28, అక్టోబర్ 2023, శనివారం

30 వ సామాన్య ఆదివారం

30 వ సామాన్య ఆదివారం
 నిర్గమ  22: 20-26, 1 తెస్సలోనిక 1:5-10, మత్తయి 22‌‌:34-40

ఈనాటి దివ్య పఠణములు క్రైస్తవ జీవితంలో అనుసరించవలసిన రెండు ప్రధానమైన ఆజ్ఞల గురించి తెలియజేస్తున్నాయి అవి దైవ ప్రేమ మరియు సోదర ప్రేమ ఆజ్ఞలను పాటించుట. ఈ రెండు ఆజ్ఞలను పాటించుటయే నిజమైన క్రైస్తవ జీవితం. ఈ రెండు ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ పాటించుట విఫలమైన అది సంపూర్ణమైన క్రైస్తవ జీవితం కాదు. ఈనాటి మొదటి పట్టణంలో దేవుడు ఇచ్చిన రెండవ ఆజ్ఞ అయిన సోదర ప్రేమను పాటించమని తెలియజేస్తుంది. మొదటి వచనము(22) మనము గమనించినట్లయితే ఈ యావే దేవునికి కాదని అన్యదైవములకు బలులు సమర్పించిన వారిని కఠినంగా శిక్షించాలి అని తెలియజే స్తునారు. వేరే దేవుళ్ళు లేరు అని దీని యొక్క అర్థం వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకుని వచ్చినది యావే దేవుడు కాబట్టి అతనికి మాత్రమే బలులు సమర్పించాలి అని ప్రభువు కోరుచున్నాను. పాత నిబంధన గ్రంథములో అనేక సందర్భంలో ప్రభువు తెలియచేసిన అంశం ఏమిటి అంటే దేవుడు ఒక్కరే, అది కూడా యావే దేవుడు మాత్రమే, ఇక ఏ దేవుడు లేరు అని అర్థం.. రెండవదిగా ప్రభువు పరదేశులకు ఎటువంటి హాని చేయవద్దు అని తెలుపుచున్నారు అంటే యూదులు కాకుండా మిగతా అన్యులకు ఎవరికి కూడా ఎటువంటి అపాయము కానీ అన్యాయం కానీ చేయకుండా వారిని ప్రేమించమని పలుకుతున్నారు. సోదర ప్రేమ అనే అంశము గుర్తు చేస్తూ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఏ విధముగా పరదేశులుగా జీవించి ఉన్నారో అక్కడ వారు దేవుని యొక్క ప్రేమను పొందుకున్న విధముగా అదే ప్రేమను వ్యక్తపరచమని తెలుపుతున్నారు. మూడవదిగా సమాజంలో ఉన్నటువంటి వితంతువులను, అనాధలను ప్రేమించమని తెలుస్తుంది. వితంతువులు,అనాధలు ఎటువంటి బలము లేనటువంటి వారు దేవుడే వారికి అండగా నిలబడుతున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా వారి యెడల జాలి, దయ, ప్రేమను చూపిస్తూ మెలగవలసినదిగా ప్రభువు కోరుచున్నారు. ఎవరైతే వితంతువునుగాని పరదేశులు గాని అనాధలను కానీ భాదిస్తూ ఉంటారో వారి యొక్క బాధను చూసిన ప్రభు తప్పక బాధపెట్టే వారిని శిక్షిస్తాను అని తెలియజేస్తున్నాను కాబట్టి
ఇది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత పొరుగువారి యెడల ప్రేమను వ్యక్తపరిచి జీవించుట. ఇంకా ప్రభువు చెప్పే మాట ఏమిటంటే ఏ వ్యక్తికి అయితే మనము అప్పు ఇస్తూ ఉంటామో ఆ వ్యక్తి దగ్గర ఎటువంటి వడ్డీ కూడా తీసుకోవద్దు తెలియజేస్తున్నారు ప్రస్తుత కాలంలో ఎవరు కూడా వడ్డీ లేకుండా ఏ అప్పు ఇవ్వటలేదు. ఎందుకు ప్రభువు ఈ విధంగా చెప్పారు అంటే మనకు ప్రేమ ఉన్న యెడల ఎదుటివారి మీద మనము భారము వేయము. వడ్డీ తీసుకొనుట ఒక విధముగా వారి మీద భారం వేసినట్లే కాబట్టి ప్రభువు వడ్డీని కూడా తీసుకోవద్దని తెలియజేస్తున్నాను. అప్పుడే మనం ఎదుటి వ్యక్తి మీద  ప్రేమను వ్యక్తపరుస్తుంటాం. ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తెస్సలోనియ ప్రజల యొక్క విశ్వాస జీవితాన్ని మెచ్చుకుంటున్నారు ఎందుకంటే  మొదటిగా వారు అన్యులైనప్పటికిని, వేరే సాంప్రదాయములు అనుసరించినప్పటికిని దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు ప్రభువు యొక్క సువార్తను ప్రేమతో స్వీకరించి, దేవుని యొక్క వాక్యం అనుసారంగా జీవించినందుకు వారి యొక్క విశ్వాసము గొప్పదిగా ఉన్నందుకు పౌలు గారు వారి జీవితమును మెచ్చుకుంటున్నారు. విశ్వాసము కొరకై అనేక బాధలు అనుభవించినప్పటికిని కూడా ప్రభువు నందు విశ్వాసము కోల్పోకుండా జీవించినందుకు పౌలు గారు వారిని మెచ్చుకుంటున్నారు అదేవిధంగా సోదర ప్రేమను కలిగి జీవించమని తెలియజేస్తున్నారు.
