5, నవంబర్ 2022, శనివారం

32వ సామాన్య ఆదివారం

 32వ సామాన్య ఆదివారం

2 మక్కబీ 7:1,2 9-14

2 తెస్స 2:16-3:5

లూకా 20:27-36

ఈనాటి దివ్య పఠనాలు మరణించిన తరువాత రాబోయే పునరుత్థానం గురించి బోధిస్తున్నాయి. దైవర్చన సంవత్సరంలో చివరి రోజులలోకి ప్రవేశిస్తున్న మనకు తల్లి శ్రీ సభ మన యొక్క జీవిత చివరి రోజుల గురించి బోధిస్తుంది. నవంబర్ రెండవ తారీకున మనం సకల ఆత్మల సంస్మరణ దినమును కొనియాడం. మన యొక్క మరణం తరువాత మరలా పునరుత్థానం ఉందని మనం నిరీక్షిస్తున్నాం. ఈనాటి దివ్య పఠనాలు కూడా తెలిపే ప్రధాన అంశం ఏమిటంటే మనకు మరణం తరువాత పరలోక జీవితం ఉందని, మనం కూడా క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం ద్వారా అంతిమ దినమున ఆత్మ శరీరములతో లేపబడతాం అని తెలుపుచున్నవి. మరణం తరువాత జీవితం అనేది క్రైస్తవ విశ్వాసానికి మూలం. క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం ద్వారా మనందరం కూడా పునరుత్థానం అవుతామని తెలియజేస్తుంది.

ఈనాటి మొదటి పఠనము లో యూదా  కుటుంబంలో ఉన్న ఒక తల్లి ఏడుగురు సోదరులకు దేవుని పట్ల తమకు గల విశ్వాసాన్ని చూపిస్తున్నారు. యూదా ప్రజలు మోషే ప్రవక్త ఇచ్చిన ధర్మశాస్త్రమునకు కట్టుబడి జీవించేవారు. చరిత్ర ప్రకారం చూసినట్లయితే సిరియా రాజు పాలస్తీనా దేశంను క్రూరంగా పరిపాలిస్తున్నా కాలం అది. సిరియా రాజు యూదులను తమ యొక్క మత ఆచారాలను సంస్కృతులను పాటించమని వారిని బలవంతం చేశారు. అలాంటి క్లిష్ట సందర్భంలో కొంతమంది యూదులు మోషే ధర్మ శాస్త్రంను విడిచిపెట్టి సిరియా రాజు ప్రకారంగా నడుచుకున్నారు కానీ కొంతమంది యూదులు మరణమునకు,హింసలకు భయపడకుండా మోషే ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటించారు. ఎవరైతే రాజు యొక్క ఆజ్ఞను దిక్కరించారో వారు క్రూరంగా హింసించబడ్డారు. అంతియోకు ఎఫీఫనే అనే రాజు ఆయన ఆజ్ఞను ఎదురించిన యూదులను శిక్షకు గురి చేశాడు కొంతమంది యూదులు మాత్రము తమ విశ్వాసంలో పటిష్టంగా ఉన్నారు. వారిలోని వారే ఈనాడు మనం చదువుతున్న తల్లి ఏడుగురు కుమారులు. వారి యొక్క విశ్వాస జీవితం గొప్పది ఎందుకంటే మరణమునకు భయపడుటలేదు మరణం తరువాత మరలా పునరుత్థానం ఉంటుందని విశ్వసించారు. ఈ కుటుంబంలో ఉన్న తల్లిని ఒక విధంగా మెచ్చుకోవాలి ఎందుకంటే తన బిడ్డలకు యావే దేవిని యందు గొప్ప విశ్వాసం ఉంచుట నేర్పించింది. ధర్మశాస్త్రం ప్రకారం యూదులు పంది మాంసం భుజంపకూడదు కాబట్టి అంతియోకు ఎఫిఫనే అనే రాజు వారిని పంది మాంసం భుజించుటకు బలవంతం చేశారు అయినప్పటికీ వీరు ప్రాణాలు కాపాడుకోవడానికి విశ్వాసంను విడిచిపెట్టలేదు.

