30, అక్టోబర్ 2021, శనివారం

ముప్పది ఒకటవ సామాన్య ఆదివారము

 ముప్పది ఒకటవ సామాన్య ఆదివారము 

ద్వితి:6 :2 :6 , హెబ్రి:7 :23 -28 , మార్కు:12 :28 -34 

ఈనాటి దివ్య పఠనాలు  ఆజ్ఞల యొక్క అంతరంగాన్ని, మరియు వాటి అర్ధాన్ని గురిం చి
తెలియజేస్తున్నాయి. అదే దైవ ప్రేమ,మానవ ప్రేమ అని  బోధిస్తున్నాయి.దానితోపాటు
దేవునియొక్క ఆజ్ఞలను మనం పాటిస్తే కలిగే ప్రయోజనాలు గురించి కూడా ఈనాటి పఠనాలు తెలుపుచున్నాయి. మనం దేవుడి చేత సృష్టించ బడినది దేవుడిని ప్రేమించడానికి అదే విధంగా దైవప్రేమను పొరుగువారితో పాటించడానికి. దేవునియొక్క ప్రేమను పొందాలి అంటే ఆయనయొక్క ఆజ్ఞలను, చట్టాలను తూచా తప్పకుండా పాటిస్తూ, మన పొరుగు వారిని కూడా ప్రేమించాలని, దానిద్వారా దేవునియొక్క ప్రేమను మనం పొందుతామని తెలిజేస్తున్నాయి.

 మొదటి పఠనము :

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వాగ్ధాతభూమిలో ఆజ్ఞలను
పాటించమని తెలుపుచున్నారు.ఇశ్రాయేలుప్రజలు వాగ్ధత భూమిలో వ్యక్తిగతంగా,సామూహికంగా పాటించవలిసిన నియమాల గురించి దేవుడు మరొకసారి తెలియపరుస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునియొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తే, వారు కలకాలం  బ్రతుకుతారని, అయన ఏర్పరిచిన  ప్రదేశమునకు చేర్చబడతారని ఉపదేశిస్తున్నాడు. లేకపోతే కలకాలం బానిసత్వంలో మ్రగ్గిపోయి, దేవుని ప్రేమకు దూరముగా వుంటారు. అందుకే దేవుడు వారిని సంరక్షణమైన మార్గములో నడిపించడానికి,నిత్యజీవితమును దయ చేయడానికి దేవుడు ఏర్పరిచిన గొప్ప మార్గం. మోషే ఉపోద్గాతం ఏమిటంటే, దేవుని పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో,పూర్ణ మనసుతో,పూర్ణశక్తితో ప్రేమించాలి అని. ఎందుకంటే, దేవునియొక్క గొప్ప శక్తిని తన కళ్ళతో చూసి, విశ్వసించిన వ్యక్తి. ఈదేవుని ద్వారానే మనకు రక్షణ అని తెలుసుకొని ఆయనకోసమే జీవించినవ్యక్తి ఈ మోషేప్రవక్త.

ప్రభువుని ప్రేమించుటయే ధర్మశాస్త్రముయొక్క సారాంశము.మొదటి పఠనము రెండవ
వచనంలోమోషేప్రవక్త ఇశ్రాయేలీయులతో అంటున్నాడు:మీరు దేవునికి భయ పడుదురేని,
అయన ఆజ్ఞలు శిరసావహిస్తారు.మనలో దైవభయం ఉన్నప్పుడే మనం దేవుని  యొక్క ఆజ్ఞలను పాటిస్తాం. ఆ దైవభయం లేకపోతే మనకు ఇష్టంవచ్చినవిధంగాఉంటాం. ఆదాము, అవ్వ దైవభయం కోల్పోయారు. అందుకే దేవునియొక్క ఆజ్ఞలనుపాటించలేదు.దైవభీతిగలవారు,దేవుని ఆదేశాల ప్రకారం జీవించేవారు ఎల్లకాలము సుఖసంతోషాలతో జీవిస్తారు. మనందరం కూడా, దేవుని యొక్క మాటలు ఆలకించి  ఆయనయొక్క ఆజ్ఞలను పాటిస్తే,మనకు అన్నీ క్షేమమే అని ప్రభువు తెలుపుచున్నారు. ఎప్పుడైతే మనము దేవుని ప్రేమిస్తామో అప్పుడే అయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తాము.దేవునియొక్క ఆజ్ఞలను పాటిస్తే,దేవుడు వారిని పాలు తేనెలు జాలువారి నేలమీద బహుగా అభివృద్ధి చెందుతారని తెలుపుచున్నారు.

