దేవుని వరమే. 

మనకు దేవుడు ఒసగిన ఆత్మ వరములు వివేకం, విజ్ఞానం , విశ్వాసం , స్వస్త పరచు శక్తి , అద్భుతాలు చేయు శక్తి, ప్రవచన శక్తి , ఆత్మలను వివరించు శక్తి, వివిధ బాషలలో మాట్లాడే శక్తి, బాషల అర్ధం వివరించే శక్తి . ఈ కృపా వరాలు అన్నీ స్వంత లాభం కొరకు కాకుండా ఇతరుల మేలు కొరకు ఉపయోగించాలి. 

ఆత్మ వరాలు పొందిన వారు , అవి తమ గొప్ప తనం వల్లనే లభించినవని గర్వించడానికి గాని , పొంగిపోవడానికి కానీ కాదు అహంకారంతో విర్ర వీగుతూవేరె  వారిని చిన్న చూపు చూడకూడదు. 

మన శరీరంలో గుచ్చ బడిన ముల్లు మనల్ని అది ప్రతిసారి  disturb చేస్తుంది , అది మనకు గుర్తు చేస్తుంది. అది మనకు గుర్తు చేసిన సమయంలో మన యొక్క బలహీనత మనకు గుర్తుకు రావాలి. మనం ఎన్ని గొప్ప కార్యాలు చేసినా , ఎంత మంచి చేసినకాని మనం గర్వంగా గొప్పలు చెప్పుకోకూడదు. ఎందుకంటే అది అంతా  దేవుని కృపా వరమే. 

దేవుని యొక్క కృప  మనతో ఉంటే చాలు ఆ కృప వలన మనం జీవించగలుగుతాం.  ఆ కృప వలన మంచి కార్యాలు చేయవచ్చు. మనం గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఉదారంగా పొందినది , ఉదారంగా ఇస్తే మనం ఇంకా దీవించబడుతాం. చాలా సందర్భాలలో ఇవ్వడానికి మనం ముందుకు రాలేము. అదె విధంగా చాలా సందర్భాలలో మనం గొప్పలు చెప్పుకుంటాం. 

గొప్పలు చెప్పుకోవడం కొందరికి అలవాటు కాని పౌలు గారు గొప్పలు చెప్పుకొనవసరం లేదని తెలుపుచున్నారు. ఎందుకంటే మనలను గొప్ప వానిగా చేసింది దేవుడే కాబట్టి ఆయనను మనం పొగడాలి,  ఆ దేవుడిని ఘన పరచాలి, స్తుతించాలి.  

-ఈనాటి సువిశేషం లో యేసు ప్రభువు చేసిన మొట్ట మొదటి అద్భుతం గురించి చదువు చున్నాం.క్రీస్తు ప్రభువు తన దగ్గర వున్నా దివ్య వరములు తమ పొరుగువారితో పంచుకొనుటను తెలుసుకుంటున్నాం.

- తాను ఈ లోకంలోకి వచ్చింది తనకు వున్నది మనకు ఇవ్వటానికి,

-తన జీవం ఇచ్చారు

-తన ప్రేమనిచ్చారు

-తన సేవనిచ్చారు

-తన క్షమను ఇచ్చారు

-తన వరములు వారములు ఇచ్చారు.

-ఈ లోకంలో దేవుడు ఈ అద్భుతం ద్వారా తన కుమారుని ద్వారా మరలా సృష్టించే శక్తిని గురించి తెలుపుచున్నారు.ఆయనకు సృష్టించే శక్తి మరియు ఉత్పత్తి చేయగల శక్తి ఉంది. కానా పల్లెలో జరిగిన ఆ పెండ్లి యొక్క విధానం మనం తెలుసుకోవాలి.ఆ పెండ్లి ప్రతి ఒక్కరి కుడా కుడా ఆనంద దాయకమైనది. అందరూ కూడా సంతోషంగా  ఉంటారు.యూదుల ఆచారం ప్రకారం జరిగే పెండ్లి దాదాపుగా వారం ఉంటుంది. అక్కడ వారికి కావలసిన దంతా పెండ్లి వారే చూసుకోవాలి. ఈనాటి సువిశేషంలో విన్న అంశం, వారి పెండ్లి జరుగుతున్నప్పుడు ద్రాక్షా రసము తక్కువగా వున్నది అని.

