9, జులై 2022, శనివారం

15వ సామాన్య ఆదివారము

15 సామాన్య ఆదివారము

ద్వితీ:- 30:- 10-14, కొలిసి:- 1:- 15-20, లూకా:- 10:- 25-37

క్రిస్తునాధునియందు ప్రియా దేవుని బిడ్డలారా  నాడు తల్లి తిరుసభ 15 సామాన్య ఆదివారంలోనికి అడిగిడుతుది.
 నాటి   దివ్య గ్రంథపఠనాలు మనకు తెలియజేసే అంశం ఏమిటంటే దేవుని ప్రేమ మరియు 
మానవుని ప్రేమ. 

మనము దివ్య గ్రంధాన్ని మొదటినుంచి చివరివరకు క్లుప్తంగా పరిశీలించినట్లైతే అనగా ఆదికాండము నుంచి దర్శనగ్రంధం వరకు పరిశీలించినట్లయితే మనకు ముఖ్యముగా అతి ప్రధానముగా తెలిపేది లేదా బోధించేది ఏమిటంటే దేవుని ప్రేమ మరియు పొరుగువాని ప్రేమగురించి బోధిస్తుంది.
ఆదికాండములో ఆదాము మరియు అవ్వ సృష్టిల ద్వారా దేవుని ప్రేమను చూస్తాముదేవుడు ప్రేమతో తన రూపంలో ఆదామును తయారు చేయటం తరువాత తాను ఎన్నుకొన్న మనుషుల ద్వరా ప్రవక్తల ద్వారాన్యాయాధిపతుల ద్వారారాజుల ద్వారా దేవుడు తన యొక్క ప్రేమను తెలియజేస్తున్నాడునూతన నిబంధనలో మానవుల మీద తనకు ఉన్న ప్రేమతో కుమారుని సైతము భూమికి పంపి థన ప్రేమను తెలియజేస్తున్నాడు.

 కుమారుడు భూమికి వచ్చి తన తండ్రి ప్రేమను వెల్లడించి పంచి చివరకు తండ్రి మీద ప్రేమతో మన మీద ప్రేమతో సిలువ శ్రమలను సహితము పొంది సిలువలో తన రెండు చేతులను చాచి మరణించి కుమారుడు మరియు తండ్రి ఎంతగా ప్రేమిస్తున్నారో చూపించాడు.
 ప్రేమతో విడిపోయినతెగిపోయిన బంధాన్ని కలిపాడు యొక్క ప్రేమను  శిస్యులకు పంచాడుకుమారుడు పంచిన  ప్రేమను శిష్యులు అనేక మంది ప్రజలకు పంచి వారుకూడా కుమారునివలె వేదసాక్షి మరణాన్ని పొందారు.

ఇలా ఎవరైతే దేవుణ్ణి మరియు పొరుగువారిని ప్రేమించలేకపోతున్నారో  నాటి మొదటి పటనములో అట్టి వారికీ ప్రభువు పలికే మాటలు " నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోను, పూర్ణ మనసుతోను, పూర్ణఆత్మతోనుప్రేమింపుము" అని  యొక్క ఆజ్ఞలు ప్రభువు మోషే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినపుడు వాటిని పాటించడములో వారు విఫలమయ్యారు.
విఫలంకావటమేకాకుండా దబ్బర దేవతలను పూజించడం ఆరంభించారు దానికి ఫలితం వారు బానిసత్వానికి తీసుకొనిపోబడినారువారు ప్రవాసం నుండి తిరిగి వచ్చిన తరువాత ప్రభువు వారిని మందలిస్తూ ఓదార్పు మాటలను చెబుతున్నారుమీరు అన్ని మరచి నా చెంతకు తిరిగి వత్తురేని మిమ్ములను దివిస్తాను అని పలుకుతున్నాడు విధేయతతో ధర్మశాస్త్రములో లికించబడిన వాటిని పాటించమని అడుగుతున్నాడు ఇంతకు ముందులాగ అవిధేయతతో కాకా విధేయతతో పూర్ణ హృదయముతోపూర్ణ మనసుతోపూర్ణ ఆత్మతో పాటించమని ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను కోరుతున్నారు ఎందుకంటే  ఆజ్ఞలుధర్మశాస్త్రము వారికీ క్రొత్త కాదు కాబట్టి అవిధేయతతో కాకవిధేయతతోపాటించమనిప్రభువుచెపుతున్నాడుధర్మశాస్త్రాన్నిజ్ఞలను విధేయతతో పాటిస్తున్నామని చెపుతూ పొరుగువారు ఎవరో కూడ తెలియని ప్రజలకు ఈనాటి సువిశేషములో   ఓకే మంచి సమరియుని ఉపమానం ద్వారా యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు.

