18, ఫిబ్రవరి 2022, శుక్రవారం
7 వ సామాన్య ఆదివారం
12, ఫిబ్రవరి 2022, శనివారం
6 వ సామాన్య ఆదివారం(2)
6 వ సామాన్య ఆదివారం
యిర్మియా 17:5-8 1 కోరింథీ 15:12, 16-20, లూకా 6:17,20-26
నేటి దివ్య పఠనాలు దేవుని నమ్ముకుని జీవించే వారిలో, దేవుడు వారిని దీవించే విధానం గురించి, అదే విధంగా దేవుని మీద ఆధారపడి, దేవునికొరకు జీవించే వారు ఎల్లప్పుడు కూడా ధన్యులె అనే అంశములను గురించి దివ్య పఠనాలు సెలవిస్తున్నాయి.
మానవ జీవితంలో నిజమైన ఆనందం దేవుని మీద ఆధారపడి జీవించే వారికి కలుగుతుంది. వారి జీవితంలో ఒక వేళ సమస్యలు, కష్టములు ఉన్నా కాని దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి దేవుడు తప్పని సరిగా వారి జీవితంలో ఆనందంను ఎల్లప్పుడు ఉంచుతారు. దేవునిలోనే నిజమైన ఆనందం, ఆశీర్వాదం దాగి ఉంది.
ఈనాటి మొదటి పఠనంలో దేవుని యొక్క విజ్ఞాన వాక్కులను యిర్మియా ప్రవక్త ప్రకటిస్తున్నారు. దేవుడు రెండు రకాలైన ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు పలుకుచున్నారు.
1. మానవుల మీద ఆధారపడి జీవించేవారు
2. దేవుని మీద ఆధారపడి జీవించేవారు
ప్రభువే స్వయంగా అంటున్నారు, నరున్నీ నమ్మే వాడు శాపగ్రస్తుడు అని. మనం నరుని శక్తిని నమ్ముకొని జీవిస్తే దేవుడిని విస్మరించినట్లే, ఎందుకంటే దేవుని శక్తి మీద నమ్మకం లేదు కాబట్టియే నరున్నీ నమ్ముకుంటున్నారు. ఇది ఆనాడు యిస్రాయేలు ప్రజల్లో చూశాం, నేడు మనందరి జీవితాలలో కూడా చూస్తున్నాం. యిస్రాయేలు ప్రజలు నిజమైన రాజును (యావే)విస్మరించి వేరొక రాజు కోసం అడిగారు, దాని ప్రతిఫలంగా వారికి నష్టమే జరిగింది.
అదే విధంగా యిస్రాయేలు ప్రజలు చాలా సందర్భాలలో తమ యొక్క రక్షణ కోసం అస్సిరియుల మీద సిరియా సైన్యం మీద ఆధారపడి జీవించేవారు. కొన్నిసార్లు ఐగుప్తు వాసుల మీద ఆధారపడేవారు.
వీటన్నిటిలో యిస్రాయేలు ప్రజల దేవుని బలమును కాక మానవ బలముల మీద ఆధారపడి జీవించారు, అందుకే వారి జీవితంలో అన్ని సమస్యలు. వారి జీవితంలో కష్టలు ఎదురైనప్పుడు దేవుని వైపు మరలి రాక మానవ శక్తి వైపు మొగ్గు చూపారు. దేవుని యొక్క ఒప్పందంను మరచి పోయారు. మానవ మాత్రుల సైనిక బలమును నమ్ముకున్నారు.
యిర్మియా ప్రవక్త రెండు విషయములను అందరిముందు ఉంచుతున్నారు. 1. ఆశీర్వాదమా? 2. శాపమా?
మానవ జీవితంలో నరుల్ని నమ్మటం పాపము కాదు కాని నరుల్ని మాత్రమే నమ్మి వారి మీద ఆధారపడి జీవించుట పాపమే. మనందరం దేవున్ని నమ్ముకొని, దేవుని మీదనే ఆధారపడి జీవిస్తున్నామని భావిస్తాం. కాని మనం దేవుని కన్నా మానవుల మీదనే ఎక్కువగా ఆధారపడి జీవిస్తాం.
బాబిలోనియా రాజు యెరుషలేము మీదకు యుద్దం చేయడానికి వస్తున్నాడని తెలుసుకున్న యూదా రాజు, మతాధికారులు యావే దేవున్ని ఆశ్రయించకుండా, నమ్మకుండా ఐగుప్తు రాజు సహాయం కోరారు. ఈ విషయం దేవుడిని చాలా బాధించింది.
అన్నీ ఇచ్చిన దెవుడ్ని మరచి వేరె వారివైపు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. శూన్యం నుండి సృష్టిని చేసిన దేవుని శక్తిని మరచారు. దేవుడు యిస్రాయేలును ఫరో నుండి బయటకు తీసుకొచ్చిన విధానం మరిచారు.
ఎర్ర సముద్రం గుండా రక్షించిన విధానం మరిచారు.
ఎడారిలో ఒసగిన సమృద్ది ఆహారంను, అధ్బుతములను మరిచారు.
దేవుడు వారికి ఇచ్చిన యుద్ద విజయములను సంరక్షణను మరిచిపోయారు.
ఇవన్నీ మరచిపోయి మానవుల సహాయం కోరారు. పవిత్ర గ్రంధంలో దేవుని శక్తి మీద ఆధారపడి దీవెనలు పొందిన వారిని చాల మందిని చూస్తున్నాం.
దావీదు రాజు దేవుని మీదనే ఆధారపడ్డారు, ఆశ్రయించారు కాబట్టి అనేక విజయాలు సాధించారు. ఎస్తేరు తన ప్రజలను రక్షించుటకు దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి తన ద్వారా ఆ ప్రజలను రక్షించారు. యెబు తన యొక్క విశ్వాస జీవితంలో దేవుని మీదనే ఆధారపడ్డారు అందుకే శ్రమలు తరువాత ఆశీర్వాదాలు సమృద్దిగా పొందుకున్నారు. -యొబు 42:12.
యిర్మియా ప్రవక్త తెలియ చేసే విషయం ఏమిటంటే దేవుని మీద ఆధారపడి జీవించుట ద్వారా శాశ్వత ఆనందం దొరుకుతుంది. వారి జీవితంలో అంతయు సమృద్ది దొరుకును అని ప్రవక్త పలుకుచున్నారు. దేవుని మీద ఆధారపడితే దీవెనలు వస్తాయి. అన్నా ఆధారపడినది దీవెనలు పొందింది. శతాధిపతి ఆధారపడ్డారు, యాయిరు ఆధారపడ్డారు, కననీయ స్త్రీ ఆధారపడ్డారు. తన యొక్క దివ్య శక్తి మీద ఆధారపడిన వారందరినీ ప్రభువు దీవించారు. ఆ దీవెనలు ఎలా ఉంటాయి అంటే జీవితం మొత్తం కూడా ఎటువంటి కొదవలేని విధంగా ఉంటాయి.
వారి జీవితం ఏటి ఒడ్డున నాటబడిన చెట్టువలే వుంటుంది. అక్కడ చెట్టుకు కావలసిన నీరు, సమృద్దిగా దొరుకుతుంది. ఆకులు పచ్చగా ఉంటాయి, కాయలు కాస్తాయి అని అంటే ఎప్పుడు కూడా వారు సు:ఖ సంతోషాలతో ఉంటారని దీని అర్ధం. మన జీవితంలో కూడా దేవుని మీదనే ఆధారపడి జీవిస్తే ఆయన యొక్క ఆశీర్వాదాలు ఎక్కువగానే ఉంటాయి. కీర్తన గ్రంధంలో 1 వ అధ్యాయంలో కూడా దేవుని మీద ఆధారపడిన వారిని గురించి చెప్పబడింది. వారికి సకాలంలో అంతయు ఇవ్వబడును.
రెండవ పఠనంలో పునీత పౌలు గారు మరియొక సారి యేసు ప్రభువు యొక్క పునరుత్థానం గురించి భోదిస్తున్నారు. పౌలుగారు యేసు ప్రభువు యొక్క శరీరం యొక్క పునరుత్థానం యాదార్ధమని ప్రకటిస్తున్నారు,అదియే వారి యొక్క విశ్వాసం అని కూడా ప్రకటిస్తున్నారు. కోరింతులోని కొందరు వ్యక్తులు శరీరం యొక్క పునరుత్థానం లేదని బలంగా నమ్మేవారు అలాంటి అపనమ్మకం ఉన్న వ్యక్తులకు పౌలుగారు చెప్పే విషయం ఏమిటి అంటే యేసు ప్రభువు పునరుత్థానం అవ్వక-పోతే మా విశ్వాసం , మా సాక్ష్యం వ్యర్ధమని ప్రకటిస్తున్నారు.