వారికి దేవునియందు స్థిరమైన విశ్వాసము ఉన్నది అందుకే వారు దేవునికి విధేయత చూపుతూ సాక్షులై జీవించారు.

వీరు విశ్వాసం కోసం ప్రాణాలు త్యాగం చేశారు పవిత్ర గ్రంథంలో చాలామంది వ్యక్తులు విశ్వాసం కోసం ప్రాణ త్యాగం చేశారు. దానియేలు యొక్క స్నేహితులను బంగారపు విగ్రహమును ఆరాధించమని బలవంతం చేసినప్పటికీ వారు రాజు బంగారపు విగ్రహానికి నమస్కరించలేదు, ఆరాధించలేదు. దానియేలు 3:6.

షడ్రకు, మేషకు, అబెద్నేగులు యావే దేవుని మాత్రమే ఆరాధిస్తాం వేరే వాళ్లను ఆరాధించమని గట్టిగా చెప్పారు. దానియేలు 3:18. స్తెపాను గారు విశ్వాసం కొరకే మరణించారు- అఫో 7:58.

శ్రీ సభ తొలి మూడు శతాబ్దాలలో అనేకమంది విశ్వాసులు తమకు దేవుని యెడల ఉన్న విశ్వాసం వలన మరణించటానికి సైతం సిద్ధంగా ఉన్నారు. అనేక సందర్భాలలో మనందరం కూడా కాంప్రమైజ్ అయిపోతుంటాం కానీ ఇక్కడ ఈ తల్లి కుమారుడు ఏ విధంగానూ కాంప్రమైజ్ కావడం లేదు ఎంతో గొప్ప విశ్వాస జీవితం వీరిది.

 ఈ తల్లి కుమారుల యొక్క సాక్షి పూరితమైన జీవితం మనందరికీ ఆదర్శం కావాలి ఎందుకంటే దేవుడిచ్చిన జీవితం దేవునికి సమర్పించుటకు సిద్ధంగా ఉన్నారు. యావే దేవుడి ఏకైక రాజు అని విశ్వసించారు మిగతా అన్య రాజులను తమ రాజులుగా అంగీకరించుటకు సిద్ధంగా లేరు. వారి విశ్వాసం బెదరని విశ్వాసం చెరగని విశ్వాసం ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు దేవుని యందు నమ్మకం కోల్పోని విశ్వాసం వారిది. మన జీవితంలో కష్టాలు బాధలు వచ్చినప్పుడు చాలా సందర్భాలలో దేవునియందు విశ్వాసం కోల్పోతాం కానీ వీరు దేవిని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచారు. ఈ తల్లి కుమారులకు పునరుద్ధానం యందు నమ్మకం ఉంది అందుకే మరణం కు భయపడలేదు ఈ ఏడుగురి తల్లి చాలా గొప్పది కళ్ళముందే కుమారులు మరణించినప్పటికీ దేవుని యెడల విశ్వాసం కోల్పోలేదు, మరణంతో అంతా కాదని దాని తరువాత మరొక జీవితము ఉందని వారు గ్రహించారు. మరణించిన తరువాత వారు మరలా సజీవులై లేస్తారని వారు గట్టిగా నమ్మారు

ఎన్నో హింసలు భరించటానికి వారు సిద్ధంగా ఉన్నారంటే వారికి దేవుని యెడల ఉన్న నమ్మకం అలాంటిది. తమ దేవుడు వారిని ఆపదల నుండి ఆదుకుంటారని అపార నమ్మకం. యావే దేవుడిని ఈ కుటుంబం అమితంగా ప్రేమించింది కాబట్టే యావే దేవుని కొరకు ప్రాణాలు సమర్పించుటకు సిద్ధంగా ఉన్నారు.

తాత్కాలికమైన ఇహలోక జీవితం కంటే శాశ్వతమైన పరలోక జీవితం మేలైనది అని విశ్వసించారు. ఈ విశ్వాసం వలన వారు హింసలు ఎంతో ప్రేమతో ధైర్యంగా భరించారు.

