19, నవంబర్ 2022, శనివారం

క్రీస్తురాజు మహోత్సవము

 

క్రీస్తురాజు మహోత్సవము 

                                                                                        2సమూ :5:1-3

కొలస్సి :1:12-20

లూకా :23:35-43

     పూజ్య గురువులు, ప్రియమయిన సహోదరీ, సహోదరులారా! ఈరోజు మన తల్లి అయిన తిరుసభ క్రీస్తురాజు మహోత్సవమును కొనియాడుతుంది. ముందుగా మీ అందరికి పండుగరోజు శుభాకాంక్షలు, దేవునియొక్క దీవెనలు.

     ఈపండుగను జరుపుకొనేటప్పుడు మనకు ఒక సందేశమురావచ్చు.అది ఏమిటంటే, మ్రానికొమ్ముల ఆదివారము క్రీస్తు ప్రభువును ఒక రాజుగా కొనియాడుతున్నాము. అప్పుడు యేసుప్రభువు యూదులకు ఒక రాజుగా యెరూషలేము నగరంలోనికి ప్రవేశించడం మనం చూస్తున్నాం.ఆసంఘటన యూదులకు మాత్రము యేసుప్రభువు ఒక  రాజుగా చిత్రీకరించడం జరిగినది.ఈక్రీస్తురాజు పండుగ ప్రపంచములోని రాజులకంటే, యేసుప్రభువు గొప్పవాడిగా, రాజులకు రాజుగా,ప్రభువులకు ప్రభువుగా, పండుగను జరుపుకుంటున్నాము. మనము చరిత్రను చూసినట్లయితే,మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత రాజులు తమ స్వార్ధముతో సొంత ప్రయోజనములకోసము, కీర్తి, పరువు ప్రతిష్ఠలకోసం వేరే దేశములపై తిరుగుబాటును మనం చూస్తున్నాం.దీనిని దృష్టిలో పెట్టుకొని, ప్రపంచములో శాంతిని నెలకొల్పడానికి పొప్ పయస్ XI quas primes (in the first).  దీని అర్ధం మొట్టమొదట విశ్వలేఖలో  రాజులందరూ క్రీస్తుప్రభువుని రాజులకు రారాజుగా, ప్రభులకు ప్రభువుగా,విశ్వసించి, ప్రపంచములో శాంతిని నెలకొల్పాలని ఈలేఖను రాసాడు.

  1. రాబోయే మెస్సయ రాజు:

2.క్రీస్తు ఎలా రాజు?

3.యేసు శాంతికరుడైన రాజు

 1.  రాబోయే మెస్సయారాజు:

         రాజు అనేవాడు ప్రజల బాధలనుండి రక్షించేవాడు. ప్రజలు నిర్భయముగా శాంతి సమాధానాలతో,పరిపాలన చేసేవాడు రాజు.ఇశ్రాయేలు రాజులు సరిగ్గా పరిపాలన చేయలేదు. కనుక రాజవ్యవస్థ కూలిపోయింది.ప్రవక్తలు భావికాలములో మెస్సయ్య నూతన రాజుగా వస్తాడని, ప్రవచనములను చెప్పారు. యెషయా ప్రవక్త ఇలా పలుకుతున్నారు: “మనకొక శిశువు జన్మించాడని చెప్తూ,అతని పుట్టుకను తెలియజేశాడు.అతడు నీతితో పరిపాలనము చేస్తాడు.అతని యేలుబడిలో ప్రజలు శాంతి సౌఖ్యముతో జీవిస్తారు. అతడు బేత్లెహేములో పుడతాడని చెప్పాడు.

  యిర్మీయా ప్రవక్త కూడా ఇలా అంటున్నాడు: “నేడు దావీదు వంశమునుండి నీతిగల రాజును ఎన్నుకొంటాను”(23:5).

జెకరియా ప్రవక్త కూడా ఇలా అంటున్నాడు:”తర్వాత దావీదు వంశానికి చెందిన సెరుబ్భాబేలు రాజ్య వ్యవస్థను పునరుద్ధరిస్తాడు అనుకొన్నారు. కానీ ఆశ నెరవేరలేదు. (8:9).

