30, డిసెంబర్ 2023, శనివారం

తిరు కుటుంబ ఉత్సవము

తిరు కుటుంబ ఉత్సవము
సిరాకు 3:2-6,12-14
కొలోస్సీ 3:12-21
మత్తయి 2:13-15,19-23

ఈనాడు తల్లి శ్రీ సభ తిరు కుటుంబ పండుగ జరుపుకుంటుంది. ఈ పండుగను 15వ బెనెడిక్ట్ పాపుగారు 1921 వ సంవత్సరంలో ప్రారంభించి ఉన్నారు. క్రిస్మస్ పండుగ జరుపుకున్న సందర్భంలో అదే విధముగా ఒక సంవత్సర చివరి ఆదివారమును ముగించుకొని ఇంకొక కొత్త సంవత్సరములోనికి అడుగుపెట్టేముందు మనము తిరు కుటుంబ పండుగను కొనియాడాలని శ్రీ సభ నిర్ణయించుకున్నది ఎందుకనగా తిరుగు కుటుంబమువలె మన కుటుంబం కూడా ఉండాలి కాబట్టి.
తిరు అనగా పవిత్రమైన కుటుంబం అని ఆదర్శవంతమైన కుటుంబం అని అర్థం. యేసు, మరియమ్మ తల్లి మరియు యేసేపు గార్ల కుటుంబమును తిరు కుటుంబ అని పిలుస్తారు. వీరి కుటుంబం ప్రపంచంలో ఉన్న అన్ని కుటుంబములకు ఒక నిదర్శనం అని చెప్పవచ్చు.
ఈ పండుగను జరుపుకునే సమయంలో మన కుటుంబాలు తిరు కుటుంబము వలె దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నదా అని పరిశీలన చేసుకోవాలి. 
పాత నిబంధన గ్రంథములో మనము కొన్ని కుటుంబాలను చూస్తున్నాం దేవునికి అతిసమీపముగా జీవించిన కుటుంబాలు ఉదాహరణకు నోవా,అబ్రహాము, ఈ సాకు, యాకోబుల కుటుంబములు ఇంకా మిగతా కొన్ని కుటుంబములు కూడా ఉన్నాయి.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు బిడ్డల యొక్క కర్తవ్యం గురించి తెలియజేస్తున్నారు. బిడ్డలు తమ తల్లిదండ్రులకు ఎల్లవేళలా విధేయులై జీవిస్తూ వారిని ప్రేమిస్తూ మంచిగా చూసుకోవాలి అని తెలుపుచున్నారు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మరువక వారి యెడల ఒక కుమారుడిగా, కుమార్తెగా  చేయవలసినటువంటివి(బాధ్యతలు నెరవేర్చుట) అన్నియు చేసి వారి యొక్క దీవెనలు పొందాలి అని ప్రభువు, వాక్యం ద్వారా తెలుపుచున్నారు.
ప్రస్తుత కాలంలో చాలామంది సమాజంలో తమ తల్లిదండ్రులను చూసుకోవటం లేదు, వారిని అనాధలుగా విడిచిపెడుతున్నారు. అదేవిధంగా కొంతమందైతే వారిని అనాధ ఆశ్రమంలో ఉంచుతున్నారు ఇంకా కొంతమంది తల్లిదండ్రులను వాటా వేసుకుని మూడు నెలలు నా దగ్గర మూడు నెలలు అన్న దగ్గర జీవించు తెలుపుతున్నారు కానీ ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకనగా మన తల్లిదండ్రులు లేనిదే ఈ లోకంలో మనం లేము వారే మనల్ని ప్రేమించారు మనకి కావలసినది ఇచ్చారు మన యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు కాబట్టి వారి జీవితమును ఎన్నడూ కూడా మరువకుండా వారిని ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఒక మంచి బిడ్డగా ప్రతి ఒక్కరూ జీవించాలి. ఈనాటి రెండవ పఠణంలో పౌలు గారు మనందరం కూడా వినయము, దయా, కనికరము, ప్రేమ, కలిగి ఒకరి ఎడల ఒకరు సంతోషముతో జీవించాలి అని తెలుపుచున్నారు. ప్రతి కుటుంబంలో సంతోషము, ప్రేమ అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే ఆ కుటుంబములు ఎల్లప్పుడూ కూడా సంతోషంగానే ఉంటాయి.
ఈనాటి సువిశేష భాగములో ఏసేపు గారు మరియ తల్లి, బాల యేసును తీసుకొని ఐగుప్తునకు వెళుచున్నారు అదేవిధంగా హేరోదు రాజు మరణము తర్వాత శిశువును తీసుకొని ఇశ్రాయేలునకు తిరిగి తీసుకుని రావటమును చదువుకుంటున్నాము. తిరు కుటుంబ పండుగను కొనియాడే సందర్భంలో వీరి యొక్క జీవితములు ఏ విధముగా ఉంటున్నాయి అని మనము ధ్యానించుకోవాలి. వీరు ముగ్గురు కూడా దేవునికి (తండ్రికి, పవిత్రాత్మ కు)సహకరించి దేవుని యొక్క చిత్తమును తమ జీవితంలో నెరవేర్చిన మంచి కుటుంబం. ఒక విధముగా చెప్పుకోవాలంటే తీరు కుటుంబము;
1. దేవునిని విదేయించిన కుటుంబము
2. దేవునికి సహాయం చేసిన కుటుంబము.
3. ప్రేమించే కుటుంబము
4. ప్రార్థించే కుటుంబము
5. త్యాగము చేసిన కుటుంబం
6. దేవుడిని కేంద్రంగా కలిగిన కుటుంబం
7. విశ్వాసము ఉన్న కుటుంబం
కావున ఏ విధముగానయితే తిరు కుటుంబము దేవునికి విధేయత చూపుతూ, దేవుని చిత్తమును ప్రేమిస్తూ, దేవుని కొరకు జీవించి ఉన్నారో అదే విధముగా మన కుటుంబాలు కూడా ఉండాలి.
మన కుటుంబాలు ఏ విధముగా ఉండాలో అని మనమే ఒక నిర్ణయం చేయాలి దానికి తగిన విధముగా ఒక మంచి కుటుంబమును నిర్మించుకోవాలి ఎందుకంటే కుటుంబంలోనే బిడ్డలు అన్నీ నేర్చుకుంటారు కావున తల్లిదండ్రులు బిడ్డలకు సుమాత్రుకగా ఉండుటకు ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు, బిడ్డలను క్రమశిక్షణలో పెంచాలి. బిడ్డలు తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తూ, ప్రేమిస్తూ జీవించాలి. భార్యా భర్తలిద్దరూ కలిసి మెలిసి అర్థం చేసుకుంటూ ప్రేమతో జీవించాలి. ఇదే ప్రభువు మనకు ఈనాడు ఈ పండుగ ద్వారా నేర్పించే అంశం కావున మన కుటుంబములను చక్కదిద్దుకొని దేవునికి ఇష్టకరమైన కుటుంబం గా జీవించుటకు ప్రయత్నం చేద్దాం.
Fr. Bala Yesu OCD