ఈనాటి రెండవ పఠనములో   పౌలు గారు తెస్సలోనికా  ప్రజల కొరకు చేసిన ప్రార్థనను వింటున్నాం. పౌలు గారు తెస్సలోనికా ప్రజలు ఎల్లప్పుడూ దేవుని యొక్క పని చేయుటకు సిద్ధంగా ఉండమని, సత్క్రియలను చేయమని తెలుపుచున్నారు.

ఈనాటి సువిశేష పఠనము లో  యేసు ప్రభువు పునరుత్థాన జీవితం గురించి తెలుపుతున్నారు.

నేటి సువిశేష పఠనము లో సద్దుకయ్యులు  ఏసుప్రభువును ఒక కష్టతరమైన ప్రశ్న అడుగుచున్నారు అది ఏమిటంటే ఏడుగురు సహోదరులు ఒక స్త్రీని వివాహమాడారు కానీ వారిలో ఏ ఒక్కరికి సంతానం కలగలేదు పునరుత్థాన మందు ఆమె ఎవరి భార్య అగును  అని

సద్దుకయ్యులు ఈ ప్రశ్న ఎందుకు అడిగారంటే వారు మృతుల యొక్క పునరుత్థానమును విశ్వసింపరు ఏసుప్రభువును హేళన చేయుట కొరకు, అందుకే ప్రభువు వారు విశ్వసించే తోర (మొదటి ఐదు పుస్తకాలు) నుండి సమాధానం ఇచ్చారు.

ద్వితీయోపదేశకాండము 25: 5 వచనం ప్రకారం సోదరులు కలిసి నివసించుచుండగా ఒకడు సంతానం లేక చనిపోయినచో అతని భార్య కుటుంబంకు చెందిన పురుషుని వివాహమాడరాదు ఆమె పెనిమిటి సోదరుడు ఆమెను దేవుని న్యాయప్రకారంగా పెండ్లి చేసుకుని తన సోదరునికి మారుగా భర్త ధర్మము నెరవేర్చవలెను. యావే దేవుడు మన దేవుడు సజీవులకు దేవుడే కానీ మృతులకు కాదు. నిర్గమ 3:6 యావే దేవుడు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులదేవుడను అని అంటున్నారు అంటే ఇంకా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవునితో సజీవులగా జీవిస్తున్నారు ఆయన దృష్టికి అందరూ సజీవులే. ఏసుప్రభు మరణం తరువాత రాబోయే జీవితం ఇప్పుడు ఉన్న భూలోక జీవితం లాగా ఉండదని అది క్రొత్త జీవితం అని తెలుపుచున్నారు. పునరుత్థాన జీవితంలో వివాహ బంధాలు లేవు. అది శాశ్వతమైన జీవితం అక్కడ అందరూ దేవదూతల వలె దేవుని బిడ్డల వలే జీవిస్తారు. మన యొక్క మరణం తరువాత జీవితం మరొక లాగా ఉంటుంది సద్దుకయ్యులు మృతుల యొక్క పునరుద్ధానం ఆత్మలను అదేవిధంగా దూతలను విశ్వసింపరు అందుకనే మరణం తరువాత జీవితం కూడా ఈ భూలోకంలో లాకే ఉంటుందని భావించారు.  సద్దుకయ్యులు  వ్రాతపూర్వకంగా (written) ఉన్నది విశ్వసించేవారు నోటి(vocal) ద్వారా చెప్పబడింది విశ్వసింపరు వారు కొద్ది మంది అయినప్పటికీ వారు పాలనాధికారులు, వారు రోమా చక్రవర్తులకు సహకరించి జీవించేవారు, అధికారం కోసం డబ్బు కోసం ఆశపడేవారు.

వితంతువును ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి వివాహమాడుటకు కారణం ఏమిటంటే ఆమెకు సమాజంలో రక్షణ కల్పించుట కొరకు, ఆమె హక్కులు కాపాడుట కొరకు, ఆమెకు తోడుగా నిలుచుట కొరకు (ద్వితీ 25:5-10).