యెష:60:16, అన్య జాతుల రాజులు రాజుకు లొంగివుంటారు అని భావించారు.

  2.  క్రీస్తు ఎలా రాజు?:

          మత్త:2:6 లో ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు మెస్సయాను గూర్చి హేరోదు రాజుకి వివరించారు. “మెస్సయ్య రాజుగా జన్మిస్తాడని బేత్లెహేములో పుడతాడని వారి ముందుగానీ ప్రవక్తల ప్రవచనములు ద్వారా తెలుసు. కానీ, యేసు ప్రభువు ఇంత నిడారంబరముగా రాజభవనములకు దూరముగా పశువుల పాకలో యూదుల రాజుగా జన్మిస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ చిత్రముగా యేసు జన్మించినపుడు నిడారంబరముగా ఉన్నాడో, మరణ సమయములో కూడా అలానే వున్నాడు. రాజ్యములేదు, సింహాసనము లేదు, కిరీటము లేదు. ఆయనకు ఎదురయిన ప్రశ్న: “నీవు యూదుల రాజువా?” ఇది పిలాతు అడిగిన ప్రశ్న. మత్త:27:11    వచనములలో దానికి యేసు ప్రభువు సమాధానము: “నీవు అన్నట్లే". చిన్నమాటలో సత్యాన్ని గ్రహించాడు పిలాతు.ఆయన సిలువ పై భాగములోనజరేయుడైన యేసు యూదులరాజు అని రాయించి దానిని మార్చమని అడిగిన వారికి: “నేను రాసినదేమో రాసితిని.అని చెప్పి నోరు మూయించాడు. ఆయన జీవితములో ఆరంభములో వినబడిన    ప్రశ్న: “యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ?” జీవితాంతములో, వినిపించిన మాట నజరేయుడయినా యేసు యూదుల రాజు. అలాగయితే ఎన్నో సందేహాలు,మరి నీరాజ్యము ఏది నీ సింహాసనము ఏది? నీ సైన్యమేది? ప్రశ్నకు సమాధానం, నా రాజ్యము ఈలోక   సంబంధమయినది కాదు. ఎందుకంటే, అయన రాజ్యము ఈలోక  సంబంద్ధమయిందయితే, అది కాలానికి లోబడుతుంది, కొంతకాలమే ఉంటుంది. దావీదు రాజు సొలొమోను రాజు ప్రపంచాన్ని గడగడా లాడించిన అలెగ్జాండర్ వారి మనుగడ తరువాత కాలగర్భములో కలిసిపోయారు.మరియు మెసయ్య యూదుల రాజుగా జన్మించిన వాడుకూడా అలా కాల గర్భములో కలిసిపోవలసిందేనా? లేదు. అలా జరగడానికి వీలులేదు. ఎందుకంటే, క్రీస్తుపూర్వం ఏడువందల సంవత్సరములో యెషయా ప్రవక్త ప్రవచించాడు(9:7). అతని రాజ్యాధికారం విస్తరించును.

   అతని రాజ్యము సదా శాంతి నెలకొనును. అతడు దావీదు సింహాసనమును అధిష్టించి, నీతి న్యాయములతో అధికారము నేర్పుచూ,నేటినుండి కలకాలం వరకు పరిపాలనను చేయును. శాశ్వతముగా పరిపాలన చేయువాడు దేవుడు మాత్రమే. ఒక నిరపరాధి రక్తముతో తనకు సంబంధము కల్పించవద్దని చేతులు కడుగుకొనిన పిలాతు యేసును రాజుగా అంగీకరించాడు.అప్పుడే జన్మించిన బాలుని జ్ఞానులు రాజుగా అంగీకరించారు.ఫిలిప్పు, నిన్ను పిలువక పూర్వమే,నేను నిన్ను ఎరిగివున్నాను, అని యేసు అనగానే, నతానియేలు, నీవు దేవుని కుమారుడవు, యూదుల రాజువని తన విశ్వాసాన్ని ప్రకటించాడు.