ఈనాటి సువిశేష భాగములో పరిసయ్యులు యేసు ప్రభువుని ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని అడుగుతున్నారు ఇది కేవలము యేసు ప్రభువుని పరీక్షించుట కొరకై వారి ఈ విధంగా అడుగుతున్నారు ఎందుకంటే వాస్తవానికి ఏసుప్రభు సద్దుకయ్యలు నోరు మూయించారని తెలుసుకొని పరిసయ్యులు కూడా ఏసుప్రభుని పరీక్షించాలనుకున్నారు అందుకే ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమి అని అడుగుతున్నారు. ఆ కాలంలో యూదులకు దాదాపు 613 ఆజ్ఞలు ఉండేవి. యావే దేవుడు మోషేకు సీనాయి పర్వతం దగ్గర ఇచ్చిన 10 ఆజ్ఞలు కాలక్రమేనా 613 ఆజ్ఞలుగా చేయబడ్డాయి అందుకనే ప్రజలు ఏ ఆజ్ఞ ముఖ్యమో, ఏ ఆజ్ఞముఖ్యము కాదో తెలుసుకొన లేకపోయారు అందుకు ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడుగుచున్నారు అందుకు ప్రభువు మొట్టమొదటిగా దేవుడిని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రేమించాలి అని తెలుపుచున్నారు. మనము దేవుడిని ప్రేమించిన ఆయన యొక్క ఆజ్ఞలలో పాటిస్తాము, ఆయన యొక్క చిత్తమును నెరవేరుస్తాను అదేవిధంగా ఆయన కొరకు జీవిస్తూ ఉంటాం. ప్రభు ప్రేమించమని తెలుపుచున్నారు ఎందుకంటే ప్రేమకు సమస్తము సాధ్యము కాబట్టి. మనము ప్రేమ కలిగి జీవించినట్లయితే దేవుని కొరకు ఏమి చేయటానికైనా సిద్ధపడి ఉంటాము. ప్రభువు మన నుండి పూర్ణ ప్రేమ కోరుచున్నాను. కొన్ని కొన్ని సందర్భాలలో స్వార్థంగా ఉంటాం. దేవునికి ఇవ్వవలసినది పూర్ణంగా ఇవ్వలేము, చందాలు వేసేటప్పుడు కానీ, దేవునికి కానుకలు ఇచ్చేటప్పుడు కానీ, ప్రార్థించేటప్పుడు కానీ మనము పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవునికి సమర్పించు కాబట్టి అది సగం సగం గానే సమర్పించబడుతుంది ఆ యొక్క సగం ప్రేమ మాత్రమే మనము దేవుడి మీద చూపిస్తుంటాం కాబట్టి మనము దేవుడిని నిస్వార్థంతో సంపూర్ణంగా ప్రేమించాలి.
 రెండవ ఆజ్ఞ నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభువు తలుపుచున్నారు. మన యొక్క అనుదిన జీవితంలో మొదటి ఆజ్ఞను పాటించుట  చాలా తేలిక ఎందుకంటే దేవుడిని ప్రతి ఒక్కరూ ప్రేమించగలరు. కానీ పొరుగు వారిని ప్రేమించుట మాత్రం కష్టం. దేవుడు కనపడరు కావున ఆయన ప్రేమిస్తారు కానీ కనిపించేటటువంటి తోటి మానవుడిని ప్రేమించుట అసాధ్యం. అనేక సందర్భాలలో ప్రభువు మనకు తెలియచేసిన విషయం ఏమిటంటే మీ శత్రువులను ప్రేమించమని కోరుతున్నారు, హింసించే వారి కొరకు ప్రార్థించమంటున్నారు అదేవిధంగా ఏ వ్యక్తి అయితే దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటారో అట్టి వ్యక్తి తన తోటి వారిని ప్రేమించకపోతే అసత్య వాది అని తెలుపుచున్నారు కాబట్టి మనము దేవుడిని ప్రేమిస్తున్నాము అని ఎప్పుడూ నిరూపిస్తాము అంటే దేవుని యొక్క ప్రేమ తోటి మానవాళి మీద చూపించినప్పుడే మనకు దైవ ప్రేమ ఉన్నది. దేవుడిని ప్రేమించే వారు తప్పనిసరిగా తమ పొరుగు వారిని కూడా ప్రేమించాలి ఎందుకంటే పొరుగు వారిని ప్రేమించుట అనేది దైవ ప్రేమ నుండి జన్మించినది కాబట్టి మనందరం కూడా దైవ మానవ ప్రేమ కలిగి సోదర భావంతో జీవించాలి.

