3, మార్చి 2022, గురువారం

తపస్సు కాల మొదటి ఆదివారం

  సాతాను శోధనలు - క్రీస్తును విజయము 

క్రీస్తు  నాధుని యందు  మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా  ఈనాడు  తల్లి తీరుసభ  మనలను అందరిని కూడా తపస్సు కాలపు మొదటి ఆదివారము లోనికి ఆహ్వానిస్తుంది. ఈనాటి పరిశుద్ద పఠనాల ద్వారా  మనలను అందరిని కూడా సాతానుకు బానిసలు కాకుండా, దేవుడు ఇచ్చిన స్వేచ్చతో జీవించమని లేదా దేవుని స్వతంత్ర బిడ్డలుగా జీవించమని కోరుతుంది. 

ఎందుకంటే ఈ యొక్క పాపము లేదా సాతాను కీడులలో నుండే కదా క్రీస్తు ప్రభువు తన శ్రమలు, మరణ, పునరుత్థానల ద్వారా మనలను స్వేచ్ఛ పరులను చేసెను. క్రీస్తు తన మరణ పునరుత్థానాల ద్వారా  సైతాను పై  ఆధిపత్యం  చూపించలేదా? తన మరణ  పునరుత్థానాల ద్వార  మనకు రక్షణ తెచ్చెను గదా?  మనలకు  పాప విమోచనగావించే కదా?

మరి మనము  ఆ పాపపు  జీవితాన్ని జీవించడం ఎంత మాత్రం సమంజసమో! మనం అందరం ఆత్మ పరిశీలన జేసుకోవాలి. ఈనాటి పరిశుద్ద గ్రంధ పఠనాలలో  చూస్తే, శోదనల గురించి వింటున్నాము. మరి ముఖ్యంగా  సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువును ఆ సైతాను ఏవిధంగా  శోధించిందో చూస్తున్నాం. 

 యిస్రాయేలు ప్రజలు, ఎడారి ప్రాంతంలో వారికి  తినడానికి ఏమి  దొరకనటువంటి సంధర్భంలో  వారు శారీరక  ఆకలితో, దేవున్ని మరియు  మోషే ప్రవక్తను నిందిస్తున్నారు. 

ఏదైన మేలు జరగనప్పుడు  మనం దేవుని నిందించాలనుకోవడం ఒక శోదనే. ఉదా: మనము యొబు జీవితం చూసుకున్నట్లయితే  తన భార్య, తన చెంతకు వచ్చి, నీవు సర్వాన్ని  కోల్పోయావు, నీవు జీవించడం వ్యర్ధము, కాబట్టి  నీ దేవున్ని శపించి నీవు కూడా చచ్చిపో, అన్నప్పుడు  యొబు  ఆ శోదనకు వెళ్ళి , దేవునితో గొడవ పడతాడు, నీవు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని. నా జీవితం ఎందుకు ఇలా అవుతుందని. 

కానీ చివరికి తన తప్పు తెలుసుకుంటాడు, దేవుని క్షమాపణ కోరతాడు. మరి మనం జీవితంలో కూడా యిస్రాయెలు  ప్రజల వలె యొబు వలె  మనకు మేలు  జరగని  సందర్భాలలో  మనం  దేవుడిని  నిందిస్తున్నామా? విశ్వాసాన్ని, లేదా నమ్మకాన్ని కోల్పోతున్నమా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ఎందుకంటే ఈ సాతాను అవకాశం కోసం  పొంచి ఉంటుంది. మనకు ఏమైనా కొదవఅయినప్పుడు , దేవునకు మనం ప్రార్దన చేసిన విననప్పుడు, దేవుడు మనలను విడనాడినట్లు ఉన్నప్పుడు, మనం బాధలలో, కష్టాలలో ఉన్నప్పడు, సాతాను మనలను దేవుడిని నిందించమని శోధిస్తుంది. 

సువిశేషం పఠనంలో చూస్తే  :-  క్రీస్తు ప్రభువుకి సాతాను శోదన మనం చూస్తున్నాం .  క్రీస్తు ప్రభువుకి ఈ శోదనలు ఒక్కసారి మాత్రమే వచ్చినవి కావు, అవి అనునిత్యం  క్రీస్తు జీవితంలో ఉన్నవే. తాను కన్ను మూసేంత వరకు, అంతా సమాప్తమైనది  అనేంత వరకు కూడా శోధింపబడ్డారు. 

ఎలా అంటే : - మనుష్య కుమారునిగా, ఒక సాదారణ వ్యక్తిగా మరణించే ముందు తండ్రి దేవుడు తనని  వీడనాడాడు లేదా తనని  వేరు చేశాడని భావించి ఉండవచ్చు కాబోలు. అందుకే నా దేవా నా దేవా , నన్నేల విడనాడితివి  అని బిగ్గరగా ఏడ్చాడు. 

కానీ :-  క్రీస్తుకు తెలుసు, ఇది  తండ్రి చిత్తమే అని , అందుకే  తండ్రి ! నా ఆత్మను నీకు సమర్పిస్తున్నాను .  అంతా సమాప్తమైనది అని అంటున్నాడు. 

ఈరోజు  సువిశేషంలో  చూస్తే 

 సాతాను మొదటి ప్రయత్నం :-  క్రీస్తు ప్రభువు  నలువది దినాలు ఉపవాసమున్నాడు,  ఈ  యొక్క  సందర్భాన్ని  ఉపయోగించుకోవాలని  ఆలోచించి, ఆ సాతాను క్రీస్తుని శారీరక ఆకలి తీర్చడం కోసం శోధిస్తుంది. 

ఇక్కడ సాతాను మూర్ఖత్వం కాకపోతే క్రీస్తు 4,000 మందికి 5,000 మందికి ఆకలి తీర్చిన దేవుడు తన ఆకలి తీర్చుకోలేడా ! సాతానును లెక్క చేయలేదు, సాతాను ఓడిపోయింది. 

సాతాను రెండవ ప్రయత్నం  :- రాజ్యాలన్నీ నీకిస్తాను, ఆధికారాన్ని నీకిస్తాను, నాకు మ్రొక్కు అంటుంది. ఇక్కడ కూడా సాతాను మూర్ఖత్వమే. ఎందుకంటే, సకల సృష్టిని సృజించిన సాక్షాత్తు దేవుని కుమారుడు, ఈ లోకాధిపతి, సర్వ అధికారికి, ఆయన ముందు సాతాను కుప్పిగంతులు. క్రీస్తు ప్రభువు బహుశా నవ్వుకొని ఉండవచ్చు కాబోలు సాతాను యొక్క మూర్ఖత్వాన్ని చూసి అప్పుడు కూడా  క్రీస్తు ప్రభువు లొంగలేదు. పైగా సాతానుకి " నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించుము, సేవించుము"  అని వ్రాయబడి ఉన్నదని  గుర్తు చేస్తాడు. 

సాతాను మూడవ ప్రయత్నం :- నీవు ఈ శికరము పై నుండి క్రిందకు దూకు, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, దూతలు తమ చేతులలో నిన్ను పట్టుకుంటారు, అని శోధిస్తుంది. ఒక్క మాటతో లోకాన్ని సృష్టించిన దేవుడు, ఒక్క మాటతో లాజరును జీవంతో ఇచ్చిన దేవుడు,  ఒక్క మాటతో స్వస్థతలు  చేసిన దేవుడు,  ఒక్క   మాటతో సముద్రాన్ని  శాసించిన, అద్భుతాలు, చేసిన క్రీస్తుకు,  ఇది ఒక శోధన. 

అప్పుడు కూడా క్రీస్తు ప్రభువు  సాతానుతో  ప్రభువైన  నీ దేవుని శోధింపరాదు అని చెబుతున్నారు. సాతాను మళ్ళీ ఓడిపోయింది. ఇలా క్రీస్తు ప్రభువు సీలువలో మరణించేంత వరకు కూడా శోధిస్తూనే వుంది. 

అద్భుతాలు, మహిమలు చేయగల  శక్తిగల దేవుడు క్రీస్తు ప్రభువు అయిన కూడా, తాను స్వార్ధంగా ఆలోచించలేదు. తన స్వంత ప్రయోజనాలకు, పేరుకు గాని ఎప్పుడు ఉపయోగించలేదు. ఎప్పుడు కూడా దేవుని యొక్క  చిత్తాన్ని నెరవేర్చుటకు, ప్రజల సంతోషం కోసమే తన శక్తులను ఉపయోగించాడు. మరి మనం శక్తి సామర్ధ్యాలు ఎవరి కోసం ఉపయోగిస్తున్నాం?ఆత్మ పరిశీలన చేసుకోవాలి? 

రెండవ పఠనం :-  పునీత పౌలుగారు రోమియులకు తెలియ చేస్తున్నారు. మనకు "ప్రభువుఒక్కడే "ఆయనను మన  హృదయంతో విశ్వసిస్తే, నీతిమంతులం అవుతాం. నోటితో ప్రభువే నా దేవుడు అని ఉచ్చరిస్తే రక్షింపబడతాం,  అని తెలియ చేస్తున్నారు. 

క్రీస్తు ప్రభువు చేసింది కూడా అదే. సాతాను వచ్చి నాకు మొక్కుము అన్నప్పుడు క్రీస్తు చెప్పిన మాటలు కూడా ఇవే మనకు దేవుడు ఒక్కడే ఆయనను మాత్రమే సేవిస్తాను అని. 

ఈనాడు మనము క్రీస్తువలె జీవిస్తున్నామా ? మనకు దేవుడు ఎవరు ధనమా , పేరు ప్రఖ్యాతలు, అధికారమా,  బందువులా, మిత్రులా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. పునీత సిలువ యోహను గారు కూడా ఇటువంటి  మాటలనే తన యొక్క జాగ్రత్తలు తెలియ చేస్తారు. ప్రతి మనిషి కూడా మూడు విధాలుగా శోధింపబడుతాడు, వాటిని జాగ్రత్తగా ఎదుర్కోనమని  తెలియచేస్తున్నారు. 

మొదటిగా : వ్యక్తిగతంగా,  ఎదురయ్యే శోధన , ఇది మానసికంగా కావచ్చు, శారీరక సుఖా:ల ద్వార కావచ్చు, లైంగిక శోధన , ఆహార శోధన , నిర్లక్ష్య కావచ్చు. 

రెండవదిగా : ఈ లోక సంబందమైన శోధన 

-బందువుల ద్వారా , స్నేహితుల ద్వారా కావచ్చు 

-సంపదల ద్వారా, ధనము ద్వారా కావచ్చు . 

మూడవదిగా : సాతాను శోధన 

వక్రబుద్ది జీవతం 

- ఆధికారం కోసం 

-గొప్పవారు కావాలని, పేరు పొందాలని, 

-ఎప్పుడు ఒకరి మీద పెత్తనం చేయాలని ఎంత నీచానికైనా మనిషి దిగజారుతాడు. 

ఇలాంటి మూడు సందర్భాలలో మనం దేవున్ని మర్చిపోతాం, దేవునికి దూరంగా జీవిస్తాం, అవే సర్వస్వం  అని నమ్మి మోసపోతాం. చివరికి జీవితం నాశనం చేసుకుంటాం. కాబట్టి వీటన్నింటికి  జాగ్రత్త కలిగి దేవునియందు విశ్వాసముంచి  జీవించమని తెలియచేస్తున్నారు. 

కావున మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ఈ శ్రమలు అనునిత్యం ఉంటాయి. ఈ నలువది  రోజులు మాత్రమే నేను ఈ విధంగా జీవించాలి అని కాదు. ప్రతి నిత్యం కూడా మనం సాతానును గెలవాలి. 

చివరిగా ఏమిటంటే, క్రీస్తు ప్రభువు మనలను బానిసత్వం నుండి స్వతంత్రులను చేయుటకు ఈ లోకానికి వచ్చారు, మనలను విముక్తులను చేశారు. కానీ ఇంకా మనం సాతాను బానిసత్వంలోనే జీవిస్తున్నాం. కాబట్టి మనం ఆత్మ పరిశీలన చేసుకొని, దేవుని స్వతంత్ర బిడ్డలుగా జీవించుటకు ప్రయత్నిద్దాం. ఆమెన్ .

BR. SUBHASH 

26, ఫిబ్రవరి 2022, శనివారం

8 వ సామాన్య ఆదివారం (2)

8 వ సామాన్య ఆదివారం 

 సీరా 27:4-7, 1 కోరింథీ 15:54-58 లూకా 6:39-45 

నేటి దివ్య పఠనాలు మన యొక్క అనుదిన జీవితంలో వినియోగించే మనిషి యొక్క మాటల గురించి తెలియజేస్తుంది. 

యేసు ప్రభువు ఏ విధంగానైతే తన యొక్క భూలోక జీవితమంలో మంచి మాటలు  మాట్లాడుతూ అనేక మంది జీవితాలలో సంతోషంను నింపుతూ,   ప్రేమను పంచుతూ  జీవించరో మనం కూడా అలాగే మృదువైన  మాటలు మాట్లాడుతూ అందరి జీవితంలో మంచిని పంచాలి. 

మన యొక్క మాటతో పాటు మనస్సు కూడా మంచిగ ఉండాలి. దేవుడు మానవునికి మాటనిచ్చింది, ఆయనను స్తుతించడానికి, ఆయనను గురించి ఇతరులకు తెలియజేయడానికి, ఇది దేవుడు ఇచ్చిన గొప్ప వరం.

 మన యొక్కమాట ద్వారా తోటి ప్రజలతో స్నేహబంధం ఏర్పరుచుకొని వారితో సమాధానంగా  సంతోషంగా ఉండవచ్చు. 

 మన యొక్క ప్రతి వాక్కు ద్వారా మన భావాలను, ఆలోచనలను వ్యక్త పరచి  ఇతరులతో  స్నేహ బంధాన్ని కలిగి మన మాటలు  జీవించడానికి ఉపయోగపడతాయి

 దేవుడిచ్చిన మాటను  సద్వినియోగం చేసుకుంటే ఆ  జీవితం సుఖంగా ఉంటుంది 

మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట విలువైనది మాట్లాడే ప్రతి మాట వెనుకు  తీసుకోవలేం, కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.

మాట్లాడే మాటలను  దుర్వినియోగం చేసుకుంటే అతని లేక ఆమె జీవితం కష్టాల పాలౌవుతుంది. 

మన జీవితంలో శాంతి సమాధానాలు లేకపోవడానికి కారణం మన యొక్కనోటి మాటయే. మన యొక్క సంభాషణలో  నోటి మాటలో శుద్ధి , సౌందర్యం లోపించినప్పుడు మన కుటుంబాలలో   కలహాలు మొదలవుతాయి. 

ఈనాటి మొదటి పఠనంలో సీరా ఎలియజర్ పుత్రుడైన యేసు రచయత మనిషి యొక్క  మాట తీరుకు అతడి మనసుకు ఉన్న సంభంధాన్ని తెలియచేస్తునారు. 

మనిషి మాట్లాడే ప్రతి మాట బయటకు మనకు  వినిపిస్తుంది. కాని అతని లేక ఆమె మనసు  మనకు కనిపించదు.  అయితే మనిషి మాట్లాడే మాటయే తన యొక్క అంతరంగమును  బయటకు వెల్లడిస్తుంది. 

సిరాకు  3 ఉపమానాల  ద్వారా మనిషి మాటలు, అంతరంగిక భావాల గురించి తెలుపుచున్నారు. 

1. జల్లెడ యొక్క ఉపమానం

2. కుమ్మరి పాత్రలు చేసే విధానం 

3. పండును బట్టి చెట్టు యొక్క స్వభావం 

  ఈ మూడు కూడా మన వ్యక్తిగత జీవితంలో రోజు చూసే ఉదాహరణలే.  ఇవి మనకు చాలా ముఖ్యమైన విషయాలు  నేర్పిస్తాయి. 

ఊపిన జల్లెడ - రైతు పంట కోసినప్పుడు మంచి గింజలనుండీ చెడు గింజలను వేరు పరచడానికి  రైతు వినియోగించే సాధనమే జల్లెడ. 

జల్లెడ పట్టడం ద్వారా మనకు మేలిమి  వస్తువులు దొరుకుతాయి.  అలాగే మనం మాట్లాడే ప్రతి  ఒక్క దానిలో  మంచి పదాలు  ఉంటాయి, అలాగే చెడ్డవి ఉంటాయి.

జల్లెడ క్రీంద పొట్టు కనబడినట్లు మన యొక్క సంభాషణలో కూడా  పోట్టు వంటి లోపాలతో కూడుకున్న పదాలు కనిపిస్తాయి. మన యొక్క మాటల్లో తప్పులు కనపడుతుంటాయి. 

   రెండవదిగా కుమ్మరి చేసే కుండలు : ఒకవేళ అతను మంచి మట్టిని వాడింది  లేనిది  వాటిని అవంలో వేసినప్పుడే అర్ధమవుతుంది. మంచి మట్టిని వాడక పోతే, అవి అగ్నిలో వేసినప్పుడే పగిలిపోతాయి. ఆవం లోని అగ్ని కుండ గట్టితనాన్ని పరిశీలించినట్లే ఒక వ్యక్తి యొక్క మాటతీరు , అతని సంభాషణ వలన అతను ఎలాంటివాడో అర్ధం అవుతుంది.  మట్టి పాత్రలు విలువ ఆవంలో తెలిసిన విధంగా మనిషి యొక్క విలువ ఆయన మాటలో  అర్థం అవుతుంది. 

 మూడవదిగా చెట్టు యొక్క పండు అది ఎలాగా ఫలములనిస్తుంది అని తెలుపుచున్నారు. చెట్టుకు అన్నీసక్రముగా ఇస్తే మంచి పండ్లనే ఇస్తుంది.  అంటే చిన్నప్పటినుండియే చిన్న బిడ్డలకు  మంచి విషయాలు నేర్పిస్తే  భవిష్యత్తులో మంచి మాటలు ప్రవర్తన కలిగి జీవిస్తారు. 

ఈ మొదటి పఠనము ద్వారా దేవుడు మన యొక్క మాటలు మంచిగా ఉండాలని తెలుపుతున్నారు. మానవ జీవితంలో మాట్లాడే ప్రతి ఒక్క మాట విలువైనది. శరీరానికి  ఒక దెబ్బ తగిలితే ఆ గాయం తొందర్లోనే మాయం అవుతుంది. కానీ మాట ద్వారా మనసుకు అయిన గాయం మానటం కష్టం. 

మనం మాట్లాడే మాటలు మనకు  స్నేహితులను చేస్తుంది.  అదే మాటల వల్ల  మనకు శత్రువులు  కూడా తయారవుతారు. 

మనం మాట్లాడే మాటలు చాలా సార్లు జీవితాలు నిర్మిస్తాయి, నిలబెడతాయి  అవే మాటలు కొన్ని సార్లు జీవితాలను కూల్చుతాయి. 

 మన యొక్క వాక్కు ద్వారా ఎందరో జీవితాలలో  వెలుగు నింపవచ్చు,  ప్రేమించవచ్చు.  అదే మాట ద్వారా మనం కొందరిని ద్వేషించేవచ్చు. 

మాట్లాడిన ప్రతి మాటకి రెండు అర్థాలు ఉంటాయి positive మరియు negative  అయితే మనం ఎలాంటి tone  ఉపయోగించం  అన్నది కూడా ముఖ్యం. 

మన యొక్క సంభాషణల  ద్వారా ఇతరులలో నమ్మకం కలిగించవచ్చు, ఓదార్పును ఇవ్వవచ్చు, ప్రేరణ కలిగించవచ్చు . 