3.యేసు శాంతికరుడైన రాజు:

      శాంతి అంటే,యుద్ధము లేకుండా వుండే వాతావరణము కాదు. ప్రజలు శాంతి సమాధానాలతో  జీవించడం.శాంతిని హీబ్రూ భాషలో షాలోమ్ అని అంటారు. దాని అర్ధం: “ప్రజా సంక్షేమం దేవునితో సమాధానము.మన సువార్తలో చూస్తున్నాం, దూతల సమూహము దేవుని అనుగ్రహమునకు పాత్రులైనవారికి శాంతి కలుగును గాక. దేవుని అనిగ్రహమును పొందు వారికి శాంతిని అనుగ్రహించడానికి బాలుడు (యేసుప్రభువు) జన్మించాడు. ఈయన ప్రధాన లక్ష్యం శాంతిస్థాపన. ఆనాటి కాలములో రాజకీయ పరిస్థితులలో మతపరమైన శాంతిస్థాపన చాలా అవసరం.  యేసు ప్రభువు ఉత్తానమైన తరువాత శిష్యులకు కనిపించి వారితో, "మీకు శాంతికలుగునుగాక" అన్నాడు. భయముతో, ఆందోళనతో  ఉన్న వారికి శాంతి సమాధానము చాలా అవసరం. వాటిని ప్రభువు తన శశిష్యులకు ప్రసాదిస్తున్నాడు.దేవుడు తప్ప మరెవ్వరూ ఇవ్వలేని తిరుగులేని శాంతి ఇది.

   తనతో సిలువ వేయబడిన దొంగలలో ఒకడు తన పాపక్రియలకుకారణము పశ్చాత్తాపపడి, యేసు దైవత్వాన్ని గుర్తించి, యేసూ, నీరాజ్యములో ప్రవేశించినపుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని ప్రాధేయపడ్డాడు. ప్రభువు తనతో, నేడే నీవు పరలోకములో ప్రవేశించెదవు. ఆవ్యక్తికి అట్టి వాగ్ధానము రాజులకు రాజుతప్ప మరెవ్వరు ఇవ్వలేరు.

మొదటి పఠనంలో: దావీదు దగ్గరకు ప్రజలు వఛ్చి నీవు మాకు  రాజుగా ఉండు అని ప్రాధేయ పడుతున్నారు. ఎందుకంటే, అతడు ఇతర రాజులతో యుద్ధము చేసి వారిని ఓడించి ఇశ్రాయేలు ప్రజలను గొప్పగా గెలిపించాడు. ఇది చూసిన, తెలుసుకొనిన ప్రజలు తన దగ్గరకు వచ్చి, నీవు మాకు రాజుగా ఉండు అని అడుగుతున్నారు.కానీ సువిశేషములో యేసు ప్రభువు సిలువమీద వున్నప్పుడు తనను ప్రజలు చూస్తున్నారు కానీ, దేవునిగా గుర్తించలేకపోయారు. ప్రధానార్చకులు తనను తాను రక్షించుకోమని హేళనచేశారు, అక్కడ ఉన్నటువంటి భటులు యేసు  ప్రభువుని   హేలనచేశారు. కానీ తనతోపాటు సిలువవేయబడిన దొంగవాడు మాత్రం దేవుని యొక్క మహిమను తెలుసుకొని రాజుగా స్వీకరించి, యేసుతో పలికిన మాట:యేసూ, నీవు నీ రాజ్యములో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకంనుంచుకొనుము" అని పలికాడు. అప్పుడు యేసు ప్రభువు,నీవు ఇప్పుడే నాతోపాటు పరలోక రాజ్యములో ప్రవేశిస్తావు అని పలికాడు. అంటే ఈలోకంలో నీవు ఎన్ని పాపములు చేసినా దేవుని యందు విశ్వాసముకలిగి పశ్చాత్తాపముతో ప్రార్ధన  చేస్తే  దేవుడు తప్పక మన ప్రార్ధన ఆలకిస్తాడు. మన యేసు ప్రభువు ఎంతో మందిని స్వస్థ పరిచాడు, ఎంతోమందికి చూపును దయచేసాడు, ఎంతోమందికి నూతన జీవితమును ప్రసాదించాడు. ఎందుకంటే అయన మనల్ని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. అంతగా ప్రేమించే దేవాతి దేవుడవైన యేసు ప్రభువుని ఒక రాజుగా, దేవునిగా, అభిషిక్తుడుగా, సృష్టికర్తగా మనము స్వీకరిస్తున్నామా లేదా ని ఆత్మపరిశీలన  చేసుకోవాలి.