    దేవునియొక్క ఆజ్ఞలను పాటిస్తే కలుగు లాభాలు:

1. మనము దీవించబడతాము. ద్వితి:11 :26 -27 .
2. దేవుడిని ప్రేమించి, అయన ఆజ్ఞలను పాటిస్తే,1,000 తరములవరకు దీవెన, కరుణను
 పొందుతాం -నిర్గ:20 :6 .
3. దేవుని మాటలను/ ఆజ్ఞలు పాటిస్తే, దేవుడు మనతో వుంటారు. - యోహాను:14 :23 .
4. దేవునియొక్క సంరక్షణ పొందుతాం. - లేవి:25 : 18 .
5. దేవుడు మనయొక్క స్నేహితుడు అవుతాడు. - సామె:15 :14 .
6. దేవునియొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా 
     -మన జీవితములో సంతోషం కనుగొంటాము.
     - దేవుని చేత దీవించబడతాము.
     -సమాదానం దొరుకుతుంది.
     - దేవుడు మన ప్రార్ధన ఆలకిస్తారు.
     -శాశ్వతజీవమును పొందుకుంటాం.
     -దేవుని ప్రేమను పొందుకుంటాం, విజ్ఞానాన్ని పొందుతాం.
     - మన జీవితములో పరిపూర్ణతను పొందుకుంటాం.
     - దేవునియొక్క సాన్నిధ్యం అనుభవించవచ్చు.
    - దేవునియొక్క స్నేహితులుగా ఉండగలుగుతాం.

సువిశేష పఠనము:
ఈనాటి మొట్టమొదటి వచనాలలో మనం చూస్తే,ధర్మశాస్త్ర బోధకుడు యేసుప్రభువును
సమీపించి, ప్రధానమైన ఆజ్ఞను తెలుసుకుంటున్నారు.అయితే వివిధ ప్రదేశాలలో ఈ ధర్మశాస్త్ర బోధకులు దేవుని సమీపించేది యేసుప్రభువును ఇరకాటంలో పెట్టడానికే.కానీ ఈనాటి ధర్మశాస్త్ర బోధకుడు మాత్రం తన ప్రశ్నకు జవాబు తెలిసిన తరువాత సంతోషపడుచున్నాడు. ఇతనిలో ఎటువంటి కల్మషము లేకుండా దేవునియొక్క అభిప్రాయం తెలుసుకుంటున్నారు. ఇదే మంచి భోధకులయొక్క లక్షణం.  యేసు ప్రభువు అతనియొక్క దేర్యానికి మెచ్చుకొంటున్నాడేకాని కండించడంలేదు. అతనిపై ఎటువంటి పక్షపాతం చూపించడంలేదు.

 ఈలోకంలో  రెండురకాల  ప్రేమలు  ఉన్నాయి. అవి: 

 1. దేవుని ప్రేమ . 2. మానవ ప్రేమ .