ఒకచిన్న అగ్గిపుల్లతో ఎలాగైతే ఒక పెద్ద అడవిని కాల్చి వేయవచ్చో అలాగే  మన యొక్క నాలుకతో మాట్లాడే మాటలు చాలామంది  జీవితాలను  కూల్చుతాయి.  ఇతరులను పాపంలోనికి నెట్టేది  కూడా మన యొక్క మాటలే ఎందుకంటే తప్పుగా మాట్లాడుట  వలన వేరే వాళ్ళు ప్రేరేపించబడి పాపం చేస్తారు. 

కాబట్టి మన యొక్క సంభాషణలో  మన మంచిగా ఆలోచనలు   చేసి మంచిగా మాట్లాడి జీవిస్తే ఈ లోకంలో శాంతి సమాధానాలు, ప్రేమ, ఆనందం ఉంటుంది. మన మాటలద్వారా ఆశీర్వదించవచ్చును శపించవచ్చును. సృష్టిలో కేవలం మానవులు మాత్రమే మాట్లాడే వారు. మనకు మాత్రమే గొప్ప వరం దేవుడు దయచేశారు. కావున మనం కూడా మాటలనే మాట్లాడాలి.

రెండవ పఠనంలో పౌలు గారు మరియొకసారి యేసుప్రభువు యొక్క పునరుత్తానం గురించి ప్రకటిస్తున్నారు. పౌలు గారు యేసు క్రీస్తు ప్రభువుకు మరణంను జయించగల శక్తి ఉన్నదని తెలుపుచున్నారు, అందువలనే యేసుప్రభువు మరణించిన తరువాత శరీరంతో పునరుత్తానమయ్యారు.

క్రీస్తు ప్రభువునందు జ్ఞానస్నానం పొందిన మన అందరంకూడా పవిత్రాత్మ ద్వారా ఇహలోకంలో దేవుని యొక్క అనుచరులుగా, విశ్వాసులుగా జీవించే మనందరం కూడా పునరుత్తానమవుతామని, దానికి నిదర్శనం యేసు క్రీస్తు పునరుత్తానమే అని పౌలు గారు తెలుపుచున్నారు.

ఈ లోకానికి మరణం పాపం చేయుట వలన వచ్చింది. పాపం చేయుటవల్ల అవిధేయులై, దేవుని చట్టాన్ని సరిగా పాటించలేం, ఇంకా పాపపు జీవితం నే కొనసాగిస్తాం. అయితే పాపంలో ఉన్నవారందరిని రక్షించడానికి ప్రభువు ఈలోకంలో జనిమించారు. ఎటువంటి పాపం చేయకుండా మన కోసం సిలువ శ్రమలు మరణం, పునరుత్తానం ద్వారా మనకు రక్షణ దయచేశారు అని పాలుగారు తెలుపుచున్నారు.

యేసుక్రీస్తుప్రభువు పాపమును జయించారు, మరణమును జయించారు, కాబట్టి మనం ఆయన యందు విశ్వాసముంచి ఆయన కార్యాలు నెరవేర్చాలి, ఆయన సేవ చేయాలని పౌలు గారు తెలుపుచున్నారు.

సువిశేష పఠనంలో యేసు ప్రభువు మనయొక్క జీవితంలో చాల విలువైన విషయాలను బోధిస్తున్నారు.

1. ఒక గ్రుడ్డివాడు వేరొక గ్రుడ్డివానికి మార్గం చూపించగలడా?

2. శిష్యులు గురువు కంటే అధికుడు కాదు

3. పరులను గూర్చి తీర్పు చేయకూడదు

4. అంతరంగిక శుద్ధి కలిగి మంచి మాటలు మాట్లాడుట, బోధించుట.


1. ఒక గ్రుడ్డివాడు వేరొక గ్రుడ్డివాడిని నడిపిస్తే ఏమవుతుందో అందరికి తెలుసు. వారిద్దరూ పడిపోయే అవకాశం ఉంది, దారి తప్పి పోతారు, గమ్యం చేరలేరు. చాల సందర్భాలలో మనం ఎలాంటి వారిని అనుసరిస్తున్నామో అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఎవరిని వెంబడించాలో, ఎవరిని మన యొక్క నాయకులుగా అనుసరించాలో వారిపట్ల జాగ్రత్తగ ఉండాలి.

అన్ని తెలిసిన వ్యక్తులు మాత్రమే మనం అనుసరించాలి, మనలను సన్మార్గంలో నడిపించే వారినే వెంబడించాలి. దైవ జ్ఞానం లేని గ్రుడ్డివారిని, దేవుడంటే విశ్వాసం లేని వారిని తల్లిదండ్రులంటే భయభక్తులు లేని వారిని మనం అనుసరిస్తే మన జీవితాలు కూడా అంధకారంలోకి నడిపించబడతాయి.

ప్రతిఒక్కరు మొదటిగా తమ యొక్క జీవితాన్ని పరిశీలించుకుని, ఆ తరువాత ప్రజలను హెచ్చరించమని, నడిపించమని తెలుపుచున్నారు.

పరిసయ్యులు ప్రజలకు నాయకులుగా వ్యవహరించే వారు. అయితే పరిశయ్యులు తమ అంతరంగాన్ని చక్క పరచుకోనంతవరకు వారు గ్రుడ్డి నాయకులే. గ్రుడ్డి నాయకులు వేరే వారికీ దేవుని మార్గం ఎలాగా చూపించగలరు?

యేసు ప్రభువు మనందరియొక్క నాయకుడు ఎందుకంటే ఆయన మాత్రమే మనలను తండ్రి మార్గంలోకి నడిపిస్తారు. ఆయనయే ఈ లోకానికి వెలుగు. మన జీవితాలు మంచిగా ఉంచకుండా, వేరొకని మంచిగా జీవించమని చెప్పుట సరిఅయిన పద్దతి కాదు అని ప్రభువు తెలుపుచున్నారు.మంచి సమాత్రుకగా ఉన్నవారే వేరొకరికి మార్గం చూపించగలరు.

2. శిష్యుడు గురువుకంటే అధికుడు కాదు

 శిష్యులు ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికిని ఆయన పొందినది మొత్తం గురువు దగ్గర నుండియే .. కాబట్టి శిష్యుడు గురువు కన్నా అధికుడు కానేరడు. శిష్యుల యొక్క జీవితంలో వెలుగును నింపింది గురువే నేర్పింది గురువే, దరి చూపించింది గురువే, జీవితం జారీచేసింది గురువే కాబట్టి మనం ఎప్పుడు కూడా గురువుకన్నా చిన్నవారమే. మన గురువు దేవుడే ఆయన కన్నా మనం ఎప్పుడు చిన్నవారమే కాబట్టి మన గురువుకు విధేయించాలి, గౌరవించాలి.

3. మన కంటిలో దూలం ఉంచుకొని వేరొక వ్యక్తి కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపిస్తాం.

మనందరికీ గురువింద గింజ తెలుసు పైన ఎర్రగా ఉంటుంది, క్రింద నల్లగా ఉంటుంది. చాలా సందర్భాలలో మనందరం పైకి మంచి వరమని, పవిత్రులమని భావిస్తాం కానీ అది వాస్తవం కాదు. మనం వేరొక వ్యక్తుల మీదనే ఎక్కువ (focus, attention) శ్రద్ధ ఉంచుతాం కానీ మన జీవితాలను మనం పరిశీలించుకోము.

పరిసయ్యులు సామాన్య ప్రజల జీవితాల మీదనెను శ్రద్ధ (focus) పెట్టారు కానీ తమ జీవితాల గురించి మరిచి పోయారు. -ఇతరుల గురించి తీర్పుచేశారు. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ (యోహాను 8: 3-11) యొక్క సువిశేష భాగంలో అక్కడా అందరూ పాపం చేసినవారే కానీ ఆ స్త్రీ పట్టుబడింది కాబట్టి ఆమెను శిక్షించాలని అనుకున్నారు. మన పాపాలు మనం తెలుసుకోవాలి, శారీరక శుద్ధి మాత్రమే కాదు అంతరంగిక శుద్ధి అవసరం. ఇతరుల గురించి తీర్పు చేయుటకు మనం అర్హులము కాదు. దేవుడు ఒక్కరే సత్యవంతుడు , పవిత్రుడు. మనలో చాలా మంది ఇతరులలో ఉన్న తప్పిదాలే వెదుకుతారు కానీ మంచిని చూడలేరు. మనం ఎవ్వరిని తీర్పు చేయకుండా నిందించకుండా, ప్రేమతో జీవించాలి. దేవుడే మన తీర్పరి.

4. అంతరంగిక శుద్ధి కలిగి జీవించాలి

మనయొక్క అంతరంగ పరిశుద్ధంగా ఉంటే మన మాటలుకూడా పరిశుద్ధంగా మంచిగా ఉంటాయి. మనయొక్క మాటలు అన్ని హృదయంనుండి, మనస్సునుండి వెలువడతాయి. మన హృదయాంతరాళంలో ఏవయినా స్వార్థం, క్రోధం, అసూయా, పగలు, ద్వేషాలు వున్నట్లైతే వాటి ద్వారా మన మాటలు చేతలు, ప్రవర్తన అవినీతి కరంగా ఉంటాయి. అంతరంగ జీవితం కు బాహ్య జీవితం కు సంబంధం ఉన్నది. ఇది కూడా విశ్వాసం చేతలు లాంటిది, రెండూకూడా ముఖ్యమే ఒకటి ఉంటే సరిపోదు.

పరిసయ్యులు బాహ్య జీవితానికి ప్రాముఖ్యతను ఇచ్చారు. అంతరంగిక జీవితం మర్చిపోయారు. మాటలు, బోధనలు మాత్రమే వున్నాయి కానీ చేతలు లేవు. మంచి జీవితం లేదు. అందుకే ప్రభువు వారిని కపట వేషధారులు అని అంటున్నారు.

ప్రజల యొక్క మెప్పుకోసమే అనేక కార్యాలు చేసేవారు, దేవుణ్ణి స్తుతించారు కానీ వారి యొక్క హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. మనం కూడా మంచి జీవితం అనగా అంతరంగికంగా మరియు బాహ్యంగా పవిత్రులై ఉండాలి.

మనందరం కూడా మంచి ఆలోచనలు కలిగి, మంచి మాటలు మాట్లాడుతూ ఒక మంచి విశ్వాసం జీవితం జీవించాలని ప్రభువు తెలుపుచున్నారు. మన సంభాషణలు యేసుక్రీస్తు సంభాషణల వలే మంచిగా పవిత్రంగా ఉండాలి.

Rev. Fr. Bala Yesu OCD

25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

8 వ సామాన్య ఆదివారం

 మనిషి మాటే  - మనస్సు బాట 

సీరా 27:4-7, 1 కోరింథీ 15:54-58 లూకా 6:39-45 

క్రీస్తునాధుని యందు  ప్రియమైన దేవుని బిడ్డలారా , ఈనాడు తల్లి శ్రీ సభ  మనలను 8 వ ఆదివారం లోనికి ఆహ్వానిస్తుంది. ఈ నాటి పరిశుద్ద గ్రంధ పఠనములు ద్వారా మనకు ఇచ్చిన సందేశం మనిషి మాట ద్వారా మనస్సును తెలుసుకోవచ్చు అని మనిషి యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది. 

మొదటి పఠనం :- ఈనాటి మొదటి పఠనంలో మనిషి మాటకు -మనిషి మనస్సుకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియ చేస్తుంది. మనిషి మనస్సును మనం చూడలేముం వినలేము కానీ మనిషి మాట మనకు వినిపిస్తుంది. కనుక మనిషి మాటలే మనకు అతని మనస్సును మనకు తెలియ జేస్తాయి. మనిషి మనస్సు, గుణం, శీలం మనిషి మాటల ద్వారం ఏ విధంగా బయటపడతాయో ఈనాటి మొదటి పఠనం మనకు తెలియ జేస్తుంది. 

ఊపిన జల్లెడ- కుమ్మరి చేసిన కుండ, చెట్టు కాపు అనే మూడు ఉపమానములు చెబుతూ మనిషి యొక్క  హృదయనంతరంగమును తెలుసుకొనుటకు అతని మాటలే అని తెలియజేస్తున్నడు. కనుక ఏ నరున్ని అతన్ని మాట్లాడకముందు స్తుతించరాదు. 

1. ఊపిన జల్లేదలో మట్టి పెళ్లలు మిగులునట్లే మనిషి సంభాషణమున దోషములు కనిపించును మనిషి మనస్సులోని దోషములు  మాలిన్యాము. స్వార్ధము అతని మాటలలలోనే బయటపడుతాయి. 

2. కుమ్మరి చేసిన కుండకు అగ్ని పరీక్ష అవసరం, అగ్నిలో కాల్చబడాలి. అలాగే మనిషికి పరీక్ష అతడి మాటలే. 

3. చెట్టు కాపును బట్టి అదెంత  బలమైనదో ఊహించవచ్చు అలాగే మాట తీరును బట్టి అతడు మంచి వాడా , చెడ్డ వాడ అని అర్ధం చేసుకోవచ్చు. పండును బట్టి చెట్టు స్వభావమును తెలుసుకుంటారు. పండు మంచిదైతేనే చెట్టు మంచిదని, పండు చెడ్డదైతే చెట్టు మంచిది కాదని ఎలా అనుకుంటామో అలాగే మనిషి మాటలను బట్టి అతను ఎలాంటి వాడు, అతని స్వభావం ఏమిటి అని తెలిసిపోతుంది. 

మనిషికి ఉన్న మాట దేవుడిచ్చిన వరం. ఆ వరంతో దేవుడిని స్తుతించడానికి, ఇతరులకు తెలియచేయడానికి ఇతరులతో స్నేహ బంధాలు ఏర్పరుచుకొని వారితో శాంతి, సమాదానంతో జీవించడానికి వినియోగిస్తున్నావా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఇచ్చే వరములను సద్వినియోగం చేసుకుంటే వారి జీవితం దేవునిలో వర్ధిల్లుతుందని, దానిని దుర్వినియోగం చేసుకుంటే జీవితం పాడైపోతుంది. 

మనిషికి మాట శుద్ది ఎంతో అవసరం : - 

మన హృదయం పవిత్రంగా ఉంటే మన మాటలు కూడా పవిత్రంగా ఉంటాయి. మన హృదయంలో  స్వార్ధము, కోపము, అసూయ,పగ, దురాశ ఉంటే మన మాటలు, చేతలు, ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది. 

మన మాటలు మన హృదయాన్ని బహిర్గతం చేస్తాయి. our speach reveals our heart. తల్లి మాటలను బట్టి బిడ్డను ఎంత ప్రేమిస్తుందో అర్ధంచేసుకోవచ్చు.  ఇతరులు మాట్లాడే విధానమును బట్టి వారు అభిమానంతో , ప్రేమతో మాట్లాడుతున్నారా? లేదా అని అర్ధం చేసుకోవచ్చు. 

మనిషి నీతి న్యాయముతో కూడిన మాటలు ఆనందము, సంతోషముతో కూడిన మాటలు ఓదార్పు,సహనం ,ప్రోత్సాహపు మాటలు, శాంతికరమైన మాటలు, క్షమించమని అడిగేమాటలు దేవుని బిడ్డల నుండి వస్తాయి. మనము కూడా అలాంటి  వారికే ప్రాముఖ్యతను  ఇచ్చి వారినీ ఇష్ట పడటమే కాదు వారి వలె ఉండటానికి ప్రయత్నించాలి. అబద్దపు మాటలు చాడీలు , గొడవలు పెట్టె మాటలు, బూతు మాటలు ఇతన్నింటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. "ప్రతి ఒక్కడు తాను పలికిన ప్రతి వ్యర్ధమైన మాటకు సమాదానం ఇవ్వవలసి ఉన్నది."మత్తయి 12:36 . అదే విధంగా నీ మాటలు బట్టి నీవు దోషివో , నిర్ధోషివో కాగలవు (మత్తయి 12:37). మన మాటలు మనం వ్యక్తిత్వాన్ని, మనస్సును తెలియ చేస్తాయి. గ్రీకు తత్వవేత్త సోక్రటీసు గారు చెప్పిన మూడు ద్వారములు : మనం నోటి మాట మూడు ద్వారములు దాటి బయటకు రావాలి, 1. మనము చెప్పే మాట నిజమేనా, 2. మనము చెప్పే మాట అవసరమేనా  మరియు 3. మనము చెప్పే మాట ఉపయోగమేనా. మన హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెళువడును(లూకా 6:45). 

రెండవ పఠనం :-  1 కోరింథీ 15:54-58 

ఈనాటి రెండవ పఠనాన్ని  ధ్యానించుకుందాం. ప్రియమైన  స్నేహితులారా  రెండవ పఠనంలో పునీత పౌలుగారు కోరింథీ  ప్రజలతో మాటలాడుతున్న  మాటలు  మనం శ్రద్దగా పరిశీలిస్తే, ఆయన ఆ ప్రజలకు దేవునితో ఉండటానికిధైర్యాన్ని ఇస్తున్నారు. 1 కోరింథీ 15:58 వ వచనంలో మూడు ముఖ్యమైన మాటలను కోరింతి ప్రజలకు చెపుతూ మనోధైర్యాన్ని, దేవుని యందు ధృడత్వాన్ని వారికి అందిస్తున్నాడు. ఆ మూడు విషయాలను తమ జీవితంలో నెరవేరిస్తే  దేవునిలో నిలబడగలవు అంటున్నారు. ఆ మూడు విషయాలు  మొదటిది ప్రియతమ సోదరులారా , దేవుని బిడ్డలారా దేవునిలో ధృడముగా, స్థిరముగా నిలబడుడు అని అంటున్నారు. అంటే మనం జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినను భాదలు వచ్చినను ఇబ్బందులకు గురి అయినను దేవుని  యెడల అపారమైన ప్రేమ, నమ్మకము , విశ్వాసము కలిగి ఉండమంటున్నారు. భౌతికమైన మన శరీరానికి అమరమైన క్రీస్తుని ధరించి ఆయనతో స్థిరంగా నిలబడమంటున్నారు పౌలుగారు. 

రెండవదిగా ప్రభువు కార్యములలో సర్వదా శ్రద్ద చూపుడు. ఈ మాటలకు అర్దం దేవునియొక్క పనులలో సంఘం యొక్క నడిపింపులో , దైవ జనులకు సహాయము చేయుటలో ప్రభువునకు సంభందించిన పనులు చేయుటకు ముందుండి ఆ దేవుని దైవత్వంలో పాలి భాగస్తులై ఉండమంటున్నారు. ఆత్మలను దైవ సన్నదికి నడిపించ ప్రభు సేవలో ప్రభుని కార్యములో సర్వదా శ్రద్ద చూపుచు ఈ లోక వ్యామోహాలకు, ఈలోక  విషయాలకు నీ హృదిలో చోటు ఇవ్వక ప్రభువునకు సంభందించిన ప్రతికార్యములో శ్రద్ద చూపాలని పౌలుగారు పలుకుతున్నారు. ఇక , మూడవదిగా ఈ రెండు కార్యములను నీ హృదయ పూర్వకముగా చేసిన యెడల మీరు చేసే ఎట్టి కార్యాలు నిష్ప్రయోజనం కాదని పౌలుగారు పలుకుతున్నారు. 