     చివరిగా, ఈపండుగరోజు మనమందరముకూడా  యేసును రాజుగా అంగీకరిస్తున్నామా? లేక అయన అధికారమునకు లోబడి ఉంటున్నామా? ఆయనకు విధేయత కలిగి జీవిస్తున్నామా?అని  ఆత్మపరిశీలన చేసుకుందాం! ఆమెన్ .

 

 

                                                                                                                                     By

Br.Simon

34 వ సామాన్య ఆదివారం

 34  వ సామాన్య ఆదివారం 

క్రీస్తురాజు  పండుగ 

2 సమూయేలు  5:1-3
కొలొస్సి  1:12-20 
 లూకా 23:35-43

నేడు తల్లి శ్రీ సభ క్రీస్తు రాజు యొక్క మహోత్సవమును కొనియాడుచున్నది. 11వ భక్తి నాథ పాపుగారు ''క్రీస్తు రాజు పండుగను" 1925 వ సంవత్సరంలో ప్రకటించారు. ఈ లోకంలో అందరు పాలకులు తామంతట తాము గొప్పవారని భావించే సమయంలో, సర్వభౌమాధికారం, సామంతపాలనం పడిపోతూ ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నాస్తికత్వం ప్రవేశిస్తున్న సమయంలో క్రీస్తు ప్రభువు ప్రజలకు నిజమైన రాజు అని ఆనాటి 11వ భక్తి నాథ పాపుగారు తెలియజేశారు. దేవుడే నిజమైన రాజు, మానవ మాత్రులు కేవలం ఒక సాధనములే, క్రీస్తు ప్రభువు రాజు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, తండ్రితో పవిత్రాత్మతో కలిసి సృష్టిని చేసి పరిపాలిస్తున్న దేవుడు ఈ లోకం మీద సర్వాధికారం కలిగిన వ్యక్తి. సర్వము ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించబడినది, అందుకే ఆయనకు సర్వాధికారం ఇవ్వబడినది. మనందరి జీవితాలను రక్షించే రాజు క్రీస్తు ప్రభువు. ఆయన విలువైన తన రక్తమును ధారపోసి మనందరినీ కాపాడిన రాజు మన యొక్క జీవితంలో సంతోషం ఉండుటకు శాంతి ఉండుటకు తానే తన జీవం ఇచ్చి మనందరినీ కాపాడారు. ఈరోజు ప్రత్యేకంగా క్రీస్తు ప్రభువు యొక్క రాజ్యం గురించి ఆయన పాలన గురించి ఆ రాజు యొక్క గొప్ప లక్షణాలు ధ్యానించుకుందాం.

నూతన నిబంధన గ్రంథంలో కూడా దేవదూత మరి అమ్మకు మంగళవార్త చెప్పే సమయంలో దేవదూత మరియమ్మతో దావీదు సింహాసనం ఆయనకు ఇవ్వబడుతుంది అని చెప్పారు. - లూక 1:32.

ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును అని అలాగే ఆయన రాజ్యమునకు అంతమే ఉండదని చెప్పారు.

