27, ఫిబ్రవరి 2021, శనివారం

తపస్సుకాల రెండవ ఆదివారము

తపస్సుకాల రెండవ  ఆదివారము 

ఆది 22:1–2, 9–13, 15–18

రోమా 8:31–34

మార్కు 9:2–10

క్రీస్తు నాధుని యందు ప్రియ స్నేహితులారా, ఈనాడు మనము తపస్సుకాల రెండవ ఆదివారమును కొనియాడుతున్నాము. ఈనాటి దివ్య గ్రంథ పఠనములు మనము ధ్యానించినట్లయితే, త్యాగపూరిత జీవితము మరియు దేవుని సాన్నిధ్యము అను అంశముల గురించి మాట్లాడుతున్నాయి. ఎవరైతే దేవుని యందు విశ్వాసముంచి, త్యాగపూరితమైన జీవితము జీవిస్తారో వారు దేవుని సాన్నిధ్యాన్ని కనుగొంటారు, మరియు వారు నిత్యము దేవుని సన్నిధిలో నివశిస్తారు. అప్పుడు దేవుడు వారి వారి కుటుంబాలను దీవిస్తాడు.

ఈనాటి సమాజమును గమనించినట్లయితే ఎంతోమంది దేవుని యందు విశ్వాసములేకుండా, ఎన్నో వ్యసనములకు గురి అవుతున్నారు. తల్లితండ్రులు అంటే గౌరవం లేకుండా పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, భార్యభర్తల మధ్య అనేకానేక సమస్యలు, ఒకరినొకరు అర్ధం చేసుకోకుండా వివాహ భాంధవ్యాన్ని అపార్ధాల ముసుగులో నెట్టుకొస్తున్నారు. ఈ సందర్భములో అబ్రాహాము జీవితము, ఈనాటి మొదటి పఠనము ద్వారా ఓ మంచి ఉదాహరణమును మన ముందుంచుతుంది.

అబ్రాహాము విశ్వాసులందరిలో చాల గొప్పవాడు. ఎందుకనగా అబ్రాహాము దేవుని పిలుపును ఆలకించి , దేవుణ్ణి అనుసరించి దేవుని చిత్తానుసారముగా జీవించాడు. అబ్రాహాము ఎల్లపుడు దేవుని కనుసన్నలలో జీవిస్తూ ఉండేవుడు. ఓనాడు దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించడం కోసం అబ్రాహాము యొక్క ముద్దుల తనయుని, తన ఒక్కగానొక్క కుమారుడైన ఈసాకుని బలిగా సమర్పించమన్నాడు. అబ్రాహామునకు చాల కాలము వరకు సంతానము కలగలేదు. దేవుడు అబ్రాహామునకు ముసలి ప్రాయములో కుమారుణ్ణి ప్రసాదించాడు. దేవుడు ఈసాకుని బలిగా అర్పించమన్నపుడు అబ్రాహాము  చిత్తం ప్రభు! అని దేవుని ఆజ్ఞను శిరసావహించి దేవుని చిత్తానుసారముగా ఈసాకుని దేవునికి సమర్పించుటకు సిద్ధపడుతున్నాడు. దేవుడు ఈసాకుని బలిగా సమర్పించమన్నపుడు అయన విశ్వాసం తొట్రిల్లలేదు. అబ్రాహాము చెదరలేదు, బెదరలేదు, వెనకడుగు వేయలేదు.

దేవుని యందు విశ్వాసము ఉంచి సకలము దేవుడే కలుగజేసాడు, నాకు ఈ బిడ్డను ఆయనే దయచేసాడు, ఆయనే సమకూరుస్తాడు అని ఈసాకును బలిగా సమర్పించడానికి మోరియా కొండ మీదకు తీసుకు వెళుతున్నాడు. అప్పుడు దేవుడు అబ్రాహాము విశ్వాసమునకు మెచ్చి, అబ్రాహాము చేసిన త్యాగమునకు గుర్తుగా ఆయన కుటుంబాన్ని ఎంతగానో దీవించాడు. అదేవిధముగా ప్రియ దేవుని బిడ్డలారా, మం జీవితములో కూడా ఎన్నోసార్లు, అనేక పరీక్షలకు గురవుతుంటాము. అనేక శోధనలు, సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ సమస్యలను చూసి మనము భయపడకుండ, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని దేవుని దూషించకుండ, దేవుని యందు విశ్వాసముంచి, అబ్రాహాము ఏ విధముగా త్యాగపూరిత జీవితము జీవించాడో అదే విధముగా మనము కూడా జీవించాలి అని మొదటి పఠనము తెలియజేస్తుంది.

