30, జులై 2022, శనివారం

18వ సామాన్య ఆదివారం

18వ సామాన్య ఆదివారం

ఉపదేశకుడు 1 :-2 ; 2 :-21 -23 
కోలస్సి 3 :-1 -5 ,9 -11 
లూకా 12 :-13 -21 

ఈనాటి దివ్య పఠనాలు మానవ జీవితంలో మరీ ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో ఈ లోక ఆశలకు ప్రాధాన్యత ఇచ్చి జీవించకుండా దేవునికి ప్రాధాన్యత ఇచ్చి పరలోక రాజ్యం పొందుటకు కృషి చేయమని తెలియజేస్తున్నాయి.

మన యొక్క జీవితంలో ఈ లోక సంపదల, మీద పేరు ప్రతిష్టల, మీద అధికారం మీద అత్యాశ ఉండకూడదు అని కూడా ఈ దివ్య పట్టణాలు తెలుపుచున్నాయి ఎందుకంటే నేడు మనం ఈ లోకంలో ఉంటాము మరి రేపటి రోజున దేవుడు పిలిస్తే వెంటనే వెళ్లాలి. 

మన స్వార్థంతో కాకుండా దేవుడు ఇచ్చిన వరములను ఆశీర్వాదములను అందరితో పంచుకొని జీవించాలి ధనం అందరికీ అవసరం కానీ ధనాకాంక్షల ఎక్కువగా ఉంచుకోకూడదు అని ప్రభువు తెలుపుచున్నారు.

ఈనాటి మొదటి పఠనంలో ఉపదేశకున్ని గ్రంథంలో జీవితం యొక్క పరమార్థం గ్రహించిన రచయిత అంతా వ్యర్థమే అని తెలుపుచున్నారు మనందరి జీవితం గడ్డి పూస లాంటిది ఎప్పుడూ ఎండిపోవును ఎవరికీ తెలియదు కాబట్టి దేవుడిని తెలుసుకొని ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం జీవించాలిఈ మొదటి పఠనంలో రచయిత మానవ జీవితానికి సంబంధించిన కొన్ని చేదు నిజాలను మనకు తెలియజేస్తున్నారు. అవి ఏమిటి అంటే దేవునికి స్థానం లేని జీవితం దేవుడిచ్చిన సిరిసంపదలు లెక్కచేయని వారి యొక్క జీవితం వ్యర్థమని ప్రకటిస్తున్నారుదేవునికి స్థానం ఇవ్వకుండా పొందుకున్నటువంటి జ్ఞానం కూడా వ్యర్థమని తెలుపుచున్నారు ఈ లోక సంపదలు సమకూర్చుకొనే మన శ్రమ అంతా వ్యర్థమేమనం కష్టపడి సమకూర్చిన సంపదలో అన్ని చివరికి మన యొక్క వారసులకు అప్పచెప్పుతాం.

వాస్తవానికి మనిషి సంపాదించడానికి ఎంత కష్టపడతాడు సంపాదించిన సంపదలను కాపాడుకోవడానికి అంతే కష్టపడతాడు మనిషిలో ఉన్న దురాశ ఇంకా ఇంకా కావాలి అనే తెలుపుచున్నవి. కానీ అవి ఏమీయు మనిషికి నిజమైన శాంతి సమాధానం ఉండవు ధనమున్న అందరూ సంతోషంగా లేరు జ్ఞానం ఉన్న అందరూ సమాధానంతో జీవించరు అందుకే ఉపదేశకుడు పలికే మాటలేమిటంటే అంతా వ్యర్థమే దేవుడు లేనటువంటి జీవితం వ్యర్థమే అధికారం కోసం ప్రాకులాడే వారి యొక్క ఆశలు వ్యర్థమే ధనాశా వ్యర్థమే కీర్తి ప్రతిష్టలు వ్యర్థమే అని తెలియజేశారు దేవుడు లేరని చెప్పుకొనే జ్ఞానవంతుల జ్ఞానం వ్యర్థమే అని తెలిపారు ఏదియు శాశ్వతం కాదు కాబట్టి శాశ్వతమైన దేవునితో ఉండాలి మనం ఎంత సంపాదించినా కానీ అది బ్రతికి ఉన్నంతవరకే మరణించినప్పుడు మనతో ఏమీ తీసుకొని పోలేము.