Fr. Bala Yesu OCD

21, అక్టోబర్ 2023, శనివారం

29 వ సామాన్య ఆదివారం

29 వ సామాన్య ఆదివారం
యెషయ 45:1,4-6, 1 తెస్సలోనిక 1:1-5, మత్తయి 22:15-21

ఈనాటి పరిశుద్ధ గ్రంధం పఠణములు మానవుని యొక్క బాధ్యతలను గురించి తెలుపుచున్నది. మానవులు దేవుని యెడల నెరవేర్చవలసిన బాధ్యతలను అదే విధముగా ఈ లోక ప్రభుత్వం యెడల నెరవేర్చవలసిన బాధ్యతలను గురించి తెలుపుచున్నది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా జీవించడం చాలా ముఖ్యం అది దేవుని పట్లయినా లేదా తమ యొక్క దేశము పట్లయినా. ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడని కాకుండా ఆయన మానవులందరికీ కూడా దేవుడు అని తెలుపుతున్నాను. ప్రభువు అన్యుడైన పర్షియా దేశపు సైరస్ రాజును అభిషక్తునిగా చేస్తున్నారు. చరిత్రలో మొదటిసారిగా యావే దేవుడు యూదులను కాకుండా అన్యులను అభిశక్తునిగా చేస్తున్నారు. సైరస్ రాజు యావే దేవుడిని ఆరాధించనప్పటికిని ఆయనను ఎన్నుకుంటున్నారు ఎందుకంటే ఆయనలో ఒక ప్రత్యేకత అది ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తుపూర్వం 587 వ సంవత్సరంలో బాబిలోనియా బానిసత్వంలో జీవించేవారు అప్పుడు వారు తమ యొక్క సొంత మత విధి విధానాలు అనుసరించడానికి అవకాశం ఉండేది కాదు కానీ దాని తర్వాత క్రీస్తుపూర్వం 539లో సైరస్ రాజు బాబిలోనియాను జయించి ఇశ్రాయేలు ప్రజలకు ఒక విధమైన స్వేచ్ఛను కలిగించారు అది మాత్రమే కాదు యూదులు ప్రత్యేక విధంగా యావే దేవుడిని ఆరాధించటకు ప్రోత్సహించాడు, వారి యొక్క భక్తికి ఎటువంటి ఆటంకం చెప్పలేదు అదేవిధంగా వారికి ఆర్థికంగా సహాయం చేశారు వారి యొక్క దేవాలయమునకు కావలసిన వాటిని కూడా సైరస్ రాజు సమకూర్చాడు. యావే దేవుడు తెలియనప్పటికీ కూడా ఆయన కొరకు అంతా చేయటానికి అనుమతిచ్చారు. అందుకే ఆయన యొక్క మంచితనమును చూసి ప్రభువు తనను అభిశక్తునిగా చేస్తున్నారు.
 అభిశక్తునిగా చేయటం అంటే దేవుడు అతనిని ఒక ప్రత్యేకమైనటువంటి పనికి ఎన్నుకుంటున్నారు ఆ ప్రత్యేకమైనటువంటి పని ఏమిటంటే యూదులకు స్వేచ్ఛనిచ్చుటకు దేవుడు అతడిని నియమిస్తున్నారు అదేవిధంగా ప్రభువు ఈ మొదటి పఠణంలో తాను ఒక్కడే దేవుడు ఇక ఏ దేవుడు లేరు అనే అంశములు కూడా తెలియజేస్తున్నారు. పదేపదే ప్రభువు నేను ఒక్కడినే అని తెలుపుచున్నారు,ఆయన్ని మాత్రమే ఆరాధించాలి అని తెలుపుతున్నాను ఈ మాటలు దేవుడు మనకు మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ప్రథమ ఆజ్ఞ గురించి తెలుపుతున్నది. అది ఏమిటంటే సర్వేశ్వరుడుని మాత్రమే ఆరాధించదువుగాక దేవుడు ఒక్కడే అని తెలుసుకొని ఆరాధించాలి. పాత నిబంధన మొత్తం కూడా దేవుడు ఒక్కడే అని తెలుపుచున్నది. నేను రోషము గల దేవుడు అని ప్రభువు తెలిపారు,నేను తప్పా ఇంకొక  దేవుడు లేడు అని ప్రవక్తల ద్వారా తెలిపారు. చాలా సందర్భాలలో మనందరం కూడా ఈ సత్యాన్ని మరచిపోతూ ఉంటాము ఎందుకంటే మనందరం వివిధ రకాలైనటువంటి విశ్వాస పద్ధతులను అనుసరిస్తాం కానీ దేవుడు ఒక్కరే. ఒకవేళ మనం వేరే మత సాంప్రదాయాలను అనుసరించినట్లయితే అది దేవునికి విరుద్ధముగా జీవించినట్లే. కాబట్టి దేవుడు ఒక్కరే అని తెలుసుకొని ఆయనను మనం విశ్వసించి అనుసరించాలి. ఈనాటి 