23, డిసెంబర్ 2023, శనివారం

ఆగమన కాలం నాలుగవ ఆదివారం

ఆగమన కాలం నాలుగవ ఆదివారం
2 సమూయేలు  7:1-5,8-12,14,16, రోమి 16: 25-27
లూకా 1:26-38

ఈనాటి దివ్య గ్రంథ పఠనములు ఏసుప్రభు యొక్క మొదటి రాకడను(మనిషావతారం) గురించి తెలియజేస్తున్నది. క్రీస్తు జన్మదినమునకు అతి చేరువలో ఉన్నటువంటి సమయంలో ఈనాటి పరిశుద్ధ గ్రంథ వచనములు ప్రభువు యొక్క రాక కొరకు మన జీవితములను తయారు చేసుకుని సిద్ధగావుండాలి. ఈనాటి మొదటి పఠణంలో దేవుడు దావీదు రాజుకు చేసిన వాగ్దానము గురించి చదువుకుంటున్నాము. దావీదు రాజు దేవుడు తన జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యములు తలచుకొని అదే విధముగా ఆయనను శత్రువుల బారి నుండి కాపాడినటువంటి గొప్ప దేవునికి నివాసము ఉండుటకు  యెరూషలేములో  ఒక దేవాలయమును   నిర్మించాలని భావించి ఉన్నారు కానీ దేవుడు మాత్రము దావీదు కాకుండా ఆయన వంశస్థుడు తనకు దేవాలయమును నిర్మిస్తారని తెలుపుచున్నారు. ప్రభువు దావీదుకు తన వలె ఇశ్రాయేలు ప్రజలను శాంతియుతంగా పరిపాలించుటకు ఒక రాజును పంపిస్తానని తెలుపుతున్నారు. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రకారముగ ప్రభువు ప్రజలను శాంతియుతంగా పాలించుటకు సొలోమోను ఎన్నుకున్నారు అయితే సొలోమోను దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టి దేవునికి దూరమై జీవించి అయితే ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి దావీదు యొక్క రాజ్యం కలకాలం నిలుచును కాబట్టి ఆయన యొక్క రాజ్యము కలకాలము ఉండుట కొరకై దేవుడు తన యొక్క కుమారుడిని ఈ లోకానికి పంపిస్తున్నారు. దావీదు విషయంలో దేవుడు మొదటగా చొరవ తీసుకుని ఆయన ఉన్నతమైన స్థితికి ఎన్నుకుంటున్నారు దేవుడికి దగ్గరగా జీవించారు కాబట్టే ఆయన యొక్క రాజ్యము వారసత్వం కలకాలం ఉండుటకై ప్రజల కొరకు మెస్సయ్యను దావీదు వంశం నుండి జన్మించేలా చేస్తున్నారు
ఈనాటి రెండవ పఠణములో పునీత పౌలు గారు దాచబడిన దేవుని యొక్క పరమ రహస్యం ప్రజలకు తెలియచేయబడినది అని తెలుపుచున్నారు మన యొక్క రక్షణ.
 ఇంకొక విధముగా చెప్పుకోవాలి అంటే దాచబడిన దేవుని యొక్క పరమ రహస్యం అనగా దేవుని యొక్క రూపము అనేక సంవత్సరాలుగా దాచబడినది ఎందుకంటే దేవుడిని ఎన్నడు ఎవరు కనులారా చూడలేదు కానీ మొట్టమొదటిసారిగా దేవుని యొక్క ముఖము ప్రజలందరికీ కూడా తెలియజేయబడినది. ఇంకొక విధముగా చెప్పుకోవాలి అంటే దేవుని యొక్క పరమ రహస్యము ఎన్నో సంవత్సరాలుగా అన్యుల నుండి దాచబడినది కానీ పౌలు గారి యొక్క సువార్త పరిచర్య ద్వారా అది వారికి తెలియజేయబడినది. మనందరి జీవితంలో ఏది అయినా కొత్తది మనకు తెలిసిన యెడల దానిని మనం సంతోషిస్తాము అదేవిధంగా దేవుని యొక్క పరమ రహస్యం మనకు తెలియజేయబడిన సందర్భంలో మనము కూడా సంతోషించాలి. ఈనాటి సువిశేష భాగములో మరియ తల్లికి మంగళవార్తను గాబ్రియేలు దూత తెలియచేయుటను వింటున్నాము మరియ తల్లి దేవుని యొక్క సందేశం మొత్తము కూడా ఆలకించి ఆలకించినటువంటి వాక్యమును విశ్వసించినది. మరియ తల్లి యొక్క విశ్వాస జీవితము చాలా గొప్పది ఎందుకంటే ప్రవక్తల యొక్క ప్రవచనములను సంపూర్ణముగా విశ్వసించినది ఇదిగో కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనును ఆయన ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించును అన్నటువంటి వాక్యము మరియ తల్లి సంపూర్ణంగా విశ్వసించి ఉన్నది కాబట్టి దేవునికి జన్మనివ్వటకు ఆ తల్లి సిద్ధంగాన్నది అదే విధముగా ఆమె తన జీవితమును దేవుని కొరకు సంసిద్ధం చేసుకున్నది దేవుడిని వాక్కు రూపంలో తనలోకి స్వీకరించాలి అని ఆధ్యాత్మికంగా తాను తయారయ్యారు అందుకే మరియ తల్లి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని పలుకుతూ ఉన్నారు. శూన్యము నుండి సృష్టిని చేసినటువంటి దేవుడు, సముద్రం నుండి దారిని చేసిన దేవుడు, ఎడారి గుండా గమ్యమును మార్గం సిద్ధం చేసిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అందుకని మరియతల్లి దేవుని యొక్క వాక్కు జీవము పొందుకుంటుంది అని సంపూర్ణంగా విశ్వసించినది. ఈరోజు మనందరం కూడా క్రీస్తు ప్రభువు యొక్క జననము మన హృదయములో జరగాలి అని మనందరం ఎదురు చూస్తున్న అయితే ఈ నాలుగు వారాల ఆగమన కాల యొక్క సిద్ధపాటు మన జీవితంలో దేవుని యొక్క రాకకు మార్గమును సిద్ధము చేసిన విధంగా ఉంటూ ఉన్నదా? అన్నది మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే క్రిస్మస్ ద్వారా దేవుడు మనకు దగ్గరవుతున్నారు కాబట్టి ఆయన రాక కొరకు మనం మార్గం సిద్ధం చేయాలి.
Fr. Bala Yesu OCD