సువిశేషం :- లూకా 6: 39-45 

ఈనాటి సువిశేషంలో కూడా మొదటి పఠనంలో చూసిన విధంగా వృక్షములను బట్టి దాని ఫలములుండును. అదే విధముగా ఒక మనుజుని మాటలు ఆయన తలంపులను బయలుపరచుచుండు సిరా 27:6 లో చూస్తున్నాం. సువిశేషంలో ప్రభుని మాటలు  "మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఈయజాలదు. లూకా 6:43. పండుని బట్టి ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు. కోరింద పొదలనుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును. దుర్జనుడు తన దుశ్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును.  "ఎలయన హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. లూకా 6:43-45. 

మనం మాట్లాడే మాటలు మన హృదయం నుండి వస్తు వుంటాయి. మన అంతరంగం పవిత్రంగా ఉంటే మన మాటలుకూడా మంచిగా ఉంటాయి. మన హృదయంలో స్వార్ధం, క్రోధం, అసూయ , పగ , దురాశలు  ఉన్నప్పుడు మన యొక్క మాటలు, చేతలు ప్రవర్తన, నడవడిక అసభ్యంగా ఉంటాయి. అవినీతిగా ఉంటాయి. దురాశలతో నిండిన హృదయం నుండి మంచి మాటలు, చేతలు ఉద్భవించవు. మన ఆంతరంగిక జీవితానికి బహిరంగ ప్రవర్తనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పరిసయ్యుల బహిరంగ ప్రవర్తనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. వారికి మాటలు , చేతలు చట్ట పరంగా ఉంటే చాలు. ఆంతరంగిక ఉద్దేశాలు, బావాలు ఎలా ఉన్నా పర్వలేదు. యేసు ఈ పరిసయ్యులను ఉద్దేశించి ఈ పఠనములోని వచనాలు పలికారు. వారి యొక్క చెడు డాంబిక ప్రవర్తనను, భక్తి  కార్యాలను యేసు ఖండించారు. ప్రజల పొగడ్తలకై ఎన్నో చేశారు కానీ హృదయ పూర్వకంగా దేవుని ఆరాధించలేదు. వారు పెదవులతో దేవుని ఆరాధించేరే కాని వారి హృదయాలు ఆయనకు ఎంతో దూరంగా ఉన్నాయి. వారి కార్యలన్నీ చెట్ల పండ్లు వంటివే. ఎందుకంటే అవి అన్నీ వారి హృదయంతరిక భక్తి హీనత నుండి, అవినీతి నుండి ఉద్భవిస్తాయి. మానవుని యొక్క మాటకు, కార్యనికి  విలువను ఇచ్చేది అతని ఉద్దేశం. 

మన అంతరంగం పరిశుద్దంగా ఉన్నపుడే మన మాటలు కార్యాలు దేవునికి ప్రీతికరంగా ఉంటాయి. క్రైస్తవులమైన మనము అనేక సార్లు ఆ పరిసయ్యుల వలె ప్రవర్తిస్తుంటాము. మన హృదయం అవినీతిలో,దురాశలతో నిండి ఉన్నప్పుడు పరిసయ్యుల వలె కాక మన హృదయాన్ని పరిశుద్ద పరచుకొని ఇతరులకు మార్గదర్శులం అవ్వాలి. అనగా క్రైస్తవుని హృదయంలో మన హృదయంలో పవిత్రత, నీతి , న్యాయం, ప్రేమ ,శాంతి ,సమాదానం, ఆనందం సహకారం  మొదలైనవన్ని నెలకొంటాయి, అప్పుడు మానవుడు పలికే ప్రతిమాట నిజమైన క్రైస్తవ స్వభావాన్ని నిరూపించగలదు. 

ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డలారా హృదయ పరిపూర్ణత, పరిశుద్దత నుండే నోటి మాట వస్తుంది. లూకా 6:45. కాబట్టి మన హృదయాన్ని నిరంతరం (శుద్ది) ప్రక్షాళన చేసుకోవాలి. అప్పుడే మన ఆలోచన ,మాట , యుక్తవిధంగా ఉంటాయి. పది మందికి ఉపయోగపడుతాయి. 

Br. Manoj 

19, ఫిబ్రవరి 2022, శనివారం

7 వ సామాన్య ఆదివారం (2)

 7 వ సామాన్య ఆదివారం 

1 సామువేలు 26:2,7-9, 12-13,22-23,   1 కోరింథీ 15:45-49, లూకా 6:27-38 

నేటి దివ్య పఠనాలు దేవుడిచ్చిన బంగారు సూత్రం గురించి భోదిస్తున్నాయి. ఇతరులు మీకు ఎట్లు  చేయాలనుకుంటారో అట్లే  పొరుగు  వారికి చేయుటయే బంగారు సూత్రం. ఇంకోక విధంగా ఆలోచిస్తే ఆ బంగారు సూత్రం  సోదరి సోదరుల పట్ల ప్రేమ కలిగి జీవించుట. అది శత్రువులైన మిత్రులైన సరే మనం ఒకరినొకరు ప్రేమించుకొని జీవించాలని అని ప్రభువు తెలుపుచున్నారు. 

నేటి పఠనాలలో ప్రభువు శత్రువులను ప్రేమించి, క్షమించి వారి కోసం ప్రార్ధించాలి అనే అంశములు ఎక్కువగా కనబడుచున్నాయి. 

ఈనాటి మొదటి పఠనంలో దావీదు రాజు యొక్క మంచి మనస్సును మనం చూస్తున్నాం. దావీదు మహారాజు దేవున మనస్సు కలిగి తన శత్రువైన సౌలును కాపాడిన విధానమును మొదటి పఠనం ద్వార వింటున్నాము. దేవుడు  సౌలు తరువాత దావీదును  యిస్రాయేలు రాజుగా అభిషేకించిన తరువాత దావీదు యిస్రాయేలు ప్రజలకు ఎన్నో రకాలైన విజయాలు చేకూర్చారు, ప్రజల్లో సంతోషం నింపారు, వారిని రక్షించారు. 

సౌలురాజు కన్నా చక్కగా పాలన చేస్తూ ప్రజల యొక్క ఆధరాభిమానాలు పొందుతున్న దావీదు పట్ల సౌలుకు అసూయ కలిగింది, దానితో ఏ విధంగానైనా దావీదును చంపాలనుకున్నారు. తన యొక్క రాజ్యాధికారం పోతుందని సౌలు రాజు భయ పడ్డాడు. తన యొక్క కుమారులకు సింహాసనం దొరకదని ద్వేషంతో ఉన్నాడు. 

అసూయ ద్వేషం వల్ల ఎలాగైనా సరే సౌలు దావీదును హత్తమార్చాలని ఆ పనిలో మూడు వేల మందిని వెంటబెట్టుకొని దావీదు ఉన్న సీపు ఎడారి ప్రాంతమునకు సౌలు ప్రయాణమై పోయాడు. సౌలు దావీదును చంపాలనుకొని వెళితే దేవుడే సౌలును దావిదునకు అప్పజెప్పాడు. ఎందుకంటే దావీదు దేవునికి విధేయించినవాడు. దేవుని చిత్తాను-సారంగా నడుచుకున్న వ్యక్తి. ఒక విధంగా ఆలోచిస్తే  దేవుడు దావీదు పక్షమున నిలబడిన వారే. ఎందుకంటే దావీదు సౌలు శిబిరంలోకి ప్రవేశించే సమయానికి అందరు నిద్రమత్తులో ఉన్నారు. దేవుడే వారిని నిద్రించేలా చేసి ఉండవచ్చు. కనీసం ఒక్కరు కూడా మెళకువగా ఉండలేదు. 

సౌలుకు  దావీదు ఉన్న స్థలం తెలుసు కాని దావీదును చంపడానికి సౌలు వస్తున్నాడని బహుశా దావిదునకు దేవుడే ఎరుక పరచి ఉండవచ్చు. దావిదునకు వచ్చిన అవకాశమును ఆయన వినియోగించుకొనలేదు. తనను చంపాలనుకున్న సౌలును దావీదు రాజు  చంపలేదు. ఎందుకంటే దావీదు రాజు సౌలు దేవుని అభిషిక్తుడు అని గ్రహించాడు. 1 సమూ 24:10,కీర్తన 105:15.  

స్వయంగా దేవుడే అతన్ని రాజుగా అభిషేకించారని గుర్తించాడు. దేవుని యొక్క ప్రతి రూపం సౌలులో ఉందని తెలుసుకున్నారు. దేవుడే ప్రేమతో ఆయన్ను ఎన్నుకొన్నాడని గ్రహించాడు. దావీదు రాజు మాత్రము ఎప్పుడు కూడా సౌలును గౌరవించి జీవించిన వ్యక్తియే. అయిన కానీ సౌలు, దావీదు చేసిన అన్నీ మేలులు మరచిపోయారు. 

దేవుని అభిషిక్తుని తాకకూడదని, ఆయనకు హాని చేయకూడదని దావీదు భావించాడు, వెనుకకు తిరిగి వచ్చాడు. సౌలు పాపి అయినప్పటికిని అసూయ ద్వేషం, పగ కలిగి ఉన్నప్పటికీ బలహీనత ఉన్నప్పటికీ దావీదు ఆయనకు ఎటువంటి ముప్పు కలుగ చేయలేదు. ఆయన్ను తాక లేదు. 

మన యొక్క జీవితాలలో ఈ విషయం మరచిపోతాం. అభిషేకించబడిన వారికి వ్యతిరేఖంగా చాలా సంధర్భాలలో ఉంటాం. వారి యొక్క పేరు చెడగొడతారు, వారికి హాని కలుగ చేస్తారు. దావీదు సౌలును దేవుడు  అభిషేకించిన విధానం గ్రహించి ఆ అభిషేకంలో ఉన్న పవిత్రత తెలుసుకున్నారు, కాబట్టియే సౌలుకు ఎటువంటి కీడు తల పెట్టలేదు. మనం కూడా ఇది నేర్చుకోవాలి. సౌలుకు దేవుడు ప్రసాదించిన రాజ్యాధికారాన్ని దావీదు ఎప్పుడు గౌరవిస్తూనే జీవించారు. దావీదు సౌలును గౌరవించాడు, తన రాజుగా అంగీకరించాడు,తన యొక్క ప్రభువుగా తనను ప్రేమించి సేవలందించాడు. 

సౌలుకు ఎంత ద్వేషం ఉందో దావీదుకు సౌలు పట్ల అంత గౌరవం, ప్రేమ ఉన్నాయి. దావీదు శత్రువుల యెడల చూపిన ప్రేమ సౌలు జీవితం నే మార్చినది. శత్రువులను ప్రేమించుటయే దేవుని యొక్క మనస్సు, దావీదు దేవుని మనస్సు కలిగి జీవించాడు. దావీదు సౌలు వలె పవిత్ర గ్రంధంలో ఇంకొక ఉదాహరణ చూస్తాం. హమాను - మోర్ధకై .

ఇతరులకు కీడు తల పెట్టాలని భావించి తామే ప్రమాదంలో  పడిన వ్యక్తులు, మనం చాలా మందిని చూస్తాం. వారిలో సౌలు వలె హమాను కూడా వస్తారు. హమాను  యొక్క మనస్తత్వం ఏమిటంటే అందరు నా క్రింద అణగి ఉండాలని, తనకు తలవంచి  మిగతవారు జీవించాలి అనే అహం తో జీవించేవాడు. మోర్ధకై మాత్రం దేవుడినే ఆరాధించే వ్యక్తి, దేవునికి మాత్రమే తల వంచి , విధేయించి  జీవించే విశ్వాస పాత్రుడు. 

మోర్ధకై తనకు తల వంచ లేదని హమాను మోర్ధకై జాతిని నాశనం చేయాలనుకున్నాడు.  చివరకి తాను చేయించిన ఉరి కంబానికి తానే వ్రేలాడాడు. తాను ఏ అపాయం అయితే ఇతరులకు తల పెట్టాలనుకున్నాడో దానిలో అతనే పడిపోయాడు. తాను తీసిన గోతిలో తానే పడిపోయాడు. మనం కూడా సాధ్యమైనంత వరకు హాని చేయకుండా మేలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. 

దావీదు రాజు తనకు అపకారం చేయదలచిన సౌలుకు ఉపకారం చేశాడు. అపకారం చేసిన వారికి అపకారం చేయక ఉపకారం చేయాలి అని స్వయంగా పౌలు గారు తెలుపుచున్నారు. రోమి 12:17-20. అపకారం చేసిన వారికి ఉపకారం చేయటయే దైవ లక్షణం కాబట్టి మనం కూడా అలాంటి దైవ లక్షణం కలిగి జీవించాలి. 

రెండవ పఠనంలో  పౌలు గారు మొదటి ఆదాము , చివరి ఆదాము మధ్య గల  తేడాను వివరిస్తున్నారు. మొదటి ఆదాము ఈ లోకంలో సృష్టించబడిన వ్యక్తి , ఆయన ఈ లోకానికి చెందిన వ్యక్తి అని పౌలు గారు వివరిస్తున్నారు. 

కొరింతు సంఘంలో ఉన్న విశ్వాసులకు, శరీరం యొక్క ఉత్తనమునకు సంభందించిన కొన్ని సందేహాలు ఉన్నాయి. యేసు క్రీస్తు వలె తాము  కూడా శరీరంతో పునరుత్థానము చెందుతామా?లేదా? అన్నది వారి యొక్క ప్రశ్న. 

దానిలో భాగంగానే పౌలు గారు చక్కటి వ్యత్యసాలను ప్రజలకు వివరిస్తున్నారు. మొదటి ఆదాము భౌతిక జీవి, చివరి ఆదాము ఆత్మ సంబంది. ఆయన పరలోకం నుండి వచ్చిన వారు. వీరిద్దరి మధ్య తేడా ఉంది. ఒకరు భూలోక సంబంధులు , రెండవ వ్యక్తి పరలోక సంబంధులు. భువి నుండి పుట్టిన వానిని  పోలిన మనము దివి నుండి వచ్చిన వాని పోలీకను పొందగలము. మన జీవితాలు పరలోకం నుండి వచ్చిన దేవుని పోలికను పొందగలవు, మన జీవితాలు మార్చుకున్నప్పుడు.  

మన శరీరాలు కూడా పునరుత్థానం అవుతాయి, అందుకే క్రీస్తు ప్రభువు మానవ శరీరమున జన్మించి, శ్రమలు అనుభవించి, మరణించి, పునరుత్థానం అయ్యారు. మనం కూడా చివరి ఆదాము అయిన క్రీస్తు ప్రభువును పోలి జీవించాలి. అలా పోలిక కలిగి జీవిస్తామని దేవుడే స్వయంగా పౌలు గారు ద్వారా పలుకుచున్నారు. 

ప్రతి మనిషి కూడా ఆదాము యొక్క మానవ స్వభావంతో, పాపంలో భాగస్తులై జీవించిన విధంగా క్రీస్తు నందు జ్ఞాన స్నానం పొందిన తరువాత ఆయన యొక్క ఆధ్యాత్మిక స్వభావం కలిగి జీవిస్తాం. కాబట్టి మనం కూడా పునరుత్థానం చెందగలం. 

మనం జ్ఞాన స్నానం పొందడం ద్వారా క్రీస్తు నందు  ఉన్నాము. క్రీస్తు సంబంధులం అయ్యాము . కాబట్టి మనకు పునరుత్థానం నిరీక్షణ ఉంది. 

సువిశేష పఠనంలో యేసు ప్రభువు మానవ జీవితంలో కొన్ని కష్ట తరమైన పనులు చేయమంటున్నారు. మానవ ఆలోచనలతో జీవిస్తే అవి కష్టం కానీ దైవ మనస్సు కలిగి జీవిస్తే ఇది సాధ్య పడుతుంది. 

సువార్తలో యేసు ప్రభువు చెప్పిన మాటలు అందరిని ఆశ్చర్యచకితులను చేశాయి. ఇప్పటి వరకు విన్న మాట ఏమిటంటే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నది కానీ ఇప్పుడు ప్రభువు శత్రువులను ప్రేమించమని పలుకు చున్నారు. ఈ మాటలు ఏ వ్యక్తియు చెప్పలేదు. ఇంత వరకు మొట్ట మొదటి సారిగా యేసు ప్రభువు చెపుతున్నారు. 

పూర్వ వేదంలో పొరుగు వాడు అంటే కేవలం ఒక యూదుడుకి ఇంకొక యూదుడు పొరుడు వాడు. ఒక యూదునకు అన్యుడు పొరుగువాడు కాదు శత్రువే. 

యేసు క్రీస్తు ప్రభువు పొరుగు వారు అనే పదంకు  క్రొత్త అర్దం ఇస్తున్నారు. మానవులంతా మన పొరుగువారే. మిత్రులు మాత్రమే కాదు శత్రువులు కూడా మన యొక్క పొరుగువారే అని తెలుపుచున్నారు. ఇక్కడ మనం ఒక  విషయం గమనించాలి యేసు క్రీస్తు ప్రభువు 

-శత్రువులను ప్రేమించమంటున్నారు

-శపించే వారిని ఆశీర్వదించమంటున్నారు 

-ద్వేషించే వారికి మేలు చేయండి అని అంటున్నారు. 

-బాధించే వారికోసం ప్రార్ధించమంటున్నారు 

- ఒక చెంప మీద కొట్టిన వానికి ఇంకొక చెంప చూపించండి 

-పై బట్టను ఎత్తుకొని పోయేవానికి అంగీని కూడా ఇవ్వమన్నారు. 

- అడిగిన ప్రతి వానికి ఇవ్వమంటున్నారు 

ఇవ్వన్నీ  కూడా మానవులుగా సాధ్యమయ్యేనా 

-మనల్ని  తిరస్కరించిన వారిని ఎలా అంగీకరిస్తాము?

-మనకు కీడు చేసె వారికి ఎలా మేలు చేస్తాం? 

- మన నాశనం కోరుకున్నవారిని ఎలా ప్రేమిస్తాం?

-శత్రువుల కోసం ఎలా ప్రార్ధిస్తాం 

-మనకు హాని చేసే వారితో ఎలా స్నేహం చేయగలం 

ఇవ్వన్నీ కూడా మానవులుగా కష్టతరమైన పనులే. అయినప్పటికీ ఒక క్రైస్తవునిగా మన యొక్క జీవితం భిన్నంగా ఉండాలి. 

మానవ స్వభావం ధరించి జీవించే మనకు ఇది అసాధ్యం కాని దేవుని దేవుని స్వభావం ధరించి జీవిస్తే సాధ్యమే. మనకు సన్నిహితులైన బంధు మిత్రులను ప్రేమించినట్లు మన శత్రువులను ప్రేమించలేం. అది అసాధ్యం కాని దేవునిలో ఏకమై జీవించినప్పుడు ఇది సాధ్యం. 

-ప్రభువు అంటున్నారు, నేను లేక మీరు ఫలింపజాలరు -యోహను 15:5. ఒక చెంప మీద కొట్టినప్పుడు రెండవ చెంపను కూడా చూపించట నిజంగా గొప్పతనమే. మన జీవితంలో ఇది చక్కగా పాటిస్తే ఎదుటి వారు మారు మనస్సు పొందుతారు. 

మాటకు మాట, దెబ్బకు దెబ్బ సూత్రం పాటిస్తే ఈ లోకంలో మిగిలేది అశాంతియే, గొడవలు మాత్రమే మిగులుతాయి. అందుకే మన జీవితాలు మార్చుకొని దేవుడు చూపిన బాటలో నడవాలి. మన జీవితంలో నిస్వార్ధమైన ప్రేమను మనం పంచాలి. నిస్వార్ధమైన ప్రేమ అంటే ఎవ్వరిని కూడా వేరు చేయకుండా అందరిని ప్రేమించాలి. నిస్వార్ధ ప్రేమను మనం వ్యక్త పరిస్తే, అది  నిజంగా మనం దేవుని బిడ్డలమని నిరూపిస్తుంది. 