మన జీవితం ఈ లోకంలో ముగిసిన తరువాత పరలోకంలో అది కొనసాగింపుగా ఉండదు. అది ఒక కొత్త జీవితం ఆ క్రొత్త జీవితం అందరిదీ కూడా కాదు ఎవరైతే దేవుని చేత తీర్పునొంది పరలోకంలో ప్రవేశిస్తారో వారికి జీవితం క్రొత్తగా ఉంటుంది. మన దేవుడు సజీవులకు దేవుడు, ఎందుకంటే మోషే కన్నా 600 సంవత్సరాలు ముందు చనిపోయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను సజీవుడగు దేవుడను అని తెలిపారు, అంటే వారు దేవునికి దగ్గరగా సజీవులుగా ఉన్నారు. దేవునికి అందరూ సజీవులే - లూకా 20:38. సద్దుకయ్యులకు ప్రభువు తెలిపే సత్యం ఏమిటంటే మృతులకు పునరుద్దానం కలదని తెలుపుచున్నారు. పునరుద్ధానం తరువాత ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు అని తెలిపారు (లూకా 20:34-35).

దేవుని దృష్టిలో అందరూ సజీవులే అని తెలిపారు. అందరూ దేవుని బిడ్డలుగా పరిగణింపబడతారు. మరణం తరువాత పరలోక జీవితం కొత్తగా ఉంటుంది.

 BY. FR. BALAYESU OCD

29, అక్టోబర్ 2022, శనివారం

31 వ సామాన్య ఆదివారం

 31 వ సామాన్య ఆదివారం

సో. జ్ఞా. 11:22-12:2,  2 తెస్స 1:11-2:2 ,  లూకా 19:1-10

 ఈనాటి దివ్య పఠనాలు దేవుని యొక్క అనంతమైన ప్రేమ గురించి తెలుపుచున్నవి. పాపులను రక్షించుటకు దేవుడు ఎప్పుడు సిద్ధంగా వుంటారు. దేవునిమన్నింపు  పొందినమనము హృదయ పరివర్తన చెంది జీవించాలి.

జక్కయ్య మారుమనసు పొందుట

యేసుప్రభు రోజు సువిశేషంలో జక్కయ్య యొక్క జీవితంను పరిశీలించుటకు వచ్చారు. సువిశేషంలో ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం ఒకరు రక్షించాలి అని అనుకునేవారు, ఇంకొకరు రక్షణ పొందాలని అనుకునేవారు.

జక్కయ్యలోని రక్షణ పొందాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. యేసుప్రభువు యెరికో పట్టనంలోకి ప్రవేశిస్తారని గ్రహించిన వ్యక్తి ప్రభువును కలవటానికి వస్తున్నారు. దేవుడు వస్తున్నారని వారి ఇంటి గుండా పోతున్నారని తెలుసుకున్న వ్యక్తి చూడటానికి వస్తున్నారు. దేవుడు మన ఇంటిలోకి కూడా వచ్చే సమయాలు మన సంఘంలోనికి వచ్చే సమయాలు చాలా ఉన్నాయి. మన గ్రామంలో ప్రార్థన పెట్టినప్పుడు మైకు తీసుకొని చెబుతారు ఫాదర్ వచ్చారు పూజకు రావాలి అని.  ఎంతమంది ఇలాగ ప్రార్థనకు వస్తున్నాం. జక్కయ్యకు అవకాశం వచ్చింది. ప్రభువు అటు వెళ్తున్నారని తెలుకున్న ఆయన   వచ్చిన అవకాశము సద్వినియోగం చేసుకున్నారు.యేసుప్రభువు గెన్నేసరేతు ప్రాంతమునకు వెళ్ళినప్పుడు కూడా అక్కడికి రోగులను తీసుకొని వచ్చారు- మార్కు 6:55-56.