- ఈ పెండ్లికి యేసు ప్రభువు, తల్లి మరియమ్మగారు ఆహ్వానించబడ్డారు. వారితో పాటు ఆంద్రెయ, పేతురు , యోహాను, యాకోబు, ఫిలిప్పు, బర్తలోమియా(నతానియేలు )  కూడా  వివాహ వేడుకలో పాల్గొన్నారని ఒక (Coptic Gospel )లో చెప్పబడింది .ఆ యొక్క సువిశేష ఆదారంగా చెప్పబడే అంశం ఏమిటంటే వరుడు మరియమ్మగారి చుట్టం. వరుడు పేరు "సీమోను" కానాకు చెందిన సీమోను.అతడు యాకోబు, యుదాల యొక్క సోదరుడు. అలాగే మరియమ్మ గారి అక్క  యొక్క కుమారుడు అందుకే బహుశా మరియమ్మ గారు ఎక్కువగా ఆసక్తి తీసుకొని ఆమె యే అంతా నడిపిస్తున్నారు. ఇది ఒక విధమైన భావన.

-ఇంకొక విధంగా ఆలోచిస్తే యేసుప్రభువు మొట్ట మొదటిగా తనయొక్క మహిమను వ్యక్త పరుస్తున్నారు.

-మరియమ్మ గారి ద్వారా ఈలోకంలోకి వచ్చిన యేసు ప్రభువు మళ్ళీ అదే తల్లి యొక్క మధ్య వర్తిత్వం ద్వారా సహాయం చేస్తున్నారు, అద్భుతం చేస్తున్నారు. వివాహం లో ఎందరో ఉన్నప్పటికీ అక్కడ అవసరం గుర్తించింది, తల్లియే గుర్తించటం మాత్రమే కాదు, ఆ అసమానత కొరతను, అవసరతను తీసివేయమని తన కుమారున్ని వేడుకొంది. మరియమ్మ గారు తాను విశ్వసించింది, తన కుమారుడు వారిని నిందలనుండి మరియు అక్కడున్న అవసరతనుండి రక్షిస్తాడు, వారిని ఆనందంగా ఉంచుతాడు అని ఆ తల్లి విశ్వసించినది   కాబట్టే  మొదటిగా  ఆయన దగ్గరకు  వెల్లింది. వేరే వాళ్ళ దగ్గరకు  వెళ్లి  ద్రాక్షా  రసము  కొనమని  చెప్పలేదు కానీ  తన కుమారుని  అడిగింది. మన  జీవితంలో  అవసరాలు  వున్నప్పుడుఎదో   కావాలి  అని అన్నప్పుడు  మనం మొదటిగా  దేవుని  దగ్గరకు  రావాలి.

-దేవుడే అన్నారు యిర్మీయా 17: 7 - తన మీద ఆధార పడితే దీవిస్తానని.

-అడగండి ఇస్తాను అన్నారు - మత్తయి 7: 7

-సమస్యలలో వుంటే తన చెంతకు రమ్మన్నారు- మత్తయి 11: 28

మనం   మాత్రం  బంధువుల  దగ్గరకు  ధనవంతుల దగ్గరకు  ఇంకా  వేరే  వాళ్ళ  చెంతకు  వెళతాం  కానీ  మరియ  తల్లి  తన  దేవుడైన  తన  కుమారుని  చెంతకు  వెల్లింది . అది  ఆమె  యొక్క  విశ్వాసం , నమ్మకం,  గొప్పతనం , వినయం. పాలస్తీనాలో    పెండ్లి జరిగేటప్పుడు ద్రాక్షా రసము చాలా అవసరం. నీటిని చాలా తక్కువగా అవసరమైతేనే వాడేవారు. ఎందుకంటే మధ్య తూర్పు ప్రాంతాలలో అంత మంచి నీరు దొరకదు. అందుకనే నీటికి బదులుగా ద్రాక్షా రసమును ఎక్కువగా వాడేవారు.