ప్రభువు అన్నట్లు "నన్ను ప్రేమించువాడు నా తండ్రిని ప్రేమిస్తున్నాడునా తండ్రిని ప్రేమించువాడు నన్ను ప్రేమిస్తున్నాడు వాడు నా తండ్రిచే ప్రేమించబడుతున్నాడు". దేవున్నీ ప్రేమిస్తున్నానని చెప్పి పొరుగువారు ఎవరో తెలియక పొతే మనం దేవున్నీ ఏవిదంగా ప్రేమించినట్లు అట్టివాడు దేవునితో ఎలా ప్రేమింపబడతాడు. నూతన నిబంధనలో ప్రభువు చెప్పేటటువంటి ముఖ్యమైన రెండు ఆజ్ఞలు నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ మనసుతో ప్రేమించు, నీవలె నీ పొరుగువారిని ప్రేమించు.  రెండు ఆజ్ఞలలో 10 ఆజ్ఞలు ఇమిడిఉన్నాయి. వీటిని పాటించువాడు నిత్యజీవం పొందుతాడు అని ప్రభువు పలుకుతున్నాడు.
పొరుగువారు ఎవరో తెలియని వారికీ మంచి సమరియుని ఉపమానము ద్వారా తెలియజేస్తున్నాడు. ఒక వ్యక్తి మార్గముగుండ పోవుచుండగా వాడు దుండగులతో కొట్టబడ్డాడు అటుగుండా యాజకుడు మరియు లేవీయుడు వెళ్లారుకాని సహాయం మాత్రం చేయలేదు కానీ సమరియుడు వారికీ సహాయం చేసాడు.

ఒక్క సారి  ప్రాంతం మరియు యూదులు, సమరియుల చరిత్రను పరిశిలించినట్లైతే యూదులకు, సమరియులకు ఒకరంటే ఒకరికి అస్సలు పడదు ఇష్టపడరుయూధులు  మార్గంగుండా వెళ్ళటానికి ఇష్టపడరు అందులోను  మార్గం చాలా ప్రమాదకరమైనది ముఖ్యముగ చీకటి పడితే  మార్గగుండా పయనించడానికి భయపడతారు ఎందుకంటె దొంగలుదుండగులు వచ్చి కొట్టి ఉన్నవన్నీ తీసుకొని పోతారు  సమయములో ఉన్న పరిస్థితిని బట్టి ప్రభువు  ఉపమానాన్ని చెప్పారు.
మొదటిగా  మార్గంగుండా యాజకుడు పయనించినపుడు పడిపోయి ఉన్న మనిషిని పాటించుకోకుండా వెళ్ళిపోయాడు ఎందుకంటే వాడు చనిపోయాడు అని అనుకోని చనిపోయిన వారిని పట్టుకుంటే మాలినమవుతాడు దేవాలయములో యాజకునిగా నిర్వర్తించవలసిన పని ఆగిపోతుందని అవకాశాన్ని కోల్పోతాను అని యాజకుడు వెళ్ళిపోయాడు. యాజకుడు మలినమై ఉండకూడదు అట్టివారిని ఉద్దేశించి ప్రభువు అంటున్నాడు "స్నానం చేసినవాడు చేతులు కడుగుకొంటే చాలు కానీ మరల స్నానం చేయనవసరంలేదు"

హృదయశుడికావాలి కానీ బాహ్యశుద్ది కాదు
నోటిలోనికివెళ్ళేది కాదు మాలినపరిచేది నోటినుండి వెలువడేది మాలిన పరచేది

సున్నం కొట్టిన సమాధివలె అందంగా ఉన్న లోపల కుళ్ళు, దురవాసన అలానే ఉంటుంది
రెండవదిగా లేవీయుడు  మార్గంగుండా వెళ్లుచు వ్యక్తిని చూసికూడా పాటించుకోకుండా వెళ్ళిపోయాడు. పడిపోయిఉన్న వ్యక్తిని చూడటానికి వెళితే  లోపల దొంగలు వచ్చి ఏమైనా చేస్తారని ముందుగానే తన జాగ్రతను చూసుకొని వెళ్ళిపోయాడు.