యేసు ప్రభువు పునరుత్థానం అయి కొందరికి ప్రత్యక్షమయ్యారు 1 కోరింథీ 15:4-7. దేవుడే ప్రత్యేక్షంగా దర్శనం ఇచ్చారు అది చూసిన వ్యక్తులు ఇంకా జీవిస్తూనే ఉన్నారు అని చెప్పిన గాని ఇంకా కోరింతులోని వ్యక్తులు నమ్ముటలేదు.
కొన్ని సార్లు కొంత మందికి ఎంత చెప్పినా సరే వినరు . యేసు ప్రభువు పునరుత్థానం అయిన తరువాత శిష్యులకు దర్శనం ఇచ్చినప్పుడు తోమస్సు గారు అఆ సమయంలో వారితో లేరు అప్పుడు శిష్యులు ప్రభువు వారికి దర్శనం ఇచ్చారు అని ఎన్ని సార్లు చెప్పిన వినలేదు నమ్మలేదు. కోరింతు వారికి కూడా ఇది జరుగుతుంది. సజీవులు సాక్ష్యం ఇచ్చిన కానీ వారిలో ఇంకా అవిశ్వాసం దాగి ఉంది. పౌలు గారు ప్రభువు పునరుత్థానం చెందకపోతే, మన విశ్వాసం వ్యర్ధమని, అపోస్తుల భోదన వ్యర్ధమని , పునీతుల సాక్ష్యం వ్యర్ధమని పలుకుచున్నారు.
సువిశేషంలో యేసు ప్రభువు ధన్యత గురించి, అనర్ధముల గురించి, సంతోషం గురించి విచారము గురించి తెలియచేస్తున్నారు. అలాగే దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని తెలుపుచున్నారు. వాస్తవానికి ప్రభువు ప్రాపంచిక జీవితమును తిరస్కరిస్తున్నారు.దానితో పాటు భౌతిక వాదంను తిరస్కరిస్తున్నారు.
యేసు ప్రభువు మైదానం వద్ద పలికిన ఈ విలువైన మాటలు మత్తయి సువార్తలోని అష్ట భాగ్యాలకు సమానంగా ఉన్నాయి. కాని లూకా సువర్తకుడు అన్నీ ఇక్కడ రాయలేదు. రెండు విషయాలను మాత్రమే ఆయన గట్టిగా చెబుతున్నారు. మొదటిగా పేదవారి గురించి రెండవదిగా ధనికుల గురించి. దేవుని కొరకు శ్రమలు అనుభవించేవారు, స్వార్ధంతో జీవిచ్చే వారి గురించి చెబుతున్నారు. పేదలగు మీరు ధన్యులు దేవ రాజ్యం మీది అని ప్రభువు పలుకుచున్నారు.
పేదవారు అంటే కేవలం ఆర్ధికంగా సంపదలు లేని వారు మాత్రమే కాదు కాని దేవుని యొక్క ఆత్మీయతతో బలహీనంగా ఉన్నవారు, దేవుని అనుభవం లేనివారు , దేవుని యొక్క ఆత్మ తక్కువగా ఉన్నవారు.
నిజానికి ఈలోకంలో సమృద్దిగా అన్నీ ఉన్నాయి అయితే అవి ఎక్కువ శాతం ధనికుల వద్దనే ఉన్నాయి. ప్రభువు వారిని ధనవంతులుగా చేసినది పేదవారిని ఆదుకొనుటకొరకే.
1. పేదలగు మీరు ధన్యులు అంటే దేవుని ఆత్మలో పేదవారు - ఆధ్యాత్మిక పేదరికం దేవుని మీద ఆధారపడి జీవించే వారు దేవుని ముంగిట తన బలహీనతలను, ఆధ్యాత్మిక అవసరతలను గ్రహించుకొని దేవుని వైపు మరలి ఆయన మీద ఆధారపడి జీవించుటయే.
మానవ జీవితంలో ఏ అనుగ్రహమైన దేవుని దగ్గరనుండియే ఇవ్వబడుతుందని గ్రహించుటయే. poor in spirit అని అర్ధం. దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉండే వారికి ధన్యత కలుగుతుంది.
2. ఆకలిగొని యున్న వారు ధన్యులు అని పలుకుచున్నారు. ఇక్కడ ఇది శారీరక ఆకలి మాత్రమే కాదు ఆధ్యాత్మిక ఆకలి.
దేవుని వాక్కు కోసం ఉన్న ఆధ్యాత్మిక ఆకలి, దేవుని ఆహారం (దివ్య సత్ప్రసాదం ) స్వీకరించాలనే ఆకలి, దేవుని అనుభూతి పొందలనే ఆకలి కలిగిన వ్యక్తులకు వచ్చే ధన్యత గురించి తెలుపుచున్నారు.
యేసు ప్రభువు ఆకలితో ఉన్న ఎందరో ప్రజల యొక్క ఆకలిని తీర్చారు. అలాగే ఆధ్యాత్మిక ఆహారం కోసం ప్రయత్నించే వారికి కూడా దేవుడు సహాయం చేస్తున్నారు. పేదవారు, ఆకలి దప్పలు కలిగిన వారు ఎప్పుడు కూడా ఆధారపడి జీవిస్తారు, ఎదురు చూస్తారు, ప్రయత్నిస్తారు, కష్టపడతారు కాబట్టియే వారికి కావలసిన ఆహారం దొరుకుతుంది. మన యొక్క జీవితంలో కూడా దేవుని మీదనే ఆధారపడి జీవిస్తే మన శారీరక , ఆధ్యాత్మిక ఆకలి తీసివేయబడి మనకు అంతా సమృద్దిగా ఇవ్వబడుతుంది. ధన్యులు అంటే దేవుని మీద ఆధారపడి , దేవుని కొరకు జీవిస్తూ తమ జీవితం ద్వారా దేవున్ని సంతృప్తి పరిచేవారు.
3. శోకించుచున్న మీరు ధన్యులు - ఆనందింతురు. తమ యొక్క పాపపు జీవితంనకు శోకించే వారు తం పాపాలకు హృదయ పరివర్తనం చెందాలని బాధపడే వారు దేవుని కృప వలన సంతోషం ఇచ్చారు. ఈ లోకం లో లాజరు శోకించారు కానీ దేవుడు అతనికి పరలోకంలో సంతోషం ఇచ్చారు. యొబు శోకించాడు అలాగే దేవుడు ఆశీర్వదించి సంతోషం ఇచ్చారు. ఎవ్వరు నిజంగా శోకీస్తారు అంటే దేవుని యొక్క పవిత్రత ముంగిట తమ యొక్క అయోగ్యత గుర్తించిన వారు.
యెరుషలేము దేవాలయంలో సుంకరి రొమ్ము బాదుకొని తన పాపాలకు పశ్చాత్తాప పడి ఏడ్చాడు. ఆయన ప్రార్ధన ఆలకించబడింది. అలాగే ఆయనలో సంతోషం నింపబడింది. మనయొక్క పాపాలకు, వ్యసనాలకు శోకించి మన జీవితాలు దేవున వైపు మరల్చుకుంటే ఆనందంగా జీవించగలుగుతాం.
4. దేవుని కొరకు నిందించబడినప్పుడు ధన్యులు అని పలుకుచున్నారు. క్రీస్తు కొరకు జీవించే వారిలో నిందలు ,హింసలు , అవమానాలు వస్తాయి అని ప్రభువు తెలుపుచున్నారు. దేవునికి సాక్షి పూరితమైన జీవితం జీవించే వారు ఎన్నో శ్రమలు అనుభవించారు అని పరిశుద్ద గ్రంధం తెలుపుచున్నది. ప్రవక్తలు శ్రమలు అనుభవించారు, శిష్యులు హింసలు అనుభవించారు, సేవకులు , పునీతులు కష్టాలు , నిందలు అవమానాలు అనుభవించారు. శ్రమలు అనుభవించిన కాని వారు దేవుని సేవ చేశారు, దేవుని కొరకు జీవించారు.
మనుష్య కుమారుని నిమిత్తము ఎందుకు హింసలు అనుభవిస్తారంటె 1. ఈ ప్రపంచం ఇంకా దేవుని తెలుసుకొనలేదు 2. శ్రమలు అనుభవించె వారు దేవుని లోకంలో జీవించే వారు ఈ లోకంలో ఉన్నప్పటికీని వారు ఈ లోకానికి చెందిన వారు కారు. 3. హింసలు పొందుతారు ఎందుకంటే దేవుని యొక్క సత్యమైన మాటలు ప్రకటించినప్పుడు అవి ప్రజలకు నచ్చనప్పుడు.