ఒక వేళా ఈ వివాహంలో ద్రాక్షా రసము లేకపోతే వారు సంతోషంగా వుండే వారు కాదు. వారు నిందలు, అవమానాలు భరించవలసి వచ్చేది, కానీ దేవునియొక్క సాన్నిధ్యం ద్వారా అలాగే మరియతల్లి యొక్క మధ్య వర్తిత్వం ద్వారా అవేమి జరగకుండా వారు సంతోషంగా వివాహమును కొనసాగించారు. మరియ తల్లి ఎప్పుడు కూడా మనకు సహాయం చేస్తూనే వుంటారు.యేసు క్రీస్తు అద్భుతం చేయకముందు ఆమె పలికిన మాటలు " ఆయన చెప్పినట్లు చేయుడు"వాస్తవానికి ఆయన చెప్పినట్లు చేస్తే మన అందరం కూడా సంతోషంగా ఉంటాం.

-ఆయన చెప్పినట్లు - పొరుగు వారిని ప్రేమించాలి, క్షమించాలి, సహించాలి, విధేయత కలిగి ఉండాలి, హృదయ పరివర్తన చెందాలి, దైవభయం కలిగి ఉండాలి.

-మరియ తల్లి మనతో వుంటే మనకు మేలు కలుగుతుంది. ఎందుకంటే ఆమె మన అవసరతలను గ్రహిస్తుంది. ఆమె మన కొరకు తన కుమారున్ని ప్రార్థిస్తుంది., మనకు సహాయం చేస్తుంది.

-నిందలు, అవమానాలు, సమస్యల్లో మనకు ఆదరువుగా ఉంటుంది.

-నీటిని ద్రాక్షా రసముగా మార్చుతాడని తల్లి ముందే గ్రహించింది. యేసు ప్రభువు వారు తన యొక్క సమయం రాకున్నా కానీ తల్లి అడిగినది కాబట్టియే అద్భుతం చేస్తున్నారు. అది ఆయనకు తన తల్లి మీద ఉన్న ప్రేమ, గౌరవం. దీని ద్వారా యేసు క్రీస్తు తన తల్లి అంటే తనకు చాలా ఇష్టం అని కూడా తెలుపుచున్నారు. తల్లి తన హృదయంకు  దగ్గరగా ఉన్నది కాబట్టియే ఆమె కొరకు అద్భుతం  చేస్తున్నారు. తల్లి అడిగితే కుమారుడు తప్పక దయచేస్తారన్నది మరియమ్మ గారి నమ్మకం.

-మనం కూడా మరియమ్మ గారిని యేసుప్రభువును మన ఇంటికి ఆహ్వానించాలి అప్పుడు మన కుటుంబాలు కూడా దీవించబడతాయి.

-మన జీవితాలు దేవుడికి సమర్పిస్తే అవి శ్రేష్ఠంగా దేవుడు చేస్తారు.

-పాత పాపపు జీవితం తీసివేసి క్రొత్త పవిత్ర జీవితం దయచేస్తారు.

- ఈ సువిశేషంలో సేవకులు విధేయత చూపారు, యేసు ప్రభువును నమ్మారు.

వాస్తవానికి ఈ సేవకులు విందు పెద్ద చెప్తేనే చేసేవారు కానీ ఎప్పుడైతే మరియమ్మ గారు ఆయన చెప్పినట్లు చేయమన్నారో వారు అలాగే చేశారు. అది వారియొక్క విధేయత  మరియు విశ్వాసం. దేవుడు మన కుటుంబంలో ఉంటే మనం దీవించ బడతాం. కాబ్బట్టి మరియమ్మ గారిని, యేసు ప్రభువుని మన గృహంలోకి ఆహ్వానించుకుందాం.

Rev. Fr. Bala Yesu OCD

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...