16, డిసెంబర్ 2023, శనివారం

ఆగమన కాలం మూడవ ఆదివారం

ఆగమన కాలం మూడవ ఆదివారం
యెషయా 61:1-2, 10-11
1తెస్సలోని 5:16-24
యోహాను 1:6-8,19-28
ఈనాటి ఆదివారమును లతీన్ భాషలో "గౌదేతే "ఆదివారం అని పిలుస్తారు అనగా 'ఆనందించు' ఆదివారము అని అర్థం. దివ్య బాల యేసు యొక్క రాక అతి చేరువులోవున్నది, మన యొక్క రక్షణ కూడా అతి సమీపంలో ఉన్నది కాబట్టి ఆయన యొక్క రాక కొరకై మనందరం కూడా ఆనందంతో సంసిద్ధత కలిగి ఎదురు చూస్తున్నాం. ప్రభువు నందు ఎల్లప్పుడూ సంతోషించాలి మనం.
ఈనాటి దివ్య గ్రంథ పఠనంలు కూడా దేవుని యొక్క రాక కొరకై త్వరపడి చేయవలసిన ఆధ్యాత్మిక పనులు చేసి సిద్ధంగా ఉండాలి అనే అంశము గురించి బోధిస్తున్నాయి. మొదటి పఠనంలో దేవుడు యెషయా ప్రవక్తను అభిషేకించిన విధానమును వింటున్నాం.  బాబిలోనియా బానిసత్వంలో జీవిస్తున్నటువంటి యూదులకు దేవుడు సంతోషకరమైన వార్తను అందచేస్తున్నారు అది ఏమిటంటే  "పేదలకు సువార్తను బోధించటానికి, హృదయ వేదననొందిన వారిని దృఢపరుచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును తన యొక్క సేవకుడిని ఎన్నుకుంటున్నాను అని ప్రభువు తెలియచేస్తున్నారు. ఈ మాటలను ఒక్కొక్కటి మనము ధ్యానం చేసుకోవాలి ఎందుకనగా మాటలు కేవలం యెషయా ప్రవక్తకు సంబంధించినవి మాత్రమే కాదు అవి బాధామయ సేవకుడైన ఏసుప్రభుకు సంబంధించిన వచనములు. మెస్సయ్య తన యొక్క భూలోక జీవితంలో చేసినది ఈ పనియే.
పేదలు అనగా లేనివారు- ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క సాన్నిధ్యం లేకుండ జీవిస్తున్నారో వారికి దేవుడిని అందజేయుట. పేదవారు దేవునియందు నిండు నమ్మకం ఉంచి ఆయనపై పూర్తిగా ఆధారపడి జీవించేవారు. దేవుడే వారి యొక్క ఐశ్వర్యం. ప్రవక్త దేవుడి మీద ఆధారపడి జీవించే వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు అని తెలిపారు.
హృదయ వేదననొందిన వారిని దృఢపరుచుటకు దేవుడు ప్రవక్తను అభిషేకిస్తున్నారు అంటే బానిసత్వములో బాధలు అనుభవిస్తూ, నిరాశలో, నిస్పృహలో అన్ని కోల్పోయాము అని బాధలో ఉన్న వారిని బలపరచడానికి ప్రవక్త అభిషేకమును పొందుచున్నారు.
చెరలో ఉన్నవారికి అదే విధముగా బంధింపబడిన  వారికి విముక్తిని కలుగ చేయుటకు అభిషేకమును దయచేస్తున్నారు. ప్రవక్త యొక్క ప్రధానమైన బాధ్యత ఏమిటంటే ఎవరైతే ఈ లోక సంబంధమైన కోరికలలో, పాపములో చిక్కుకుని పోయి ఉన్నారో వారిని విడుదల చేయుటకు అభిషేకమును పొందుతున్నారు. అలాగే శిక్షించేటటువంటి వారిని ఓదార్చుటకు ప్రవక్త నియమింపబడుతున్నారు. ఈ మొదటి పఠనం ద్వారా మనము గ్రహించవలసిన అంశం ఏమిటంటే దేవుడు ప్రజలకు సంతోషమును దయ చేయుటకు వారి మార్గములను సరి చేయుటకు వారికి తాను ఎప్పుడూ తోడుగా ఉన్నారు అని తెలియచేయుటకు ప్రవక్తలను ఎన్నుకొని వారిని తన యొక్క సాధనములుగా ప్రజల మధ్య ఉంచుతున్నారు.