దేవుని కొరకు హింసలు పొందినప్పుడు వారికి బహుమానం కలుగుతుంది. 1. గౌరవించ బడుతారు. అ . పో . 5: 41, 2. ఓదార్చబడతారు 2 కోరింథీ 1:5 3. దేవునికి దగ్గరగా ఉంటే దీవెన పొందుతారు (1 పేతు 4:14)4.క్రీస్తుకు గొప్ప సాక్షులు అవుతారు. (2 కోరింథీ1:4-6)
మానవ జీవితంలో మనం దేవుని కొరకు జీవిస్తే దేవుడు తప్పని సరిగా మన కొరకు జీవిస్తారు. ధనికులను గురించి ప్రభువు హెచ్చరిస్తున్నారు, ధనికులు సుఖాలు అనుభవించి పేదవారిని నిరాకరిస్తున్నారు, స్వార్దంతో జీవిస్తున్నారు.
1.ధనికులు తమ మీదనే ఆధారపడుతారు. దేవున్ని కాదని ధనమే ముఖ్యమని జీవించే ధనికులందరికి అనర్ధం అని ప్రభువు తెలుపుచున్నారు. ధనం మనిషిని ఈ లోక ఆశలకు కట్టి వేస్తుంది, ధనమే అన్ని అనర్ధాలకు మూలం.
2.కడుపు నిండిన వారా మీకు అనర్ద, అని పలుకుచున్నారు ప్రభువు అంటే ఇంకా వారికి ఎదియు అవసరం లేదు. నిండిన వారు అంటే ఈ లోక ఆశల్లో , వ్యామోహంలో, ధనంతో, స్వార్ధంతో , కొరికలతో, నిండినవారు అలాంటి వారికి అనర్ధం వారి జీవితంలో దేవున్ని నింపు కోటానికి స్థలం లేదు. లూకా 15:16.
3. నవ్వుచున్న వారులారా అనర్దం - నవ్వు చున్న వారి గురించి చెప్పబడింది. అంటే వారి జీవితంలో సరదాలు ఎక్కువగా ఉంటాయి. parties , celebrations ఎక్కువగా ఉండేవారు అలాంటి వారికి అనర్ధం అని తెలుపుచున్నారు. వారి జీవితంలో పాపాలకు పశ్చాత్తాపం లేదు. అసలు పాపం అనే ఆలోచనే లేదు. దాని వల్ల విందులతో వినోదలతో జీవితాలు గడుపుతున్నారు. అలాంటి వారికి అనర్దం అని పలికారు.
4. ప్రశంసించబడినప్పుడు అనర్ధం అంటున్నారు. ఎందుకంటే ఎదుటి వారికి నచ్చిన విధంగా, చెప్పిన విధంగా మనం జీవిస్తే తప్పని సరిగా ప్రశంసించబడతాం. కానీ అలాంటి జీవితం కాదు మనం జీవించాలిసింది. ప్రశంసల కోసం అన్యాయంను న్యాయం చేయకూడదు. దేవుని కొరకు సత్యమైన జీవితం జీవించాలి. దేవుని మాటలే ప్రకటించాలి. హింసలు వచ్చిన, బాధలు వచ్చిన దేవుని కొరకు జీవిస్తే ఆయనయె వారిని సన్మానిస్తారు.
కాబట్టి దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవుని దీవెనలు పొందుదాం. మానవ శక్తి మీద కాకుండా, ఈ లోక శక్తి మీద కాకుండా దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవునికి సాక్షులై జీవించుదాం.
Rev. Fr. Bala Yesu OCD
6 వ సామాన్య ఆదివారం ( ఏవరిని నమ్మాలి )
6 వ సామాన్య ఆదివారం
యిర్మియా 17:5-8 1 కోరింథీ 15:12, 16-20, లూకా 6:17,20-26
క్రీస్తు నాధుని యందు ప్రియ దేవుని బిడ్డలారా ఈనాడు తల్లి తిరుసభ 6 వ సామాన్య ఆదివారము లోనికి అడుగిడుతుంది. ఈనాటి దివ్య గ్రంధ పఠనాలు అన్నీ దేవుని యందు విశ్వాసం గురించి భోదిస్తున్నాయి. ఈనాటి మూడు పఠనాలు మనము గమనించినట్లయితే మనకు ఒక సందేహము కలుగవచ్చు. అది ఏమిటంటే "ఎవరిని నమ్మాలి" అని ఎందుకంటే ఈనాటి మొదటి పఠనాన్ని గమనించినట్లయితే మొదటి పఠనం యిర్మియా గ్రంధము నుంచి తీసుకొనబడింది. యిర్మియా ఒక గొప్ప ప్రవక్త, దేవుని మాట కోసం తన జీవితాన్ని సైతం లెక్క చేయకుండ దేవుడు ప్రజలను ఏవిధంగా శిక్షింపనున్నాడో , వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనభోతున్నారో తన జీవితం ద్వారా తెలిపిన గొప్ప ప్రవక్త, ప్రజలను దేవుని వైపు నడిపించడానికి తన ప్రాణములను సైతం పణంగా పెట్టిన గొప్ప ప్రవక్త. ఈ యిర్మియా ప్రవక్త రాజకీయంగా విఫలమైయాడు కానీ ఆధ్యాత్మికతలో మాత్రం దేవునికి ఏంతో దగ్గరయ్యాడు. ఈనాటి మొదటి పఠనంలోని మాటలు యిర్మియా ప్రవక్త తానే స్వయంగా ప్రజలను హెచ్చరిస్తూ పలికిన మాటలు. ఎందుకంటే ఈ యూదా ప్రజలను దేవుడు బానిసత్వం నుండి తీసుకొని వచ్చి వారికి కావలసిన వన్ని ఇచ్చి వారికి అక్కున నిలిచాడు.
ఈ యిస్రాయేలు ప్రజలకు ఏ ఆపదవచ్చిన వారికి సమీపమున లేదా సహాయముగా ఉండేది ఎవరు అంటే దేవుడు. దేవుడు వారికి అతి సమీప వ్యక్తి పిలవగానే పలికే వ్యక్తి , వారికి ఏ ఆపద వాటిల్లినా మొదటిగా తలచేది దేవుడినే చివరకు దేవుడు వారితో ఓడంబడిక కూడా చేసుకున్నాడు. మీరు నా ప్రజలు , నేను మీ దేవుడను అని . ఈ ప్రజలకు దేవుడు ఇంత చేసిన తరువాత కూడా ఆపద వచ్చినప్పుడు దేవున్ని కాదని మానవుల సహాయం కొరకై వెళుతున్నారు. అది కూడా వారి శత్రువుల దగ్గరికి బాబిలోనియా రాజు యిస్రాయేలు ప్రజలను బానిసత్వమునకు తీసుకొని వెళ్ళాడు. ఆ బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించాడు. ఇప్పుడు బాబిలోనియా రాజు వారి మీదకు దండెత్తి వస్తున్నారని తెలిసి యిస్రాయేలు ప్రజలు ప్రాణముల మీద తీపితో ఈజిప్టు దగ్గరకు సహాయముకై వెళుతున్నారు. శత్రువులైన ఈజిప్టు రాజు నుండి కాపాడిన దేవుడిని మరచి ఈ ప్రజలు మానవుని సహాయము కొరకై పరుగు తీస్తున్నారు.
దేవుడిని కాదని మానవుల మీద ఆధారపడిన వారు లేదా మానవులను నమ్మిన వారి గతి ఏ విధంగా ఉండునో దివ్య గ్రంధం చక్కగా వివరిస్తుంది. ఉదాహరణకు ఏసావు , యకొబును నమ్మితే, యాకోబు తన అన్న అయినటువంటి ఏసావును మోసం చేస్తున్నాడు. పాత నిభందనలోని యేసేపు తన అన్నలను నమ్మితే వారు యేసేపు చావుని కోరారు, సంసొను డెలీలా ను నమ్మితే డెలీలా సంసొనును మోసం చేసింది, ఇలా మనం నిజ జీవితంలో ఎన్నో చూస్తున్నాం, కొన్ని సార్లు అనుభవించే వుంటాం. కానీ దేవుడు మాత్రం వారు ప్రార్ధించిన ప్రతిసారీ, అడిగిన ప్రతిసారీ, మొరపెట్టుకున్న ప్రతిసారీ ఆలకించాడు,ఇచ్చాడు. వారి చెంతనే నిలిచాడు. పగలు మేఘ స్తంభం వలె రాత్రి అగ్ని స్తంభం వలె ఉంది కాపాడాడు. ప్రజలు ఎన్నిసార్లు మోసం చేసిన దేవుడు మాత్రం దయ కలిగే ఉన్నాడు వారి యందు. ఈనాటి పఠనంలో కూడా తన ప్రవక్త అయిన యిర్మియాను పంపి తన ప్రజలను హెచ్చరిస్తున్నాడు. దేవునిపై నమ్మకము ఉంచి విశ్వసించువాడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టువలే ఎప్పుడు పచ్చగా ఉంటాడు, ఎప్పుడు ఫలిస్తూ ఉంటాడు, మానవులను నమ్మి వారిపై ఆధారపడువాడు మరు భూమిలో ఉండు తుప్పలను పోలి ఉంటాడు అని హెచ్చరిస్తున్నాడు. కానీ యిర్మియా ప్రవక్త మాత్రం దేవుడిని చివరివరకు విడనాడలేదు అందుకే యిర్మియాను ఒక గొప్ప ప్రవక్త గా భావిస్తుంటారు.