దేవుడు ఎలాగైతే శత్రువుల మీద కూడా వర్షాన్ని ,ఎండను కురుపిస్తూ ప్రేమను పంచుతూ ఉన్నారో అలాగే మనం కూడా దుష్టులకు మేలు చేయాలి. దేవుడు మనలను ప్రేమించిన విధంగా మనం కూడా ఇతరులను ప్రేమించాలి. మనం పాపం చేసి ఆయనకు శత్రువులైనప్పటికి ఆయన మనలను ప్రేమించారు. 

యేసు క్రీస్తు ప్రభువు  తన శత్రువులను ద్వేషింపక ప్రేమించారు,  క్షమించారు. అలాగే వారి కోసం ప్రార్ధించారు. ఆయన యొక్క గొప్ప ప్రేమతో వారి జీవితమునే మార్చారు. శత్రువులను ప్రేమించుట కష్టమైన పని, అసాధ్యం అనిపిస్తుంది. అయితే ప్రభువు వారికి తన జీవితం ద్వార సుమాతృకను ఇస్తున్నారు. 

సువిశేషంలో చెప్పబడిన విషయాలు అన్నీ మానవ స్వభావంతో ఆలోచిస్తే కష్టమే కాని దేవుని వలె జీవిస్తే తప్పని సరిగా సాధ్యం అవుతుంది. 

-యేసు క్రీస్తు ప్రభువు శత్రువులను  ప్రేమించారు. 

-ద్వేషించే వారికి మేలు చేశారు 

-బాధించిన వారి కోసం ప్రార్ధించారు 

-శపించిన వారి బిడ్డలను దీవించారు. 

మానవ జీవితంలో క్రైస్తవ జీవితం, క్రీస్తు అనుచరుడిగా ఉండే వారు భిన్నంగా ఉండాలంటే ఇవ్వన్ని పాటించాలి.  మనందరం ఈ లోకం ఆశలు , ఆలోచనలు మించి దైవరాజ్య స్థాపన  కోసం, దేవునిలో ఐక్యమై జీవించుటకు కృషి చేస్తే ఇది సాధ్య పడుతుంది. 

మనం జీవితంలో దేవునితో  అంటుకట్టబడితే  మనం మారిపోతాం, దేవుని వలె ప్రేమిస్తాం. అసాధ్యమైనవి సుసాధ్యమవుతాయి. మనం జీవితం ప్రత్యేకంగా ఉండాలంటే  ద్వేషాలు, పగలు అసూయలు విడిచిపెట్టి ప్రేమను అలవరుచుకోవాలి. ప్రేమతో జీవిస్తే కష్టమైన పనులు అన్నీ సక్రమంగా చేయవచ్చు. 

నేటి పఠనాల ద్వారా దేవుడు మనందరిని ఒక క్రొత్త జీవితమునకు ఆహ్వానిస్తున్నారు. దైవ స్వభావం కలిగి, క్రీస్తులో ఐక్యమై క్రీస్తుకు సాక్షులుగా జీవించుదాం . 

Rev. Fr. Bala Yesu OCD  

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

7 వ సామాన్య ఆదివారం

7 వ సామాన్య ఆదివారం


1 సామువేలు 26:2,7-9, 12-13,22-23,   1 కోరింథీ 15:45-49, లూకా 6:27-38 

నేను మీతో చెప్పుచున్నది ఏమన్నా: మీ శత్రువులను  ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించించిన వారికీ మేలు చేయుడు లూకా: 6 : 27 

* క్రీస్తు నాదునియందు ప్రియ దేవుని బిడ్డలారా మరియు క్రైస్తవ విశ్వాసులారా. ఈ నాడు తల్లి శ్రీసభ  సామాన్యకాలపు ఏడవ  ఆదివారంలోనికి ప్రవేశిస్తుంది. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు శత్రువులను ప్రేమించుట మరియు  క్షమించుట అను అంశం  గురించి తెలియజేస్తున్నాయి. 

* క్రైస్తవ సంఘం  అంటేనే ప్రేమ, ప్రేమ లేనిదే క్రైస్తవ సంఘం  లేదు. ఈ ప్రేమ అనేది మన సొంతవాళ్లకి, దగ్గర వాళ్ళకి మాత్రమే కాదు, ఈ ప్రేమ అనేది విశ్వవ్యాప్తంగా ఉండాలని తల్లి శ్రీసభ మనందరిని కూడా ఆహ్వానిస్తోంది.

* లూకా 6 :36 లో అంటున్నారు మీ తండ్రి వలెనే మీరు కనికరం గలవారై యుండుడి అని, ఎందుకంటే మనలను ద్వేషించే వారికీ మేలు చేయాలి, మనలను శపించువారిని ఆశీర్వదించాలి, బాధించువారికై  ప్రార్ధించాలి.  ఇతరుల నుండి మనం ఏమి కోరుకుంటామో అదే మనము ఇతరులకు చేయాలి అప్పుడే  దేవుడు చెప్పినటువంటి ప్రేమ నెరవేరుతుంది. 

* ఆలా కాకుండా మనలను ప్రేమించిన వారినే ప్రేమిస్తే, తిరిగి ఇవ్వగలిగినవారికే సహాయం చేయగలిగితే అందులో ఎటువంటి ప్రత్యేకత లేదు అని ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. 
* ఈనాటి మొదటి పఠనంలో  దావీదును చంపాలనుకున్న సౌలును సహితం దావీదు  క్షమించి సౌలును వదలివేయటం మనం చూస్తున్నాము.

* అదే విధంగా క్రీస్తు యొక్క జీవితం ద్వారా సువిశేష  పఠనంలో క్రీస్తు ప్రభు  అంటున్నారు నియొక్క శత్రువును ప్రేమింపుము అని చెబుతున్నారు, ఎందుకంటే క్రీస్తు ప్రభువును ఎంతగానో ద్వేషించి, క్రూర హింసలు పెట్టి, కొట్టి, తిట్టి, బళ్ళేముతో తన ప్రక్కన   పొడిచిన కూడా క్రీస్తు ప్రభువు వారికీ తిరిగి  హాని చేయలేదు , వారిని ప్రేమతో క్షమించి తండ్రి దేవునికి వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. తాను జీవించి ఉన్నంత కాలం ప్రేమతోనే జీవించాడు, ప్రేమలో జీవించాడు, ప్రేమిస్తూనే జీవించాడు, అదే ప్రేమను మరణము మరియు పునరుత్తనం  వరకు తీసుకోని వెళ్ళాడు, అదే ప్రేమను ఇప్పుడు పొందుతున్నాడు.

మనము మొదటిపఠనములో చూసినట్లైతే శత్రువును ఎలా ప్రేమించాలి, క్షమించాలి అనే అంశం గురించి తెలియజేస్తుంది. దావీదును చెంపలనుకున్న సౌలు రాజునూదావీదు ఏ విధంగా క్షమించాడో, చంపకుండా వదలివేసాడో మనము మొదటిపఠనములో ఆలకిస్తున్నాము.

1 ) సౌలు ఎవరు 
* బెన్యామీను గోత్రమునకు చెందిన వాడు 
* ఇశ్రాయేలీయుల మొదటి రాజు 
* సమూవేలు సౌలును ఆభిషెకించి ఇశ్రాయేలీయులకు రాజుగా చేసెను 
* 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పరిపాలించాడు 
*దేవుని యొక్క ఆజ్ఞను దిక్కరించాడు.

దావీదు ఎవరు  
* యూదా గోత్రమునకు చెందిన వాడు 
*ఇశ్రాయేలీయుల రెండొవ రాజు 
*సమూవేలు  ఆభిషెకించిన కూడా దావీదు మాత్రం దేవుడు ఇచ్చేటి వంటి సమయం కోసం వేచిచూసాడు 
*40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పరిపాలించాడు 
*దేవునికి అను గుణంగా జీవించాడు 
*యోనాతానును మంచి స్నేహితుడు.

ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు, వారియొక్క జీవితంలో అసలు సౌలు దావీదును ఎందుకు చంపాలని అనుకున్నాడు అంటే దావీదుపైన అసూయతో-చంపాలనుకున్నాడు. అందుకు తాను 
ప్రయత్నించాడు. అది తెలుసుకున్న దావీదు సౌలుకు దొరకకుండా అరణ్యములో దాగుకున్నాడు. అది తెలుసుకొన్న సౌలు దావీదును చంపుటకు మూడువేలమంది యోధులను వెంటపెట్టుకొని చంపుటకు బయలుదేరాడు. అలా దావీదును వెదకి దొరకక అలసిపోయినటువంటి సౌలు సైనికులతో కలసి విశ్రాంతి తీసుకుంటూ నిద్రించినప్పుడు సౌలుని చూసి చంపడానికి వచ్చినపుడు, దావీదుమాత్రం సౌలును చంపుటకు నిరాకరించాడు. ఎందుకంటే సౌలురాజు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి.  దావీదు సౌలు రాజు యొక్క ఈటెను, మంచినీటి కుండను ఆయనతోపాటు తీసుకుని పోయాడు.కాబట్టి ఈయొక్క మొదటి పఠనంలో క్షమాగుణం అనే అంశం గురించి తెలియజేస్తుంది. 
 
సువార్తా పఠనము :లూకా :
నేటి సువార్తాపఠనమును చూసినట్లయితే, ఈ సువార్తను క్రీస్తు ప్రభువు రెండు విధాలుగా విభజించాడు:

మొదటిది:
మనలను ద్వేషించినవారికి మేలుచేయాలి.(  వచనము).
మిమ్ము శపించినవారిని ఆశీర్వదింపుడు(  వచనము).
మిమ్ము భాదింపువారికై ప్రార్ధింపుడు(  వ వచనము)

రెండవది: 
నీపైబట్టలను ఎత్తుకొని పోవువాడికి నీ అంగీనికూడా తీసుకొనిపోనిమ్ము 
నిన్ను ఒకచెంపపై కొట్టిన వానికి నీ రెండవ చేంపను కూడా చూపుము.
నిన్ను అడిగిన ప్రతివారికి ఇమ్ము, నీసొత్తును ఎత్తుకొని పోవువాడిని మరలా అడగవద్దు.

 ఈ రెండిటిలో మనము ముఖ్యముగా క్షమించేగుణాన్ని తెలుసుకుందాం.  శత్రువులను ఎలా ప్రేమించాలో యేసు ప్రభువు మనకు చూపించియున్నారు.

 దేవుడు తన వ్యక్తిగత జీవితముద్వారా  తన  ప్రేమను మనలో పెంచి  మనలను తన బిడ్డలుగా చేసుకున్నట్టుగానే క్రైస్తవులైన మనమందరము కూడా ఇతరులతో అలా మెలగడమే దేవుడు ఆశించే క్రైస్తవ నీతి  లేదా జీవితము.
సువార్తాపఠనంలో ప్రేమించండి, మంచిచేయండి, ఇవ్వండి అనే అంశాలను గురించి తెలియజేస్తుంది. కాబట్టి దేవునియొక్క బిడ్డలమైనటువంటి మనము అంటే క్రైస్తవులము, దేవుడు ఇచ్చినటువంటి  ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలని యేసుప్రభువు సువిశేషములో స్పష్టం చేసాడు.

  క్రైస్తవ జీవితం అనేది సోదర ప్రేమ, క్షమా గుణము .  మనము ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తామో అప్పుడే మనలను కూడా అదేవిధముగా ప్రేమిస్తారు అని దేవుడు ఈనాడు తెలియజేస్తున్నాడు.
 చివరిగా మనము దేవునియొక్క శిష్యులుగా పిలువబడాలి అంటే, అందరినీకూడా (శత్రువులను) సమానముగా ప్రేమించగలగాలి. క్రీస్తు ప్రభువు ఏవిధముగానయితే సిలువపై వ్రేలాడుతూ కూడా తన ప్రేమను వ్యక్తపరిచారు, అందరికోసం ప్రార్ధన చేశారు. అదేవిధముగా మనం కూడా చేయాలి. శత్రువులను ప్రేమించడము అంటే, వారిని మనస్ఫూర్తిగా క్షమించడం. వారికి మంచిజరగాలని కోరుకోవడం.వారికి మనము చేయగలిగిన మంచిచేయడం, వారిని దేవుడు దీవించాలని ప్రార్ధన చేయడం. అలా అందరినీ ప్రేమించినందులకు దేవుడు మనకు ఒసగే గొప్ప బహుమానము మనం పొందుతాము. 

Br. Johannes 

12, ఫిబ్రవరి 2022, శనివారం

6 వ సామాన్య ఆదివారం(2)

 6 వ సామాన్య ఆదివారం

యిర్మియా 17:5-8 1 కోరింథీ 15:12, 16-20, లూకా 6:17,20-26

నేటి దివ్య పఠనాలు దేవుని  నమ్ముకుని జీవించే వారిలో, దేవుడు వారిని దీవించే  విధానం గురించి, అదే విధంగా దేవుని మీద ఆధారపడి,  దేవునికొరకు జీవించే వారు ఎల్లప్పుడు కూడా ధన్యులె  అనే అంశములను గురించి  దివ్య పఠనాలు సెలవిస్తున్నాయి. 

మానవ జీవితంలో నిజమైన ఆనందం దేవుని మీద ఆధారపడి  జీవించే వారికి కలుగుతుంది. వారి జీవితంలో ఒక వేళ సమస్యలు, కష్టములు ఉన్నా కాని దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి దేవుడు తప్పని సరిగా వారి జీవితంలో ఆనందంను ఎల్లప్పుడు ఉంచుతారు. దేవునిలోనే నిజమైన ఆనందం, ఆశీర్వాదం దాగి ఉంది. 

ఈనాటి మొదటి పఠనంలో  దేవుని యొక్క విజ్ఞాన వాక్కులను యిర్మియా ప్రవక్త ప్రకటిస్తున్నారు. దేవుడు రెండు రకాలైన ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు పలుకుచున్నారు. 

1. మానవుల మీద ఆధారపడి జీవించేవారు 

2. దేవుని మీద ఆధారపడి జీవించేవారు

ప్రభువే స్వయంగా అంటున్నారు, నరున్నీ నమ్మే వాడు శాపగ్రస్తుడు అని. మనం నరుని శక్తిని నమ్ముకొని జీవిస్తే దేవుడిని విస్మరించినట్లే, ఎందుకంటే దేవుని శక్తి మీద నమ్మకం లేదు కాబట్టియే నరున్నీ నమ్ముకుంటున్నారు. ఇది  ఆనాడు యిస్రాయేలు ప్రజల్లో చూశాం, నేడు మనందరి జీవితాలలో కూడా చూస్తున్నాం. యిస్రాయేలు ప్రజలు నిజమైన రాజును (యావే)విస్మరించి వేరొక రాజు కోసం అడిగారు, దాని ప్రతిఫలంగా వారికి నష్టమే జరిగింది. 

అదే విధంగా యిస్రాయేలు ప్రజలు చాలా సందర్భాలలో తమ యొక్క రక్షణ కోసం అస్సిరియుల మీద సిరియా సైన్యం మీద ఆధారపడి జీవించేవారు. కొన్నిసార్లు ఐగుప్తు వాసుల మీద ఆధారపడేవారు. 

వీటన్నిటిలో యిస్రాయేలు ప్రజల దేవుని బలమును కాక మానవ బలముల మీద ఆధారపడి జీవించారు, అందుకే వారి జీవితంలో అన్ని సమస్యలు. వారి జీవితంలో కష్టలు ఎదురైనప్పుడు దేవుని వైపు మరలి  రాక మానవ శక్తి వైపు మొగ్గు చూపారు. దేవుని యొక్క ఒప్పందంను మరచి పోయారు.  మానవ  మాత్రుల సైనిక బలమును నమ్ముకున్నారు. 

యిర్మియా ప్రవక్త రెండు విషయములను అందరిముందు ఉంచుతున్నారు. 1. ఆశీర్వాదమా? 2. శాపమా?

మానవ జీవితంలో నరుల్ని నమ్మటం పాపము కాదు కాని నరుల్ని మాత్రమే నమ్మి వారి మీద ఆధారపడి జీవించుట పాపమే. మనందరం దేవున్ని నమ్ముకొని, దేవుని మీదనే ఆధారపడి  జీవిస్తున్నామని భావిస్తాం. కాని మనం దేవుని కన్నా మానవుల మీదనే ఎక్కువగా  ఆధారపడి జీవిస్తాం. 

బాబిలోనియా రాజు యెరుషలేము మీదకు యుద్దం చేయడానికి వస్తున్నాడని తెలుసుకున్న యూదా రాజు, మతాధికారులు యావే దేవున్ని ఆశ్రయించకుండా, నమ్మకుండా ఐగుప్తు రాజు సహాయం కోరారు. ఈ విషయం దేవుడిని చాలా బాధించింది. 

అన్నీ ఇచ్చిన దెవుడ్ని మరచి వేరె వారివైపు  సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. శూన్యం నుండి సృష్టిని చేసిన దేవుని శక్తిని మరచారు. దేవుడు యిస్రాయేలును ఫరో నుండి బయటకు తీసుకొచ్చిన విధానం మరిచారు.

ఎర్ర సముద్రం గుండా రక్షించిన  విధానం మరిచారు. 

ఎడారిలో ఒసగిన సమృద్ది ఆహారంను, అధ్బుతములను మరిచారు. 

దేవుడు వారికి ఇచ్చిన యుద్ద విజయములను  సంరక్షణను మరిచిపోయారు. 

ఇవన్నీ మరచిపోయి మానవుల సహాయం కోరారు. పవిత్ర గ్రంధంలో దేవుని శక్తి మీద ఆధారపడి  దీవెనలు పొందిన వారిని చాల మందిని చూస్తున్నాం. 

దావీదు రాజు దేవుని మీదనే ఆధారపడ్డారు, ఆశ్రయించారు కాబట్టి అనేక విజయాలు సాధించారు. ఎస్తేరు తన ప్రజలను రక్షించుటకు దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి తన ద్వారా ఆ ప్రజలను రక్షించారు. యెబు తన యొక్క విశ్వాస  జీవితంలో దేవుని మీదనే ఆధారపడ్డారు అందుకే శ్రమలు తరువాత ఆశీర్వాదాలు సమృద్దిగా పొందుకున్నారు. -యొబు 42:12. 

యిర్మియా ప్రవక్త తెలియ చేసే  విషయం ఏమిటంటే దేవుని మీద ఆధారపడి జీవించుట ద్వారా శాశ్వత ఆనందం దొరుకుతుంది. వారి జీవితంలో అంతయు సమృద్ది దొరుకును అని ప్రవక్త పలుకుచున్నారు. దేవుని మీద ఆధారపడితే దీవెనలు వస్తాయి. అన్నా ఆధారపడినది దీవెనలు పొందింది. శతాధిపతి ఆధారపడ్డారు, యాయిరు ఆధారపడ్డారు, కననీయ స్త్రీ ఆధారపడ్డారు. తన యొక్క దివ్య శక్తి మీద ఆధారపడిన వారందరినీ ప్రభువు దీవించారు. ఆ దీవెనలు ఎలా ఉంటాయి అంటే జీవితం మొత్తం కూడా ఎటువంటి కొదవలేని విధంగా ఉంటాయి. 

