9, మార్చి 2024, శనివారం

తపస్సుకాలం నాలుగవ ఆదివారం

తపస్సుకాలం నాలుగవ ఆదివారం
2 రాజుల దినచర్య 36:14 -16, 19-23, ఎఫేసి 2:4-10, యోహాను 3:14-21
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని యొక్క దయార్ధ హృదయము గురించి తెలియజేయుచున్నవి. దేవుడు రక్షణను అందరికీ దయచేసి ఉన్నారు, తన యొక్క కుమారుడు యొక్క మరణ, పునరుత్థానము ద్వారా అయితే మన యొక్క రక్షణ నిమిత్తమై ప్రతినిత్యం మనందరం కూడా కృషి చేయాలి. ప్రభువు మనందరికీ కూడా రక్షణ ఉచితముగా ఇచ్చి ఉన్నారు అనే సత్యం తెలుసుకొని మనము కూడా ఆయనకు విశ్వాసపాత్రులుగా జీవించాలి. ఈ తపస్సు కాల నాలుగు ఆదివారాన్ని Gaudate Sunday అని పిలుస్తారు అనగా ఆనందించు ఆదివారము అని అర్థం. ప్రభువు యొక్క పునరుత్థానము దగ్గరలో ఉన్నది కాబట్టి మనందరం సంతోషించాలి.
ఈనాటి మొదటి పఠణంలో దేవుని యొక్క దయ గురించి తెలుపుచున్నారు అదేవిధంగా దేవుని యొక్క సహనం గురించి తెలుపుతున్నారు. రాజుల దినచర్య రెండవ గ్రంథము ఇశ్రాయేలు ప్రజల యొక్క మొదటి రాజు సౌలు రాజు దగ్గర నుండి (1030 B.C), యూదా ప్రజలు బాబిలోనియా (550) బానిసత్వము గురించి తెలుపుచున్నది. మొదటి రాజు దగ్గర నుండి బానిసత్వం వరకు కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా వారికి తోడై దీవించి వారి నడిపించారని తెలుపుచున్నది అదే విధముగా బానిసత్వం అనేది వారి యొక్క పాపము జీవితమునకు శిక్షగా దేవుడు వారికి ఇస్తున్నారు. యూదులు ఇతర ప్రజల నుండి ఆ గౌరవప్రదమైన ఆచారాలు నేర్చుకున్నారు. ఈరోజు విన్న ఈ భాగంలో ఏ విధముగా ఇస్రాయేలు ప్రజలు దేవుని నివాస మైనటువంటి యెరుషలేము దేవాలయమును, సొంత భూమిని కోల్పోయినటువంటి అంశమును చదువుకుంటున్నాము. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవాలయమునకు ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను ఇవ్వలేదు ప్రభువు యొక్క పవిత్ర మందిరమును అమంగళము చేశారు. ఇది వారి యొక్క పాపపు జీవితమునకు, గర్వమునకు నిదర్శనం. దేవుడిని కాదని అన్య దైవముల వెంట వెళుతూ వారు ఈ యొక్క పాపపు క్రియలకు పాల్పడ్డారు. వారు ఎంత పాపం చేసినప్పటికీ దేవుడు మాత్రము వారి యొక్క హృదయ పరివర్తన నిమిత్తమై ప్రవక్త తర్వాత ప్రవక్తలను పంపుచున్నారు ఇది ఆయన యొక్క దయార్ధ హృదయమునకు నిదర్శనముగా ఉంటుంది ఆయన వారు మారాలనుకున్నారు కాబట్టి వారి కొరకు ప్రవక్తను పంపిస్తున్నారు. కొన్ని సందర్భాలలో ప్రజలు హృదయ పరివర్తనం చెందనప్పుడు వారిని శిక్షిస్తున్నారు, చెందినప్పుడు వారిని దీవిస్తున్నారు. ఈ యొక్క శిక్ష సరిదిద్దుటకే కానీ నాశనం చేయటానికి కాదు. ఆయన శిక్షలో ప్రేమ ఉంది ఆయన కోపములో అనురాగం ఉంది ఆయని యొక్క ప్రేమ, కరుణతో కూడుకున్నటువంటి ప్రేమ. ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి పారశీక దేశ రాజు అయిన సైరస్ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విముక్తులను చేస్తున్నారు వారు మరొకసారి సొంత భూమికి వెళ్లి, సొంత దేవాలయమునకు దేవాలయమును తిరిగి నిర్మించుటకు అవకాశము దయ చేస్తున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో కూడా దేవుని యొక్క కృప అపారమైనది అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆయన మన పట్ల చూపిన ప్రేమ అమితమైనది అని తెలుపుతున్నారు. కేవలము దేవుని యొక్క కృప వలన ద్వారానే మనందరం కూడా రక్షించబడుతిమి. మనందరం కూడా క్రీస్తు ప్రభువుతో ఐక్యమై జీవించినట్లయితే దేవుని యొక్క రాజ్యములో, మనము ప్రభువుతో పాటు కూర్చుండ చేస్తారు. పౌలు గారు ఇదంతా కూడా దేవుడు మానవునికి ఉచితంగా ఇచ్చినటువంటి బహుమానం కాబట్టి ఆయన ఇచ్చిన వరమును మనము ఎప్పుడూ కూడా సద్వినియోగపరచుకుని జీవించాలని పలికారు.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు నికోదేముతో సంభాషించిన అంశము గురించి తెలుపుచున్నది. నికోదేము ఒక ధనవంతుడు, పరిసయ్యుడు. ఆయనకు ఏసుప్రభు నందు విశ్వాసము ఉన్నది అందుకు కాబట్టే పరలోక సంబంధమైనటువంటి అంశములను గురించి చర్చించారు. నికోదేము ఏసుప్రభు తో సంభాషించేటప్పుడు ప్రభువు రక్షణము గురించి తెలియజేస్తున్నారు.
మోషే ప్రవక్త ఎడారిలో ఏ విధముగానైతే సర్పము నెత్తి ఉన్నారో ఆ సర్పమును చూసినటువంటి వారందరూ కూడా రక్షించబడితిరి. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4-9 వచనాలలో చదువుకునేది ఏమిటంటే ఇజ్రాయేల్ ప్రజలు మోషే ప్రవక్తకు దేవునికి విరుద్ధముగా మాట్లాడిన సందర్భంలో దేవుడు వారిని పాము కాటు ద్వారా శిక్షిస్తున్నారు. వారిని రక్షించుట నిమిత్తమై మరొకసారి దేవుడు మోషేను కంచు సర్పము చేయమని తెలుపుచున్నారు. ఈ యొక్క కంచు సర్ఫము వైపు ఎవరైతే పశ్చాతాపముతో చూస్తారో వారందరూ కూడా రక్షించబడుతారు అని ప్రభువు తెలుపుతున్నారు, వారు పశ్చాతాపంతో చూసిన విధముగానే రక్షింపబడ్డారు. అదే విధముగా ఏసుప్రభువు కూడా ఎత్తబడిన సందర్భములో మనందరం కూడా ఆయన యొక్క సిలువను చూసి పశ్చాతాపబడినప్పుడు మనము కూడా రక్షించబడతాము. ఆ సిలువ నాథుడు మనందరి యొక్క రక్షణకు కారణం అవుతారు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించారు కాబట్టి ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమవలన బారమైనటువంటి ఆ శిలువను మోసుకుని వెళ్లారు. ఆయన మనలను రక్షించుటకే వచ్చారు కానీ ఖండించుటకు రాలేదు కాబట్టి మనము కూడా ఆ యొక్క సిలువను చూస్తూ హృదయ పరివర్తనం చెందుతూ జీవించాలి. ఏసుప్రభును విశ్వసించేవారు ఖండింపబడరు కానీ ఎవరైతే విశ్వసింపరు వారు ఖండించబడి ఉన్నారు అని తెలుపుతున్నారు. ప్రభువు యొక్క శిలువను చూస్తూ ఆయన విశ్వసిస్తే ఆయన మన మీద చెప్పిన కరుణను ప్రేమను దయను మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క అనుదిన జీవితాల్లో కూడా ఇవి పాటించేలాగా మనం మారాలి అలాగే దేవుడు యొక్క వెలుగును మనందరం కూడా కలిగి ఆ వెలుగును ఇతరులకు పంచాలి.
Fr. Bala Yesu OCD

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...