ఈనాటి రెండవ పఠనంలో పౌలు గారు తెస్సలోనిక ప్రజలను సర్వదా సంతోషించమని, ప్రార్థించమని మరియు దేవునికి కృతజ్ఞత తెలియజేయమని తెలుపుచున్నారు. ప్రభువు యొక్క రాకడ జరుగును కావున ఆ అంశం మీద ఎల్లప్పుడూ సంతోషించమని తెలుపుతూ ఉన్నారు. అలాగే దేవునికి ప్రార్ధన చేస్తూ ప్రభువు పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞులై జీవించమని తెలుపుతున్నారు. పౌలు గారు ఈ లోకంలో అంతయు పరీక్షించి కేవలం మనిషిని మాత్రమే అనుసరించమని తెలుపుచున్నారు ఎందుకనగా మంచిని చేసినట్లయితే మనము ఎప్పుడు కూడా సంతోషంతోనే జీవిస్తూ ఉంటాం. అదేవిధంగా దేవుని యొక్క ఆత్మనుసారంగా మనము జీవించాలని పౌలు గారు తెలుపుతున్నారు.
ఈనాటి సువిశేష  భాగములో బప్తిస్మ యోహాను గారు గురించి చెప్పబడినది బప్తిస్మ యోహాను గారు ఈ లోకంలో క్రీస్తునకు సాక్షమిచ్చుటకు వచ్చి ఉన్నారు. అలాగే క్రీస్తు  కొరకు ప్రజలలో మార్గమును సిద్ధం చేయుటకు వచ్చి ఉన్నారు. ఆయన సువార్త పరిచర్య చేసే సమయంలో అనేకమంది ప్రజలలో యోహాను గారే మెస్సయ్య లేదా ఇంకా వేరే ఒకరి కొరకు ఎదురు చూడాలా అనే సందేహాలు చాలా ఉన్నాయి దానికిగాను యెరుషలేములో ఉన్న యూదులు కొందరు యాజకులను, లేవీయులను యోహాను గారి దగ్గరికి పంపిస్తున్నారు, ఆయన ఎవరు అని తెలుసుకొనుటకు. యోహాను గారు తాను క్రీస్తుని కాదని ఒప్పుకొనుటకు ఎటువంటి నిరాకరణ చేయలేదు. ఆయన ఆ సందర్భంలో నేనే క్రీస్తు అని చెప్పినట్లయితే అనేకమంది ఆయనను నమ్మి ఉండి ఉండవచ్చు కానీ యోహాను గారు, నేను ఆయనను కాదు కేవలము ఆయన కొరకు మార్గమును సిద్ధం చేయుట కొరకై పంపబడిన వాడిని పలికారు మరియు నేను ఆయన పాదరక్షలను విప్పుటకైన యోగ్యుడను కాను అని తనను తాను తగ్గించుకొని క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చారు. బప్తిస్మ  యోహాను గారు ఏసుప్రభుకు సాక్ష్యం ఇచ్చుటలో సంతోషంగా ఉన్నారు.ఈయనలో అంత వినయము ఉన్నది కాబట్టే దేవుడు అతని జీవితమును దీవించారు అందుకే ఏసుప్రభు ఈ భూలోకంలో బప్తిస్మ యోహాను గారు గొప్పవారు అని తెలుపుతున్నారు.
ఈనాటి పరిశుద్ధ వాక్యం మనం దేవుడి యందు సంతోషించాలి అనే అంశమును తెలుపుతూ ఉన్నారు కాబట్టి మనం కూడా మంచిని చేస్తూ, మంచిగా జీవిస్తూ, ప్రభు రాకడ కొరకై మన జీవితంను సిద్ధపరచుకుంటూ ఆయన వస్తాడు అనేటటువంటి ఆశతో, ఆనందంతో, ఎదురుచూసి రక్షకుని మన ఇంటికి ఆహ్వానించుదాం.
Fr. Bala Yesu OCD