ఈనాటి లూకా సువార్తలోని వచనాలు మనం మత్తయి సువార్తలో కూడా చూస్తాము. రెండు ఒకే విధంగా ఉంటాయి. ఈ వచనాలు సరిగా చదివితే అవి విప్లవాత్మకంగా , సమాజ విలువలను గురించి మాట్లాడినట్టుగా వుంటాయి. మత్తయి సువార్తికుడు ఆధ్యాత్మిక పేదరికం గురించి మాటలాడుతుంటాడు, కానీ లూకా సువార్తికుడు మాత్రం ఆనాటి కాలంలో జరుగుతున్న కలహాలు, హెచ్చుతగ్గులు గురించి మాట్లాడుతుంటాడు. నిజమైన పేదరికం గురించి వారు అనుభవిస్తున్న వాటి గురించి మాట్లాడుతున్నాడు. సువార్తలో ప్రభువు చెప్పినట్లు పేదరికం , ఆకలి, దాహం లాంటివి ఆనాటి కాలంలోని కలహాలు. ఆనాటి కాలం లోనే కాదు ఇప్పటికీ కొనసాగుతున్నావే ఇవి, మానవుడు దేవుని విలువలకంటే ప్రపంచ విలువులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందుకే ప్రభువు అంటున్నారు ఆకలికొని ఉన్న వారులారా ఆనందపడుడు అని ధనికులకు శాపగ్రస్తులు అని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వస్తువులకు, విలువులకి ప్రాధాన్యత ఇచ్చేవాడు దేవుని విలువులకు ప్రాధాన్యత ఇవ్వలేడు. హృదయాన్ని దేని మీద అయితే కేంద్రీకృతం చేస్తామో దాని కొరకై పరుగెడుతాము. ప్రపంచ వస్తువుల మీద అయితే వాటి కొరకై పరుగెడతాము కానీ వాటిని ఎప్పటికీ సాధించలేము, దేవుని మీద అయితే మనం సాధించగలం. ఎందుకంటే మనం ఆయన ప్రజలం ఆయన మన దేవుడు. ఎవరైతే దేవుని విలువలకు ప్రాధాన్యత ఇస్తారో అట్టి వారు ఏటి ఒడ్డున నాట బడిన చెట్టు వలె నిరంతరం పచ్చిగా ఫలిస్తుంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారులారా ధన్యులు దైవ రాజ్యం అట్టివారిది.
రెండవ పఠనంలో పునీత పౌలుగారు క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థానమును గురించి పునరుత్థానము నందు విశ్వాసము గురించి ప్రస్తావించుచున్నారు. మొదటి కోరింథీయులు 15 వ అధ్యాయము అర్ధము చేసుకోవడానికి కష్టముగా ఉండేటువంటిది. అందులోని మర్మము అర్ధం కాదు. కొరయిన్థియ ప్రజలు శరీరము యొక్క ఉత్తానమును తీరస్కరిస్తున్నారు. కానీ ప్రభువు యొక్క పునరుత్థానమును కాదు. పౌలు గారు చెప్పేది ఏమిటి అంటే శరీర ఉత్తానమును తీరస్కరిస్తే ప్రభుని పునరుత్థానమును కూడా తీరస్కరించినట్లే. శరీర ఉత్థానమును నమ్మని వాళ్ళు ప్రభుని పునరుత్థానమును ఎలా నమ్ముతారు? ఇలా అపనమ్మకము ద్వారా క్రైస్తవ సత్యాన్ని, నిజాన్ని, సందేశాన్ని కించపరిచినట్లే. ఇప్పటి వరకు భోధించినది వ్యర్ధమైనట్లే ప్రభువు పునరుత్థానము కాకపోతే చేసే బోధన, విశ్వాసం అంతా వ్యర్ధమే.
ఎందుకు పౌలుగారు ప్రభుని పునరుత్థానమునందు విశ్వాసాన్ని ముఖ్యముగా భావిస్తారు, అందులో దాగిన విలువలు, సత్యము ఏమిటి అంటే ప్రభువు అనేక సార్లు తన శిష్యులకు దర్శనమిచ్చారు.
*క్రైస్తవులను హింసించే సౌలుకు సైతం దర్శనమిచ్చ పౌలుగా మార్చారు.
*శిష్యులతో కలసి భుజించాడు, ప్రయాణించాడు ఇలా ఎన్నో జరిగాయి.
*పునరుత్థాన సత్యము యూదులు చేసే అసత్య వాదనకన్నా బలమైనది, నిజమైనది.
* ప్రభుని పునరుత్థానము మంచి చెడు మీద ఎంత బలమైనది అని నిరూపిస్తుంది.
*ప్రభుని పునరుత్థానం ప్రేమ అసహ్యం కంటే ఎంత బలమైనది అని నిరూపిస్తుంది.
*ప్రభుని పునరుత్థానము బ్రతుకు చావు కంటే ఎంత బలమైనది అని నిరూపిస్తుంది.
చివరిగా పౌలుగారు చెప్పేది ఏమిట అంటే ఒక వేళ క్రీస్తు ప్రభుని పునరుత్థానం నిజము కాకుంటే , భోదించే సందేశం అబద్ధం అయితే పునరుత్థానంను విశ్వసించి చనిపోయిన వారి చావు, విశ్వాసం వ్యర్ధమే వారి యొక్క విలువలు వ్యర్ధమే.
పునరుత్థానమును జీవితంలో నుంచి తీసివేస్తే మనకు అయిన క్రైస్తవ విశ్వాసాన్ని చెడిపివేసినట్లే. "నేను కాదు జీవించేది నాలో జీవించేది క్రీస్తే" అని పౌలు గారి వలె మనము మన పునరుత్థాన విశ్వాసాన్ని చాటి చెప్పాలి. మనం మనయందును లేక మానవుల యందు కాక దేవుని యందు నమ్మకం ఉంచుదాం. ఆయనయందు విశ్వాసంలో ధృడపడుదాం.
Br. Lukas
4, ఫిబ్రవరి 2022, శుక్రవారం
అయిదవ సామాన్య ఆదివారము (2)
5 వ సామాన్య ఆదివారం (మూడవ సంవత్సరం )
దైవ పిలుపు- దైవ పిలుపునకు మన స్పందన -దైవ పిలుపు ఉద్దేశం
యోషయా 6:1-8, 1 కోరింథీ 15:1-11 లూకా 5:1-11
ఈనాడు తల్లి తిరుసభ 5 వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈనాటి మూడు పఠనాలు దైవ పిలుపు గురించి ప్రస్తావిస్తున్నాయి. వీటిని వివరంగా మూడు అంశాల రూపేనా ధ్యానిస్తూ, అర్థం చేసుకొని మన జీవితాలకు అపాదించుకుందాం.
1. దైవ పిలుపు
2. దైవ పిలుపునకు మన స్పందన
3. దైవ పిలుపు ఉద్దేశం
1 . దైవ పిలుపు -
మనము పవిత్ర గ్రంధంలో ఎంతో మందిని పిలవడం ,మరెంతో మందిని ఎన్నుకోవడం చూస్తున్నాం. ముఖ్యముగా ఈనాటి మొదటి పఠనంలో అతి సామాన్యమైన యోషయాను పిలిచి ప్రవక్తగా మలుస్తున్నారు.(యోషయా 6:8). రెండవ పఠనంలో సౌలును పౌలుగా అంటే హింసకుడిని , సువార్త సేవకై పిలిచిన దేవుడు తన సువార్త వ్యాప్తికై ఒక సాధనముగా వాడటం చూస్తున్నాం.(1 కోరింథీ 15:10-11), మరియు చేపలు పట్టువాడైన సీమోనును ప్రేరేపించి పిలిచి మనుషులు పట్టువానిగా మలచడం చూస్తున్నాం.(లూకా 5:1-11).
ఈరోజు అత్యల్పులమైన, అతి సామాన్యులమైన , అయోగ్యులమైన మనందరిని ప్రభువు పేరు పెట్టి పిలుస్తున్నారు. కొందరిని తన సువార్త సేవకై మరి కొందరిని కుటుంబ జీవితానికి పిలుస్తున్నారు. పిలువబడిన వారు వారి జీవిత అంతస్తుకు తగిన విధంగా జీవించాలి. కానీ మనం ప్రభువు పిలుపునకు స్పందిస్తున్నామా ? సరిగా స్పందిస్తే ఈ పిలుపు మన జీవితాలను మలచకలదు, మన జీవితాలను మార్చ కలదు. మన జీవిత ఉద్దేశాలను కార్యసాధనకు చేర్చకలదు.
