12, ఆగస్టు 2023, శనివారం

 

19 సామాన్య ఆదివారము

1 రాజులు 19 :9 , 11 -13

రోమా 9 : 1 - 5

మత్తయి 14 : 22 - 33

క్రిస్తునాధుని యందు ప్రియా సహోదరి సహోదరులారా!

ఈనాడు తల్లి తిరుసభ 19 సామాన్య ఆదివారములోనికి ప్రవేశిస్తున్నది. ఒక మనిషి తన జీవితంలో అనేకమైన సందర్భాలలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటు ఉంటాడు. మనము ఎదుర్కొనే సమస్యలు, అన్నింటిలో దేవుని యొక్క చేయూత మన జీవితంలో ఉన్నట్లయితే మన సమస్యలు అన్ని కూడా ఒక సమస్యగా కనిపించకుండా ఒక సాధారణ విషయంగా కనిపిస్తూ ఉంటుంది. ఈనాటి మూడు దివ్య గ్రంథ పఠనాలు మనము ధ్యానించినట్లయితే మనయొక్క జీవితము గురించి మన జీవితంలో ఎదుర్కొనే సమస్యల గురించి తెలియజేస్తున్నాయి. మనకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాము, మనము ఏం చేయాలి అనేది ఈనాటి మూడు పఠనాలలో మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మనము ధ్యానించుకున్నట్లు అయితే జీవన నౌక అనే అంశాన్ని మనము గమనించవచ్చు.

నౌక అనగా మనకు గుర్తు వచ్చేది ఏంటంటే నీటి పై పయనించే ఒక వాహనము. యొక్క నౌకను చుస్తే ఎంతో ప్రశాంతంగా విహరిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది కానీ యొక్క నౌకను నడిపే నౌక దారికి మాత్రమే తెలుస్తుంది నౌకను నడపడం ఎంత కష్టమైన పని అని. నౌక హరి అనేవాడు లేక పోతే నౌకకు ఒక గమ్యము అనేది లేకుండా పోతుంది. అపుడు అది దాని పతనానికి ధరి తెస్తుంది. అదే నౌక ధరి ఉన్నట్లయితే అది దాని గమ్యానికి చేరుకుంటుంది. మన యొక్క జీవితాలు కూడా యొక్క నౌకను పోలి ఉన్నాయి. మరి మన జీవితాలకు నౌకాదరి ఎవరన్నా ఉన్నారా అంటే అది ఒక దేహ్వుని వాక్యము మాత్రమే. కీర్తనల గ్రంధము 119 : 105 వచనంలో మనం చూస్తున్నాం " నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు". దేవుని యొక్క వాక్యము మన జీవితాలలో ఉన్నట్లయితే వాక్యము మనలను మన యొక్క గమ్యము వైపు నడిపిస్తుంది అంటే దేవుని యొక్క చేయూత మనకు ఉన్నట్లయితే మనం గమ్యము వైపు పయనించగలం. మరి దేవుని యొక్క చేయూత మనకు కలగాలి అంటే దేవుని పట్ల మనము ధృడమైన నమ్మకము కలిగి ఉండాలి. విధమైన నమ్మకము అనేది మనము ఈనాటి మొదటి పట్టణములో ఏలీయా ప్రవక్త జీవితం ద్వారా మనము చూస్తూ ఉన్నాం.

ఏలీయా ప్రవక్త గురించి మనము చూస్తున్నాము తాను విధంగా బాలు దేవతలను వధించి యావే ప్రభువు మాత్రమే నిజమైన దేవుడని విధంగా నిరూపించాడో. మనకు విదితమే. అదే అలియా ప్రవక్తే ఏనాడూ తన యొక్క ప్రాణ రక్షణార్ధమై పారిపోవడాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలతో ఇదిగో మీరు  మిమ్మల్ని బానిసత్వము నుండి కాపాడిన యావే ప్రభుని మరిచి యెజెబెలు రాణిచే సృష్టించిన చిల్లర దేవుళ్లను అనగా అన్య దేవుళ్లను ఆరాధిస్తున్నారు. మరు మనసు పొందండి అని ఇశ్రాయేలు ప్రజలను ఖండిస్తున్నాడు. యెజెబెలు రాణి ఇది అంత చూస్తూ తనయొక్క సైన్యంతో ఏలీయా ప్రవక్తను హతమార్చమని ఆజ్ఞాపిస్తుంది. ఏలీయా తన యొక్క ప్రాణ రక్షణార్ధమై దేశాన్ని వదిలి వెళ్లిపోవడం జరుగుతుంది.