వారి జీవితం ఏటి ఒడ్డున నాటబడిన చెట్టువలే వుంటుంది. అక్కడ చెట్టుకు కావలసిన నీరు, సమృద్దిగా దొరుకుతుంది. ఆకులు పచ్చగా ఉంటాయి, కాయలు కాస్తాయి అని అంటే ఎప్పుడు కూడా వారు సు:ఖ సంతోషాలతో  ఉంటారని దీని అర్ధం. మన జీవితంలో కూడా దేవుని మీదనే ఆధారపడి జీవిస్తే ఆయన యొక్క ఆశీర్వాదాలు ఎక్కువగానే  ఉంటాయి. కీర్తన గ్రంధంలో 1 వ అధ్యాయంలో కూడా దేవుని మీద ఆధారపడిన వారిని గురించి చెప్పబడింది. వారికి సకాలంలో అంతయు ఇవ్వబడును. 

రెండవ పఠనంలో పునీత పౌలు గారు మరియొక సారి  యేసు ప్రభువు యొక్క పునరుత్థానం గురించి భోదిస్తున్నారు. పౌలుగారు యేసు ప్రభువు యొక్క శరీరం యొక్క పునరుత్థానం యాదార్ధమని ప్రకటిస్తున్నారు,అదియే వారి యొక్క విశ్వాసం అని కూడా ప్రకటిస్తున్నారు. కోరింతులోని కొందరు వ్యక్తులు శరీరం యొక్క పునరుత్థానం లేదని బలంగా నమ్మేవారు అలాంటి అపనమ్మకం ఉన్న వ్యక్తులకు పౌలుగారు చెప్పే విషయం ఏమిటి అంటే యేసు ప్రభువు పునరుత్థానం అవ్వక-పోతే మా విశ్వాసం , మా సాక్ష్యం వ్యర్ధమని ప్రకటిస్తున్నారు. 

యేసు ప్రభువు పునరుత్థానం అయి కొందరికి ప్రత్యక్షమయ్యారు 1 కోరింథీ 15:4-7. దేవుడే ప్రత్యేక్షంగా దర్శనం ఇచ్చారు అది  చూసిన వ్యక్తులు ఇంకా జీవిస్తూనే ఉన్నారు అని చెప్పిన గాని ఇంకా కోరింతులోని వ్యక్తులు నమ్ముటలేదు. 

కొన్ని సార్లు  కొంత మందికి  ఎంత చెప్పినా సరే వినరు . యేసు ప్రభువు పునరుత్థానం అయిన తరువాత శిష్యులకు దర్శనం ఇచ్చినప్పుడు తోమస్సు గారు అఆ సమయంలో వారితో లేరు అప్పుడు శిష్యులు ప్రభువు వారికి దర్శనం  ఇచ్చారు అని ఎన్ని సార్లు చెప్పిన వినలేదు నమ్మలేదు. కోరింతు వారికి కూడా ఇది జరుగుతుంది. సజీవులు సాక్ష్యం ఇచ్చిన కానీ వారిలో ఇంకా అవిశ్వాసం దాగి ఉంది. పౌలు గారు ప్రభువు పునరుత్థానం చెందకపోతే, మన విశ్వాసం వ్యర్ధమని, అపోస్తుల భోదన వ్యర్ధమని , పునీతుల సాక్ష్యం వ్యర్ధమని పలుకుచున్నారు. 

సువిశేషంలో యేసు ప్రభువు ధన్యత గురించి, అనర్ధముల గురించి, సంతోషం గురించి విచారము గురించి తెలియచేస్తున్నారు. అలాగే దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని తెలుపుచున్నారు. వాస్తవానికి ప్రభువు ప్రాపంచిక జీవితమును తిరస్కరిస్తున్నారు.దానితో పాటు భౌతిక వాదంను తిరస్కరిస్తున్నారు. 

యేసు ప్రభువు మైదానం వద్ద పలికిన  ఈ విలువైన  మాటలు  మత్తయి సువార్తలోని అష్ట భాగ్యాలకు సమానంగా ఉన్నాయి. కాని లూకా సువర్తకుడు అన్నీ ఇక్కడ రాయలేదు. రెండు విషయాలను మాత్రమే ఆయన గట్టిగా చెబుతున్నారు. మొదటిగా పేదవారి గురించి రెండవదిగా ధనికుల గురించి. దేవుని కొరకు శ్రమలు అనుభవించేవారు, స్వార్ధంతో జీవిచ్చే వారి గురించి చెబుతున్నారు. పేదలగు మీరు ధన్యులు దేవ రాజ్యం మీది అని ప్రభువు పలుకుచున్నారు. 

పేదవారు అంటే కేవలం ఆర్ధికంగా సంపదలు లేని వారు మాత్రమే కాదు కాని దేవుని యొక్క ఆత్మీయతతో బలహీనంగా ఉన్నవారు, దేవుని అనుభవం లేనివారు , దేవుని యొక్క  ఆత్మ తక్కువగా ఉన్నవారు. 

నిజానికి ఈలోకంలో సమృద్దిగా  అన్నీ ఉన్నాయి అయితే అవి ఎక్కువ శాతం ధనికుల వద్దనే ఉన్నాయి. ప్రభువు వారిని ధనవంతులుగా చేసినది పేదవారిని ఆదుకొనుటకొరకే. 

1. పేదలగు మీరు ధన్యులు అంటే దేవుని ఆత్మలో పేదవారు - ఆధ్యాత్మిక పేదరికం దేవుని మీద ఆధారపడి జీవించే వారు దేవుని ముంగిట తన బలహీనతలను, ఆధ్యాత్మిక అవసరతలను గ్రహించుకొని దేవుని వైపు  మరలి ఆయన మీద ఆధారపడి  జీవించుటయే. 

మానవ జీవితంలో ఏ అనుగ్రహమైన దేవుని దగ్గరనుండియే ఇవ్వబడుతుందని గ్రహించుటయే. poor in spirit అని అర్ధం. దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉండే వారికి ధన్యత కలుగుతుంది. 

2. ఆకలిగొని యున్న వారు ధన్యులు అని పలుకుచున్నారు.  ఇక్కడ ఇది శారీరక ఆకలి మాత్రమే కాదు ఆధ్యాత్మిక ఆకలి. 

దేవుని వాక్కు కోసం ఉన్న ఆధ్యాత్మిక ఆకలి, దేవుని ఆహారం (దివ్య సత్ప్రసాదం ) స్వీకరించాలనే ఆకలి, దేవుని అనుభూతి పొందలనే ఆకలి కలిగిన వ్యక్తులకు వచ్చే ధన్యత గురించి తెలుపుచున్నారు. 

యేసు ప్రభువు ఆకలితో ఉన్న ఎందరో ప్రజల యొక్క ఆకలిని తీర్చారు. అలాగే ఆధ్యాత్మిక ఆహారం కోసం ప్రయత్నించే వారికి కూడా దేవుడు సహాయం చేస్తున్నారు. పేదవారు, ఆకలి దప్పలు కలిగిన వారు ఎప్పుడు కూడా ఆధారపడి జీవిస్తారు, ఎదురు చూస్తారు, ప్రయత్నిస్తారు, కష్టపడతారు కాబట్టియే వారికి కావలసిన ఆహారం దొరుకుతుంది. మన యొక్క  జీవితంలో కూడా దేవుని మీదనే ఆధారపడి జీవిస్తే మన శారీరక , ఆధ్యాత్మిక ఆకలి తీసివేయబడి మనకు అంతా సమృద్దిగా ఇవ్వబడుతుంది. ధన్యులు అంటే దేవుని మీద ఆధారపడి , దేవుని కొరకు జీవిస్తూ తమ జీవితం ద్వారా దేవున్ని సంతృప్తి పరిచేవారు.   

3. శోకించుచున్న మీరు  ధన్యులు - ఆనందింతురు. తమ యొక్క పాపపు జీవితంనకు శోకించే వారు తం పాపాలకు హృదయ పరివర్తనం చెందాలని బాధపడే వారు దేవుని కృప వలన సంతోషం ఇచ్చారు. ఈ లోకం లో లాజరు శోకించారు కానీ దేవుడు అతనికి పరలోకంలో సంతోషం ఇచ్చారు. యొబు శోకించాడు అలాగే దేవుడు ఆశీర్వదించి సంతోషం ఇచ్చారు. ఎవ్వరు నిజంగా శోకీస్తారు అంటే దేవుని యొక్క పవిత్రత ముంగిట తమ యొక్క అయోగ్యత గుర్తించిన వారు. 

యెరుషలేము దేవాలయంలో సుంకరి రొమ్ము బాదుకొని తన పాపాలకు పశ్చాత్తాప పడి ఏడ్చాడు. ఆయన ప్రార్ధన ఆలకించబడింది. అలాగే ఆయనలో సంతోషం నింపబడింది. మనయొక్క పాపాలకు, వ్యసనాలకు శోకించి మన జీవితాలు దేవున వైపు మరల్చుకుంటే ఆనందంగా జీవించగలుగుతాం. 

4. దేవుని కొరకు నిందించబడినప్పుడు ధన్యులు అని పలుకుచున్నారు. క్రీస్తు కొరకు జీవించే వారిలో నిందలు ,హింసలు , అవమానాలు వస్తాయి అని ప్రభువు తెలుపుచున్నారు. దేవునికి సాక్షి పూరితమైన జీవితం జీవించే వారు ఎన్నో శ్రమలు  అనుభవించారు అని పరిశుద్ద గ్రంధం తెలుపుచున్నది. ప్రవక్తలు శ్రమలు అనుభవించారు, శిష్యులు హింసలు అనుభవించారు, సేవకులు , పునీతులు కష్టాలు , నిందలు అవమానాలు అనుభవించారు. శ్రమలు అనుభవించిన కాని వారు దేవుని సేవ చేశారు, దేవుని కొరకు  జీవించారు. 

మనుష్య కుమారుని నిమిత్తము ఎందుకు హింసలు  అనుభవిస్తారంటె 1. ఈ ప్రపంచం ఇంకా దేవుని తెలుసుకొనలేదు 2. శ్రమలు అనుభవించె వారు దేవుని లోకంలో జీవించే వారు ఈ లోకంలో ఉన్నప్పటికీని వారు ఈ లోకానికి చెందిన వారు కారు. 3. హింసలు పొందుతారు ఎందుకంటే దేవుని యొక్క సత్యమైన మాటలు ప్రకటించినప్పుడు అవి ప్రజలకు నచ్చనప్పుడు. 

దేవుని కొరకు హింసలు పొందినప్పుడు వారికి బహుమానం కలుగుతుంది. 1. గౌరవించ బడుతారు. అ . పో  . 5: 41, 2. ఓదార్చబడతారు 2 కోరింథీ 1:5 3. దేవునికి దగ్గరగా ఉంటే దీవెన పొందుతారు (1 పేతు 4:14)4.క్రీస్తుకు గొప్ప సాక్షులు అవుతారు. (2 కోరింథీ1:4-6)

మానవ జీవితంలో మనం దేవుని కొరకు  జీవిస్తే దేవుడు తప్పని సరిగా మన కొరకు జీవిస్తారు. ధనికులను గురించి ప్రభువు హెచ్చరిస్తున్నారు, ధనికులు సుఖాలు అనుభవించి పేదవారిని నిరాకరిస్తున్నారు, స్వార్దంతో జీవిస్తున్నారు. 

1.ధనికులు తమ మీదనే ఆధారపడుతారు. దేవున్ని కాదని ధనమే ముఖ్యమని జీవించే ధనికులందరికి అనర్ధం అని ప్రభువు తెలుపుచున్నారు. ధనం మనిషిని ఈ లోక ఆశలకు కట్టి వేస్తుంది, ధనమే అన్ని అనర్ధాలకు మూలం. 

2.కడుపు నిండిన వారా మీకు అనర్ద, అని పలుకుచున్నారు ప్రభువు అంటే ఇంకా వారికి ఎదియు అవసరం లేదు. నిండిన వారు అంటే ఈ లోక  ఆశల్లో , వ్యామోహంలో, ధనంతో, స్వార్ధంతో , కొరికలతో, నిండినవారు అలాంటి వారికి అనర్ధం వారి జీవితంలో దేవున్ని నింపు కోటానికి స్థలం లేదు. లూకా 15:16. 

3. నవ్వుచున్న వారులారా అనర్దం - నవ్వు చున్న వారి గురించి చెప్పబడింది. అంటే వారి జీవితంలో సరదాలు ఎక్కువగా ఉంటాయి. parties , celebrations ఎక్కువగా ఉండేవారు అలాంటి వారికి  అనర్ధం అని తెలుపుచున్నారు. వారి జీవితంలో పాపాలకు పశ్చాత్తాపం లేదు. అసలు పాపం అనే ఆలోచనే లేదు. దాని వల్ల విందులతో వినోదలతో జీవితాలు గడుపుతున్నారు. అలాంటి వారికి అనర్దం అని పలికారు. 

4. ప్రశంసించబడినప్పుడు అనర్ధం అంటున్నారు. ఎందుకంటే ఎదుటి వారికి నచ్చిన విధంగా, చెప్పిన విధంగా మనం జీవిస్తే తప్పని సరిగా ప్రశంసించబడతాం. కానీ అలాంటి జీవితం కాదు మనం జీవించాలిసింది. ప్రశంసల కోసం అన్యాయంను  న్యాయం చేయకూడదు. దేవుని కొరకు సత్యమైన జీవితం జీవించాలి. దేవుని మాటలే ప్రకటించాలి.  హింసలు వచ్చిన, బాధలు వచ్చిన దేవుని కొరకు జీవిస్తే ఆయనయె వారిని సన్మానిస్తారు. 

కాబట్టి  దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవుని దీవెనలు పొందుదాం. మానవ శక్తి  మీద కాకుండా, ఈ లోక శక్తి మీద కాకుండా దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవునికి సాక్షులై జీవించుదాం. 

Rev. Fr. Bala Yesu OCD 

 

6 వ సామాన్య ఆదివారం ( ఏవరిని నమ్మాలి )

6 వ సామాన్య ఆదివారం 

యిర్మియా 17:5-8 1 కోరింథీ 15:12, 16-20, లూకా 6:17,20-26 

క్రీస్తు నాధుని యందు ప్రియ దేవుని బిడ్డలారా ఈనాడు తల్లి తిరుసభ  6 వ సామాన్య ఆదివారము లోనికి అడుగిడుతుంది. ఈనాటి దివ్య గ్రంధ పఠనాలు  అన్నీ దేవుని యందు విశ్వాసం గురించి భోదిస్తున్నాయి. ఈనాటి  మూడు పఠనాలు  మనము గమనించినట్లయితే మనకు ఒక సందేహము కలుగవచ్చు. అది ఏమిటంటే "ఎవరిని నమ్మాలి" అని ఎందుకంటే ఈనాటి మొదటి పఠనాన్ని గమనించినట్లయితే మొదటి పఠనం యిర్మియా గ్రంధము నుంచి తీసుకొనబడింది. యిర్మియా ఒక గొప్ప ప్రవక్త, దేవుని మాట కోసం తన జీవితాన్ని సైతం లెక్క చేయకుండ దేవుడు ప్రజలను  ఏవిధంగా శిక్షింపనున్నాడో , వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనభోతున్నారో తన జీవితం ద్వారా తెలిపిన  గొప్ప ప్రవక్త, ప్రజలను  దేవుని వైపు నడిపించడానికి తన ప్రాణములను సైతం పణంగా పెట్టిన గొప్ప ప్రవక్త. ఈ యిర్మియా  ప్రవక్త  రాజకీయంగా విఫలమైయాడు కానీ ఆధ్యాత్మికతలో మాత్రం దేవునికి ఏంతో దగ్గరయ్యాడు.  ఈనాటి మొదటి పఠనంలోని మాటలు యిర్మియా ప్రవక్త తానే స్వయంగా ప్రజలను హెచ్చరిస్తూ పలికిన మాటలు. ఎందుకంటే ఈ యూదా ప్రజలను దేవుడు బానిసత్వం  నుండి  తీసుకొని వచ్చి వారికి కావలసిన వన్ని ఇచ్చి వారికి అక్కున నిలిచాడు. 

ఈ యిస్రాయేలు  ప్రజలకు  ఏ ఆపదవచ్చిన వారికి సమీపమున లేదా సహాయముగా ఉండేది ఎవరు అంటే దేవుడు. దేవుడు వారికి అతి సమీప వ్యక్తి  పిలవగానే పలికే వ్యక్తి , వారికి ఏ ఆపద  వాటిల్లినా మొదటిగా తలచేది దేవుడినే చివరకు దేవుడు వారితో ఓడంబడిక కూడా  చేసుకున్నాడు. మీరు నా ప్రజలు , నేను మీ దేవుడను అని . ఈ ప్రజలకు  దేవుడు ఇంత చేసిన  తరువాత కూడా ఆపద వచ్చినప్పుడు దేవున్ని కాదని మానవుల సహాయం కొరకై వెళుతున్నారు. అది కూడా వారి శత్రువుల దగ్గరికి బాబిలోనియా రాజు యిస్రాయేలు ప్రజలను బానిసత్వమునకు తీసుకొని వెళ్ళాడు. ఆ బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించాడు. ఇప్పుడు బాబిలోనియా రాజు వారి మీదకు దండెత్తి వస్తున్నారని తెలిసి యిస్రాయేలు ప్రజలు ప్రాణముల మీద  తీపితో ఈజిప్టు దగ్గరకు సహాయముకై వెళుతున్నారు.  శత్రువులైన ఈజిప్టు రాజు నుండి కాపాడిన దేవుడిని మరచి ఈ ప్రజలు మానవుని సహాయము కొరకై పరుగు తీస్తున్నారు. 

దేవుడిని కాదని మానవుల మీద ఆధారపడిన వారు లేదా మానవులను నమ్మిన వారి గతి ఏ విధంగా ఉండునో దివ్య గ్రంధం చక్కగా వివరిస్తుంది. ఉదాహరణకు ఏసావు , యకొబును నమ్మితే, యాకోబు తన అన్న అయినటువంటి ఏసావును మోసం చేస్తున్నాడు. పాత నిభందనలోని యేసేపు తన అన్నలను నమ్మితే వారు యేసేపు చావుని కోరారు, సంసొను డెలీలా ను నమ్మితే డెలీలా సంసొనును మోసం చేసింది, ఇలా మనం నిజ జీవితంలో ఎన్నో చూస్తున్నాం, కొన్ని సార్లు అనుభవించే వుంటాం. కానీ దేవుడు మాత్రం వారు ప్రార్ధించిన ప్రతిసారీ, అడిగిన ప్రతిసారీ, మొరపెట్టుకున్న ప్రతిసారీ ఆలకించాడు,ఇచ్చాడు. వారి చెంతనే నిలిచాడు. పగలు మేఘ స్తంభం వలె రాత్రి అగ్ని స్తంభం వలె ఉంది కాపాడాడు. ప్రజలు ఎన్నిసార్లు మోసం చేసిన  దేవుడు మాత్రం దయ కలిగే ఉన్నాడు వారి యందు. ఈనాటి పఠనంలో కూడా తన ప్రవక్త అయిన యిర్మియాను పంపి తన ప్రజలను హెచ్చరిస్తున్నాడు. దేవునిపై నమ్మకము ఉంచి విశ్వసించువాడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టువలే ఎప్పుడు పచ్చగా ఉంటాడు, ఎప్పుడు ఫలిస్తూ ఉంటాడు, మానవులను నమ్మి వారిపై ఆధారపడువాడు  మరు భూమిలో ఉండు తుప్పలను పోలి ఉంటాడు అని హెచ్చరిస్తున్నాడు. కానీ యిర్మియా ప్రవక్త మాత్రం దేవుడిని చివరివరకు విడనాడలేదు  అందుకే యిర్మియాను ఒక గొప్ప ప్రవక్త గా భావిస్తుంటారు. 