13, డిసెంబర్ 2023, బుధవారం

దైవ వాక్కు ధ్యానము : మత్తయి 11:11-15

దైవ వాక్కు ధ్యానము : మత్తయి 11:11-15:  మత్తయి  11:11-15 "మానవులందరిలో స్నాపకుడగు  యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ...

9, డిసెంబర్ 2023, శనివారం

ఆగమన కాల రెండవ ఆదివారం

ఆగమన కాల రెండవ ఆదివారం
యెషయా 40:1-5,9-11
2 పేతురు 3:8-14
మార్కు1:1-8
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు రక్షకుని రాకడకై మన హృదయం అనే ఇంటికి మార్గమును సిద్ధము చేయుట అనే అంశం గురించి బోధిస్తున్నాయి. ప్రభు మన యొక్క జీవితంలోకి రావాలి అంటే మనందరం కూడా ఆయన కొరకు ఒక మార్గమును సిద్ధం చేయాలి. ఆ మార్గము హృదయ పరివర్తనంతో కూడిన మార్గం అయి ఉండాలి అదేవిధంగా పవిత్రత కలిగిన మార్గమై ఉండాలి.
ఈనాటి మొదటి పఠణంలో యెషయా ప్రవక్త  బాబిలోనియా బానిసత్వంలో ఉన్న యూదులను ఓదారుస్తున్నారు. 60 సంవత్సరాల సుదీర్ఘ బాబిలోనియా బానిసత్వం నుండి దేవుడు తన ప్రజలకు స్వేచ్ఛనిచ్చి వారిని యెరుషలేమునకు పంపిస్తున్నారు. ఇకమీదట ఇశ్రాయేలు ప్రజలకు  దేవుడు ఒక కాపరిగా తోడుండి వారిని నడిపిస్తారు అనే అంశమును తెలుపుచున్నారు. ప్రవక్త దేవుని యొక్క మాటలను ఈ విధంగా తెలుపుచున్నారు "ఇశ్రాయేలు ప్రజల బానిసత్వం ముగిసినదనియు, వారు తమ పాపములకు రెండింతలుగా శిక్షను అనుభవించారని,వారి శిక్ష ముగిసినదని తెలిపారు. యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల యొక్క బానిసత్వమునకు వారి యొక్క పాపము జీవితమే కారణం చెప్పుటకు నిరాకరించలేదు ధైర్యంగా వారికి చేసిన తప్పిదమును తెలియజేశారు. ప్రభు వారికి విముక్తిని కలుగజేస్తూ ఆయన యొక్క రాకడ కొరకు మార్గమును సిద్ధం చేయమంటున్నారు. ఈ మొదటి పఠణంలో ఒక స్వరం ఈ విధంగా పలుకుచున్నది "ఎడారిలో ప్రభువులకు మార్గం సిద్ధం చేయుడు, మరో భూమిలో మన దేవునికి రాజ పదమును తయారు చేయుడు. ప్రతి లోయ పూడ్చబడాలి, ప్రతి పర్వతము చదును చేయబడాలి అదేవిధంగా మిట్ట పల్లములు సమతలముగా చేయాలి". ఈ మాటలు వాస్తవానికి ప్రజల యొక్క ఆధ్యాత్మిక జీవితమునకు చెందినటువంటివి.
- ఎడారిలో మార్గమును సిద్ధము చేయుట అనగా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం ఎడారిలాగా మారినది అంతా కోల్పోయారు, జీవము లేని విధంగా మారినది. దేవుడు లేనటువంటి జీవితం ఎడారి జీవితంలో లాంటిది. అందుకే ఇశ్రాయేలు ప్రజల  యొక్క జీవితం నిర్జీవంగా మారినది, శాంతి లేదు, సమాధానం లేదు కేవలము నిరాశ, నిస్పృహ మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకే ప్రవక్త అంటున్నారు ఎడారి వలె నిర్జీవముగా ఉన్నటువంటి వారి జీవితములో దేవుని రాకకై మార్గాలు సిద్ధం చేయమంటున్నారు. దేవుడు వారి జీవితము గుండా ప్రయాణిస్తాను అని అంటున్నారు.
- మరు భూమిలో దేవునికి రాజ్యమార్గమును సిద్ధము చేయమంటున్నారు అనగా ఫలించలేనటువంటి జీవితంలో విశ్వాసముతో దేవునికి ఒక మార్గాన్ని సిద్ధం చేయమంటున్నారు.
- ప్రతి లోయ పూడ్చబడాలి అనగా ప్రతి ఒక్కరిలో ఏది కొరతగా ఉన్నదో దానితో వారి జీవితము నింపుకోవాలి అది వినయమైన కావచ్చు, సహనమైన కావచ్చు, ప్రేమ అయినా కావచ్చు, క్షమాపణ అయిన కావచ్చు లేదా ఇతర సుగుణములు ఏవైనా కావచ్చు, కాబట్టి మనలో ఉన్న లోయలను ఈ సుగుణములతో నింపుకోవాలి.