     1. దేవుని ప్రేమ : 

       దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటిలో ప్రేమ ఆజ్ఞ మొట్ట మొదటిది. ఈ ఆజ్ఞలయొక్క సారాంశము ఏంటి అంటే,దేవునియొక్క నిత్యరాజ్యములోనికి ప్రవేశింపచేయడానికే. ఆనాడు ఆదాము అవ్వల ద్వారా తెగిపోయిన బంధాన్ని ఈనాడు తిరిగి నిర్మించడానికి ఈ ప్రేమ ఆజ్ఞను మనందరికీ బహుమానంగా ఇస్తున్నాడు.  అయితే మనం ఎందుకు దేవుడిని ప్రేమించాలి? 

 ఎందుకంటే, దేవునియొక్క ప్రేమ ద్వారా మనందరమూ అయన పోలికలోనే  మనందరినీ
  సృష్టించాడు. అయన తోనే నివాసము ఏర్పరచుకునేందుకు, ఆయనతోకలిసి జీవించుటకు
 తరువాత మోక్షం పొందుటకు అయన మనలను సృష్టించాడు.   దేవుని ఆదరణ పొందాలన్నా,
 అయనయొక్క ఆశీర్వాదాలు అందుకోవాలన్నా,అయన ప్రసాదించే అంతిమ బహుమానం
 అందుకోవాలన్న,ఆయనయొక్క ప్రేమఆజ్ఞను పాటించాలి. ప్రభువు అంటారు; మీరు నన్నుప్రేమిస్తే ఆ ఆజ్ఞలు పాటిస్తారని (యోహాను:14 :15 ).
యెష :49: 15-16 లో  చూస్తే , “తల్లి  నిన్ను  మరచినను  నేనునిన్ను  మరువను . నీపేరును
  నా  అరచేతిలో  వ్రాసితిని  అని  అంటున్నాడు ”. అది  దేవునియొక్క ప్రేమ. యోహా : 3:16: “దేవుడు  ఈ  లోకమును  ఎంతో  ప్రేమించి తన  ఏకైక  కుమారుని  మనకు ప్రసాదించెను ”. ఎప్పుడయితే మనమందరం దేవుని దేవుని పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ 
మనసుతో,పూర్ణశక్తితో ప్రేమిస్తామో అప్పుడు దేవుడు మన జీవితములలో గొప్పకార్యాలు  చేస్తాడు. పుట్టు గ్రుడ్డివాడయిన భర్తీమాయికి స్వస్థపరిచాడు. మరణించిన లాజరును తిరిగి లేపాడు. పాపా కూపములో జీవిస్తున్న మనుషులను పుణ్యమార్గమునకు నడిపించాడు. ఇది దేవుని యొక్క ప్రేమ.

  2.మానవునియొక్క ప్రేమ:

           ఈలోకంలో మానవులు వివిధప్రేమలకొరకు ప్రాకులాడుచున్నారు. ధనము,
అధికారము,మరియు వివిధవస్తువులమీద ప్రేమ కోసం ఎన్నో తప్పులను చేస్తూ, మనలను
 ప్రేమిస్తున్నటవంటి దేవుని ప్రేమను మాత్రం తెలుసుకోలేక పోతున్నాము. అయితే దేవుడు ఎందుకు పొరుగు వారిపై ప్రేమ కలిగి జీవించాలి అని బోధించాడు అంటే, ఆది:1 :26 లో చూస్తే, "దేవుడు మానవ జాతిని సృజించెను. తన పోలికలో మానవుని చేసెను". ఇందుకుగాను దేవుడు తన పొరుగువారికి ప్రేమించామన్నాడు. ఈలోకంలో జీవిస్తున్న ప్రతిఒక్క వ్యక్తి దేవుని పోలికలోనే సృజింపబడ్డాడు. ఎలా సృజింపబడిన ప్రతిఒక్క వ్యక్తితన పొరుగువారిలో దేవుని చూడాలని ఆ దేవాతి దేవుని కోరిక.పు. చిన్నతెరెసామ్మ గారి జీవితములో చూస్తే, ఆమె జీవించినాన్నాలు, తన పొరుగు వారిలో దేవుణ్ణి చూసింది. అందుకోసమే తన పొరుగువారి ప్రేమను తననుండి ఎప్పుడు కోల్పోలేదు.