మూడవదిగా సమరియుడు నిజానికి అతడు సమరియుడు కాదు ఎందుకంటె సమరియులకు, యూదులకు ఎక్కడ పొత్తుకుదరదు కానీ  వ్యక్తి దయకలిగిన వాడిలా వ్యక్తిని సత్రంలోనికి తీసుకెళ్లాడు. సత్రం అధికారి ఇతనను నమ్మాడు. యూదులు యేసు ప్రభువుని సమరియుడు అని పిలుస్తారు. ధర్మశాస్త్రాన్ని పాటించని వారిని, ఆజ్ఞలను ఊల్లంగించువారిని సమరియుడు అని పిలుస్తారు.
సమరియుడు అనబడు  వ్యక్తి పదిపోయిన వ్యక్తిని బాగుచేయటానికి తన దెగర ఉన్నదంతయు ఇచ్చాడు.

వ్యక్తి ఎవరైనా దేవుని ప్రేమ  తన హృదయంలో ఉన్నది కావున పడిపోయిన వ్యక్తిని పొరుగువానిగా భావించి తనకు సహాయంచేసాడు.
"తన స్నేహితునికొరకు ప్రాణమును సహితము ధారపోయువాడు నిజమైన స్నేహితుడు". ఇటువంటి స్నేహితుడిని మనము ఈనాటి రెండవ పటనములో చూస్తాము.

 నాటి రొండోవ పటనములో పాలుగారు కొలిసి ప్రజలకు క్రీస్తు ప్రభుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరించడం చూస్తున్నాము. దేవుని కుమారుడు, తండ్రి దేవుని ప్రతిరూపము అన్నింటిమీద ఆధిపత్యము కలిగిన వ్యక్తి, ఈయన మరణముద్వారానే మనము రక్షణ పొందాము ఈయన ఉతనముద్వారా తెగిపోయిన ప్రేమను మరల పొందగలిగాము. ఈయనకు పొరుగువారి మీద ఉన్న ప్రేమవలననే తండ్రి దేవునిచే ప్రేమించబడుతున్నాముప్రభువు అంటున్నాడు నీసహోదరునితో ఏమైనా తగాదాలుకలహాలు ఉంటె నీవు తెచ్చిన అర్పణలను అక్కడే వదిలివేసి మొదట నీ సహోదరునితో సఖ్యతపడి అటు తరువాత వచ్చి నీ అర్పణలను సమర్పించు.
దేవుని ప్రేమిస్తున్న అని చెప్పుకొనటం కాదు సహోదరునికుడా ప్రేమించినపుడే దేవునిచే ప్రేమింపబడతావు.

"నీ దేవుడైన ప్రభువుని పూర్ణ మనసుతోపూర్ణ హృదయముతోపూర్ణ ఆత్మతో  ప్రేమింపుము నీ వలె నీ పొరుగువారికి ప్రేమించు".
                                                                                                                బ్రదర్. లూకాస్. ఓసిడి

5, జులై 2022, మంగళవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

మత్తయి సువార్త 9: 32-38

మూగదయ్యమును  వెడలగొట్టుట మరియు క్రీస్తు కారుణ్యము.

32. వారు పోవుచుండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవానిని ఒకనిని కొందరు యేసు వద్దకు కొనివచ్చిరి. 33. పిశాచము వెడలగొట్టబడిన యంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అపుడు అచటి ప్రజలు ఎల్లరు ఆశ్చర్యపడుచు, "ఇశ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడును ఎరుగము" అనిరి. 34. కాని పరిశయ్యులు, "పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టు చున్నాడు" అని ఈసడించిరి. 

35. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి, ప్రార్థన మందిరములలో బోధించుచు, పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు, జనుల వ్యాధి భాదలనెల్ల పోగొట్టుచుండెను. 36. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు, కాపరిలేని గొఱ్ఱెలవలె  చెదరియున్న జనసమూహను చూచి, ఆ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయెను. 37. అపుడు యేసు తన శిష్యులతో "పంట మిక్కుటము; కాని కోతగాండ్రు తక్కువ. 38. కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను  పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు" అని పలికెను.

ధ్యానము: పరిశయ్యులయొక్క నిర్లక్ష్యము, అసూయ, మరియు క్రీస్తు ప్రభువు దేవుని పనిని నెరవేర్చుట.

ప్రియ స్నేహితులారా ! ఈ నాటి సువిశేష పఠనాన్ని మనము ధ్యానించినట్లైతే మనకు రెండు విషయాలు అర్థమవుతాయి. మొదటిగా “పరిశయ్యులయొక్క నిర్లక్ష్యము, అసూయ, మరియు క్రీస్తు ప్రభువు దేవుని పనిని నెరవేర్చుట, లేదా క్రీస్తు తన సువార్త పరిచర్యను” నెరవేరుస్తున్నటువంటి సారాంశమే  మనకు అర్థమవుతుంది.