అలెగ్జాండర్ ది గ్రేట్ 356-323 BC పేరు ప్రతిష్టలు సంపాదించిన రాజు అతనికి సంపాదనలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి జీవితంలో ఎంతగానో ఎతిగాడు చివరికి ఆయన మరణించే ముందు తన వారితో చెప్పిన మాటలు ఏమిటంటే నన్ను సమాధి వద్దకు తీసుకొని వెళ్లేటప్పుడు సమాధి పెట్టెలో నా చేతులను బయట ఉంచండి అందరు ప్రజలు కూడా ఒక విషయం తెలుసుకోవాలి అది ఏమిటి అంటే నేను చనిపోయిన తర్వాత నా వెంట ఏమీ తీసుకొని పోవడం లేదు అంతా వ్యర్థమే అని తెలిపారు నిజంగా మనం సంపాదించే డబ్బులు కానీ జ్ఞానం కానీ ఏమీ మన ప్రాణాలు కాపాడలేవు కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎంతో మంది ధనవంతులు తనకు ఉన్న దనంతో ప్రాణాలు కాపాడుకోవాలని అనుకున్నారు కానీ సాధ్యపడలేదు. చాలామంది తాము అన్యాయంగా సంపాదించిన డబ్బులు కాపాడుకోవడానికి ఎన్నో రాత్రులు నిద్రలేక ప్రశాంతత లేక జీవించారు కాబట్టి మనసుకు ప్రశాంతత నిచ్చే దేవుడిని కలిగి జీవించాలి.

ఈనాటి రెండో పఠనంలోమన యొక్క హృదయం మనసు దేవుని మీద ఉంచి పరలోక రాజ్యం పొందమని ఆహ్వానిస్తున్నాయి ఈ లోక వస్తువుల మీద కాకుండా పరలోకము నందు గల వస్తువులపై మీ మనసులను లగ్నము చేయుడు అని తెలుపుచున్నారు. ఇంకొక విధంగా చెప్పాలంటే క్రైస్తవ జీవితం శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించాలి. ఎవరైతే శరీరానుసారంగా  జీవిస్తారు వారు దేవుని సంతృప్తి పరచలేరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు ప్రియ పౌలు గారు రోమీయులకు రాసిన లేఖలో చక్కగా ఈ అంశం గురించి వివరించారు రోమీ 8:4-16. మనందరం కూడా చాలా సందర్భాలలో శరీర వాంఛలకు లోనై శరీరాలను సంతృప్తి పరుస్తాం కానీ అలాంటి జీవితాలు ఎన్నడూ ప్రభువును సంతృప్తి పరచలేదు మన జీవితంలో ఎప్పుడూ కూడా ఒక పోరాటం ఉంటుంది మంచికి చెడుకు పాపమునకు పుణ్యమునకు. అయితే దేవుని యొక్క పోలికలో సృష్టింపబడిన మనం దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు ప్రయత్నిస్తున్నాం లేకపోతే ఈ లోక వస్తువుల కోసం ప్రాకులాడుచున్నాము మన యొక్క దృష్టి భూలోకం మీద ఉన్నట్లయితే మనందరం కూడా డబ్బు కోసం పేరు కోసం ఆశపడటం మన దృష్టి దేవుని మీద, ఆయన రాజ్యం మీద ఉన్నట్లయితే సమస్తమును దేవుని కొరకు విడిచిపెడతాం.

పునీత అస్సిసి ఫ్రాన్సిస్ గారు దేవుని కొరకు అన్ని విడిచిపెట్టి ప్రభువు యొక్క సేవ చేశారు ఆయన మాత్రమే కాదు శ్రీసభలో చాలామంది పునీతులు సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు వీరికి దేవుడంటే మిగుల ప్రీతి ఈ భూలోక విషయాల మీద వారు మనస్సు లగ్నం చేయక పరలోక విషయాల మీద వారి హృదయం, మనసు లగ్నం చేస్తారు.

ఈ లోకంలో జీవించే మనం పరలోకవాసులం అని గ్రహించి పరలోక దేవునికి చెందిన బిడ్డలుగా మంచి జీవితం జీవించాలి.

ఈనాటి సువిశేష పట్టణంలో యేసు ప్రభువు యొక్క ఉపమానములను తెలియజేస్తున్నారు. ఈ ఉపమానము ద్వారా ప్రభువు శిష్యులకు కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు వారి జీవితంలో కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అంటే దేవునికే కానీ ఈ లోక సంపదలకు కాదు అని చెప్పారు ఒక యువకుడు ఏసు ప్రభువు చెంతకు వచ్చి తనకు తన తండ్రి దగ్గర నుండి రావలసిన ఆస్తిని పంచిపెట్టమని కోరుచున్నాడు తన యొక్క ఆలోచనలు మొత్తం కూడా సంపద మీదనే ఉంది అందుకే క్రీస్తు ప్రభువును చూసిన సరే ఆయనను గౌరవించలేదు ఆయనకు నమస్కరించలేదు ప్రభువును ఆశ్రయించిన వెంటనే తనకు రావలసిన సొమ్మును గురించే అడుగుచున్నాడు యూదుల యొక్క బోధకులకు ఆస్తిని పంచి ఇచ్చేటువంటి హక్కు కలదు మోషే యొక్క ధర్మశాస్త్రము ప్రకారం పెద్ద కుమారునికి రెండు వంతుల ఆస్తి ఇవ్వబడుతుంది అది వారి యొక్క జన్మహక్కు ద్వితీయ 21:15-17 సంఖ్య 27:1-11 సంఖ్య 26:7-9 మిగతా కుమారులందరికీ ఒక వంతు ఆస్తిని పంచిపెట్టడం జరుగుతుంది.