ఈనాటి లూకా సువార్తలోని వచనాలు మనం మత్తయి సువార్తలో కూడా చూస్తాము. రెండు ఒకే విధంగా  ఉంటాయి. ఈ వచనాలు సరిగా చదివితే అవి విప్లవాత్మకంగా , సమాజ విలువలను గురించి  మాట్లాడినట్టుగా వుంటాయి. మత్తయి సువార్తికుడు ఆధ్యాత్మిక పేదరికం గురించి మాటలాడుతుంటాడు, కానీ లూకా సువార్తికుడు మాత్రం ఆనాటి కాలంలో జరుగుతున్న కలహాలు, హెచ్చుతగ్గులు గురించి మాట్లాడుతుంటాడు. నిజమైన పేదరికం గురించి వారు అనుభవిస్తున్న వాటి గురించి మాట్లాడుతున్నాడు. సువార్తలో ప్రభువు చెప్పినట్లు పేదరికం , ఆకలి, దాహం లాంటివి ఆనాటి కాలంలోని కలహాలు. ఆనాటి కాలం లోనే కాదు ఇప్పటికీ కొనసాగుతున్నావే ఇవి, మానవుడు దేవుని విలువలకంటే ప్రపంచ విలువులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందుకే ప్రభువు అంటున్నారు ఆకలికొని ఉన్న వారులారా ఆనందపడుడు అని ధనికులకు శాపగ్రస్తులు అని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వస్తువులకు, విలువులకి ప్రాధాన్యత ఇచ్చేవాడు దేవుని  విలువులకు ప్రాధాన్యత ఇవ్వలేడు. హృదయాన్ని దేని మీద అయితే కేంద్రీకృతం చేస్తామో దాని కొరకై పరుగెడుతాము. ప్రపంచ వస్తువుల మీద అయితే వాటి కొరకై పరుగెడతాము కానీ వాటిని ఎప్పటికీ సాధించలేము, దేవుని మీద  అయితే మనం సాధించగలం. ఎందుకంటే మనం ఆయన ప్రజలం ఆయన మన దేవుడు. ఎవరైతే దేవుని విలువలకు ప్రాధాన్యత ఇస్తారో అట్టి వారు ఏటి ఒడ్డున నాట బడిన చెట్టు వలె నిరంతరం పచ్చిగా ఫలిస్తుంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారులారా ధన్యులు దైవ రాజ్యం అట్టివారిది. 

రెండవ  పఠనంలో పునీత పౌలుగారు క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థానమును  గురించి పునరుత్థానము నందు  విశ్వాసము గురించి ప్రస్తావించుచున్నారు. మొదటి కోరింథీయులు 15 వ అధ్యాయము అర్ధము చేసుకోవడానికి కష్టముగా ఉండేటువంటిది. అందులోని మర్మము అర్ధం కాదు. కొరయిన్థియ ప్రజలు శరీరము యొక్క ఉత్తానమును  తీరస్కరిస్తున్నారు. కానీ ప్రభువు యొక్క పునరుత్థానమును కాదు. పౌలు గారు చెప్పేది ఏమిటి అంటే శరీర ఉత్తానమును తీరస్కరిస్తే ప్రభుని పునరుత్థానమును కూడా తీరస్కరించినట్లే. శరీర ఉత్థానమును నమ్మని వాళ్ళు ప్రభుని పునరుత్థానమును ఎలా నమ్ముతారు? ఇలా అపనమ్మకము ద్వారా క్రైస్తవ సత్యాన్ని, నిజాన్ని, సందేశాన్ని  కించపరిచినట్లే. ఇప్పటి వరకు భోధించినది వ్యర్ధమైనట్లే ప్రభువు పునరుత్థానము కాకపోతే చేసే బోధన, విశ్వాసం అంతా వ్యర్ధమే. 

ఎందుకు పౌలుగారు ప్రభుని పునరుత్థానమునందు విశ్వాసాన్ని ముఖ్యముగా భావిస్తారు, అందులో దాగిన విలువలు, సత్యము ఏమిటి అంటే ప్రభువు అనేక సార్లు తన శిష్యులకు దర్శనమిచ్చారు.  

*క్రైస్తవులను హింసించే సౌలుకు సైతం దర్శనమిచ్చ పౌలుగా మార్చారు. 

*శిష్యులతో కలసి భుజించాడు, ప్రయాణించాడు ఇలా ఎన్నో జరిగాయి. 

*పునరుత్థాన సత్యము యూదులు చేసే అసత్య వాదనకన్నా బలమైనది, నిజమైనది. 

* ప్రభుని పునరుత్థానము మంచి చెడు మీద ఎంత బలమైనది అని నిరూపిస్తుంది. 

*ప్రభుని పునరుత్థానం ప్రేమ  అసహ్యం కంటే ఎంత బలమైనది అని నిరూపిస్తుంది. 

*ప్రభుని పునరుత్థానము బ్రతుకు చావు కంటే ఎంత బలమైనది అని నిరూపిస్తుంది. 

చివరిగా పౌలుగారు చెప్పేది ఏమిట అంటే  ఒక వేళ క్రీస్తు ప్రభుని పునరుత్థానం నిజము కాకుంటే , భోదించే సందేశం అబద్ధం అయితే పునరుత్థానంను విశ్వసించి చనిపోయిన వారి చావు, విశ్వాసం  వ్యర్ధమే వారి యొక్క విలువలు వ్యర్ధమే. 

పునరుత్థానమును జీవితంలో నుంచి తీసివేస్తే మనకు అయిన  క్రైస్తవ విశ్వాసాన్ని  చెడిపివేసినట్లే. "నేను కాదు జీవించేది నాలో జీవించేది క్రీస్తే" అని పౌలు గారి వలె మనము మన పునరుత్థాన విశ్వాసాన్ని చాటి చెప్పాలి. మనం మనయందును లేక మానవుల యందు కాక  దేవుని యందు నమ్మకం  ఉంచుదాం. ఆయనయందు  విశ్వాసంలో ధృడపడుదాం. 

Br. Lukas 


4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

అయిదవ సామాన్య ఆదివారము (2)

అయిదవ సామాన్య ఆదివారము
 యెషయా   6:1-8
 1 కొరింతి 15:1-11
  లూకా  5:1-11

నేటి దివ్యపఠనాలు దేవుని సేవకు ఎన్నుకొనబడిన వారి జీవితం గురించి భోదిస్తుంది. ప్రభువు యొక్క సేవ చేయడానికి ఆయన యొక్క పవిత్ర వాక్యం బోధించడానికి అలాగే దేవుని ముంగిట నిలబడడానికి ఎన్నుకొన్న బడిన వారి యొక్క అయోగ్యత గురించి తెలుపు చున్నాయి.
అర్హత లేని వారిని ఎన్నుకొని, వారిని బలపరిచి తన యొక్క సేవకు వినియోగించిన విధానం నేడు మూడు పఠనాలు ద్వారావింటున్నాం.

ఈనాటి మొదటి పట్టణములో దేవుడు యెషయా ప్రవక్తను తన యొక్క పని నిమిత్తము  పిలిచినా విధానం తెలుసుకుంటున్నాం. దేవుని యొక్క ప్రణాళికలను, భోధనలనుతెలియజేయుటకు దేవుడు యెషయా ప్రవక్తను ఎన్నుకొంటున్నాడు. క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దములో దేవునియొక్క ప్రజలు రెండుగా విభజింపబడ్డారు. ఉత్తర రాజ్యమును ఇశ్రాయేలుగా, దక్షణ రాజ్యము యూదాగా విభజింపబడ్డాయి. యెషయాను దేవుడు క్రీస్తు పూర్వం 742 వ సంవత్సరములో పిలిచి, ప్రవక్తగా ఎన్నుకొంటున్నారు. ఆయన ప్రవక్తగా పిలుపుని పొందిన సమయములో అస్సిరియా సేనలు బలంగా ఉండేవి. దానితోపాటు సిరియా కూడా బలంగా ఏర్పడుచున్న సమయమది. అయితే అప్పటి యూదా, ఇశ్రాయేలు ప్రజలు పెద్దలు వారియొక్క రాజ్యములను సంరక్షించుకొనుటకు వారు భద్రముగా ఉండుటకు రాజకీయ పరంగా అస్సిరియులకు మిగతా బలంగా వున్నా సైనిక రాజ్యాలకు సహకరించి జీవించేవారు. దేవుణ్ణివారు నమ్మకుండా వేరే మానవ శక్తులను, బలాలను నమ్ముకొని వారిమీద ఆధారపడే సమయములో దేవుడు యెషయాను పిలిచి ఆయనయొక్క సందేశం అందించుటకు ఆయన్ను ఎన్నుకొంటున్నారు.

దేవునియొక్క విలువైన ప్రతిమాటను రాజులకు, మతపెద్దలకు, ప్రజలకు తెలియజేయుటకు దేవుడు ప్రవక్తను ఎన్నుకొంటున్నారు. యెషయా దైవపిలుపును అందుకొన్న సమయములో యూదా రాజ్యాన్ని యోతాము,ఆహాసు, హిజ్కియా రాజులు పరిపాలించేవారు.

యెషయా ప్రవక్త యొక్క ఎన్నిక ప్రత్యేకమైనది. ఎందుకంటే, స్వయముగా దేవుడు తన దర్శనం కలుగజేస్తూ, తనయొక్క మహిమను వెల్లడిస్తూ తనయొక్క పనికోసం ఎన్నుకొన్నారు. యెషయా ప్రవక్త యెరూషలేము దేవాలయములో ప్రార్ధిస్తున్నప్పుడు ఆయనకు ఈ దర్శనం కలిగినది. దేవునియొక్క సమక్షంలో తన యొక్క అయోగ్యతను గుర్తించాడు.

 యెషయా  ప్రవక్త  తనకు కలిగిన దర్శనంలో దేవుని యొక్క పవిత్రతను గుర్తించాడు 
ఎందుకంటే దేవదూతల విలువైన మాటలు చెవులారా విన్నాడు.
-పవిత్ర మూర్తి అయినా దేవుణ్ణి చూసినప్పుడు, దేవుణ్ణి గురించి విన్న స్తుతిగానాలు యెషయా ప్రవక్త దేవుని యొక్క సన్నిదిలో తాను ఎంత పాపియే తెలుసుకుంటున్నాడు.
-దేవుని ముంగిట నూలువబడటానికి ప్రజలు ఎంతటి అనర్హులో గ్రహిస్తున్నాడు, అయినప్పటికీ దేవుడు మరలా  బలహీనులను పాపాత్ములైన జనుల మధ్య నుండే తన సేవకు ఎన్నుకుంటున్నారు. 

మనం దేవునికి ఎంత దగ్గరవుతామో అప్పుడు అంట తెల్లగా మన యొక్క పాపపు జీవితం అర్థమవుతుంది. 
-ఇంకొక విధంగా చెప్పాలంటే మనము వెలుగులోనో లేక వెలుతురుకు దగ్గరగా వెళ్తే మన మీద వున్నా మరకలు, మచ్చలు, మురికి అంత స్పష్టంగా కనిపిస్తుంది. 
-అదేవిధంగా ఈ లోకానికి వెలుగైయున్న పవిత్ర మూర్తి అయినా దేవునికి దగ్గరగా వస్తే మనయొక్క అపవిత్రత తెలుస్తుంది.
-యెషయా దేవునికి దగ్గరగా వున్నాడు కాబట్టియే తనయొక్క పాపపు జీవితం గుర్తుకువచ్చింది. 
-ఆ సమయంలో దేవుని యొక్క సెరాఫీము దూతలు ఆయన్ను పవిత్రపరిచారు. 
-సెరాఫిక్ అంటే జ్వలితాలు, మండుచున్నవారు. వీరు నిత్యం పవిత్రతతో జ్వలించే వారు, పవిత్రతతో ప్రకాశించేవారు. 

-రెండవ పఠనంలో పునీత పౌలుగారు తన యొక్క ఎన్నిక గురించి బోధిస్తున్నారు. 
-పౌలుగారు కొరింతునగరంలో సువార్త పరిచర్య చేసే సమయంలో యేసు క్రీస్తు ప్రభుని పునరుత్తానం గురించి అనేక ప్రశ్నలు ప్రజలలో ఉండేవి. కొందరు క్రీస్తు పునరుత్తానం అవ్వలేదని మరికొందరు అయ్యారని అలాగే పౌలుగారి యొక్క సువార్త భోదన్ను కూడా ప్రశ్నించే వారు ఆ సందర్భంలో పౌలుగారు వారందరికీ సాక్ష్యములతో తెలియచేస్తున్నారు .
-క్రీస్తు ప్రభువు నిజంగా ఉత్తానమైనవారు ఆయన మొదటిగా పేతురుకు తరువాత ఆపోస్తులకు, ఐదువేలమందికి దర్శనం ఇచ్చారు అని వారికీ తెలియచేస్తున్నారు. 
-దేవుడు నిజంగా ఉత్తానమై ఉన్నారు దానికి సజీవ సాక్షులు మన మధ్య వున్నారు అని తెలుపుచున్నారు.
ఆయన  యొక్క  మరణ పునరుత్తానములను ప్రకటించుటకే నేను ఎన్ను కోన బడ్డాను అని పౌలుగారు తెలుపుచున్నారు. 
-ఆయన ఎన్నికలో తన యొక్క అయోగ్యతను గుర్తిస్తున్నారు తాను అపోస్తులుడుగా పిలువబడుటకు అర్హుడను కాని ఎందుకంటే దేవుని ప్రజలను హింసించాను కాబట్టి అయినా దేవుడు తన్ను ఎన్నుకొన్నారు అది ఆయన గొప్పతనం అని పలుకుచున్నారు.
-దేవునియొక్క పునరుత్తానం ప్రకటించుటకు దేవుని కృప తనకు తోడుగా ఉందని తెలుపుచున్నారు. దేవుని కృపవలెనే నేను ఇప్పుడు న్న స్థితిలో  వున్నాను అని తెలుపుచున్నారు. 1 కొరింతి 15: 10 
-పౌలు గారు అర్హతలేని నన్ను దేవుడు ఎన్నుకొన్నారు, ఆయన పునరుత్తానమునకు నేనే నిజమైన సాక్షి అని తెలుపుచున్నారు. 

ఈ నాటి సువిశేష పఠనంలో దేవుడు శిష్యులను ఎన్నుకొనే విధానం చూస్తున్నాం. ఆ యన ఎంతో మంది గొప్పవారిని జ్ఞానులను, సమాజంలో పేరున్న వారిని విడిచి పెట్టి ఏమి లేనటువంటి సాధారణమైన ప్రజలను తన సేవకు ఎన్నుకొంటున్నారు.
 
-సామాన్యమైన చేపలు పట్టేవారిని దేవుడు ఎన్నుకొని మనుష్యులను పట్టేవారినిగా చేస్తున్నారు. 
- ఈ సువిశేష భాగంలో చాల విషయాలు మనం ధ్యానించుకోవచ్చు.
- గెన్నేసరేతు ప్రజలయొక్క విశ్వాస జీవితం - ఆ ప్రజల దేవుని యొక్క పవిత్రమైన మాటలను ఆలకించటానికి నెట్టుకొనుచు వస్తున్నారు. దేవునియొక్క మాటలు నిత్య జీవం ఇచ్చే మాటలు అని గ్రహించారు అందుకే నెట్టుకొంటున్నారు . ఇది వారి యొక్క విశ్వాస జీవితానికి నిదర్శనం. 
-మార్కు 6 :53 - 56 వచనాలలో వింటాం యేసు ప్రభువు వారి మధ్యకు వచ్చారని విని ఊరిలో ఎక్కడెక్కడో వున్నా అనారోగ్యులను ప్రభువు చెంతకు తీసుకొనివస్తున్నారు. వచ్చిన అవకాశం కోల్పోకూడదని భారమైన, కష్టమైన రోగులను , యేసుప్రభువు దగ్గరకు మోసుకొని వచ్చారు. వారికి స్వస్థత కావాలి ఆ స్వస్థత దేవుడే ఇస్తారు అని గ్రహించి యేసు ప్రభువు దగ్గరకు వచ్చారు అలాంటి  గొప్ప విశ్వాసం కలిగి వున్నా వారు గెన్నేసరేతు ప్రజలు.

-గెన్నేసరేతు ప్రజలకు విశ్వాసం ఎక్కువగా ఉన్నదియే కాబట్టి ఆయన వాక్కు ఆలకించటానికి నెట్టుకొని పోతున్నారు.
-ఏం సమయంలో మనం నెట్టుకొని పోతాం? మనకు ఏదైనా ముఖ్యమైనది పొందాలంటే అందరికన్నా ముందే వెళ్తా అని తక్కువుగా ఉంటె నెట్టుకొని పోతాం.
-ఇంకా మనం పలానా సమయంలో వెళ్లకపోతే ఇక ఇది మనకు దొరకదు అనే సమయంలో నెట్టుకొని పోతాం. 
-ఉదా; 2020 లో కరోనా వచ్చినప్పుడు కొన్ని నెలలు ముందు పాపులు శ్రమలేదు ఎప్పుడైతే ఆ షాపులు ఓపెన్ చేశారో జనాలు ఒకరినొకరు నెట్టుకుంటూ రెండు మూడు కిలోమీటర్ల వరకు క్యూలో వున్నారు. 
-ఎందుకంటే ఆ టైయంలో వెల్లకపోతే ఇక ముందు దొరకదు అని వారు భావించిన సందర్భంలో నెట్టుకుంటున్నారు. 
-క్రొత్త సినిమా రిలీజ్ అయినా అదే సంగతి. 
-గెన్నేసరేతు ప్రజలు విశ్వాసంతో జీవించే ప్రజలు. వారు నెట్టుకొని వచ్చింది కేవలం దేవుని యొక్క వాక్కును ఆలకించటానికి వస్తున్నారు. 

- ఈ ప్రజలు దేవుని యొక్క వాక్కు ఆ సమయంలో ఆలకించక పోతే ఎదో మేము కోల్పోతాం అని భావించారు. కాబట్టియే దాని   కోసం నెట్టుకొని పోతున్నారు.
-యేసు భోదన, మాటలు కొత్తగా ఉంది ఆ సందేశం ప్రేరణగా ఉంటుంది, ఆ సందేశం చాల గొప్పదని భావించారు. కాబట్టియే ఆ వాక్కు కోసం ఆలా తహ తహ లాడుచున్నారు. 

1. దేవుని యొక్క వాక్కు అయస్కాంత వాక్కు, అయస్కాంతం ఇనుమును ఆకర్షించిన విధముగానే దేవుని యొక్క వాక్కు విశ్వాసులను ప్రజలను అకార్చిస్తుంది. చాల సందర్భాలలో అన్యులు యేసు అనుచరులుగా మారటం చూస్తాం ఎందుకంటే వాక్కు వారిని ఆకర్శించింది కాబ్బటి 
ఉదా: సాధు సుందర్ సింగ్ 

2. దేవుని యొక్క వాక్కు పుట్టించే వాక్కు లూకా 8 : 4 
దేవుని యొక్క వాక్కు మనలో ప్రేమను పుటిస్తుంది
దేవుని యొక్క వాక్కు మనలో క్షమా పుటిస్తుంది 
దేవుని యొక్క వాక్కు మనలో ప్రేరణ పుటిస్తుంది 
దేవుని యొక్క వాక్కు మనలో హృదయ పరివర్తన పుటిస్తుంది 
దేవుని యొక్క వాక్కు మనలో దయను పుటిస్తుంది 
దేవుని యొక్క వాక్కు మనలో క్రొత్త జీవితం పుటిస్తుంది.