2 . దైవ పిలుపునకు మన స్పందన
దేవుడు మనలను పిలవడం ఒకెత్తయితే దానికి స్పందించడం మరొక ఎత్తు . దైవ పిలుపునకు స్పందించడం అంటే కేవలం కాళ్ళ నడక ద్వారా దేవుని అనుసరించడం కాదు. కానీ పిలుపునకు అనుగుణంగా మన జీవిత మార్పు ద్వారా దేవుని అనుసరించడం. మనం దేని నుండి దేనికి పిలవబడ్డాం అని గ్రహించాలి. ఎవరి చేత పిలవబడ్డాం, అని తెలుసుకోవాలి మరియు దానికి అనుగుణంగా స్పందించాలి. అంటే
1. మన పాపపు స్తితిని గ్రహించాలి: -నేను హా !చేడితిని కదా ! నా నోటి నుండి వెలువడునవన్నియు అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పల్కు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. అని యోషయా ప్రవక్త తన పాపపు స్థితిని గ్రహించాడు. (యోషయా 6:5). ఏలయన అపోస్తులందరిలో నేను అల్పుడను. దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తులుడని పిలువబడుటకు నేను అయోగ్యుడను" అని పౌలు తన జీవిత స్థితిని గ్రహించాడు. (1 కోరింథీ 15:9). ప్రభూ ! నేను పాపాత్ముడను నన్ను విడిచి పొండు అని పేతురు గారు కూడా తన పాప స్థితిని గ్రహించారు.(లూకా 5:8). ఈనాడు నీవు నేను కూడా మన పాపపు స్థితిని గ్రహించాలి.
2. పాపాన్ని విడిచి పెట్టాలి :- పాపాపు స్థితిని గ్రహించడమే కాదు . పాపాన్ని పరి పూర్తిగా విడిచిపెట్టాలి. మన జీవితాన్ని పవిత్రీకరించమని దేవుని అర్థించాలి. మనము పాప కార్యముల నుండి వైదొలగి నూత్న హృదయమును,నూతన మనస్సును పొందాలి. ఎవడు చనిపోవుట వలన ప్రభువునకు సంతోషం కలగదు. కనుక మీరు మీ పాపముల నుండి వైదొలగి బ్రతుకుడు. ఇది యావే ప్రభు వాక్కు. యోహేజ్కేలు 18:31-32.
3. మనలని మనం దేవుని చిత్తానికి అప్పగించాలి:- దౌర్జన్యమునకు సాధనముగా మీ శరీరములందు ఏ అవయములను పాపమునకు అర్పింపకుడు. అంతేగాక , మృత్యువు నుండి జీవమునకు కొనిరాబడినవారుగా మిమ్ము మీరు దేవునికి అర్పించుకొనుడు. మీ శరీరమునందలి అవయములను నీతికి సాధనములుగా ఆయనకు సమర్పించుకొనుడు. (రోమి 6:13). దేవుని పిలుపునందుకున్న మనమందరము దేవునికి మనలను మనం సంపూర్ణముగా అప్పగించుకోవాలి. అంటే దేవుని చిత్తమే మన చిత్తం కావాలి. దేవుని చిత్తానుసారంగా ఆలోచించాలి, మాట్లాడాలి, కార్యాలు చేయాలి. ఈ విధంగా దేవుని పిలుపునకు స్పందిస్తే దేవుని అనుగ్రహాలను పొందగలము, ఆ అనుగ్రహాలకు సాధనాలుగా మారగలము.
3. దేవుని పిలుపు యొక్క ఉద్దేశము
దేవుడు తన ప్రజలను ఓ గొప్ప ఉద్దేశంతో పిలిచి వారిని పవిత్రులుగా , నిర్దోషులుగా చేస్తారు. (ఏపేసి 1:4) పవిత్రులుగా , నిర్దోషులుగా మలచబడినవారు, దైవ పిలుపు ఉద్దేశమైన సువార్త వ్యాప్తిద్వారా ఇతరులను పవిత్రులుగా, నిర్దోషులుగా తయారుచేయాలి. ఈ ప్రేషిత కార్యం కొరకై మనము ప్రభుని సొంత ప్రజలుగా ఎన్నుకోబడతాము. (ద్వీతి14:2 ), అదే యోషయా ప్రవక్త (6:8) , పౌలు గారు (1 కోరింథీ 15:10) మరియు పెతురు (లూకా 5:10 ) వీరి జీవితాలలో జరగడం ఈనాటి పఠనాలలోమనం చూస్తున్నాం .
దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క జీవిత శైలికి పిలిచియున్నారు. కొంతమందిని సువార్త వ్యాప్తికై , మరి కొంత మందిని భర్తలుగా, భార్యలుగా , పిల్లలుగా మరియు ఇతర జీవిత శైలికి పిలిచారు. ప్రతి ఒక్కరు వారి జీవిత అంతస్తుకు తగిన విధంగా జీవించాలి. ఆ విధంగా జీవించాలంటే మనకు కావల్సిన మొట్ట మొదటి ఆయుధం విశ్వాసం. విశ్వాసం లేకపోతే దైవ పిలుపు యొక్క ఉద్దేశం నెరవేర్చలేము. పునీత పౌలుగారు ఈనాటి రెండవ పఠనములో చాలా చక్కగా చెప్తున్నారు. "మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప ,నేను మీకు భోదిం చిన విధంగా మీరు దానిని గట్టిగా అంటి పెట్టుకొని ఉంటిరేని , మీరు రక్షింపబడుదురు." (1 కోరింథీ 15:2). పేతురు గారు ప్రభువు మాట యందు విశ్వాసించాడు, వల చినుగునన్ని చేపలు పట్టగలిగాడు. లూకా 5:6 . మనము కూడా విశ్వసించాలి, ప్రభువునకు ప్రార్ధించాలి. తద్వారా మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి. మన జీవితాలలో ప్రభువు కార్యాలను చవి చూడాలి.
రెండవది ప్రేమ. యోహను 3:16 . 15:12. ప్రభువు కాపరికి అప్పగించిన తన మందను , కుటుంబ పెద్ద సభ్యులను ఎటువంటి పక్షపాతం లేకుండా అందరిని సమానంగా ప్రేమించాలి. ప్రేమ అనే ఆయుధం ద్వార పరలోకాన్ని భూలోకంలోనే సృజించవచ్చు. ఎప్పుడైతే కాపరులు తమ స్వార్ధనికి ,ఆనందాలకు, ఇహలోక జీవిత శ్రేయస్సుకు, వస్తువులకు మరణించి, తన ఆలోచనలను, శక్తిని మాటలను మరియు కార్యాలను దైవ చిత్తానికి దైవ రాజ్య వ్యాప్తి ఉపయోగార్దం జన్మిస్తారో. అప్పుడు ప్రేమ ద్వార ఇహలోక జీవియతం పరలోక జీవితంగా మారుతుంది.
మూడవ ఆయుధం ఓర్పు , సహనం. ఈ సద్గుణాలు ఉన్నటువంటి వారు ఎటువంటి బేరుకు లేకుండా దేవునితో నడవగలరు. సంఘంలో కుటుంబంలో ప్రజలందరు ఒకే విధంగా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుతో ప్రవర్తిస్తుంటారు. కానీ దైవ పిలుపు స్వీకరించిన మనం ఓర్పు సహనం కలిగి అందరిని ఒక తాటిపై నడిపించగలగాలి. ఇది దేవునితో మనం ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దేవుడు లేనప్పుడు పేతురుగారు ఒక్క చేపనైన పట్టలేక పొయ్యాడు. కాని దేవుడు తనతో ఉన్నప్పుడు వల చినిగే చేపలను పట్టగలిగాడు. (లూకా 5:5,6 ), దేవుడు మనతో ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలలో కూడా ఎటువంటి కొరతలు ఉండవు. అన్నీ సమృద్దిగా ఒసగపడుతాయి.