ప్రభువు వారి యొక్క మనవిని తిరస్కరించారు ఎందుకంటే ఆయన ఈలోకానికి వచ్చింది సువార్తను ప్రకటించడానికి దేవుని యొక్క క్షమాపణమును తెలియజేయటానికి, ప్రేమను పంచడానికె కానీ ఆస్తి పాస్తులను పంచి పెట్టటానికి కాదు ఏసుప్రభువుకు తెలుసు సంపదల వల్ల కుటుంబాలలో కలహాలు వస్తాయి అని అందుకే దానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు 

1.అబ్రహాము లోతు ఆస్తుల దగ్గర గొడవలు వస్తాయి అని ముందుగానే అబ్రహాము గుర్తించి లోతుకు మంచి స్థలం ఇచ్చారు ఆది 13:5-13

2. యాకోబు కూడా అధికారం కోసం అన్నఐన ఏ సావును మోసం చేశాడు ఆది 27:36.

3. ఆహాబు ధనం మీద ఉన్న ఆశ వలనే నాబోతు చావుకు కారణం అయ్యాడుజేజబేలు రాణి నాబోతు ప్రాణాలు తీశారు .1రాజు21:22 అన్యాయాలు.

4. అననీయ, సఫీరా కూడా ధనం మీద ఉన్న ఆశ వలనే నిజాయితీగా లేకుండా డబ్బు దాచుకున్నారు వారు దేవుని శిక్షకు గురి అయ్యారు. అపో 5:5-11. ధనం వలన అనేక అనర్ధాలు వస్తాయి అనే గ్రహించి ప్రభువు దానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు.

ఈనాటి సువిశేష పఠనము ద్వారా ప్రభువు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నారు జాగ్రత్త వహింపుడు. ఎట్టి లోబమునకు లోను కాకుడు ఎలయన మానవ జీవితం కేవలం సిరి సంపదలు సమృద్ధికే కాదు అని అన్నారు. ఇది అందరికీ హెచ్చరికయే ఎవరైతే కేవలం ధనం కోసం ప్రాకులాడుచున్నారు వారందరినీ ఉద్దేశించి ప్రభువు పలికారు.

యొక్క ఉపమానంలో గుర్తించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.

1. ధనికుడు దేవుడిని మరిచిపోయాడు- మనకున్నదంతా దేవుడిచ్చిన ఆశీర్వాదమే ఈ విశేషంలో చెప్పబడిన ధనికుడు తాను తన సొంత శక్తి మీదనే ఆధారపడ్డాడు. మన జీవితం మన సంపదలు అన్నియు కూడా దేవుడిచ్చిన కానుకలు 1కొరిం 10:26 అంతయు దేవునికి చెందినది. ధనికుడు తన యొక్క జీవితం గురించే తాను ఎక్కువగా ఆలోచిస్తున్నాడు తన యొక్క కుటుంబం గురించి కానీ తన యొక్క సంఘం గురించి కానీ ఎట్టి ఆలోచన ఆయనకు లేదు అందుకే పదేపదే నాకు నేను నా అనే వ్యక్తిగత పదాలు వాడుతున్నారు.

తన స్వార్థం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారుతనకు సమృద్ధిగా వచ్చిన తరుణంలో ఆ పంట వల్ల దేవుడినే మరిచిపోయాడు

పదిమంది కుష్టు రోగులలో 9 మంది కూడా స్వస్థత పొందిన తరువాత దేవుణ్ణి మరిచిపోయారు.

ధనికుడు దేవుడిని తన హృదయం నుండి తీసివేసి సంపదను పెట్టుకున్నాడు.

దేవునికి కృతజ్ఞతా తెలుపుటకు బదులుగా ఆయన దేవుని మర్చిపోయాడు ఆయనకు వచ్చినదంతా తన యొక్క కష్టార్జితం అనే భ్రమలోనే ఉన్నాడు.