రెండవ పఠణంలో పౌలు గారు తెస్సలోనిక ప్రజల యొక్క విశ్వాస జీవితాన్ని మెచ్చుకుంటున్నారు ఎందుకంటే వారు అక్కడ పరిచర్య చేసినటువంటి సందర్భంలో అన్ని విధాలుగా సహకరించి నందుకు అదేవిధంగా దేవుని ఎడల విశ్వాస పాత్రలుగా జీవించినందుకు. పౌలు గారు తెస్సలోనిక ప్రజల యొక్క విశ్వాసం, ప్రేమ, నిరీక్షణను మెచ్చుకుంటున్నారు.
ఈనాటి సువిశేష పఠణంలో పరిసయ్యులు ఏసుప్రభువును సుంకము గురించి అడిగినటువంటి ప్రశ్న తెలుసుకుంటున్నాం. ఏసుప్రభువు చక్రవర్తికి సుంకమును చెల్లించాలా? లేదా అనేటటువంటి ప్రశ్న అడుగుతున్నారు దానికి ప్రతిఫలముగా ప్రభువు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే నాణెము మీద ఉన్న రూపంను బట్టి సుంకములు చెల్లించవలసిందిగా తెలుపుతున్నారు. వాస్తవానికి వీరు యొక్క ఉద్దేశం ఏంటంటే ఏసు ప్రభువుని ఏ విధంగానైనా సరే పట్టించాలి అనే ఆలోచన. ఒకవేళ ఏసుప్రభు సుంకము చెల్లించవద్దు అని అన్నట్లయితే ఆయన రోమా చక్రవర్తులకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు అని ఆయన మీద కుట్ర పన్ని ఆయనను శిక్షించాలని అనుకుంటున్నారు. ప్రభువు వారికి చక్కగా సమాధానం ఇచ్చారు. నాణెము మీద చక్రవర్తి రూపము ఉన్నది కాబట్టే అతనికి సుంకము చెల్లించవలసిన అవసరత ఉన్నది అదేవిధంగా మనందరం కూడా దేవుని యొక్క రూపంలో సృష్టించబడ్డాము కాబట్టి మనము ఆయనకు(దేవునికి) చెందినటువంటి వారమైట్లయితే మరి ఆయన యెడల ఉన్నటువంటి మన యొక్క బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నామా? దేవుడు మన జీవితంలో మనకు కావలసినవి ఇచ్చారు మరి మనం ఆయన యెడల ఎలాంటి విశ్వాసం వ్యక్తపరుస్తున్నాము? ఏ విధముగా ఆయన యొక్క ఆజ్ఞ పాటిస్తున్నా మీ? ఏ విధముగా ఆయన చిత్తమును మన జీవితంలో నెరవేరుస్తున్నాము?. మనందరి యొక్క జీవితంలో దేవుని యొక్క రూపం ఉన్నది కాబట్టి మనము దేవునికి చెందిన వారము కావున దేవుడి యొక్క మాట ప్రకారముగా మనం జీవించటకు ప్రయత్నం చేయాలి.
మనకి భూలోక పౌరసత్వము అదేవిధంగా పరలోక పౌరసత్వం ఉన్నది కాబట్టి మనము ఈ లోకానికి చెందినటువంటి ప్రభుత్వమునకు సంబంధించినటువంటి బాధ్యతలను నెరవేర్చాలి అదేవిధంగా దేవుడికి సంబంధించినటువంటి బాధ్యతలను కూడా నెరవేర్చాలి.
Fr. Bala Yesu OCD

14, అక్టోబర్ 2023, శనివారం

 

ఇరువదిఎనిమిదవసామాన్యఆదివారము

యెష:25:6-9 ;ఫిలి: 4:12-14,19-20 ;మత్త: 22: 1-14

 

"పిలువబడినవారుఅనేకులు, ఎన్నుకున్నవారుకొందరే".

మొదటి పఠనము:

1.రాబోవుయేసుక్రీస్తుగురించితెలియజేస్తుంది.

అయన వస్తే ఏంజరుగుతుంది, ఎం జరుగబోతోందో తెలియజేస్తుంది.