గ్రుడ్డివాడు ప్రజల కేకలను వింటున్నారు, యేసుప్రభు అటుగా వస్తున్నారని తెలుసుకున్నాడు అందుకే బిగ్గరగా అరుస్తున్నారు(లూకా 18:37,38. మార్కు 10: 46-52 -బర్తిమయి యేరికోలో చూపు పొందుట). దేవుడు వారి మార్గం గుండా పోతున్నారని వారు తెలుసుకున్నారు అందుకే దేవుడిని   కలవాలని వెళ్ళుచున్నారు. సువిశేషం గురించి ధ్యానించే ముందు యెరికో నగరం గురించి తెలుసుకోవాలి. యెరికో పట్టనం ఒక సంపద కలిగిన ప్రదేశం, వనరులు ఎక్కువగా ఉండే స్థలం.  రోము నగరస్తులు వర్తకానికి వచ్చేవారు. అక్కడ అధిక సంపదలు ఉంటాయి కాబట్టి సొమ్ము చేసుకోవడానికి రోము నగరస్తులు వస్తారు. డబ్బు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి జక్కయ్య కూడా అధికంగా సుంకం వసూలు చేసేవారు. జక్కయ్య డబ్బు సంపాదించుటలో ఒక గొప్ప స్థాయికి ఎదిగాడు కానీ దైవ ప్రేమను పొందుటలో సోదర ప్రేమను పంచుటలో ఆయన ఎదగలేకపోయారు.ఆయన సంపాదనలైయితే పెరిగాయి కానీ స్నేహితులు పెరగలేదు. ఆయనను అందరూ ద్వేషించారు ఎందుకంటే ఎక్కువగా సుంకం వసూలు చేసేవారు కొంత రోమాను చక్రవర్తులకు కొంత తన సొంత లాభానికి . ద్వేషించబడే వ్యక్తి సంఘంలో జీవించుట చాలా కష్టం అయినా జక్కయ్య నివసిస్తున్నారు. సువిశేష పఠనంలో మూడు ముఖ్యమైన స్థాయిలు ఉన్నాయి.

1. ఆయన ధనికుడు: ధనం ఉంది కానీ సంతోషం లేదు (లూకా 12: 16-21). ధనం ఉన్న వాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉండలేరు. డబ్బు పెట్టి double cot ను కొనవచ్చు కానీ నిద్ర నువ్వు కొనలేము. డబ్బు పెట్టి బిర్యానీ కొనవచ్చు కానీ ఆకలిని కొనలేము. డబ్బు పెట్టి వస్తువులను కొనవచ్చు కానీ సంతోషాన్ని కొనలేము. డబ్బుతో అంతా మనము కొనలేం. జక్కయ్య ధనమే సర్వం అనుకొని ధనంకు తన జీవితంలో ప్రాధాన్యత ఇచ్చి ధనం దగ్గరే ఉన్నాడు. నీ సంపద ఉన్న చోటనే నీ హృదయం ఉండును.- మత్తయి 6:21.

జక్కయ్యకు దేవుడిచ్చిన స్వేచ్ఛ వలన ఆయన ఎన్నుకుంటున్నారు తన యొక్క పాపపు జీవితాన్ని. అన్యాయపు మార్గము వలన ఆయన ప్రజలను కోల్పోతున్నారు. మనం ఎలా ఉండాలన్నా మనమే నిర్ణయం తీసుకుంటాం.

- పవిత్రంగా ఉండాలి- పాపిగా ఉండాలి

- మంచి కోడలిగా- మంచి భార్యగా

- తండ్రిగా - భర్తగా

- బిడ్డగా - కూతురిగా

అని మనకు ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి మన మార్గం ఎన్నుకొంటాం. యూరప్ ఖండంలో 15 సంవత్సరాలు వస్తే వారి దారి వారే చూసుకోవాలి ఎందుకంటే ఇవ్వబడినటువంటి స్వేచ్ఛను బట్టి. ఆదాముకు ఇవ్వబడిన స్వేచ్ఛలో ఆయన తన మార్గం ఎన్నుకొన్నారు, పండు తిన్నారు -ఆది 3:6. శిష్యులకు కూడా స్వేచ్ఛ ఇవ్వబడింది యేసుప్రభువు దివ్య సత్ప్రసాదం గురించి చెప్పినప్పుడు అయితే మార్గం ఎన్నుకునేది స్వేచ్ఛ వలన- యోహాను 24:15,16. మనం కూడా మంచి మార్గాన్ని ఎన్నుకుంటే మన జీవితాలు ఫలప్రదంగా ఉంటాయి. జక్కయ్య ప్రభువు గురించి విన్నారు, వినుట వలన విశ్వాసం వచ్చింది- రోమీ 10:17. మనం కూడా వింటాం మంచి మాటలు అయితే అందరితో కలిసి పోతాం. ప్రసంగం చెప్పే వాళ్ల గురించి వింటే గుడికి వస్తాం. యేసుప్రభువు పాపుల యొక్క స్నేహితుడని విన్నారు అందుకే ఆయనను కలవాలని అనుకున్నారు- మత్తయి 11:16-19.