ఏ విధంగా దైవ పిలుపు అందుకున్న కుటుంబ అంతస్తుకు చెందినవారు సువార్తను భోధించగలరు ? దివ్య వాక్కు వినడం, పఠించడం, పాటించడం ద్వారా. దైవ వాక్కు మన జీవితాలకు ఆధ్యాత్మిక భోజనం. భోజనం భుజింపకపోతే ఏ విధంగా భౌతిక ఆరోగ్యాన్ని కోల్పోతాము. అధేవిధంగా ఆధ్యాత్మిక భోజనం అయినటువంటి దేవుని వాక్యం పఠించక,వినక, పాటించక పోయిన ఆధ్యాత్మిక అనుగ్రహాలను కోల్పోతాము. కాబట్టి దేవుని వాక్యం చదువుదాం , విందాం, ఆచరిదాం. తద్వారా దైవ పిలుపును గ్రహించి , ఆ పిలుపునకు సరిగ్గా స్పందించి, ఆ పిలుపును జీవిస్తూ ముందుకు సాగుదాం. ఆమెన్
Br. Sunil Inturi OCD
29, జనవరి 2022, శనివారం
4 వ సామాన్య ఆదివారము
4 వ సామాన్య ఆదివారము
22, జనవరి 2022, శనివారం
మూడవ సామాన్య ఆదివారం
మూడవ సామాన్య ఆదివారం
నెహెమ్యా 8:2-4,5-6,8-10 1 కోరింథీ 12:12-30 లూకా 1:1-4,4:14-21
నేటి దివ్య పఠనాలు దేవుని యొక్క వాక్కు వినేటటువంటి ప్రజలు ఎలాంటి జీవితం జీవించాలి అనే అంశం గురించి తెలుపుతున్నాయి. దేవుని యొక్క వాక్కు యొక్క గొప్పతనం శక్తిని గ్రహించి దేవుని ప్రజలు ఐక్యత, సక్యత కలిగి జీవిస్తూ దేవున్ని అంటి పెట్టుకొని జీవిస్తూ దేవుని సేవ చేయాలని కూడా ఈనాటి పఠనాలు మనకు తెలుపుచున్నాయి.
ఈనాటి మొదటి పఠనంలో దేవుని వాక్కు యొక్క గొప్పతనం గురించి చదువుకుంటున్నాము. మొదటి పఠనం యొక్క చరిత్ర మనం గ్రహిస్తే, ఆనాటి పర్షియా రాజు కోరేషు బాబిలోనియా ప్రజలను జయించిన తరువాత బానిసత్వంలో దాదాపు 70 సంవత్సరాలు గడిపిన యూదులను వారి సొంత భూమి అయిన యెరుషలేముకు పంపించారు.
తిరిగి వచ్చిన యూదులు యెరుషలేము దేవాలయంణు పునర్నిమించారు. ఎజ్రా 6:15-17 అదే విధంగా ఆ పట్టనపు గొడలు కూడా కట్టడం ముగించిన పిదప దేవుని యొక్క వాక్యం చదువుచున్నారు. దేవుని యొక్క వాక్యం చదువుచున్నారు. దేవుని యొక్క వాక్యం చదివినది ఎజ్రా. ఆయన ధర్మ శాస్త్ర భోధకుడు , యాజకుడు అదే విధంగా మత సంబంధిత నాయకుడు (నెహెమ్యా 8:9)
అదేవిధంగా నెహెమ్యా రాష్ట్ర పాలకుడు దేవునితో మంచి అనుభందం కలిగిన వ్యక్తి, దైవ భయం వున్న వ్యక్తి ,దేవుడు ఎజ్రాకు మరియు నెహెమ్యాకు ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పజెప్పారు. ఆదేమిటంటె దేవుని యొక్క వాక్కును ప్రకటించుట, ప్రకటించుట మాత్రమే కాదు ప్రజలను ప్రేరేపించాలి.
ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. దేవుని వాక్కు మనం ప్రకటించాలి, ఇతరులను దైవ వాక్కుతో ప్రేరేపించాలి. ఈ మొదటి పఠనంలో యిస్రాయేలు ప్రజలు దేవుని యొక్క వాక్కును వినుటకు కనబరిచిన ఆసక్తి గొప్పది.
దేవుని యొక్క వాక్కు వినాలని ఎంతో ఆశతో వున్నారు. దేవుని యొక్క వాక్కు దేవునితో సమానమని భావించారు. బానిసత్వంలో బహిరంగంగా దేవుని వాక్కు ఆలకించే అవకాశం లేదు అందుకే ఇప్పుడు దొరికిన అవకాశంను బట్టి వారు ఆ వాక్కుకై తయారై వున్నారు. ఎజ్రా దేవుని వాక్కు చదివినప్పుడు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అందరుకూడా సావదానంగా విన్నారు. వారు విసుగు చెందక, అలసట పొందకు అదే పనిగా ఎలాగా వినగలిగారు. అంటే ఆ వాక్కులు ఆ ప్రజలకు వినసొంపుగా వున్నాయి. ఆ వాక్కు వల్ల దేవుని తెలుసుకోవచ్చు అం గ్రహించారు. కీర్తన 119:103
ఆ వాక్యములు వారికి వెలుగును , చూపేలా ఉన్నాయి. అందుకే వాటిని వినడానికి చాలా ఇష్టపడుతున్నారు. దేవుని వాక్కు యొక్క ఔనత్యాన్ని తెలుసుకున్నారు. అందుకే ఎటువంటి ఇబ్బంది లేకుండా విన్నారు. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంకు దైవ వాక్కే ఆహారం. దేవుని యొక్క వాక్కు సృష్టించే వాక్కు అని. దేవుని యొక్క వాక్కు ఆదరించే వాక్కు అని ,దేవుని యొక్క వాక్కు నేర్పించే వాక్కు అని , దేవుని యొక్క వాక్కు పుట్టించే వాక్కు అని , దేవుని యొక్క వాక్కు స్వస్థత నిచ్చే వాక్కు అని వారు గ్రహించారు.
మనం దేవుని వాక్కుకు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాం? దేవుని యొక్క వాక్కును ఆలకించడానికి చదవడానికి ఎంత మందికి ఆసక్తి ఉంది. యూదుల కాలంలో అందరి దగ్గర దేవుడు మోషే ద్వార ఇచ్చిన ధర్మ శాస్త్రం లేదు అయినప్పటికీ అయినప్పటికీ అవకాశం ఉన్న చోటల్లా దేవుని వాక్కు వింటున్నారు. మనందరికీ ఇప్పుడు బైబుల్ గ్రంధం ఉంది. ఎంత మంది చదువుతున్నారు? చదువు లేకపోయినా చదువుకున్న బిడ్డల దగ్గర ఎంతమంది చదివించుకొని వింటున్నారు.
గుడికి వచ్చినప్పుడు యాజకులు బైబుల్ గ్రంధం మొత్తం వివరించలేరు ప్రసంగంలో , అందుకే దేవున్ని తెలుసుకోవాలంటే మన జీవితాలు సన్మార్గంలో నడిపించు కోవాలంటే మనం దేవుని వాక్కు చదవాలి, వినాలి.
చదివితే మరియు వింటేనే మనలో విశ్వాసం పెరుగుతుంది. రోమి 10:17. ఆనాటి యూదా ప్రజలు సమయం గురించి ఆలోచించలేదు. దేవుని వాక్కు గురించి మాత్రమే ఆలోచించారు. మనం కూడా పవిత్ర గ్రంధం చదువుట ద్వారా దేవుని ప్రేమ, క్షమా, త్యాగం చాల విషయాలు నేర్చుకోవచ్చు.
అలంటి ఆసక్తి మనలో ఉందా?
2. రెండవది గా దేవుని ధర్మ శాస్త్రమునకు ఇచ్చిన గౌరవం అందరం ధ్యానించుకోవాలి.
నెహెమ్యా 8: 5-6 ఎప్పుడైతే ఏజ్రా
గ్రంధమును విప్పారో అప్పుడు అందరుకూడా లేచి నిలబడ్డారు, దేవుణ్ణి స్తుతించి అదేవిధంగా ఆ ప్రభువుని ఆరాధించారు.
- ఆ గ్రంధం గురించి వారికి తెలుసు కాబట్టియే ఆ పుస్తకం కు అంత ప్రాధాన్యత
ఇచ్చారు.
-మరి ఈ రోజు మనం పవిత్ర గ్రంథం ను ఎలాంటి స్థలాల్లో ఉంచుతున్నాం?
-కొంతమంది ఎక్కడెక్కడో పెడతారో. అది కాదు మనం చేయాల్సింది, ఆ గ్రంధం దేవుడే కాబట్టి మనం మంచి స్థలం ఇవ్వాలి.
- విలువ గ్రహిస్తే ప్రాధాన్యత ఇస్తాం. ఇశ్రాయేలు ప్రజలు గ్రహించారు
కాబట్టియే అది చేయగలిగారు.
-చర్చిలో నిలబడ్డ సమయంలో కొన్నిసార్లు బైబిలు మన కాళ్ళ దగ్గరఉంటుంది. అది కూడా
మనం పట్టుకొని నిలబడితే అప్పుడు ఆ వాక్కు కు మనం గౌరవం ఇచ్చినట్లు అవుతుంది.
- ప్రతి ఒక్కరు పవిత్ర గ్రంధమును దేవాలయానికి తీసుకురావాలి.