పు. మదర్ తెరెసా గారు అనారోగ్యులలో, అనాధలలో, చిన్నారిబిడ్డలలో దేవుని చూసింది. దానిఫలితం ఆమెయొక్క జీవితాన్నిసహితం వారికి సమర్పించి దేవుడినుంచి, మానవులనుంచి గొప్ప మన్నను పొందింది.   

-దానియేలు దేవుడిని ప్రేమించాడు. కాబట్టే ఆయనకు విధేయుడై జీవించాడు. 
-యోసేపుగారు (పాత నిబంధన) దేవుడిని ప్రేమించారు,కాబట్టే, అయన మాటలను పాటించారు.
-యేసు ప్రభువుగారు తన తండ్రిని ప్రేమించారు,అందుకే అయన తన తండ్రి యొక్క మాటలు
 పాటించారు.
- మరియ తల్లి కూడా అదేవిధంగా చేశారు.
 మనజీవితములో కూడా దైవంమీద ప్రేమవుంటే, తప్పనిసరిగా ప్రేమిస్తాం, దేవుని ఆజ్ఞలు
 పాటిస్తాం. మన రక్షకుడయినా యేసుక్రీస్తు కూడా తన జీవితాన్ని సహితం తన తండ్రి
 చిత్తానుసారం ఈలోకంలోవున్న ప్రతిఒక్కరికోసం సమర్పించ బడినది. దాని మూలముననే
ఈనాడు మనమందరము ఆ రక్షణను మన జీవి తములో ఆనందిస్తున్నాము. 


  రెండవ పఠనం:

ఈనాటి రెండవ పఠనంలో, యేసుప్రభువు తన ప్రేమకు నిర్వచనంగా తనను తాను మనందరి 
కోసం శాశ్వత యాజకునిగా మనకోసం సమర్పించుకున్నాడు. కావుననే యేసు ప్రభువు నిత్యము జీవించే వాడినని   తెలుపు చున్నాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి మోషే చట్ట ప్రకారము కాక తన ప్రేమ అనే చట్టముతో ఒక్కసారే  మనందరికోసం బలిగా సమర్పించి, మరణించి, తిరిగి మూడవనాడు లేచి, ఉత్తానమయ్యి, ఈనాడు నీకు నాకు కాపరిగావుంటూ, మనలను తన ప్రేమమార్గములోనడిపిస్తూ, నిత్యజీవితముఅను బహుమతిని దయచేస్తున్నాడు.

ఈనాడు మనమందరము ఆత్మ పరిశీలన చేసుకోవాలి.నిజముగా నువ్వు నేను మన పొరుగు వారుని ప్రేమిస్తున్నామా? లేదా?. ఒకవేళ ప్రేమిస్తే, దేవుడు నీతో అనే మాట: "నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నాతండ్రివలన ప్రేమింపబడును.నేను వానిని ప్రేమించి,వానికి నన్ను తెలియపరుచుకొందును" (యోహా:14 :21 ).

 కాబట్టి, ఈనాటి దివ్య బలిపూజలో ఆ దేవాతి దేవునికి ప్రార్ధన చేదాం. మనం ఆ దేవాతిదేవుడిని ఏవిధంగానయితే   ప్రేమిస్తున్నామో, అదేవిధముగా మన పొరుగువారికి కూడా ప్రేమించుటకు మనకు మంచి హృదయాన్ని దయ చేయమని ఒకరినొకరు అర్ధం చేసుకొని జీవించునట్లు చేయమని పశ్చాత్తాప హృదయముతో ప్రార్ధన చేదాం. ఆమెన్.