2. యేసు ప్రభువును చూడాలని కోరిక, నిర్ణయం.

ఒక్కసారి దేవుని గురించి విన్న తరువాత ఆయనను చూడాలని కోరిక ఆయనలో కలిగింది. మనలో కూడా దేవుని చూడాలని కోరిక ఉండాలి. కోరిక ఉంటే చదవగలం. పవిత్ర గ్రంథంలో కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం:  రక్తస్రావంతో బాధపడే స్త్రీ. ప్రభు అంగీని తాకాలని కోరిక వచ్చింది తాకుతుంది. రోగులు స్వస్థత పొందాలని కోరికతో వచ్చారు పొందుతున్నారు. కోరిక ఉంటే చాలదు దానికోసం ప్రయత్నించాలి. జక్కయ్య ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి. సమాజంలో అన్యాయం చేసే వ్యక్తిని ఎవరు ఇష్టపడరు. తనను ఏమనుకున్నా పర్వాలేదు అని అనుకున్నాడు, కొట్టిన తిట్టిన ఏమి చేసినా సరే. కొన్నిసార్లు మనం సమాజంలో ఉన్నప్పుడు భయపడతాం. గుడికి వెళ్లాలన్నా, ప్రార్థన బయటకు చెప్పాలన్నా, దివ్య సత్ప్రసాదం తీసుకోవాలన్నా, కానీ జక్కయ్యలో మాత్రం దేవుని కలవాలనే కోరిక చాలా ధృడంగా ఉండిపోయింది. పునీత అవిలాపురి తెరేసమ్మ గారు అంటున్నారు ప్రతి ఒక్కరం ధృడ సంకల్పం కలిగి ఉండాలి, ఎటువంటి వాటికి వెనుదీయక మనం అనుకున్నదానిలో ముందుకు సాగిపోవాలి. మనం కూడా ఇలాగే ఉండాలి.

3. జక్కయ్య తాను ఇక నుండి ఒక కొత్త వ్యక్తి అని సమాజానికి చూపించారు అంటే తాను మారుమనస్సు పొందానని చెప్పాడు.

 యేసుప్రభుతో ఉంటే మన జీవితాలు మారతాయి.

శిష్యులు- మార్కు 3:14.

వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ- యోహాను 7:53–8:11

సౌలు ధమస్కు వెళ్లే మార్గంలో- అపో 9:1….

జక్కయ్యకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు. యేసుప్రభువును కలిసినప్పుడు మనలో కూడా మార్పు రావాలి. అప్పుడే ఆయన యొక్క రాకడకు అర్థం ఉంటుంది. ప్రభువు మనతో ఉండాలి అంటే మనం కూడ మన జీవితంలో క్రిందికి దిగి రావాలి.

ఎక్కడి నుంచి క్రిందకు రావాలి?

1. మూఢనమ్మకాలు

2. పాపం నుండి

3. గర్వం నుండి

4. చెడు వ్యసనాల నుండి

5. కోపం, ద్వేషం, పగల నుండి

6. ఆస్తులు అంతస్థుల నుండి

అలా ఉంటేనే దేవుడు నీతో ఉంటారు నాతో ఉంటారు. మనం కూడా తగ్గింపు కలిగిన జీవితాన్ని జీవిస్తేనే దీవెనలు ఎక్కువగా వస్తాయి. అవకాశం ఒక్కసారే వస్తుంది వచ్చినప్పుడు జీవితాలను మార్చుకోవాలి.


BY. FR. BALAYESU OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...