అదే విధముగా ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు దివ్యరూపము దాల్చడము మనము చూస్తున్నాము. యేసు ప్రభువు దివ్యరూపము దాల్చినపుడు , తాను పొందబోవు శ్రమలు, మరణ పునరుత్తానముల గురించి మోషే, ఏలీయాతో సంభాషిస్తున్నారు. అప్పుడు అక్కడ పేతురు, యాకోబు, మరియు యోహాను మాత్రమే ఉన్నారు. వారు ఆ దృశ్యాన్ని చూసి, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కనుగొన్నారు, ఆ సాన్నిధ్యాన్ని అనుభవించారు. అందుకనే వారు సమస్తాన్ని మరిచిపోయారు. పేతురు గారు 4 వ వచనంలో బోధకుడా! మనము ఇక్కడే ఉందాము. మీకు, మోషేకు, ఏలీయాకు మూడు పర్ణశాలలు నిర్మిస్తాము అని అంటున్నారు.

మనము కూడా ఎప్పుడైతే దేవుని సాన్నిధ్యములో ఉంటామో, ఎన్నడైతే మనము దేవునిని కనుగొంటామో, దేవుడు మనతో మాట్లాడతాడు, తన రహస్యాలను మనకు బయలు పరుస్తాడు. ఆనాడు కొండమీద దేవుడు, ;ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను ఆలకింపుడు; అని శిష్యులతో పలికారో ఈనాడు అదే దేవుడు మనతో కూడా పలుకుతారు. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఉంటామో అప్పుడు ఎలాంటి సైతాను శోధనలనైనా ఎదుర్కొన శక్తిమంతులమవుతాము. ఎలాంటి సమస్యలైనా మన మనస్సును కలత పెట్టలేవు. అందుకనే ఈనాటి రెండవ పఠనములో పునీత పౌలు గారు ఈవిధముగా అంటున్నారు,దేవుడు మన పక్షమున ఉన్నచో, ఇక మనకు విరోధి ఎవడు ఎప్పుడైతే మనము దేవుని యందు ఉంటామో అప్పుడు దేవుడు మనయందు ఉంటాడు. దేవుడు మనయందు ఉండాలి అంటే మనము పవిత్రముగా జీవించాలి, దేవునికి అనుగుణముగా, విశ్వాస జీవితములో, త్యాగపూరితముగా జీవించాలి. అప్పుడు దేవుడు మనయందు జీవిస్తాడు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలము ఎంతో చక్కని కాలము. ఎందుకనగా, మనమందరము ఉపవాసముతోను, ప్రార్ధనతోను గడుపుకోవడానికి దేవుడు మనకు దయచేసిన ఒక చక్కటి కాలము. ఈ తపస్సు కాలములో మనము దానధర్మాలతో, ప్రార్థన జీవితముతో, దేవుని యందు విశ్వాసముంచి, మన పాపాలను, చెడు ఆలోచనలను, కుళ్లూకుతంత్రాలను విడనాడి, మంచి జీవితాలను జీవించ కావలసిన అనుగ్రహములను దయచేయమని దేవుని ఆర్థిద్దాము. ఆమెన్.

20, ఫిబ్రవరి 2021, శనివారం

తపస్సు కాల మొదటి ఆదివారం

  

ఆదికాండము 9: 8-15 , 1 పేతురు 3: 18-22, మార్క్ 1:12-15

ప్రియా దేవుని బిడ్డలారా ,సహోదరి సహోదరులారా , ఈనాడు మనం  తపస్సుకాల మొదటి  ఆదివారాన్ని కొనియాడుతున్నాము.  ఈనాడు  తల్లి  తిరుసభ  మన జీవితములో మార్పు, మరియు  హృదయ పరివర్తన గురించి  ధ్యానించ  ఆహ్వానించుచున్నది. తపస్సు కాలము యొక్క  ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మానవుడు  తన చేదు క్రియలను, ఆలోచనలను , మాటలను  వదలి , మంచి  క్రియలవైపు , మంచి జీవితం, మంచి  ఆలోచనలవైపు మరియు  మంచి మాటలవైపు మరలడం.  అదే పలు  పశ్చాత్తాప, ఉపవాస మరియు  త్యాగ క్రియల ద్వారా తన  నడవడికను క్రీస్తులో నూత్నికరించుట.  ఈనాటి  సువిశేషంలో  క్రీస్తు ప్రభువు  హృదయ పరివర్తనకు ఆహ్వానము పలుకుచున్నాడు. కాలము  సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది. హృదయ పరివర్తన చెంది , సువార్తను విశ్వసింపుడు. (మార్కు :1, 15) అని ఆహ్వానిస్తున్నారు. 