Rev. Fr. Bala Yesu OCD, Br. Mario 



24, అక్టోబర్ 2021, ఆదివారం

30 వ సామాన్య ఆదివారము(2)

30 వ సామాన్య ఆదివారము(2)

ఈ నాడు మూడు పఠనాలు దేవుని యొక్క రక్షణ మరియు నూతన జీవితం గురించి తెలియజేస్తున్నాయి. తండ్రి ఐన దేవుడు తన ప్రజల పట్ల చూపిన అపారమైన ప్రేమ, ఒక తండ్రికి తన పిల్లపై ఏ విధంగా ఉంటుందో, మరియు దేవున్ని దృఢమైన విశ్వాసంతో ప్రార్థిస్తే మనకు కలిగే రక్షణ మరియు నూతన జీవితం, అనే విషయాలను మనము ఈ నాడు తెలుసుకుంటాము.

మొదటి పఠనము ధ్యానించినట్లైతే బాబిలోను దేశ బానిసత్వంలో మగ్గుచున్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఒక తండ్రిగా లేక తండ్రివల్లే విమోచించబోతున్నాడు. మరల వారికీ పూర్వ వైభవం దయచేస్తానని యిర్మీయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. కేవలం బాబిలోనియ నుండి మాత్రమే కాదు ప్రపంచం మొత్తం చెల్లా చెదురైనా వారిని తమ సొంత దేశానికి తరలిస్తున్నాడు దేవుడు. నేల అంచుల నుండి వారిని కొనివత్తును, గ్రుడ్డివారు, కృంటివారు, గర్భవతులు, ప్రసవించుటకు సిద్ధముగా ఉన్నవారను ఎల్లరును కలిసి మహాసముద్రంగా కలిసి వత్తురు. 

కాబ్బటి సంతసముతో పాదుడు, స్తుతిగానము చేయుడు. ఎందుకంటే ప్రభు తన ప్రజలను రక్షించెను. యిర్మీయా 31: 9 వారు ఏడ్పులతోను, ప్రార్థనతోను తిరిగి వత్తురు, ఎప్పుడైతే నువ్వు ఈ విదంగాదేవుని యొద్దకు తిరిగి వస్తావో అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడని తెలియజేస్తున్నాడు. మనము దేవుని దగ్గరకు తిరిగి వస్తే మనలను అయన సొంత బిడ్డలుగా మార్చుకుంటాడని చెబుతున్నాడు. ప్రియా స్నేహితులారా ఒక్క మాటలో చెప్పాలంటే నేటి మొదటి పఠనము ద్వారా దేవుని యొక్క ప్రేమ తన ప్రజలపై ఒక తండ్రి వాలే ఉంటుందని తెలియజేస్తున్నాడు.

సువిశేష పఠనములో

ద్రుష్టి ప్రదానం చేసే అద్భుతం సంఘటన దానిలో పరమార్థాన్ని చూస్తున్నాము. మొదటి పట్టణములో యావే ప్రభువు గ్రుడ్డి వారి పట్ల చూపిన ప్రేమను నెరవేర్చు ప్రవచనం. యేసు అయన శిస్యులు, గొప్ప జనసమూహముతో యెరికో పట్టణం దాటి పోతున్నారు. అంటే ఎసరుసలేము పట్టణానికి సమీపంలో ఉన్నారని అర్థం. 

బర్తిమయి అనే గ్రుడ్డి వాడు త్రోవ పక్కన కూర్చొని బిక్షమడుగుకుంటున్నాడు అటువంటి దౌర్భాగ్యులకు ఆ కాలంలో ఆ దేశంలో  గుర్తింపు లేదు.