- పర్వతములు, కొండలు నేలమట్టం కావలెను అని ప్రవక్త అంటున్నారు ఈ యొక్క మాటలకు ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే పర్వతములైన, కొండలైనా(hight) ఎత్తుగా ఉంటాయి ఇవి మనలో ఉన్నటువంటి గర్వమునకు, అహంకారంకు చూచనగా ఉన్నాయి కొంతమంది గర్వంతో, అహంకారంతో జీవిస్తుంటారు ఆ యొక్క గర్వము అహంకారం నేలమట్టం అవ్వాలని ప్రవక్త తెలుపుచున్నారు.
- మిట్ట పల్లములు సమతలము కావలెను అనగా మనలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా సరి సమానులే, దేవుని బిడ్డలే అనే ఆలోచనతో కలిసిమెలిసి జీవించాలి.
ప్రజలను పరిపాలించే రాజు వస్తున్నాడు కాబట్టి ఆయన కొరకై మనందరం మన జీవితంలో ఒక మార్గమును సిద్ధపరచినట్లయితే ప్రభువు మన జీవితము గుండా ప్రయాణిస్తూ ఉంటారు. మార్గము ఏర్పరిచినప్పుడు మాత్రమే ప్రయాణము సులువుగా కొనసాగుతుంది అదేవిధంగా మన జీవితమును దేవుని రాక కొరకై సిద్ధం చేసుకున్న సమయంలో మాత్రమే దేవుడు మన గుండా వెళుతుంటారు. కాబట్టి మన కాపరి అయిన దేవునికి మనందరం మన జీవితాలను తయారు చేసుకుందాం.
ఈనాటి రెండవ పఠణంలో పేతురు గారు ఏసుప్రభు యొక్క రాకడను గురించి తెలియజేస్తున్నారు ఆయన యొక్క రాకడ దొంగ వలె వచ్చును కాబట్టి సహనంతో ఉండమని తెలుపుతున్నాను. ప్రభు యొక్క దృష్టిలో ఒక దినము వెయ్యి సంవత్సరములకు అదేవిధంగా వెయ్యి సంవత్సరములు ఒక దినము వలె ఉండును. ఆయన యొక్క రాక ఆలస్యం ఎందుకంటే అనేకమంది విశ్వాసులను రక్షించుటకు ఆయన ఆలస్యంగా వస్తూ ఉంటారు కావున మనము ఆయన యొక్క దినముకై వేచి చూస్తూ మన యొక్క జీవితాలను మనము తయారు చేసుకోవాలి.
ఈనాటి సువిశేష భాగములో బప్తిస్మ యోహాను గారు ప్రజలకు హృదయ పరివర్తనము చెంది పాప క్షమాపణకై జ్ఞాన స్నానము పొందాలని తెలుపుచున్నారు. బప్తిస్మ యోహాను గారు ప్రజలకు భిన్నమైన జీవితమును జీవించారు. అంతయు త్యాగం చేసి ఎడారిలో తన సమయమును దేవునితో గడిపారు అదే విధముగా ఆయన తన సమయమును ఎక్కువగా ప్రార్థించుటకై వినియోగించారు, రోమముల వస్త్రములను ధరించారు, నడుమునకు తోలు పట్టి కట్టుకొని మిడతలను భుజించుచు పుట్ట తేనెను త్రాగుచుండెను. ఆయన ప్రజలను యేసు ప్రభువు యొక్క రాకడ కొరకై సిద్ధం చేస్తున్నారు. యోహాను గారు తన యొక్క సువార్త పనిని ఎడారిలో ప్రారంభించడానికి కారణం ఏమిటంటే పూర్వ వేదంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎడారిలో నివసించుచున్న కాలాన్ని ప్రత్యేకంగా దైవ వరప్రసాద కాలమని యూదులు భావించేవారు. దేవుడు తన ప్రజలకు అతి సన్నిహితంగా ఉన్నాడు అని తెలిపే కాలం అది. దైవ రాజ్యం మొదటిగా ఎడారిలో స్థాపింపబడుతుందని అచటనే మెస్సయ్య ప్రత్యక్షమవుతారని యూదులు భావించేవారు అందుకే బప్తిస్మ యోహాను తన యొక్క బోధనలను ఎడారిలో ప్రారంభించి అనేక మందిని ఉదయ పరివర్తనం చెంది ఎలాగ చేశారు. హృదయ పరివర్తనము చెందితే గాని మన దేవుడిని మనలోనికి ఆహ్వానించలేము. కాబట్టి దేవుడే స్వయంగా మన యొక్క హృదయములోనికి రాబోతున్నారు కావున మన పాపపు జీవితమును, పాత అలవాటులను, కోరికలను, అభిప్రాయాలు వదిలేసి దేవునితో కొత్త జీవితం ప్రారంభించాలి. యోహాను గారు ప్రభువు రాకడ కొరకై ప్రజల జీవితాలను సిద్ధం చేసిన విధంగా మనం కూడా దేవుని రాకకై మన జీవితాలను సిద్ధం చేయాలి.