ధనికుడు దేవునికి దశమ భాగం ఇవ్వటం కూడా మరిచిపోయాడు భౌతికంగా ఆయన ఎంత సంపాదించినా దేవుడు లేక ఆధ్యాత్మికంగా ఆయన మరణించినట్లేధనికుడు తన యొక్క సంపాదనలను ఎలా కాపాడుకోవాలా అనే చింతలతో ఉన్నాడు ప్రశాంతత లేక ఉన్నారుధనికుడు సంపూర్ణంగా దేవుడిని మర్చిపోయాడు మనం దేవుని మేలులు గుర్తించి ఆయన చెంతకు తిరిగి రావాలి.

2. ధనికుడు స్వార్థం

దేవుడు ఆ సంవత్సరం పంటలు సమృద్ధిగా ఇచ్చింది. ఎందుకంటే తనకు ఉచితంగా ఇవ్వబడిన దానిని ఇతరులతో పంచుకొని జీవించమని ఏసుప్రభు శిష్యులను సువార్తకు పంపించే ముందు వారితో పలికిన మాటలు ఏమిటి అంటే మీరు ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి అని మత్తయి10:8.

దేవుడిచ్చిన పంటను ఆకలితో ఉన్న వారితో పంచుకోవడానికి ఇష్టపడలేదుతనకు సమృద్ధిగా ఇవ్వబడిన సందర్భంలో పేదవారికి సహాయం చేయాలి అని  గుర్తుకు రాలేదు. మనం ఇతరులకు ఇస్తేనే మనతో ఉంటుంది అది ప్రేమ అయినా సరే సహాయం అయినా సరే మనతో దాచుకున్నది ఎప్పుడూ మనకు శాశ్వతం గా ఉండదు.

ఇంగ్లాండ్ దేశంలో ఒక సమాధి మీద ఈ విధంగా రాయబడి ఉన్నది what I gave I have, what I kept lost.

సువిశేషంలో చెప్పబడిన ధనికుడు చనిపోయినప్పుడు అంతా కోల్పోయాడు ఎప్పుడైతే దేవుడిచ్చిన సంపదలను మనం ఇతరులతో పంచుకుంటాము దేవుడు వాటిని ఇంకా అదికం చేస్తారుదేవుడు ఈ లోకంలో కొంతమందిని ధనికులుగా చేస్తున్నారు ఎందుకంటే ఆ ధనము వలన పేదవారిని ఆదుకోమని కానీ వారు అదే మర్చిపోతున్నారు.

3. ధనికుడికి పరలోక దృష్టి లేదు:

ఈ లోకమే శాశ్వతం అని భావించాడు ఇతనికి ముందు చూపు లేదు అందుకే తన యొక్క ధనంను పేదలకు పంచి పెట్టడం లేదు. తనకు ఇవ్వబడినది నలుగురితో పంచుకుంటే పరలోకంలో ప్రవేశిస్తానని గ్రహించలేకపోయాడు.

మనందరి దృష్టి కూడా ఎక్కువగా డబ్బు మీద నగల మీద ఆస్తుల మీదనే చాలా ఎక్కువగా ఉంటుంది. పరలోకం మీద దృష్టి ఉన్నట్లయితే దానికి తగిన విధంగా పుణ్యక్రియలు చేసేవాడు.

ధనికుడైన యువకుడికి కూడా డబ్బు మీదనే ఆశ అందుకే తన డబ్బు పేదలకు ఇవ్వలేకపోయాడు దాని ఫలితంగా నిత్యజీవితం కోల్పోయాడు.

4. ధనికుడు మంచితనంలో ఎదగలేదు

ఆయనకు ఉన్న సంపదలతో ఎంతోమంది పేరు తెచ్చుకొని ఉండి ఉండవచ్చు దేవుడుని మెప్పించవచ్చు కానీ ఏమీ చేయలేదు.

అధికంగా ఉన్నప్పుడు కనీసం ఇతరులతో కూడా మాట్లాడలేదు అందుకే ప్రతిసారి నా, నేనా అని తనలో తాను మాట్లాడుతున్నాడుమనకు దేవుడిచ్చిన దానిని బట్టి మంచితనంలో సహాయం చేయటంలో ప్రేమను పంచుటలో ఎదగాలి.

దేవుడిచ్చిన సంపదల వల్ల మంచి పేరు సంపాదించవచ్చు అదేవిధంగా చెడ్డ పేరు సంపాదించవచ్చు దేవుడు మనలను మంచిగా వినియోగించుకోవడానికి మనకు సంపదలు ఇచ్చారు కాబట్టి వాటిని సరిగ్గా వినియోగించుకుందాంమనం స్వార్థంతో కాకుండా నిస్వార్థంతో జీవించటం దేవుడు చేసిన మేలులకు ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలుపుదాం.

                                                                          ఫాదర్. బాల యేసు. ఓ సి డి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...