మార్పు : 

మానవజీవితములో  మార్పు  అనేది సహజము.  లోకములో  ప్రతి  వస్తువు, ప్రతి విషయము మారుతు  ఉంటుంది.  మారాలి కూడా. ఎందుకంటే  మార్పులోనే అందము, ఆనందము ఉంటుంది.  అందుకే అంటారు, పాతోక  రోత , క్రొత్త ఒక వింత అని. కనుకనే మానవుడు ప్రతి విషయములోను కూడా  కొత్తదనం కోరుకుంటూ ఉంటాడు.  దైనందిన  జీవితములో కానివండి వ్యాపారములో కానివండి. ,భోజన పదార్థములో కానివ్వండి. ప్రతి  విషయములో కుడా  మార్పుదే విజయము. లోకములో అన్నింటిలోనూ మార్పు , క్రొత్తదనం  కోరుకుంటాడు మానవుడు . దానికి తగినట్లే  క్రొత్త క్రొత్త  విషయములను కనిపెడుతూ ఉంటాడు. ఈ మార్పు  అనే  సూత్రంతోనే  అన్నింటిలోనూ అభివృద్ధి  చెందుతూ ఉన్నాడు. 

 

ఈనాడు  టెక్నాలజీ  పెరిగింది , రక్త  సంభందాలు తగ్గినవి .  ఆస్తు పాస్తులు  పెరిగాయి , బంధుప్రీతి తగ్గినది. వస్తు వినియోగమపెరిగినది. మనిషి విలువ తగ్గినది, క్షణభంగురమైన , అశ్వాశత విషయములపై  ఆసక్తి పెరిగినది, శాశ్వత విషయములగు దేవుడు , ఆత్మ , ఆనందము, సంతోషం, ప్రేమ సహవాసము అను విషయములపై శ్రద్ద తగ్గినది.

ప్రియా దేవుని బిడ్డలారా మనం ఒకసారి  ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఎక్కువ  దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాము, లోకములో ఉన్న వాస్తువులకా లేక జీవిత మార్పుకా . 

ప్రేమ - హృదయ పరివర్తన 

నోవా కాలంలో మానవుడు ఘోరమైన  పాపంలో  జీవిస్తున్న సమయములో దేవుడు  కోపించి  మానవుని నాశనం  చేయాలనీ జలప్రళయమును పంపించాడు.  చివరకు నోవా కుటుంబ సభ్యులు  మాత్రమే  రక్షించబడ్డారు, ఈ యొక్క  పతనాన్ని  చూచి దేవుడు మనసు మార్చుకొని నోవాతో ఒడంబడిక  చేసుకుంటున్నాడు.  అది ఏమిటంటే  ఇక ఎన్నడూ ఇటువంటి ముప్పును పంపనని ఆది ఖాండము 9:11 . అలాంటి గొప్ప దేవుడు  మానసు మార్చుకొని  తన ఏకైక  కుమారుణ్ణి మన రక్షణార్థమై పంపియున్నాడు యోహాను3:16. మరి మనము ఎందుకు  హృదయ పరివర్తన చెందలేకున్నాము. 

చివరిగా ఈ తపస్సు కాలములో తరచుగా వినపడే మాటే ఇది .. హృదయ పరివర్తనలే కుండా  మనిషికి పర లోక రాజ్యములో తావులేదు. చక్కని గులాబీ పువ్వు చుట్టూ బోలెడన్ని ముల్లుంటాయి. గులాబీ కోయాలంటే మన చేయి ముల్లులలను ధాటి వెళ్ళాలి. అదే విధముగా పరలోకరాజ్యములో శశ్వతానందం పొందాలంటే  హృదయ పరివర్తన తప్పనిసరి. 

కాబట్టి  ఈ తపస్సు కాలము మొత్తము కూడా దేవుని వాక్యాన్ని  ఆలకిస్తూ , పాటిస్తూ ,మన జీవితలను చిగురింప  చేయమని ప్రార్థనచేద్దాం '. 

 

బ్రదర్ అబ్బదాసరి రత్నరాజు ఓ  సి డి 

 

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...