ఆ వ్యక్తి అక్కడ జనం యొక్క అలజడి విని దానికి కారణం అడగ్గా "నజరేతు నివాసియగు యేసు ఆ మార్గమున వస్తున్నాడని ఒక వ్యక్తి చెప్పాడు" అది విన్న వెంటనే గ్రుడ్డి వాడు, దావీదు కుమారా యేసు ప్రభువు నన్ను కరుణింపుము అని యేసును పిలవడం మొదలుపెట్టాడు. బిగ్గరాగా పిలిచాడు. అక్కడ మనం గమనిస్తే అతని కేకలకు, ఆర్తనాదాలకు ప్రజల యొక్క గదమాయింపు మనం చూస్తున్నాము. చుట్టూ ఉన్న ప్రజలు ఆయన్ను నోరు మూసుకొమ్మని కోపగించుకున్నారు. గ్రుడ్డి వానికి ఆటంకంగా ఉన్నారు కానీ బర్తిమయిని ప్రజలు ఆపలేకపోయారు. పెద్ద పెద్దగా అరవగలిగాడు, అరిచాడు. లూకా 18 : 1-8 వితంతువు ప్రార్థన ద్వారా క్రీస్తు మనకు ఎల్లపుడు ప్రార్ధించండి, నిరుత్సహులు కాకాకండి అని తెలియజేశాడు. చాలాసార్లు మన ప్రార్థన వేడుకోలు ఆర్తనాదాలు ఇతరులకు వెర్రి కేకలుగా కనిపించవచ్చు. మరి నువ్వు నేను దేవుని బర్తిమయి లాగా బిగ్గరగా పిలువగలుగుతున్నామా లేదా?

మనం మన జీవితాలను పరిశీలించినట్లయితే ఎన్నో విషయాలు, వ్యక్తులు, వస్తువులు, మనలను యేసుప్రభువును సమీపించదానికి ఆటంకాలుగా ఉంటునాయి. 

కొన్ని సార్లు మనం ఇతరుల దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే వారు దేవుని సన్నిధికి వెళ్లకుండా, ప్రార్థన చేయనీయకుండా అడ్డు పాడతాం, ఆటంకాలు కలుగజేస్తాము. అందుకే మనకు ఉదాహరణగా బర్తిమయి తీసుకోవాలి ఎందుకంటే అతడు పట్టుదలతో ప్రార్ధించాడు, దానికి ఫలితం అంధకారాన్ని తొలగించి నూతన జీవితాన్ని ప్రసాదించాడు. 

నువ్వు నేను  దేవుని పిలిస్తే క్రీస్తు కూడా మనలను అదే ప్రశ్న అడుగుతున్నారు! నీకు ఏమి కావాలి ధనమా, పేరు ప్రఖ్యాతలు, అందమా, ఆరోగ్యంగా లేక ఆయుషా. అందుకే నన్ను ని బిడ్డగా మార్చు ఈ ప్రశ్నకు జవాబు రెండొవ పట్టణములో చూస్తున్నాము, దేవుడు ప్రభువైన క్రీస్తు ప్రభు పలికిన మాటలు మనతోకూడా పలికితే, అది నాకు చాలు అని ప్రార్ధించాలి. ఏంటి ఆ మాట అంటే హెబ్రీ 5 : 5 లో నువ్వు నా కుమారుడవు, నా కుమార్తెవు నేను నీకు తండ్రి నైతిని. క్రీస్తు ప్రభుని భక్తి, వినయాల వల్లనా తండ్రి దేవుడు క్రీస్తు ప్రభుని ప్రార్థన ఆలకించెను అని వింటున్నాము. క్రీస్తు దేవుని పుత్రుడై వుండి కూడా మనకు ఒక గొప్ప సుమాతృకను ఇచ్చి ఉన్నాడు. 

బర్తిమయి దృఢమైన విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్ధించాడు, దేవుని కరుణ పొంది నూతన జీవితం పొంది  క్రీస్తును అనుసరించాడు. 

కాబ్బటి ప్రియా స్నేహితులారా మన దేవుడు మన అవసరాలు, బలహీనతలు ఏరిగినవాడు, కావున మన అందరిని ఆదుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో దేవుని ప్రార్ధించి రక్షణ, నూతన జీవితం పొందుదాం! ఆమెన్.

Br.Suresh OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...