ఒక సారి చారిత్రక నేపధ్యాన్ని చూసినట్లయితే, క్రీస్తు పూర్వం లో ఉజ్జియా రాజు మరణించిన తరువాత అర్ధ శతాబ్దం పాటు ఇశ్రాయేలీయులు అశూరు రాజుల ద్వారా దాడులను  ఎదుర్కొన్నారు.  అట్టి పరిస్థితులలో యెషయా ప్రవక్తను దేవుడు ఎన్నుకొని వారితరఫున మాట్లాడటానికి వారికి ఊరటను రక్షణను కలుగజేయడానికి వారి చెంతకు పంపిస్తున్నాడు.

అయితే ఇక్కడ ప్రవక్త పర్వతము మీద ఒక విందు జరుగబోతోంది అని తెలియ జేస్తున్నాడు.

ఈవిందు పర్వతముపైన జరిగే యేసుక్రీస్తు యొక్క బలిదానం.

యేసుప్రభువుయొక్క భాలిద్వారానే ప్రజలకు రక్షణ వాటిల్లుతుంది. అదివారి పాపపు ముసుగును తీస్తుంది :పశ్చాత్తాప పడిన పాపులు నూతన నిబంధనలో పండగచేసుకోవడం మనం చూస్తున్నాం.ఉదాహరణకు సుంకపుమెట్టుదగ్గర కూర్చున్న మత్తయి గారు. యేసు ప్రభువు ఎప్పుడయితే తనను అనుసరింపమనిచెప్పాడో వెంటనే అంతా విడిచిపెట్టి యేసుప్రభువుని అనుసరించాడు. తరువాత వెంటనే తన ఇంటిలోనే అందరిని పిలిచి భోజనముపెడుతున్నాడు. అది దీనిలో వున్నా పరమార్ధము. (మత్త:9:9-10).

కన్నీళ్లను తుడిచి వేస్తుంది:

వ్యభిచారము పట్టుహాదిన స్త్రీ యేసుప్రభువు దగ్గర పశ్చాత్తాపముతో కన్నీరు కార్చింది. (యోహా:8:11).

అవమానములను తొలగిస్తుంది:

బెతానియాలో మరియమ్మ పరిమళ ద్రవ్యముతో వచ్చి తన అవమానమును తొలగించుకోవడానికి తన వెంట్రుకలతో పరిమళ ద్రవ్యమును తెచ్చి యేసు పాదములను తుడిచెను. (యోహా: 12:3)

 

ఇంకా మృత్యువును సహితము నాశనము చేస్తుంది:

లాజరుని దేవుడు తిరిగి మరణమునుండి లేపాడు( యోహా:11:42, “పిమ్మట యేసు బిగ్గరగా లాజరూ! వెలుపలికి రమ్ముఅని పలికెను. వెంటనే అతడు జీవము పొందెను.

 ఇదంతా ఎప్పుడు సంభవిస్తుంది అంటే, ఆదేవాతి దేవుని పైనా అచెంచలమయినా విశ్వాసము ఉంచి తనదగ్గరకు వచ్చినప్పుడు జరుగుతుంది. కానీ మనము మాత్రము చాలా సార్లు మన ఇష్టానుసారం జీవించడానికి ప్రయత్నించి మనకోసం వచ్చిన వారిని కండి స్తాము.

సువిశేష పఠనము:

    ఈనాటి సువిశేష పఠనమును యేసుప్రభువు అక్కడవున్న ప్రజలకు ఒక ఉపమాన రీతిగా తెలియజేస్తున్నాడు. అసలు ఏంటి ఉపమానము అంటే, పెండ్లి పిలుపు గురించి.

మన రోజువారీ జీవితములో మన కుటుంబములలో పెళ్లి జరుగుతుంది అంటే కొన్ని నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఎవరెవరిని పిలవాలి, ఎంతమందిని పిలవాలి. ఎం వంటలు చేయాలి అని చాలా బాగా ప్లాన్ చేస్తాం. ఇలా చేసినతరువాత మనం పిలిచినా వారు రాకపోతే, మన ఆతిధ్యాన్ని స్వీకరించకుండా వారి వారి పనులకు వెళ్ళిపోతే మనకు ఎలా ఉంటుందో ఉపమానము ద్వారా దేవుడు తెలుపుతున్నారు. కాబట్టి ముందుగా సువిశేషములో చూపిన కొన్ని సూచనలను మనం గుర్తిదాం:

 పరలోక రాజ్యము= రక్షణ

రాజు= తండ్రి దేవుడు

కుమారుడు= యేసుక్రీస్తు ప్రభువు

రాజ సేవకులు= ప్రవక్తలు, న్యాయాధిపతులు, అపొస్తలులు

పిలువబడినవారు= ఇశ్రాయేలు ప్రజలు

 ఎన్నుకోబడినవారు=జ్ఞానస్నామును పొందిన ప్రతి ఒక్కరు.