ఎందుకు ఏలీయా ప్రవక్త ఇలా చేసాడు అంటే తాను నమ్మింది ఒకే ఒక్క శాసనం. అది ఏంటంటే "యావే ప్రభువు మాత్రమే దేవుడు. “యావే ప్రభువు తప్ప మరియొక్క దేవుడు లేడు" అనే ఒక ధృడ నమ్మకాన్ని కలిగి ఉండి ఒక్క మాటకై తన యొక్క ప్రాణాన్ని ఫణంగా పెడుతూ ఉన్నాడు. ఏలీయా ప్రవక్త పారిపోతూ ఉన్నాడు ఎవరి దగ్గిరకి అని అంటే మానవమాత్రుడి దగ్గిరకు కాదు కానీ దేవుని దగ్గిరకి పారిపోవుచు ఉన్నాడు. ఏలీయా ప్రవక్త మానవుని కాక దేవుని నమ్మి ఉన్నాడు కాబట్టి దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా మన జీవితాలలో కూడా మనము అనేకమైన సమస్యలను ఎదుర్కొంటు ఉన్నాము. కానీ మనము దేవుని తప్ప అందరిని ఆశ్రయిస్తాము. కానీ మనము కూడా ఏలీయా ప్రవక్తలాగ దేవుని ఆశ్రయించినట్లయితే మన సమస్యలకు దేవుడే పరిష్కారం చూపిస్తాడు.

రెండొవ పట్టణములో పునీత పౌలు తనయొక్క జీవితంలో దేవుడు చేసిన మేలులను గుర్తు చేసుకొంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మొదటి వచనాలలో మనం చూస్తున్నాము. " నేను క్రీస్తునందు సత్యము పలుకుచున్నాను. అసత్యము పలుకుట లేదు". యేసు క్రీస్తు నిజముగా ప్రభువు. అని తన యొక్క నమ్మకాన్ని ప్రకటిస్తున్నాడు.

ఈనాటి సువిశేష పట్నంలో యేసు ప్రభు తనయొక్క శిష్యులకు ఒక అభయాన్ని ఒసగుతూ ఉన్నాడు. శిష్యులు పడవలో ప్రయాణం చేస్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు యేసు వారిని రక్షించడానికి నీటిపై నడిచి రావడాన్ని మనం చూస్తున్నాము. కానీ సిష్యులు యేసు ప్రభుని గుర్తించక పెను భూతము అనుకొని భయపడి నపుడు" భయపడవలదు, నేనే కదా " అని వారికి అభయాన్ని ఒసగుతూ ఉన్నాడు. కానీ పేతురు అవిస్వాసుడై ప్రభు అది నీవే అయితే నీటి పై నడచి రావడానికి నాకు ఆజ్ఞ ఇమ్ము అని ప్రభుని కోరినప్పుడు అలాగే రమ్ము అని ప్రభు పలికితే పేతురు తన దృష్టిని ప్రభుని వైపు కాక తన భయము వైపు మలిచి తన యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకున్నాడు. ప్రియా బిడ్డలారా !మనయొక్క జీవితాలలో ఎదో ఒక విధంగా దేవుని యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతున్నది. కానీ పేతురు వాలే మనము మన దృష్టిని మనకు కావలసిన వాటి మీద కాక వేరే వాటి పై దృష్టి సారిస్తున్నాము. మన యొక్క విశ్వాసాన్ని మనమే పరీక్షించుకుంటున్నాము.

మరి మన యొక్క దేవుని పై ఉండాలంటే మనము చేయవలసిన ఒక పని ఏంటంటే ఏలీయా ప్రవక్తలాగ, పౌలు గారు లాగ " యావే ప్రభువు మాత్రమే నిజమైన దేవుడు" అని  ధృడమైన నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము ధృడమైన నమ్మకాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నిధం. ముందుగా మనము చెప్పుకున్న విధంగా మన జీవన నౌకకు అనగా మన జీవితానికి దేవుని యొక్క వాక్యాన్ని మూలముగా చేసుకున్నట్లయితే మనయందు దేవుని రక్ష ఉంటుంది కాబట్టి యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితానికి మార్గ చూపరిగా నియమించుకుందాం. " నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు". ఆమెన్.

బ్రదర్ పవన్ కుమార్ . సి. డి

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...