ఎందుకంటే, మన అందరికి తెలిసిన విధంగా పరిశయ్యులంటే సంఘ కాపరులు, లేదా ప్రజలను అనునిత్యం కాపాడేవారు, వారి బాగోగులు చూసుకునే వారు.

కాని వారిజీవిత నడవడిక మాత్రం, వారి పదవికి వ్యతిరేకంగా ఉంటుంది, లేదా వారు బోధించే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉంటుంది. వారు ఎప్పుడు కూడా కపట వేషధారులవలె, పేరుకు మాత్రమే భోదకులుగా జీవించే వారు, నిజానికి అమాయక ప్రజలమీద, శాస్త్రాలయొక్క భారాన్ని మోపేవారు, ప్రజలను ఎప్పుడు కూడా సక్రమైన మార్గములో నడిపించే వారు కాదు. ఇశ్రాయేలు ప్రజలు, తమ వ్యక్తి, తమలో ఒకరయినటువంటి క్రీస్తు మీద, ఈర్ష, అసూయ చెందుతున్నారు.

ఎందుకంటే క్రీస్తు ప్రభువుకి వారికంటే, పరిశయ్యులకంటే గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేసే శక్తి ఉంది, ప్రజలుకూడా క్రీస్తు ప్రభువు వైపే వెళుతున్నారు అని అసూయ చెందుతున్నారు.

దేవుని శక్తి మనలో లేనప్పుడు మనము సాతానుని వెళ్ళొగొట్టలేము. సాతాను, సాతానును వెళ్లగొట్టగలడా?

క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు కాబట్టి, దేవుని శక్తి తనలో ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభువుకు ఆ సాతాను లొంగి పోయింది.

పరిశయ్యులు కూడా దేవుని యొక్క బిడ్డలే, కాని వారు ఎప్పుడు క్రీస్తు వలె, నిజమైన దేవుని రాజ్యాన్ని బోధించే వ్యక్తిగా లేదా అధికారులుగా, సంఘ కాపరులుగా జీవించలేదు. అందుకే దేవుని శక్తి, దేవుని మహిమ వారు చేయలేకపోయారు.

మరి పరిశయ్యులు, అంతా తెలిసినవారే కదా, దేవుని ధర్మశాస్త్త్రాన్ని అనుసరించే వారేకదా, దేవునిచే ఎన్నుకొనబడినవారే కదా, మరి వారి ప్రజలలో ఒకరు అస్వస్థతకు గురి అయినప్పుడు, పరిశయ్యులు ఎందుకు అద్భుతాలు చేయలేదు, స్వస్థతలు చేయలేదు? ఎందుకంటే వారు పేరుకు మాత్రమే సంఘపెద్దలు, లేదా కాపరులు.

దేవుని ప్రమేయమున్నపుడే, శాతానును మనము జయించ గలము లేదా ఓడించగలము. సాతాను తనకు తానుగా ఎలా ఓడించుకుంటుంది. పిశాచముల నాయకుడు అంటున్నారు, మరి పిశాచముల నాయకుడు అయితే మంచి కార్యములు, అద్భుతములు ఎలా చేస్తాడు? సాతాను నుండి అయితే మంచి పనులు చేయకూడదు కదా.

రెండవదిగా: క్రీస్తు ప్రభువు కారుణ్యము లేదా క్రీస్తు ప్రజలయొక్క నిస్సహాయతను, అమాయకత్వాన్ని చూసి, వారియొక్క భడాలను చూసి జాలి చెందుతున్నాడు.

క్రీస్తు ప్రభువు, గ్రామాలు గ్రామాలు తిరుగుచున్నారు, దేవుని రాజ్యాన్ని బోధిస్తున్నారు, స్వస్థతలు, అద్భుతాలు, చేస్తున్నారు., కాని ప్రజలందురు కూడా కాపరిలేని గొఱ్ఱెలవలె, త్రోవ తప్పిన వారివలె జీవిస్తున్నారు. సంఘ కాపరులు వారిని పట్టించుకోవట్లేదు, నాయకులు, ప్రజల బాగోగులు చూసుకోవట్లేదు. అందుకే ప్రజల జీవితాలు ఈవిధంగా ఉన్నాయని బాధపడుతున్నాడు.

దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. ఇంకా చాల గ్రామాలు ఉన్నాయి వాటన్నిటిలో అద్భుతాలు చేయాలి, దేవుని రాజ్యాన్ని బోధించాలి, అందుకనే క్రీస్తు ప్రభువు, పంట విస్తారము, కోతగాండ్రు కావాలి అంటున్నారు, అంటే, తన సువార్త పరిచర్యలో మనలనుకూడా, బాగస్తులను అవమాని ఆహ్వానిస్తున్నారు.