3 దేవుని వాక్కు నేర్పించే వాక్కు మనం ఎలా జీవించాలన్నది నేర్పిస్తుంది. 

4 దేవుని వాక్కు స్వస్థతను ఇచ్చే వాక్కు అనేక మందికి మాటలతో స్వస్థతను ఇచ్చారు దేవుడు
గన్నేసరెతు ప్రజలు ఈ వాక్యం యొక్క గొప్ప తనం తెలుసుకొని  ఈ వాక్యం వినకపోతే అలాగే ఈ వాక్యం ప్రకారం జీవించకపోతే మేము ఎదో కోల్పోతామని భావించారు కాబ్బటియే అంత అతృతతో ఉన్నారు.
వారి యొక్క వాక్యం యొక్క ఆకలి తీసివేయబడింది ఇప్పుడు ఉన్న రోజులో దేవుని యొక్క వాక్కు కోసం అంతగా ఆకలితో ఉన్నామా? ఎదురు చుస్తున్నామా? ఆసక్తిగా ఉన్నామా?
ii వారు తమ యొక్క వలలు శుభ్రపరుస్తున్నారు, ఆ సమయంలో దేవుడు వారి పడవలో ప్రవేశిస్తునాడు, మన జీవితంలో పాపమును కడిగివేస్తే పాపాలు ఒప్పుకొని పచ్చాత్తాపం పడితేనే దేవుడు మన జీవితంలోకి ప్రవేశిస్తాడు.
iii విశ్వాస జీవితంలో దేవుని ఆశీర్వాదాలు దొరకాలంటే, మన యొక్క విశ్వాస జీవితంలో లోతుగా వెళ్ళాలి.
- ఒడ్డున వలవేస్తే ఏమి జరగదు, దొరకదు అలాగే నమ మాత్రపు క్రైస్తవ జీవితం జీవిస్తే మనకు అనుగ్రహాలు కూడా దొరకవు. 
- దేవునితో ప్రయాణం చేసినప్పుడు లోతుగా వెళ్ళాలి గాఢమైన విశ్వాసం కలిగి ఉంటె అలాగే దేవునితో ఆ అనుబంధం కలిగి ఉంటేనే దేవుడు మనలను దివిస్తాడు.
- మనం కూడా ప్రార్థనలో లోతుగా వెళ్ళాలి, కష్టపడాలి అప్పుడే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు.
- విధేయత చూపుట ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి. పేతురును అన్ని తెలిసినాకూడా దేవుడు చెప్పిన మాట విని నమ్మకం ఉంచి వాలా వేసాడు, తన జీవితంలో అద్భుతం దేవిని శక్తి చూశాడు అందుకే వాలా చినిగే అన్ని చేపలు బడ్డాయి. 
- నోవా విదేయించాడు - రక్షణ పొందాడు 
- అబ్రాహాము విదేయించాడు - దీవెనలు పొందాడు 
-కాన పల్లి సేవకులు విదేయించాడు - వారు దీవెన పొందారు 
- మరియా తల్లి విడియించారు - దేవుని తల్లి అయారు
- మనం విదేఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు.
 -సెరెఫాతు వితంతువు విడియించింది- నూనె సంవృద్ధిగా పొందింది.  (1 రాజు :17 :8 -16 )

మనం కూడా విధేయులై జీవిస్తే మనలోకూడా దేవుని ఆశీర్వాదాలు సంవృద్ధిగా వస్తాయి. నిరాశలో వుండే వారికి దేవుడు తనయొక్క ఓదార్పునిస్తాడు. పేతురుగారిని దేవుడు తనయొక్క సువార్తా  పనికోసమై ఎన్నుకొంటున్నారు. పేతురు దేవునితో సంభాషించే వేళలో తనయొక్క పాపపు జీవితం గుర్తుకు తెచ్చుకొని తనయొక్క అయోగ్యతను గుర్తించి నేను పాపాత్ముడను అని ఒప్పుకొంటున్నారు. పేతురు హన సంభాషణ ద్వారా తనకు దగ్గరైన కొలది తనయొక్క పాపపు జీవితం గుర్తుకుతెచ్చుకొని నన్ను వదలిపొండు అని ప్రభువుతో అంటున్నాడు.  దేవుడు అతడ్ని విడిచిపెట్టడంలేదు. మనంకూడా దేవునితో సంభాషిస్తే అయన సాన్నిధ్యం మనజీవితములో అనుభవిస్తే, మన పాపాలు గుర్తుకు వస్తాయి.మనంకూడా పశ్చాత్తాపపడతాం. పేతురుగారిని దేవుడు ఎన్నుకొని పవిత్రపరచి తనయొక్క రాజ్య స్థాపనకై నాయకుడిగా నియమిస్తున్నారు. తన వాక్యాన్ని, తన రాజ్యాన్ని స్థాపించుటకు దేవుడు సామాన్యమైన వారిని ఎన్నుకొని బలపరిచి, దీవించి వారికి కావలిసిన వరములను ఇస్తున్నాడు. అయోగ్యులైనాకూడా  వారిని తన ప్రేమతో ఎన్నుకొని వారిని నియమించిన గొప్పదేవుడు ప్రభువు. ప్రభువు.

     ఈ మూడు పఠనాల ద్వారా తెలియజేయబడిన వ్యక్తులు యెషయా, పౌలు, పేతురు గార్లు దేవునికి విధేయులై దేవుని కొరకు జీవించిన విధంగా మనం కూడా జీవించాలి.
Rev. Fr. Bala Yesu OCD

5 వ సామాన్య ఆదివారం (మూడవ సంవత్సరం )

 దైవ పిలుపు- దైవ పిలుపునకు మన స్పందన -దైవ పిలుపు ఉద్దేశం 

యోషయా 6:1-8,     1 కోరింథీ 15:1-11             లూకా 5:1-11 

ఈనాడు  తల్లి తిరుసభ 5 వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈనాటి మూడు పఠనాలు దైవ పిలుపు  గురించి ప్రస్తావిస్తున్నాయి. వీటిని వివరంగా మూడు అంశాల రూపేనా ధ్యానిస్తూ, అర్థం చేసుకొని మన జీవితాలకు అపాదించుకుందాం. 

1. దైవ పిలుపు 

2. దైవ పిలుపునకు మన స్పందన 

3. దైవ పిలుపు ఉద్దేశం 

1 . దైవ పిలుపు -

 దైవ పిలుపు  చాలా పవిత్రమైనది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క  విధంగా పిలుస్తుంటారు. దేవుని యొక్క పిలుపు మరియు ఎన్నిక మానవ మేధస్సుకు అతీతంగా వుంటుంది. దేవుడు సామాన్యులను నిరాక్షరాసులను , అయోగ్యులను , మానవ దృష్టిలో  దేనికి పనికిరారు అన్నటువంటి అతి సాధారణమైన వ్యక్తులను పిలిచి, ఎన్నుకొని, వారిని తనకు తగిన వారీగా మలిచి ,అభిషేకించి తన ప్రేషిత కార్యాన్ని వారి ద్వారా నెరవేరుస్తారు. దేవుడు అల్పులను పిలిచి అత్యదికులను చేస్తారు.  బలహీనులను పిలిచి బలవంతులను చేస్తారు. అయోగ్యులను పిలిచి యోగ్యులనుగా చేస్తారు. 

మనము పవిత్ర గ్రంధంలో  ఎంతో మందిని పిలవడం ,మరెంతో మందిని ఎన్నుకోవడం చూస్తున్నాం. ముఖ్యముగా ఈనాటి మొదటి పఠనంలో అతి సామాన్యమైన యోషయాను పిలిచి ప్రవక్తగా మలుస్తున్నారు.(యోషయా 6:8). రెండవ పఠనంలో సౌలును పౌలుగా అంటే హింసకుడిని , సువార్త సేవకై పిలిచిన దేవుడు తన సువార్త వ్యాప్తికై ఒక సాధనముగా వాడటం చూస్తున్నాం.(1 కోరింథీ 15:10-11), మరియు చేపలు పట్టువాడైన సీమోనును ప్రేరేపించి పిలిచి మనుషులు పట్టువానిగా మలచడం చూస్తున్నాం.(లూకా 5:1-11). 

 ఈరోజు అత్యల్పులమైన,  అతి సామాన్యులమైన , అయోగ్యులమైన మనందరిని ప్రభువు పేరు పెట్టి పిలుస్తున్నారు. కొందరిని తన సువార్త సేవకై  మరి కొందరిని కుటుంబ జీవితానికి పిలుస్తున్నారు. పిలువబడిన వారు వారి జీవిత అంతస్తుకు తగిన విధంగా జీవించాలి. కానీ మనం ప్రభువు పిలుపునకు స్పందిస్తున్నామా ? సరిగా స్పందిస్తే ఈ పిలుపు మన జీవితాలను మలచకలదు,  మన జీవితాలను మార్చ కలదు. మన జీవిత ఉద్దేశాలను కార్యసాధనకు చేర్చకలదు. 

2 . దైవ పిలుపునకు మన స్పందన 

దేవుడు మనలను పిలవడం ఒకెత్తయితే దానికి స్పందించడం మరొక ఎత్తు . దైవ  పిలుపునకు స్పందించడం అంటే కేవలం కాళ్ళ నడక ద్వారా దేవుని అనుసరించడం కాదు. కానీ పిలుపునకు అనుగుణంగా  మన జీవిత మార్పు ద్వారా  దేవుని అనుసరించడం. మనం దేని నుండి దేనికి పిలవబడ్డాం అని గ్రహించాలి. ఎవరి చేత పిలవబడ్డాం, అని తెలుసుకోవాలి మరియు దానికి అనుగుణంగా  స్పందించాలి. అంటే 

1. మన పాపపు స్తితిని గ్రహించాలి: -నేను హా !చేడితిని కదా ! నా నోటి నుండి వెలువడునవన్నియు  అపవిత్రమైన మాటలే.  అపవిత్రమైన మాటలు పల్కు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. అని యోషయా ప్రవక్త తన పాపపు స్థితిని గ్రహించాడు. (యోషయా 6:5). ఏలయన అపోస్తులందరిలో  నేను అల్పుడను. దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తులుడని  పిలువబడుటకు నేను అయోగ్యుడను" అని పౌలు తన జీవిత స్థితిని  గ్రహించాడు. (1 కోరింథీ 15:9).  ప్రభూ ! నేను పాపాత్ముడను నన్ను విడిచి పొండు అని పేతురు గారు కూడా తన పాప స్థితిని గ్రహించారు.(లూకా 5:8). ఈనాడు నీవు నేను కూడా మన పాపపు స్థితిని గ్రహించాలి.

 2. పాపాన్ని విడిచి పెట్టాలి :- పాపాపు స్థితిని గ్రహించడమే కాదు . పాపాన్ని పరి పూర్తిగా విడిచిపెట్టాలి. మన జీవితాన్ని పవిత్రీకరించమని దేవుని అర్థించాలి. మనము పాప కార్యముల నుండి వైదొలగి నూత్న హృదయమును,నూతన మనస్సును పొందాలి. ఎవడు చనిపోవుట వలన  ప్రభువునకు సంతోషం కలగదు. కనుక మీరు మీ పాపముల నుండి వైదొలగి బ్రతుకుడు. ఇది యావే ప్రభు వాక్కు. యోహేజ్కేలు 18:31-32. 

3. మనలని మనం దేవుని చిత్తానికి అప్పగించాలి:-  దౌర్జన్యమునకు సాధనముగా మీ శరీరములందు ఏ అవయములను పాపమునకు అర్పింపకుడు. అంతేగాక , మృత్యువు నుండి జీవమునకు కొనిరాబడినవారుగా మిమ్ము మీరు దేవునికి  అర్పించుకొనుడు. మీ శరీరమునందలి అవయములను నీతికి సాధనములుగా ఆయనకు సమర్పించుకొనుడు. (రోమి 6:13). దేవుని  పిలుపునందుకున్న మనమందరము దేవునికి మనలను మనం సంపూర్ణముగా అప్పగించుకోవాలి. అంటే దేవుని చిత్తమే మన చిత్తం కావాలి. దేవుని చిత్తానుసారంగా ఆలోచించాలి, మాట్లాడాలి, కార్యాలు చేయాలి. ఈ విధంగా దేవుని పిలుపునకు  స్పందిస్తే దేవుని అనుగ్రహాలను పొందగలము, ఆ అనుగ్రహాలకు సాధనాలుగా మారగలము. 

3. దేవుని పిలుపు  యొక్క ఉద్దేశము

  దేవుడు  తన ప్రజలను ఓ గొప్ప ఉద్దేశంతో పిలిచి వారిని పవిత్రులుగా , నిర్దోషులుగా  చేస్తారు. (ఏపేసి 1:4) పవిత్రులుగా , నిర్దోషులుగా మలచబడినవారు, దైవ పిలుపు ఉద్దేశమైన సువార్త వ్యాప్తిద్వారా ఇతరులను పవిత్రులుగా, నిర్దోషులుగా  తయారుచేయాలి. ఈ ప్రేషిత కార్యం కొరకై మనము ప్రభుని సొంత ప్రజలుగా ఎన్నుకోబడతాము. (ద్వీతి14:2 ), అదే యోషయా  ప్రవక్త (6:8) , పౌలు గారు (1 కోరింథీ 15:10) మరియు పెతురు (లూకా 5:10 ) వీరి జీవితాలలో జరగడం   ఈనాటి పఠనాలలోమనం చూస్తున్నాం . 

దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క జీవిత శైలికి పిలిచియున్నారు. కొంతమందిని సువార్త  వ్యాప్తికై , మరి కొంత మందిని భర్తలుగా, భార్యలుగా , పిల్లలుగా మరియు ఇతర జీవిత శైలికి పిలిచారు. ప్రతి ఒక్కరు వారి జీవిత అంతస్తుకు తగిన విధంగా జీవించాలి. ఆ విధంగా జీవించాలంటే మనకు కావల్సిన మొట్ట మొదటి  ఆయుధం విశ్వాసం. విశ్వాసం లేకపోతే దైవ పిలుపు యొక్క ఉద్దేశం నెరవేర్చలేము. పునీత పౌలుగారు ఈనాటి రెండవ పఠనములో చాలా చక్కగా చెప్తున్నారు. "మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప ,నేను మీకు భోదిం చిన విధంగా మీరు దానిని గట్టిగా అంటి పెట్టుకొని ఉంటిరేని , మీరు రక్షింపబడుదురు." (1 కోరింథీ 15:2). పేతురు గారు ప్రభువు మాట యందు విశ్వాసించాడు, వల చినుగునన్ని చేపలు పట్టగలిగాడు. లూకా 5:6 . మనము కూడా విశ్వసించాలి, ప్రభువునకు ప్రార్ధించాలి. తద్వారా మన విశ్వాసాన్ని  బలపరచుకోవాలి. మన జీవితాలలో ప్రభువు కార్యాలను చవి చూడాలి. 

రెండవది ప్రేమ. యోహను 3:16 . 15:12. ప్రభువు కాపరికి అప్పగించిన తన మందను , కుటుంబ పెద్ద సభ్యులను ఎటువంటి పక్షపాతం లేకుండా అందరిని సమానంగా  ప్రేమించాలి. ప్రేమ అనే ఆయుధం ద్వార పరలోకాన్ని భూలోకంలోనే సృజించవచ్చు. ఎప్పుడైతే కాపరులు తమ స్వార్ధనికి ,ఆనందాలకు, ఇహలోక జీవిత శ్రేయస్సుకు, వస్తువులకు మరణించి, తన ఆలోచనలను, శక్తిని మాటలను మరియు కార్యాలను  దైవ చిత్తానికి  దైవ రాజ్య  వ్యాప్తి ఉపయోగార్దం జన్మిస్తారో. అప్పుడు  ప్రేమ ద్వార ఇహలోక  జీవియతం పరలోక జీవితంగా మారుతుంది. 

మూడవ ఆయుధం ఓర్పు , సహనం. ఈ సద్గుణాలు ఉన్నటువంటి వారు ఎటువంటి బేరుకు లేకుండా  దేవునితో నడవగలరు. సంఘంలో  కుటుంబంలో  ప్రజలందరు ఒకే విధంగా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క  తీరుతో  ప్రవర్తిస్తుంటారు. కానీ దైవ పిలుపు స్వీకరించిన మనం  ఓర్పు సహనం కలిగి అందరిని ఒక తాటిపై  నడిపించగలగాలి. ఇది దేవునితో మనం ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దేవుడు లేనప్పుడు పేతురుగారు ఒక్క చేపనైన పట్టలేక పొయ్యాడు. కాని దేవుడు తనతో ఉన్నప్పుడు వల చినిగే చేపలను పట్టగలిగాడు. (లూకా 5:5,6 ), దేవుడు మనతో ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలలో కూడా ఎటువంటి కొరతలు ఉండవు. అన్నీ సమృద్దిగా ఒసగపడుతాయి. 

ఏ విధంగా దైవ పిలుపు అందుకున్న కుటుంబ అంతస్తుకు చెందినవారు సువార్తను భోధించగలరు ? దివ్య వాక్కు  వినడం, పఠించడం, పాటించడం ద్వారా. దైవ వాక్కు మన జీవితాలకు  ఆధ్యాత్మిక  భోజనం. భోజనం భుజింపకపోతే ఏ విధంగా  భౌతిక ఆరోగ్యాన్ని కోల్పోతాము. అధేవిధంగా ఆధ్యాత్మిక భోజనం  అయినటువంటి దేవుని వాక్యం పఠించక,వినక, పాటించక పోయిన ఆధ్యాత్మిక అనుగ్రహాలను కోల్పోతాము. కాబట్టి దేవుని వాక్యం చదువుదాం , విందాం, ఆచరిదాం. తద్వారా  దైవ పిలుపును గ్రహించి , ఆ పిలుపునకు సరిగ్గా స్పందించి, ఆ పిలుపును జీవిస్తూ ముందుకు సాగుదాం. ఆమెన్ 

 Br. Sunil Inturi  OCD

   


29, జనవరి 2022, శనివారం

4 వ సామాన్య ఆదివారము

 4 వ సామాన్య ఆదివారము

యిర్మీయా 1 : 4-5, 17-19., 1కొరింతి 12: 31-13: 13., లూకా 4: 21-30.