విందు= సంతోషము, ఆకలి తీర్చబడటం( ఆధ్యాత్మిక, భౌతిక), అందరూ కలసి భుజించడం  ఇంకా చెప్పాలి అంటే దివ్య సప్రసాదము.

ఇక్కడ మనము పరిశీలించినట్లయితే, దేవుడు వారి వారి స్వంత జీవితమునుండి రక్షణ మార్గమునకు ఆహ్వానించినప్పుడు ప్రజలు తాను ఎన్నుకున్న వారు మాత్రం దేవునినుండి దూరముగా వెడలిపోతున్నారు. ప్రవక్తలు, న్యాయాధిపతులు ఇలా ఎంతోమంది వచ్చి దేవుని గురించి దైవ రాజ్యం గురించి బోధించిన ప్రజల జీవితములో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. తాను ఎన్నుకున్న ప్రజలే దేవుని అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఉదాహరణకు యెషయా గ్రంధములో చూస్తే,“భూమ్యాకాశములారా వినుడు! నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే నామీద తీరుగా బడిరి. అని పలుకుచున్నాడు. (యెష: 1:2).కానీ ఎన్నుకున్న ప్రజలు మాత్రం అర్ధం చేసుకోలేక పోయారు.

 మరి దేవుడు మన జీవితములలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాకానీ మనం మాత్రం మన స్వలాభాముకోసమే చూస్తాము. పాత నిబంధన గ్రంధములో చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు దేవునికి విరోధముగా ఎదురుతిరిగారు. కానీ దేవుడు మాత్రం వారిని ప్రేమించివున్నాడు. కానీ కొన్నిసార్లు మాత్రమే వారిని శిక్షించి వున్నాడు. ఎందుకంటే, ఇకనయినా వారు మారతారేమోఅన్న  చిన్ననమ్మకం వారిపైన.

రాజు తన సేవకులు:

  రాజుదగ్గర వుండే సేవకుల పని ఏమిటంటే తన రాజుగారు చెప్పిన పనిని నిర్వర్తించడమే వారికున్న పని. ఎంత కష్టం వచ్చిన ఎన్ని భాధలు ఎదురయినా వెనుతిరగకుండా ఆపనిని పూర్తిచేసేవాడే నిజమైన సేవకుడు. అయితే ఇక్కడ రాజు అంటే అర్ధం తండ్రి దేవుడు. అయన తనకు మారుగా తన పేరిట తన సేవకులను తాను ఎంచుకున్న ప్రజలదగ్గరికి పంపిస్తున్నాడు. మోషే ప్రవక్తను తన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశీయుల దాస్య విముక్తి చేయడానికి, పాలు తేనె జాలువారు దేశమునకు తీసుకొని వెళ్ళడానికి ఎన్నుకొనుచున్నాడు.  (నిర్గ:3:4-8)

 సమువేలు. ఇతడిని తన చిన్న ప్రాయమునందే ఎన్నుకొని ఎంతోమంది రాజులకు, ప్రజలకు తీర్పరిగా ఉండటానికి రాజులను అభిషేకించడానికి ఎన్నుకున్నాడు. (సమువేలు: 3:10).ఇలా ఎంతోమంది యిర్మీయాను, యెషయాను ఇంకా చాలా మంది సేవకులను ఎన్నుకొని వారిద్వారా దేవుడు మాట్లాడాడు. వారిని ఒక మంచిబాటలో పయనింపచేయడానికి ప్రయాసపడ్డాడు. కానీ ఈనాటి సువిశేష పఠనంలో రాజు మాత్రం తన సేవకులను పంపిస్తున్నాడు. వారు నిరాకరించినా మరొకసారి పంపిస్తున్నాడు. ఇది రాజుకి తన వారిమీద నమ్మకం. దేవునికి కూడా ఇలాంటి నమ్మకం వుంది మనమీద. అందుకే తన సేవకులను మనకోసం పంపిస్తున్నాడు. మరి మన పూర్వికులు మాత్రం ఎప్పుడూవారిని నిరాకరిస్తూ, తప్పుపడుతూ, ఎన్నో హింసలకు గురిచేస్తూ, చంపివేస్తూ వచ్చారు.యూదా ప్రజలు చేసిన పనులు ఇవే. వారికోసం పంపించిన యిర్మీయాను చిత్రహింసలు పెట్టారు. మోషే ప్రవక్తను ఇబంది పెట్టారు, ఎన్నోసార్లు నిందించి వారి స్వంత దేవుళ్లను చేసుకొని పూజించారు (నిర్గ:32:1,4). అయినా  కానీ దేవుడు మాత్రం తన ప్రేమను మాత్రం మనమీద కుమ్మరించడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. ఎప్పుడూ తన రాజ్యంలో చేర్చుకోవాలని చూస్తుంటాడు. తనతోపాటు జీవించాలని చూస్తుంటాడు.