దేవుడంటే తెలియని గ్రామాలు చాలాఉన్నాయి, దేవుని సేవచేయుటకు, దేవుని రాజ్యాన్ని లోకమంతట వ్యాపింప చేయుటకు, శిష్యులు కావాలి, కాబట్టి ఈ నాటి సువిశేష పఠనం ద్వారా క్రీస్తు ప్రభువు మనందరిని ఆహ్వానిస్తున్నారు.

ప్రియ స్నేహితులారా! మనము ఈ సువిశేషాన్ని గమనించినట్లయితే, భాద్యత కలిగినటువంటి అధికారులే(పరిశస్యులు), ఏ భాద్యత లేకుండా, ప్రజలను భాదలతో, కష్టాలలో ఉన్నప్పుడు వారిని పట్టించుకోవడంలేదు.

కాని దేవుడు కారుణ్యము కలవాడు కాబట్టియే, తనలో దైవత్వం ఉందికాబట్టియే, దేవుని కుమారుడు కాబట్టియే, తన ప్రజలచెంతకు వెళుతున్నాడు, వారికీ స్వస్థతలు, అద్భుతాలు చేస్తున్నాడు. ఒక భాద్యత కలిగి జీవిస్తున్నాడు. దేవుని కార్యాన్ని, చిత్తాన్ని నెరవేరుస్తున్నారు.

ఎందుకంటే తనప్రజలు కష్టాలతో, బాధలతో సతమతమవుతుంటే దేవుడు ఓర్చుకోలేడు, చూస్తూ ఊరుకోడు. తమ ప్రజలకు న్యాయము చేస్తాడు.

ప్రియ స్నేహితులారా ఇప్పుడు మనందరమూ ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము పరిశయ్యుల వలె జీవిస్తున్నామా? లేదా క్రీస్తు వలె ఇతరులకొరకే, దేవునిరాజ్యాన్నిభోధించుటకే జీవిస్తున్నామా?

ఎందుకంటే మనం, మన సాధారణ జీవితంలో, ఇలాంటి సన్నివేషాలను చాల చూస్తూనే ఉంటాం, మన గ్రామాలలో, అనారోగ్యం తో బాధపడేవారిని, కష్టాలలోఉన్నవారిని, నిస్సహాయులును, మానసికంగా, శారీరకంగా బాధపడే వాళ్ళను మనము చూస్తూవుంటాం. కాని అందరమూ కూడా పరిశయ్యులవలె, పట్టించుకోము, నిర్లక్ష్యము చేస్తాము. 

ఆ త్రియేక దేవుడు, మనందరిలో జీవిస్తున్నాడు, మనందరిలో కూడా  దైవత్వం ఉంది. కాని మనము, మనలో ఉన్న దైవత్వానికి ప్రాముఖ్యతను ఇవ్వము. అందుకే మనము స్వస్థతలు, అద్భుతాలు చేయలేక పోతున్నాం, అంతేకాక, దేవుడు చేసిన అద్భుతాలను మనం నమ్మలేక పోతున్నాం, ముందుగా వాటిని గ్రహించలేక పోతున్నాం.

మనంకూడా క్రీస్తు వలె అద్భుతాలు చేయగలము, ఎప్పుడైతే మనం దేవుని విశ్వసిస్తామో, దేవుని పై ఆధారపడి జీవిస్తామో. 

ప్రియ స్నేహితులారా చివరిగా మనం గ్రహించాలిసింది ఏమిటంటే, సాతాను క్రియలు నాశనము చేయడానికే, కాని క్రీస్తు చేసే పనులు దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి.

ప్రార్థన: కరుణామయుడవైన దేవా! మాలో ఉన్నటువంటి మీ దైవత్వాన్ని మేము గ్రహించలేక పొతున్నాం.

మాజీవితాలు కూడా చాలా సార్లు పరిసయ్యులవలె ఉంటున్నాయి, పేరుకు మాత్రమే నేను, క్రైస్తవునిగా, సంఘంలో ఒకవ్యక్తిగా జీవిస్తున్నాను, దేవుని రాజ్యాన్ని, సువార్తను, నా జీవితం ద్వారా ఇతరులకు భోదించలేక పోతున్నాను, నా సహోదరులను నిరాకరిస్తున్నాను. ఇకనుండి అయినను నేను నీవలె జీవించుటకు, ఇతరులుకొరకు జీవించుటకు నాకు శక్తిని, మంచినే చేసే కరుణగల హృదయాన్ని నాకు ప్రసాదింపుము, అని ప్రార్థన. ఆమెన్.

Br. Subhash

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...