Fr. Bala Yesu OCD

2, డిసెంబర్ 2023, శనివారం

ఆగమన కాలం మొదటి ఆదివారం


యెషయా 63:16-17, 64: 1. 3-8
1 కొరింతి 1:3-9
మార్కు 13: 33-37
ఆగమన కాలం మొదటి ఆదివారం తో దైవార్చన కొత్త సంవత్సరము ప్రారంభమగుచున్నది. ప్రభువు యొక్క రాకడ ఎప్పుడు ఏ విధంగా జరుగునో ఎవరికీ తెలియదు కావున ఆయన యొక్క రాకడ కొరకు మనము సంసిద్ధులై జీవించాలి. ఆయన రావటము అనేది సత్యం ఎందుకంటే భూమ్యాకాశములు గతించిన గాని నా మాటలు గతించిపోవు అని ప్రభువు పలికారు ఆయన పలికిన ప్రతి మాట తప్పక నెరవేరును. పోయిన దైవార్చన సంవత్సరములో((Year A) ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకై తయారైన విధముగా మరొకసారి మనందరం కూడా క్రీస్తు ప్రభువు యొక్క రాకడ కొరకై తయారై ఉండాలి. 
ఈ యొక్క ఆగమన కాలంలో మనం ప్రభువు యొక్క జన్మము కొరకై ఎదురుచూస్తున్నాం. దేవుడు మన మధ్య మరియు మనలో జన్మించాలి అంటే మనందరం కూడా ఆయనకు ఒక నివాస స్థలమును మన మధ్య మరియు మన హృదయములో ఏర్పరచాలి. 
ఈనాటి మొదటి పఠణంలో  యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు దేవునికి చేసిన పశ్చాత్తాప ప్రార్థన గురించి తెలుపుచున్నారు. పర్షియా దేశమునకు చెందిన సైరస్ రాజు ఇశ్రాయేలు ప్రజలకు స్వేచ్ఛనిచ్చి యెరుషలేము దేవాలయం పునః నిర్మించుటకు అనుమతి ఇచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరమైన విధానమును గ్రహించుకొని వారు పశ్చాత్తాపముచెంది మరొకసారి వారి మధ్య దేవుడిని దిగి రమ్మని ప్రార్థన చేస్తున్నాను. యావే దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆయనను వారి మధ్యకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. వాస్తవానికి ఇశ్రాయేలు దేశం ప్రపంచంలో ఒక మహా రాజ్యముగా రూపొందగలదని ఆశపడ్డారు, కానీ వారి యొక్క పాపపు జీవితం వలన దేవునికి దూరమైపోయి సర్వమును కోల్పోయారు. అలాంటి క్లిష్ట పరిస్థితులు యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు సంతోషకరమైన వార్తను దయచేసి చేస్తున్నారు ఏమిటంటే, దేవుడిని నమ్ముకున్న ప్రజలకు ఆయన ఎప్పుడు చేరువులోనే ఉంటారు అని. దేవుని యొక్క గొప్ప లక్షణం , మంచితనము ఏమనగా ఆయన కొరకు ఎదురు చూసే వారికి తప్పనిసరిగా దర్శనం ఇస్తారు. దేవుడు ఎన్నుకున్న ప్రజలు తప్పు చేసినప్పటికీ, అవిధేయత చూపించినప్పటికీ మాత్రము ఎన్నడు వారిని విడిచిపెట్టలేదు వారికి సహాయంగా ఉన్నారు. కేవలము వారి యొక్క హృదయ పరివర్తన కొరకై కొన్ని సందర్భంలో బానిసత్వంను అనుమతించారు అయినా వారికి తోడుగానే ఉన్నారు.
ఈ మొదటి పఠణం  మొదటి భాగములో ప్రజలు దేవుడు తమ్మును విడిచి పెట్టారు అని భావించారు కానీ రెండవ భాగంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తన పట్ల ఏ విధముగా ప్రవర్తించారో తెలుపుచున్నారు. తన చెంతకు వచ్చిన వారిని, తనను సేవించే వారిని మరియు తన మీద ఆధారపడి జీవించే వారిని ప్రభువు ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు అని తెలుపుచున్నారు. కేవలము ప్రజలే ఆయనను గుర్తించలేకపోయారు అని తెలిపారు. ఆయన యొక్క ఆహ్వానాన్ని స్వీకరించలేదని ప్రభువు పలికారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుడు మనకు ఒసగిన అనుగ్రహాలు గురించి తెలుపుచున్నారు. ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా మనందరికీ కృపానుగ్రహాలు వసగబడెను. ఇది కేవలము ఆయన మనకు ఇచ్చిన ఒక గొప్ప అనుగ్రహం. మనము పాపాత్ములు అయినప్పటికీ కూడా ఆయనయే తన ప్రేమ వలన మనకు అనుగ్రహాలు ఇస్తున్నారు. ప్రభు యొక్క రాకడ కొరకై విశ్వాసముతో ఎదురుచూసే వారికి ఆయన యొక్క అనుగ్రహాలకు కొరత ఉండదు అని కూడా పౌలు గారు తెలుపుచున్నారు. అన్ని విషయములయందు వారిని ప్రభువు సుస్థిరం చేస్తారు.
ఈనాటి సువిశేష భాగములో యజమానుడు ఎప్పుడు వచ్చునో తెలియదు కాబట్టి ఆయన యొక్క రాకడకై సేవకులను జాగరుకులై ఉండమని ప్రభువు తెలుపుచున్నారు. ఈ సువిశేష భాగములో రెండు అంశములను ప్రధానంగా చూస్తున్న ఒకటి వేచి ఉండటం రెండు జాగరుకులై ఉండటం.
1. వేచి ఉండటం, ఎదురు చూడటం- వేచి ఉండటం, చూడటం అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం.
-తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఎదురు చూస్తారు.
-చదువుకునే వారు మంచి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తారు.
- ప్రయాణికులు వాహనముల కొరకు వేచి ఉంటారు.
-సంతానం లేని వారు పిల్లల కొరకు ఎదురు చూస్తారు.
- దేవుడు కూడా మన యొక్క హృదయ పరివర్తన కొరకు ఎదురు చూస్తారు
ఈ విధంగా చాలా సందర్భాలలో అనేక విషయాలలో ఎదురుచూస్తూ ఉంటాం. ఈ సువిశేషంలో యజమానుడు ఎప్పుడు వస్తారు అని సేవకులు ఎదురుచూస్తున్నారు. ఆయన యొక్క రాక ఊహించని సమయంలో జరుగును కావున వారికి ఇచ్చిన పనిని వారు సక్రమంగా చేస్తూ బాధ్యతాయుతముగా మెలగాలి. కాబట్టి దేవుడు మన యొక్క యజమాని కావున మనం ఆయన యొక్క రాకకు ఎదురు చూడాలి. ఈ భూలోకంలో మంచి పనులు చేస్తూ,  మంచి జీవితం జీవిస్తూ దేవుడిచ్చిన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ ఆయన యొక్క రాక కొరకు ఎదురు చూడాలి.
2. జాగరుకులై ఉండాలి- అనేక సందర్భాలలో క్రీస్తు ప్రభువు జాగ్రత్త కలిగి ఉండమంటున్నారు.
శిష్యులను సువార్త సేవకై పంపించే సందర్భంలో మిమ్ములను తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె పంపిస్తున్నాను జాగ్రత్తగా ఉండమంటున్నారు.
అనేకమంది నా పేరిట వచ్చి నేనే అతనిని చెబుతారు కానీ వారి వెంట మీరు వెళ్ళవద్దు జాగరుకులై ఉండమంటున్నారు.
ఈ లోక విపత్తుల ఎడల జాగరూకులై ఉండమంటున్నారు.
ప్రభు అనేక సందర్భంలో జాగరూకత కలిగి జీవించమంటున్నారు ఎందుకంటే మనము పాపములో పడిపోకూడదని, నశించిపోకూడదని, దేవుని యొక్క మార్గమును విడిచి వెళ్ళకూడదని దేవుని యొక్క కోరిక కాబట్టి ఈ ఆగమన కాలంలో క్రీస్తు ప్రభువు యొక్క రాకడ కొరకై ఎదురుచూసే సమయములో ఆయన యొక్క జననం ఆధ్యాత్మికంగా మన హృదయం జరగాలంటే మనము కూడా దేవుడు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ ఆయన యొక్క రాక కొరకు ఎదురు చూడాలి. మనల్ని మనము ఆధ్యాత్మికంగా ఆయనను స్వీకరించుటకు తయారు చేసుకోవాలి. అదేవిధంగా జాగరుకత కలిగి పాపములో పడిపోకుండా దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ జీవించాలి.

Fr. Bala Yesu OCD

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...