-నేటి దివ్య పఠనాలు సువార్త వ్యాప్తిలో దేవుని అనుసరణలో ఎదురయ్యే తిరస్కరణలను దైర్యంగా ఎదుర్కోవాలి అని తెలుపుతుంది. 
- మన జీవితంలో ఎన్ని తిరస్కరణలు వచ్చినా గాని దేవుని మీద నమ్మకం ఉంచి, దైవ సేవ ప్రేమతో చేయాలనీ ఈ పఠనాలు భోదిస్తున్నాయి.
-చాలా సందర్భాలలో విశ్వాసానికి  సంభందించిన  తిరస్కరణలు, హింసలు ఎదురవుతాయి అయితే వాటన్నింటిని ఎదుర్కొని విశ్వాస సాక్ష్యం మిగతా వారికీ ఇవ్వాలి.
-ఈ నాటి మొదటి పఠనంలో దేవుడు యిర్మియా ప్రవక్తను తన యొక్క సేవకి ఎన్నుకొని ఆయన్ను బలపరిచిన విధానం తెలుసుకుంటున్నాం.
-దేవునిసేవలో ఎదురయ్యే కష్టాలను ముందుగానే ప్రవక్తకు తెలుపుచున్నారు.
-దేవుడు యిర్మీయాను పిలిచి తన ప్రవక్తగా నియమించారు. యిర్మియా తన తల్లి గర్భమున రూపొందకమునుపే దేవుడు తన్ను ఎన్నుకున్నారు అని పలుకుచున్నారు.
-ఆయన ఈ లోకంలో ఇంకా పుట్టక మునుపే అభిషేకించారు, అని తెలుపుచున్నారు. ఆయన్ను ఎన్నుకొన్నది ఒక ప్రవక్తగా జాతులకు తోడుగా ఉండుటకు.
-ప్రవక్త అంటే దేవుని స్వరం. దేవుడు పలకమన్న మాటనే పలుకుతూ దేవునికి మానవునికి మధ్యవర్తిగా నిలబడే దైవ సేవకుడే ప్రవక్త.
-దేవుడు యిర్మియాను పిలిచి, ఎన్నుకొని ఆయన్ను పవిత్ర పరచుచున్నారు. పవిత్ర పరచినది ఎందుకంటే, నిస్వార్థ సేవ చేయుటకు.
-పవిత్ర పరచినది దేవునితో వ్యక్తిగత సన్నిహిత సంబంధం కలిగి జీవించడానికి.
-పవిత్ర పరచినది దేవుణ్ణి సేవించుటకు, ఆయన మాటలను, వినుటకు, ఆయనలో ఐక్యమై జీవించుటకు దేవుడు యిర్మియాను ఎన్నుకొన్నారు, పవిత్ర పరిచారు.
-మనందరినీ దేవుడు జ్ఞాన స్నానం ద్వారా పవిత్ర పరుస్తున్నారు. అయితే మనం ఆయనలో ఐక్యమై జీవిస్తున్నామా, దేవునితో బంధం కలిగి పాపం, విడిచి దైవ చిత్తాన్ని నెరవేర్చుతున్నామా?
-యిర్మియా ప్రవక్త జీవితంలో దేవుడు ఆయన్ను జాతులకు ప్రవక్తగా ఉండుటకు అభిషేకిస్తున్నారు. కేవలం తన సొంత ప్రజల కోసం మాత్రమే కాదు అన్ని జాతుల వారికోసం అని ప్రభువు సుస్పష్టంగా తెలియచేస్తున్నారు.
-యిర్మియా మాత్రమే కాదు అన్య జాతులు వద్దకు పంపబడినవారు ఏలీయా, ఎలీషా, యోనా, లాంటి వారు కూడా అన్య జాతి జనులకు సేవలందించారు. 
-దేవుడు తన యొక్క ప్రవక్తను పరిచర్యకు ముందుగానే ఎదుర్కొన బోయే సమస్యలకు, హింసలకు, తిరస్కరణలకు, సిద్ధంచేస్తున్నారు.
-ప్రవక్తను పిలిచినప్పుడు వారి జీవితం పులపాన్పువలె సంతోషంగా ఉంటుందని వాగ్దానం చేయలేదు, వారి జీవితంలో కష్టాలు ఉంటాయి అని తెలిపారు.
-కష్టాలు, నిందలు, భాదలు, ఎదురైనా సరే నేను నీకు తోడుగా ఉంటాను అనే అభయం ఇస్తున్నారు.
-ప్రవక్తతో అంటున్నారు 1: 7   నీవు నడుము కట్టుకొని నిలబడి నేను ఆజ్ఞాపించిన సంగతులెల్ల వారితో చెప్పుము, నీవు వారికి భయపడ వలదని తెలుపుచున్నారు.
-ప్రవక్త లేదా దేవుని సేవకులు మాట్లాడే ప్రతి యొక్క మాట దేవుని యొక్క సందేశమే, దేవుడు తెలియచేయ మన్న మాటలే గురువులు, ప్రవక్తలు తెలుపుతారు.
-దేవునియొక్క సత్యమైన మాటలు మాట్లాడితే చాలామందికి నచ్చదు. ఎందుకంటే వారు మార్పు అంగీకరించలేరు. కాబట్టి వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజల్లో మనం ఇలాంటి స్వభావాలు చూస్తున్నాం.
-ఇశ్రాయేలు ప్రజల్ని దేవునిలో ఐక్య పరచటానికి ప్రవక్త ప్రయత్నిస్తున్నారు అలాగే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో శుద్ధీకరణ కోసం కృషి చేస్తున్నారు, వారి పాపపు జీవితం విడిచి పెట్టి, నీతిమంతమైన జీవితం జీవించాలని, దేవునికి విధేయులై జీవించాలన్న సత్యమైన దేవుని మాటలు ప్రజలతో పలికినప్పుడు అవి చాల మందికి నచ్చలేదు, ఎందుకంటే వారు మార్పును అంగీకరించలేక పోయారు అలాగే వారికి నచ్చిన సొంత జీవితం జీవించాలనుకున్నారు. అందుకే ప్రవక్తలను తిరస్కరిస్తున్నారు.
-ప్రభువు అంటున్నారు “నా మాటలు పలుకుటకు, నా సేవ చేయుటకు సిద్ధంగా ఉండుమని తెలుపుచున్నారు. నిజంగా మన జీవితాలను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటే ఎటువంటి ఇబ్బందులకు భయపడనవసరంలేదు” .
-దేవుడే అంటున్నారు 'బయపడనవసరం లేదు '. స్వార్థ పరులైన ఇశ్రాయేలు రాజకీయ,మత నాయకులు అనేక ఆటంకాలు పరిచర్యకు  కలిపిస్తారు, అలాంటి తరుణంలో నిర్భయంగా ముందుకు సాగమని దేవుడు అభయం ఇస్తున్నారు.
- దేవుడు తనకు తోడుగా ఉంటానని తెలుపుచున్నారు. యెషయా 41 : 10 
- ఎవరు ఎదురించినా సరే దేవుడు తోడుగా ఉంటాననే అభయం ఇస్తున్నారు.
-వారికి తోడుగా ఉండే విధానంలో దేవుడు మూడు ప్రతీకలను ఉదాహరిస్తున్నారు;
1. సురక్షిత నగరం.
2. ఇనుప స్తంభం 
3. ఇత్తడి తలుపు.
1. సురక్షిత నగరం- భద్రతకు గుర్తు. ఎంతమంది శత్రువులు దాడి చేసినా సరే చెక్కు చెదరకుండా, పడిపోకుండా, దృడంగా నిలబడుతుంది. 
2.ఇనుప స్తంభం - బలానికి, మహా శక్తికి గుర్తు. దేవుని యొక్క అభిషేకం ద్వారా మహాశక్తి ప్రతిఒక్కరిలో దాగి ఉంది, కాబట్టి ఆ శక్తి తో ఎన్ని సమస్యలైనా ఎదుర్కొని దైర్యంగా ఉండుమని తెలుపుతుంది.
3. ఇత్తడి తలుపు- భాదలు, అవమానాలు తట్టుకొని నిలబడే ఒక ఆయుధం, సాధనం.
-యిర్మియా తో దేవునియొక్క సంరక్షణ గురించి ప్రభువు తెలుపుచున్నారు. ఆయన ఒక రక్షణ కవచంగా ఉంటానని వాగ్దానం ఇస్తున్నారు.
- చాలా సందర్భాలలో దైవ సేవ చేసేటప్పుడు మనం భయ పడుతూ ఉంటాం. కొంతమంది ప్రవక్తలు కూడా ఉదాహరణగా మనకు నిలుస్తారు. 
మోషే, యిర్మియా, యోనా, ఏలీయా. 
-మోషే ప్రవక్త నత్తివాడినని   సాకులు చెబుతూ తప్పించుకోవాలని అనుకున్నాడు. 
-యిర్మియా - చిన్నవాడినని భయపడ్డాడు. 
-యోనా - అన్యులు అంగీకరిస్తారా లేదా అని భయ పడ్డాడు. 
-ఏలీయా - ఎసెబేలు రాణికి భయ పడ్డారు.
- వారిజీవితంలో ఎదురవ్వబోయే పరిణామాలకు ప్రవక్తలని భయపడ్డారు. దానికి తోడుగా ఇశ్రాయేలు ప్రజలు కూడా అనేక మంది ప్రవక్తలను నిరాకరించింది కాబట్టి వారు భయ పడ్డారు. 
- హోషేయా 9: 7, యిర్మియా 2: 30 
-2 వ రాజుల దిన 36: 16, ఆమోసు 2: 12 
-లూకా 13: 34, మత్తయి 23: 37, హెబ్రీ 11: 32, 1 థెస్స 2; 15 
-ప్రవక్తలు తమ జీవితంలో దేవుని కొరకు మాత్రమే పనిచేసారు. వారు అధికారులకు భయపడలేదు, మత పెద్దలకు, నాయకులకు, భయపడలేదు ఎందుకంటే వారు దేవునికి సంపూర్ణ, విధేయత చూపించారు. దేవుని చిత్తం నెరవేర్చారు, సొంత స్వార్థం చిత్తం చూసుకోలేదు. 
-మనం కూడా గుర్తించు కోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని సేవ చేసినప్పుడు అంగీకారం మరియు తిరస్కారం అనేవి సర్వ సాధారణ అనుభవాలు అయితే తిరస్కరింప బడినప్పుడు క్రుంగి పోనవసరంలేదు ఎందుకంటే యేసేపు అన్నల చేత తిరస్కరించబడ్డారు, అయినా దేవుడు తన పక్షాన వున్నారు, ఆయన మాత్రం దైర్యంగా వున్నాడు, అభివృద్ధిలో ముందుకు సాగరు. ఆది ఖా: 37 .
-యేసు ప్రభువు నిరాకరించబడ్డారు, యోహాను 15: 18, మార్కు 3: 21 
ప్రభువు మాత్రం తండ్రి చిత్తం నెరవేర్చారు. 
- యిర్మియాను నిరాకరించారు అయినా దైవ సేవ చేశారు. నిరాకరించిన సరే దైవ వాక్కు తనను నిశబ్దంగా ఉంచుటలేదు, ఆయన దేవుని మాటలు దైర్యంగా ప్రకటిస్తున్నారు. 
-మన జీవితంలో తిరస్కరించ బడినప్పుడు మనకు దేవుడు తోడుగా ఉంటారని తెలుసుకొని దేవుడ్ని నమ్ముకొని ముందుకు సాగిపోవాలి.
- రెండవ పఠనంలో పౌలు గారు దైవ వారములు పొందిన విశ్వాసులు ప్రేమతో కూడిన జీవితం జీవించాలని తెలుపుచున్నారు.
-కొరింతు క్రైస్తవ సంగంలో ప్రేమ అనే వరము కొరవడింది. దేవుని యొక్క వారములు పొందినవారు వేవుణ్ణి, పొరుగు వారిని ప్రేమిస్తూ జీవించాలని పౌలు గారు పలుకుచున్నారు .
-పౌలు గారు తనయొక్క సువార్త పరిచర్య మొత్తం కూడా ప్రేమతో చేశారు.
-దేవుణ్ణి ప్రేమించారు కాబట్టే ఆయన సందేశమును ప్రజలకు ప్రకటించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు, హింసలు , ఎదురైనా  ఆయన మాత్రమూ దైవ సేవ చేశారు.
- ప్రేమకు ఏదైనా సాధించే బలం ఉంది అలాగే ఎంత శ్రమైన భరించే ఓర్పుకు, ప్రేమ ఉంది.
-దేవుని యొక్క కుమారుని యొక్క జీవితంలో మనకు అర్ధమయ్యే విషయం అదే. ఆయన ప్రేమతోనే మన కోసం ఈ లోకంలో జన్మిమ్చారు. 
-ప్రేమవలనే సుంకరులతో, పాపులతో కలిసి భోజనం చేశారు.
-ప్రేమవలనే అన్ని ప్రాంతాలవారికి సువార్త ప్రకటించారు.
-ప్రేమతో అద్భుతాలు చేశారు.
-ప్రేమ వల్లనే ఆయన్ను నిరాకరించిన కానీ మళ్ళీ వారిని అంగీకరించారు.
-ప్రేమ వల్లనే మోసం చేసినా క్షమించరు
-ప్రేమ వల్లనే తన జీవితం త్యాగం చేశారు
-ప్రేమ వల్లనే మనలను రక్షించారు
-ఆయన ప్రేమను గుర్తించిన పౌలు గారు ఈ విధంగా దేవుని యొక్క ప్రేమ జీవితం గురించి తెలుపుచున్నారు. 
- దేవుడు ప్రేమ స్వరూపి అని యోహాను గారు కూడా వ్రాశారు. 1 వ యోహాను 
-దేవుడు తన వారిని శాశ్వత మైన ప్రేమతో ప్రేమించారు. యిర్మియా 31 : 3  కాబట్టియే తిరస్కరించిన సమయాలలో క్రుంగి పోకుండా దైర్యంగా తన యొక్క పరిచర్యను కొనసాగించారు.
-ప్రేమలో స్వార్థం ఉండదు 
-ప్రేమ ఎదుటి వారి మేలు కోరుకుంటుంది. 
-ప్రేమకు ఎలాంటి చెడుగుణములు లేవు.
-దేవుడు మనలను ప్రేమించిన విధంగానే మనం ఒకరినొకరు ప్రేమించుకొని దైవ సేవ చేద్దాం. దేవుని ప్రేమను పంచుకుందాం.
-నేటి సువార్త పఠనంలో యేసు ప్రభువును తన సొంత ప్రజలే నిరాకరించిన విధానం మనం చూస్తున్నాం.
-సువిశేష భాగంలో రెండు విషయాలు మనం గుర్తించాలి. 
- ప్రజల యొక్క ఆశ్చర్యం 
-సొంత వారి యొక్క నిరాకరణ 
1. ఎప్పుడైతే యేసుప్రభువు యెషయా ప్రవక్త  గ్రంధం ను చదివి లేఖనము నెరవేరింది అని పలికారో అపుడు వారందరు ఆశ్చర్య పడుతున్నారు. 
-ఆయన మాటల్లో నూతనత్వం వున్నదని గ్రహించారు. ఆయన యొక్క భోధన యధార్థమైనదని గ్రహించారు. 
-ఆశ్చర్య పోయినతరువాత ఆయన యొక్క కుటుంభంతో ఆయన్ను పోల్చుతున్నారు. అయన యేసేపు కుమారుడు కాదా అని వారి ఆశ్చర్యం, ద్వేషంగా మారిపోతుంది ఇక్కడ.
-చాలా సందర్భాలలో మనంకూడా కొంతమందిని పోల్చుతారు.
-సమాజంలో పేరు ప్రతిష్టలున్న వారి అబ్బాయి కన్నా ఒక  పేద వానికి  వున్నత ఉద్యోగం వస్తే ఇదెలా అని ఆలోచిస్తూ వ్యత్యాసాలు చూసుకుంటారు.
-వారి అభిప్రాయమేమిటంటే వారికన్నా మిగతా వారందరు తక్కువ వారే, లేని వారే అనే భావన. ఇక్కడ యూదులు కూడా చేసినది అదే, ఆయన్ను (యేసు ప్రభువును) తన తండ్రితో పోల్చుతున్నారు. ఈ పేదవాని కుమారుడు ఎలాగా ఇలా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తున్నారు .
-ఆయన బోధనలు అంగీకరించుటకు బదులుగా ప్రశ్నించుకొంటున్నారు.
-సొంత వారు ఎప్పుడు తమ సొంత ప్రవక్తల గొప్పతనం అంగీకరించలేరు, ఎందుకంటే మన మధ్యలో పుట్టి, పెరిగిన వ్యక్తి, వారికన్నా ఎక్కువగా మంచి చేస్తుంటే, భోదిస్తుంటే ఎవరు కూడా అంగీకరించలేరు. వారిలో ఎక్కువ అసూయా ఉంటుంది.
- ప్రజలు ఎందుకు నిరాకరించారంటే 
1. తన బోధనల ద్వారా వారికి కోపం తెప్పించారు, మరీ ముఖ్యంగా వారి విశ్వాసం అన్యుల కన్నా చిన్నది అని చెప్పారు. 
2. వారి మధ్య అద్భుతాలు చేయుటకు నిరాకరించారు.
3.నాయకులను, మత పెద్దలను ప్రతి నిత్య కపట ప్రవక్తలని సంబోధించినందులకు 
4. తానే మెస్సయ్య అని చెప్పుకున్నందుకు
5. అసూయా వల్ల ప్రభువును నిరాకరించారు చంపాలనుకున్నారు.
6. ఆయన (క్రీస్తు) ప్రజలు అనుకున్న విధంగా నడవలేదు.
7. ప్రజలకు ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడలేదు అందుకే వారు కోప పడ్డారు, నిరాకరించారు. 
-దానికి ప్రతి ఫలంగా దేవుడు వారి విశ్వాస జీవితాలను పరీక్షించుటకు రెండు ఉదాహరణలు ఇస్తున్నారు.
1. ఏలీయా - సెరాఫథ్ వితంతువు- 1 రాజు 17: 7 - 24 
2. ఎలిశా - నామాను కుష్టి రోగి (సిరియా) 2 రాజు 7: 3 -10 
ఏలీయా ప్రవక్త సెరాఫత్ లో వున్న వితంతువద్దకు వెళ్లారు. అక్కడ ఆమె ప్రవక్త మాటలను  విశ్వసించింది.
- ఆయన మాటప్రకారం నడుచుకొన్నది.
- నామాను కూడా అన్యుడే అయినప్పటికీ ప్రవక్త మతాల మీద విశ్వాసం ఉంచి విధేయత చూపారు కాబట్టియే స్వస్థత పొందారు. 
-వితంతువు, నామాను, ఇద్దరు కూడా ప్రవక్తలను అంగీకరించారు వారిద్దరిలో ప్రవక్తలో దైవ శక్తి దాగి ఉందని గ్రహించారు. అందుకే వారి మాటలను ఆలకించి వినయంతో వారు చెప్పినది చేసారు. అందువల్ల అద్భుతాలు పొందారు.
-ప్రభువు ప్రేమ అందరికి ఇవ్వబడుతుంది దానిని స్వీకరించకపోతే అది మన లోపమే.
-యూదులకు మొదటి ప్రాముఖ్యత నిచ్చారు కానీ వారు తృణీకరించారు. మనం కూడా అలాగే చేస్తున్నామా?
-అసూయా ఉంటే ఎవరియొక్క గొప్పతనం, మంచితనం, మనం అంగీకరించలేము. ప్రేమ ఉంటే ఎవరినైనా అంగీకరిస్తాం, భరిస్తాం. కాబట్టి మన జీవితంలో అంగీకారం , తిరస్కారం ఉంటూనే ఉంటాయి . కాబట్టి మనం ప్రేమతో అని తెలుసుకొని ప్రవక్తలను యేసుప్రభువును  ఉదాహరణ గా తీసుకొని ముందుకు సాగాలి. వారు నిరాకరించబడిన కానీ గమ్యం మరువలేదు, సువార్త  సేవ ఆపలేదు , క్రుంగి పోయి వెనుకంజ వేయలేదు. దైవ ప్రేమతో సోదరుల మంచికోసం ఎన్ని తిరస్కరణలైన ఎదుర్కోగలిగారు. మనం కూడా ప్రేమ ఉంటె ఎంత కష్టమైన ఇష్టంగా ఏదైనా సాధించవచ్చు.
-దేవుడు అందరిని సువార్త వ్యాప్తి కోసం పిలుస్తున్నారు కాబట్టి ప్రభువు యొక్క వాక్యం అనుసారం జీవించుదాం.
Rev. Fr. Bala Yesu OCD

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...