కానీ మనము మాత్రం దేవుని కంటే మన స్వంత పనులకే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తుంటాము.  ఈనాటి సువిశేషములో అదేమనము చూసాము. తాను పిలిచినా ప్రజలు తన పిలుపును నిరాకరించారు, తత్ఫలితముగా  వారు దేవుని రాజ్యములో పాలిభాగస్థులు కాలేక పోయారు.

ఆహ్వానింపబడినవారు:

   వీరు ఎవరయ్యా అంటే, యూదులు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు వీరిని ఎంతగానో ప్రేమించి వారి కన్నీటిని చూసి వారి బలహీనతను చూసి వారిని ఎన్నుకుంటే, వారు మాత్రం అయన నుండి అన్ని పొందిన తరువాత తన దగ్గరనుంచి ఏమి పొందలేదు అన్నట్లు జీవించడం మొదలు పెట్టారు.

వారి బాధలను కళ్ళారా చూసాడు నిర్గ: 3:7. తొమ్మిది అరిష్టములనుండి కాపాడాడు. నిర్గ:6-10.

సముద్రమును రెండుపాయలుగా చీల్చి దానిని దాటేలా చేసాడు నిర్గ: 14:16-19

ఎడారిలో మన్నా ని పురుడు పిట్టలను భుజించారు నిర్గ: 15: 31-35.రాతినుండి నీళ్లు తాగారు నిర్గ:17:6.

ఇలా ఎన్నో రకాలుగా వారిని నడిపిస్తూ, రక్షిస్తూ ప్రథయొక్కదానిని వారికి ఇస్తూ వస్తుంటే వారు మాత్రం రోజురోజుకి దేవునికి విరోధముగా జీవించారు కానీ దగ్గరగా జీవింపలేకపోయారు.వీరిని రక్షించడానికి ఎంతో మందిని పంపిస్తే వీరు మాత్రం వారిని కూడా లెక్కచేయకుండా వారి ఇష్టానుసారం జీవిచి చివరికి వారిని కూడా హత్యలకు, శ్రమలకు గురిచేశారు. అందుకే దేవుడు వారిని ఈనాడు విడనాడుతున్నాడు. ఒకవేళ మనజీవితము కూడా ఇలానే ఉంటే ఈరోజు నీ జీవితము నాజీవితం దేవుడినుండి విడనాడబడి శ్రమలు జీవితాన్ని జీవిస్తూ మరణానికి గురికావలిసి వస్తుంది.

రాజు యొక్క ఉగ్ర రూపం:

రాజుయొక్క ఉగ్రరూపాన్నిదేవునియొక్క ఉగ్రరూపానికి సూచన. మనం చూస్తున్నాం.ద్వితి:4:24, " మీ ప్రభువైన యావే దహించివేయు అగ్నివంటివాడు, అసూయపరుడైన దేవుడు". దేవుడు కోపవాడేవాడు. నిర్గ:32:10:“నీవు నాకు అడ్డు రావలదు. నాకోపము గన గన మంది వారిని బుగ్గిచేయును. ఇది సోదోము గొమొఱ్ఱా ప్రాంతములో ఏవిధముగా నయితే నాశనము  జరిగినదో అదేవిధముగా దేవుడు ప్రజలను హతమారుస్తున్నాడు. ఎందుకంటే వీరికి తనపై వినయము లేదు. తన మాటను దిక్కరించారు.దేవుని చులకనగా చూసారు. దానికి నిదర్శనంగా వారిని నాశనము చేస్తూ, ఒక కొత్త ప్రజలకు అవకాశమును కల్పిస్తున్నాడు. కొత్త ప్రజలే అన్యులు, వెలివేయబడిన వారు. పాపులుగా ఎంచబడినవారు. ఈనాడు మనమందరము కూడానా ఈకోవలోకే చేరుతాం. కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడూ అలా చూడడు ఎందుకంటే ఆయనకు మనమంటే ఎంతో ప్రేమ.

 పాట: చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మినా నా యేసుడు.

అయితే దేవుడు వారు అనుకోని ఆలోచించని ప్రజలను ఎంపిక చేసుకొని తన గృహమునకు ఆహ్వానిస్తున్నాడు. తన కుమారుని పెండ్లి విందుకు ఆహ్వానిస్తున్నాడు. పెండ్లి విందు యేసు ప్రభుని మరణ పునరుత్తానము. ఎవరైతే ఈయొక్క మరణ పునరుతానములలో పాలి భాగస్థులవుతారో వారే రక్షణ మార్గములో కూడా పాలిభాగస్థులవుతారు.