-దేవునియొక్క వాక్కును చదివిననప్పుడు వారియొక్క హృదయాలు చలించి పోయాయి.
అందుకే దుఃఖం పట్టలేక ఏడ్చిరి . నెహెమ్యా 8:9
- దేవుని ఆజ్ఞలు మీరు జీవించినందుకు ఏడ్చి ఉండవచ్చును.
- వారు బోరున ఏడ్చారు. దేవుని వాక్కును విన్న సమయంలో దేవుడి ప్రేమ వారికి
గుర్తుకు వచ్చింది.
-దేవుడు వారిని ఒక కాపరిగా, తండ్రిగా నడిపించిన
విధానం గుర్తుకు వచ్చింది.
-వారికి బానిసత్వం వచ్చింది ఆయన యొక్క వాక్కును ధిక్కరించడం వల్లే అని గ్రహించి
ఉండవచ్చును.
- వారికి ఇచ్చిన మన్నా, పూరేడు పిట్టలు, సమృద్ధిగా స్వేచ్ఛ జీవితం గుర్తుకు వచ్చింది.
- వారు దైవమును కాదని అన్య దైవములను ఆరాధించిన పాపపు జీవితం గుర్తుకు వచ్చింది.
-దేవుని యొక్క వాక్కు వారి జీవితాలకు అన్వయించారు కాబట్టియే వారియొక్క బలహీనతలు, పాపపు మచ్చలు గుర్తుకు వచ్చాయి.
మనం కూడా దేవుని వాక్కును మన జీవితాలకు అన్వయించుకుంటేనే మనలో కూడా హృదయ పరివర్తనం అనేది కలుగుతుంది.
- కొన్నిసార్లు మనం కొంతమందిని చూస్తాం ప్రసంగం చెప్పేటప్పుడు ఏడుస్తారు
ఎందుకంటే ఆ వాక్యం వారిని తాకింది.
అదేవిధంగా వారియొక్క పాపపు జీవితం గుర్తుకు వచ్చినప్పుడు, ఏడుస్తారు.
-పాపపు జీవితం ద్వారా, స్వార్ధపు జీవితం
ద్వారా ఇతరులను దేవుడిని బాధ పెట్టిన సమయాల గురించి వాక్యంతో భోదించినప్పుడు
సాధారణంగా అందరూ ఏడుస్తారు. మనం కూడా ప్రభువు యొక్క వాక్కు విన్న సమయంలో భాద కలిగి
మార్పు కలగాలి.
1.సౌలు విన్నాడు హృదయ పరివర్తనం చెందాడు. (పౌలు)
2.దావీదు నాతాను ప్రవక్త యొక్క దైవ వాక్కులు విన్నాడు పశ్చాత్తాప పడ్డారు.
3.నినెవె పట్టణ వాసులు విన్నారు దుఃఖం తో జీవితాలు సరిచేసుకున్నారు
4.అగస్టీను దేవుని యొక్క వాక్కు విన్నాడు -హృదయ పరివర్తనం చెందాడు. మనం
కూడా అలాగే మన జీవితాలు మార్చుకోవాలి.
-వాక్యం చదవటానికి, వినటానికి సమయం కేటాయించాలి.
అప్పుడే దేవుని గురించి తెలుసుకొని జీవిస్తాము.
-దేవుని వాక్కు చదివితే ఆ వాక్యమే మనలను నడిపిస్తుంది, ప్రేరేపిస్తుంది. మనం ఎలా జీవించాలి అని తెలుపుతుంది.
- దేవుని యొక్క వాక్కు లేని లోపం వారు తెలుసుకున్నారు. అందుకే ఎంత సమయమైనా
కాని పట్టించుకోకుండా శ్రద్ధగా విన్నారు, ప్రభువునందు
ఆనందించారు. అలాంటి విశ్వాసం, ఆశ మనలో కూడా ఉండాలి.
రెండవ పఠనంలో
దేవుని బిడ్డలు, దేవుని వాక్కు
వినేవారు చదివేవారు జీవించవలసిన విధానం గురించి పౌలుగారు తెలుపుచున్నారు.
-కొరింతు ప్రాంతంలో భిన్నమైన ప్రజలు జీవిస్తుండేవారు వారిలో బేధాభిప్రాయాలు
ఎక్కువగానే ఉండేయి. ఐతే పౌలు గారు వారందరు కూడా ఐక్యంగా కలిసి జీవించుటకు శరీరం
మరియు దానిలో వున్నా అవయవములు ఉదాహరణ తీసుకొని ఐక్యతను గురించి తెలుపుచున్నారు.
-జ్ఞానస్నానం పొందిన ప్రతి యొక్క విశ్వాసి దేవుని యొక్క పవిత్రమైన శరీరంలో
భాగమే.
- జ్ఞాన స్నానం స్వీకరించుటకు ముందు మనలో ఎన్నోరకాలైన భావాలూ భేదాలు
ఉన్నప్పటికీ వాటన్నింటిని జ్ఞానస్నానం పొందిన తరువాత విడిచిపెట్టాలి అని పౌలుగారు
వివరిస్తున్నారు. (1కొరింతి12: 12-13 )
-మన శరీరంలో వున్న ప్రతియొక్క అవయవం ముఖ్యమైనది ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని
ఉంటుంది. కొన్ని అవయవాలు పెద్దవి అయివుండవచ్చును కొన్ని చిన్నవి అయి ఉండవచ్చు, అయినప్పటికీ దేని ప్రాముఖ్యత దానికి ఉంది.
-కాబట్టి ఒక్క అవయవం ఇంకొక్క దానికి సహకరిస్తూ జీవిస్తే అక్కడ మంచిగా
ఆరోగ్యంగా ఉంటుంది.
-మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం పనిచేస్తేనే మనందరం బాగుంటాం. ఏది బాగా లేకపోయినా
మనం సంతోషం గా ఉండలేము. అలాగే మనందరం కూడా దేవుని శరీరంలో భాగస్తులం మరి మనం కూడా ఐక్యంగా జీవించాలి.
చేయి నోటికి సహకరించకపోతే మనం తినలేం
-కన్ను కాలికి సహకరించకపోతే మనం నడవలేం
-నోరు చెవులకు సహకరించకపోతే మనం వినలేం.
అందుకే ప్రతి ఒక్క అవయవం అవసరం, ప్రతి అవయవం
శరీర అభివృద్ధి కోసం, మానసిక, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడాలి.
-ప్రతి ఒక్క వ్యక్తి తాను శ్రీసభ (శరీరం) కోసం తన వంతు తాను కష్టపడాలి. అప్పుడే
శ్రీసభ ఆనందంగా ఉంటుంది.
- శ్రీ సభ శిరస్సు క్రీస్తుప్రభువే ఆయన లేకుండా మనం లేము. కాబట్టి ఆ శరీరం
గొప్పతనం గ్రహించి , సహకరించి జీవించాలి.
-మనందరం కూడా ఐక్యత కలిగి జీవించాలి. పౌలుగారు అంటారు జ్ఞానస్నానం
పొందినవారందరు దేవుని బిడ్డలే అందుకే వారు ఐక్యంగా జీవించాలి.
-సాధారణంగా సమాజంలో మనం చుస్తే ఇంకా చాలామందికి జాతి,
మత, కుల భేదాభి ప్రాయాలు
వున్నాయి. బహుశా ఇంకా వారిని దేవుని యొక్క వాక్కు తాకలేదు.
-స్వయంగా యేసు ప్రభువే తనను తాను తగ్గించుకొని పాపులతో, సుంకరులతో కలిసి జీవించారు.
-పౌలు పరిసయ్యుడు అయినప్పటికీ అన్యులకు సేవచేసారు. ఆయన్ను దేవుని వాక్కు
మార్చింది.
-దేవుని వాక్కు అతనికి వివేకాన్ని అందించింది అందుకే భేదాభి ప్రాయాలు లేకుండా
జీవించారు.
-మనం దేవుని బిడ్డలం, ఆయన మన తండ్రి మనందరం ఒకే
కుటుంబంలో ని బిడ్డలం కాబట్టి అందరితో కలిసి మెలసి ఐక్యంగా జీవించాలి.
-శ్రీ సభ అభివృద్ధి కోసం సహాయపడాలి. అందరుకూడా విలువైన వారే ధనిక -పేద
వ్యత్యాసం లేకుండా .
-మనందరం దేవుని వాక్కు చదివి, ధ్యానించి ఆ వాక్కు
అనుసారం జీవించాలి, ఎలాంటి భేదాలు మనలో వుండవు. వాక్యమును
చదువుకొని జీవించుద్దాం, ఐక్యంగా కృషిచేద్దాం.
-ఈనాటి సువిశేష పఠనంలో యేసు క్రీస్తు ప్రభువు యొక్క పంపబడిన విధానం
తెలుసుకుందాం.
-ప్రభువు ఎందుకు ఈ లోకానికి పంపించబడ్డారు అని తెలుపుచున్నారు.
సువార్త ప్రారంభంలో లూకా గారు ఈ సువార్త తెయోఫిలుకు వ్రాస్తున్నారు. అదేవిధంగా
అందరి విశ్వాసుల కోసం వ్రాస్తున్నారు.
-తెయోఫిలు బహుశా నీటి గలిగిన వ్యక్తి అయి ఉండవచ్చు, మంచి
పేరు కలిగిన వ్యక్తి కావచ్చు, లేకపోతే దేవుణ్ణి తెలుసుకోవాలి
అనే ఆసక్తి కలిగి లూకా గారిని యేసు ప్రభువు గురించి వ్రాయమని అడిగివుండవచు.
-బహుశా దేవునియందు విశ్వాసం ఉంచి క్రొత్తగా జ్ఞానస్నానం పొందిన వ్యక్తి అయి
ఉండవచ్చు.
-తెయోఫిలు అంటే (a
friend of God) దేవునికి స్నేహితుడు, దేవుణ్ణి ప్రేమించువాడు అని అర్థం.
-దేవుణ్ణి ప్రేమించు ప్రతిఒక్కరికి లూకా గారు ఈ సువార్తను వ్రాస్తున్నారు.
-వారియొక్క విశ్వాసంలో దృడంగా ఉండటానికి ఈ విధంగా వ్రాస్తున్నారు.
-సువార్తలో మనం వింటున్నాం లూకా 4:14-15 యేసు ప్రభువు చేసినా సువార్త పరిచర్య గురించి
-ఆయన కేవలం ప్రార్థించుటకు మాత్రమే కాకుండా వీలైన ప్రతి సమయంలో వాక్యాన్ని
ప్రకటిస్తున్నారు.
-ప్రకటించిన వాక్యంకు ప్రతి ఫలం ఉండాలి. యేసుప్రభువు తండ్రి గురించి
సువార్తలో తెలిపారు. ఆయన యొక్క జీవిత లక్ష్యం, ప్రణాళిక
తెలిపారు.
-ప్రభువు ప్రతి ప్రాంతమునకు వెళ్ళేది అందరూ కూడా దేవున్ని తెలుసుకొని,
హృదయ పరివర్తనం చెంది, రక్షణ పొందాలి అనే
ఉద్దేశంతోనే.
యేసు ప్రభువు చదివిన మాటలు యెషయా 61:1-2 నుండి తీసుకొనబడినవి.
- ఈ మాటలు మోషే ఎన్నికకు దగ్గరగా వున్నాయి. నిర్గమ 3:7-10
మోషేను ఎందుకు ప్రభువు ఎన్నుకున్నారు అని తెలుపుచున్నారు.
-18 వచనం ద్వారా దేవుని ఎన్నిక దేని నిమిత్తం అని అర్థమవుతున్నది.
1. దేవుని ఆత్మ ఆయన పై ఉన్నది.
2. పేదలకు సువార్తను భోధించుటకు అభిషేకించారు.
3. చెరలో వున్న వారికి విడుదలను దయచేయుటకు.
4. గ్రుడ్డివారికి చూపును నిచ్చుటకును
5. పీడితులకు విమోచనం కలిగించుటకును
6. ప్రభు హిత సంవత్సరమును ప్రకటించుటకు ఆయన్ను అభిషేకించారు.
-దేవుని కార్యముల కోసం, సువార్త వ్యాప్తి కోసం మూడు
రకాల ప్రజలు అభిషేకించబడ్డారు.
1.రాజులు
2.యాజకులు
3.ప్రవక్తలు
1.సమువేలు సౌలును, దావీదును రాజులుగా అభిషేకిస్తున్నారు.
దేవుని యొక్క ప్రతినిధులు వుంది దేవుని కార్యములు నెరవేరుచుటకు.
2. యాజకులు ప్రతి ఒక్క యాజకున్ని దేవుడు అభిషేకిస్తారు దేవుని యొక్క యాజకులు
ఆరోను దేవుని యొక్క యాజకులు ఆరోను అతని కుమారులు దేవుని సేవకోసం ప్రత్యేకంగా
కేటాయించబడిన వారు - 2 రాజులు 29, 30 అధ్యాయాల్లో చెప్పబడినవి.
3. ప్రవక్తలు - దేవుడే వారికి స్వయంగా పిలుపునిస్తున్నారు. దేవునికి మానవులకు మధ్యవర్తులుగా ఉండటానికి దేవుడు ఏలియాతో ఏలిషాను అభిషేకించడానికి చెప్పారు. 1 రాజులు 19:16-19 వీరందరూ దేవుని యొక్క పనికోశం అభిషేకించబడిన వారే, వారికి అధికారం , శక్తి, ఆత్మ వరములు ఇవ్వబడ్డాయి. కాబట్టి వారు చేసే సువార్త అంగీకరించి జీవించాలి.
1. దేవుని ఆత్మ అభిషేకించబడిన వారి మీద ఉన్నది. దేవుని ఆత్మచె వారు నడిపించబడాలి. యేసు ప్రభువు నాపై ప్రభుని ఆత్మ ఉన్నది అని పలికారు. ఆ ఆత్మ శక్తిచే శోదనలు జయించారు, ఆత్మ శక్తిచే సువార్తను ప్రకటించారు. కష్టలు ఓదార్చుకున్నారు. దేవుని ఆత్మ తనను పరిచర్యకు సంపూర్ణంగా సిద్దం చేసింది.
దేవుడు తాను పిలిచిన వారిని బలపరుస్తారు. దేవుని యొక్క ఆత్మ వారిని నడిపిస్తుంది.
2. పేదలకు సువార్తను భోధించారు. పేదలు అనగా లేని వారు. దేవుని గురించి అవగాహన లేనివారు. దైవ ప్రేమ లేని వారు, దేవుని సుగుణాలు లేని వారు ,దేవుని యొక్క ఆత్మ లేనివారు, దేవుని యొక్క మంచి తనం, గొప్పతనం తెలియని వారికి సువార్తను ప్రకటించుటకు యేసు ప్రభువును తండ్రి దేవుడు అభిషేకించారు. గురువులను కూడా అందుకే అభిషేకించారు.
3. చెరసాలలో ఉన్న వారికి విడుదల దయచేయుటకు ఈ లోక ఆశతో , వ్యామోహంతో బంధీలుగా ఉన్నవారిని పాప సంకీర్తనల ద్వారా విడుదల దయ చేయుటకు దేవుని యొక్క పరిశుద్ద వాక్కు ద్వారా విడుదల దయ చేయుటకు ఎన్నుకొనబడ్డారు.
4. గ్రుడ్డి వారికి చూపు నిచ్చుటకు
ఎవరైతే దేవుని యొక్క కార్యాలు చూడలేక పోతున్నారు. దేవున్ని తమ జీవితంలో గుర్తించలేక పోతున్నారు. ఎదుటి వారిలో ఉన్న ప్రేమను చూడలేని గ్రుడ్డి వారు కొంతమంది కనులుండి గ్రుడ్డి వారిగా ఉండే వాళ్ళు ఉన్నారు. వారు అనుకున్నదే సత్యం అనుకుంటారు అట్టి వారికి దేవుడు మాత్రమే చూపు నివ్వగలరు.
కొందరికి దేవుడు ఆధ్యాత్మిక చూపు దయ చేస్తారు.
5. పిడితులకు -విమోచనం -ఎవరైతే శారీరకంగా , మానసికంగా ,ఆధ్యాత్మికంగా పీడించబడుతున్నారో అలాగే దయాల చేత పీడించబడేవారికి ,విమోచనం కలిగిస్తారు. మానసిక గాయాలవల్ల పీడించబడే వారు , అణచి వేయబడినవారు , ఎదుటి వారి పట్ల హర్ట్ అయినవారికి విమోచనం కలుగ చేయుటకు పంపించబడ్డారు.
6.దేవుని సంవత్సరం ప్రకటించుటకు - దేవుని యొక్క రక్షణ సంవత్సరం అని అర్ధం లేక మెస్సీయ్య యొక్క రాక అని అర్ధం. దేవుడు వారి మధ్యలో ఉన్నారు, అని తెలిపే సంవత్సరం అది. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి, అనుసరించి ఆ వాక్కు చేత స్వతత్రం పొందుతు సన్మార్గంలో నడుస్తూ దేవునికి అంగీకార జీవితం జీవిద్దాం. సాధ్యమైనంత వరకు సువార్త వ్యాప్తి కోసం కృషి చేద్దాం, దేవుని రాజ్య స్థాపనకు కృషి చేద్దాం.
REV.FR.BALAYESU OCD
నిత్య జీవము ఎలా వస్తుంది
యోహాను 6: 22-29 మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...