కుమారుడు:

 ఈకుమారుడు యేసు ప్రభువుకి సూచన. అయన తన ఏకైక కుమారుని ఒక పెండ్లికుమారుడిగా పోల్చుతూ, తనదగ్గరకు వచ్చేవారిని అయన సంతోషముగా పంపిస్తాడు అని తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువు జ్ఞానస్నానము పొందు సమయమున తండ్రి దేవుడు పలికిన మాటలు ఒకసారి చూస్తే, మత్త: 3:17,  ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయననుగూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను". తన కుమారుడైన యేసుక్రీస్తునందు ఆనందించుచున్నాడు కాబట్టి తన వివాహము అంటే, శ్రమలు, మరన,  పునరుత్తాన సమయములో అందరికి ఆహ్వానము పంపుతున్నాడు. ఆహ్వానమును అంగీకరించి ఎవరయితే వారికి వారు సంసిద్ధత చేసుకొని వస్తారో వారు ఆనందముతో పాలి భాగస్థులవుతారు.

వివాహ వస్త్రము:

ఇక్కడ వివాహ వస్త్రము పవిత్ర జీవితము. ఎవరయితే పవిత్ర జీవితమును జీవిస్తారో వారే దేవుని వింది అనే సంతోషకరమైన రాజ్యములో ప్రవేశిస్తారు. అయితే ఈనాడు చూసినట్లయితే,

మనమందరము కూడా జ్ఞానస్నానమును పొంది దేవుని బిడ్డలుగా తిరుసభకు బిడ్డలుగా మారి, దేవాతి దేవుని మన జీవితములలోనికి  దివ్య సప్రసాదము ద్వారా స్వీకరిస్తూ వున్నాం.అయితే, వింది అన్నే దివ్య సప్రసాదమును సీకరించాలి అంటే ముందుగా మనల్ని మనము శుద్దులను చేసుకొని దాని తరువాత స్వీకరించాలి. అందుకే ఈనాడు చూస్తున్నాం, వివాహ వస్త్రం లేని వారిని తొలగించి కాలు సేతులు కట్టి, వెలుపల వున్న చీకటిలో త్రోసివేస్తున్నారు. కాబట్టి వివాహ వస్త్రం అనే పరిశుద్ధతను కప్పుకొని దేవుని చెంతకు చేరాలి. నిర్గమా కాండములో చూస్తే, ఎప్పుడయితే మోషే ప్రవక్త దేవునితో మాట్లాడి వచ్చేటప్పుడు తనపై ఒక ముసుగును ధరిస్తుండెడివాడు. ఎందుకంటే, తన ముఖము కాంతివంతముగా మారి ప్రజలకు భయాన్ని పుట్టించేదిలా ఉండేది. నిర్గ: 34:34; "అతడు యావే సన్నిధిని మాటలాడుటకు వెళ్ళినప్పుడల్లా అటనుండి తిరిగివచ్చువరకు మొగముమీద ముసుగును తొలగించెడివాడు, మరలా ప్రభువు సన్నిధికి వేళ్ళు వరకు ముఖమును ముసుగుతో కప్పుకొనెడివాడు".దర్శన గ్రంధములో చూస్తే, వస్త్రం దయించడం అంటే,

నిజాయితీ కలిగిన జీవితాన్ని జీవించడం.

పాపము తొలగిపోవడం.

క్షమను పొందటం.

ఉదా: తప్పిపోయిన కుమారుడు. తన తండ్రి తన పాత, మురికిగా వున్న వస్త్రాలను తీసి రాజ వస్త్రాలను ధరింపచేస్తున్నాడు. దీని అర్ధం పాపము తొలగింపబడి పరిశుద్ధతను, నిజాయితీ జీవితమును పొందుకోవడం (లూకా: 15:22).

రెండవ పఠనము:

పునీత పౌలు గారు, క్రీస్తు అనుగ్రహించు శక్తితో ఎటువంటి పరిస్థితినయినా ఎదుర్కొనగలగాలి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈనాడు మనమందరము కూడా ఆదేవాతి దేవుడు ఇచ్చినటువంటి పిలుపుని అంగీకరించి అయన ప్రియమైన కుమారులుగా, సేవకులుగా జీవిస్తూ అయన రాజ్యములో పాలి బాగస్తులవుతూ, అయన ఇచ్చు వరములను అనుగ్రహములను పొందుకుంటూ, ఆయనకు తగిన బిడ్డలుగా జీవించడానికి ప్రయాసపడదాం. అప్పుడు క్రీస్తు యేసు నందలి మహిమైశ్వర్యముల కనుగుణముగా మన అవసరములను తెరుస్తూ, మనతో ఎప్పుడూ చిరకాలము వుండాలని దానికంటే ముందు అదేవాతి దేవునికి సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ జీవించడానికి ప్రయాసపడదాం. ఆమెన్.

డీకన్. జోసెఫ్ మారియో సి డి.

 

 

 

 

 

 

 

 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...