ముగ్గురు రాజులు బాల యేసును దర్శించుటకు వచ్చిన సమయంలో యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ అని అడిగారు - మత్తయి 2:2. ముగ్గురు రాజులు క్రీస్తును రాజుగా గుర్తించారు. ఏసుప్రభు తన యొక్క సిలువ శ్రమలు అనుభవించే ముందు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు ప్రజలు ఆయనను రాజుగా అంగీకరించి గొప్పగా నినాదాలు చేశారు ఆయన్ను మెచ్చుకున్నారు. లూక 19:38.

ప్రజలు క్రీస్తు ప్రభువును రాజుగా గుర్తించారు ఎందుకంటే ఆయన వారి కోసం పోరాడారు వారికి తోడుగా ఉన్నారు వారి బాధలలో పాలుపంచుకున్నారు అందుకే ఆయన్ను రాజుగా ప్రజలు గుర్తించారు.

ఫిలాతు కూడా ఏసుప్రభువును నీవు యూదుల రాజు వా అని ప్రశ్నించారు - యోహాను 18:33.

పిలాతు యేసు ప్రభువు యొక్క శిలువ మీద వ్రాయించిన మాటలు అవే నజరేతుడైన యేసు యూదుల రాజు.

చివరికి ఆయన రెండవసారి వచ్చేసరికి ఆయన మెఘారూడై వస్తారని చెప్పారు - మత్తయి 28:18.

ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువు రాజు అని తెలియజేసే అంశాలు ఏసుప్రభు కూడా సువార్తను ప్రారంభించిన సమయంలో మొదటిసారిగా పలికిన మాటలు కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది అని. క్రీస్తు ప్రభువు దేవుని రాజ్యమునకు రాజు, దేవుని రాజ్యం అంటే సమస్తము.

సాధారణంగా రాజు అంటే ఒక రాజ్యాన్ని పాలించేవాడు అని అర్థం ఆ రాజ్యానికి కొన్ని సరిహద్దులు ఉంటాయి. కొందరు వారసత్వం పరంగా రాజులవుతారు మరికొందరు ప్రజల యొక్క ఆదరాభిమానాల వల్ల రాజులవుతారు. ఏసుక్రీస్తు ప్రభువు మాత్రం దేవుడు అదే విధంగా ప్రజల చేత గుర్తించబడ్డా రాజు. ఆయన అధికారం కానీ ఆయుధాలు కానీ ధరించని రాజు ప్రజలపై ఆధిపత్యం చలాయించే రాజు కాదు వారికి స్వేచ్ఛనిచ్చే రాజు ఆయన యొక్క రాజ్యత్వం ఈ లోక సంబంధమైనది కాదు పరలోక సంబంధమైనది.

1. దేవుని రాజ్యం ప్రేమ రాజ్యం- 

అందరినీ కూడా ప్రేమించిన గొప్ప ప్రేమామయుడు. ఆయన రాజ్యంలో కలహాలకు యుద్ధాలకు తావులేదు విభజనలకు తావులేదు అధికార వాంఛలకు తాగులేదు ఆయన కేవలం ప్రేమతో తన రాజ్యపాలన చేశారు.

- ప్రేమతో ప్రజల వద్దకు వచ్చారు ప్రేమతో ప్రజల కష్టాలు బాధలు పంచుకొన్నారు.

- ప్రేమ వలన సిలువ మోసారు ప్రాణత్యాగం చేశారు దైవ ప్రేమను మానవాళికి పంచినా రాజు క్రీస్తు ప్రభువు.

2. దేవుని రాజ్యం శాంతి రాజ్యం-

దేవునికి మానవునికి మధ్య పాపం చేయటం వలన ఏర్పడిన ఆ అగాధమును క్రీస్తు రాజు భర్తీ చేశారు. తన యొక్క జీవితం ద్వారా మరణా పునరుద్ధానం ద్వారా సమాధానమును ఏర్పరిచారు. తండ్రికి ప్రజల మధ్య శాంతిని సమకూర్చారు. కలవర పడే హృదయాలలో శాంతిని నెలకొల్పిన రాజు. ప్రజల మధ్య శాంతిని నెలకొల్పిన రాజు.

3. దేవుని రాజ్యం సంతోషకరమైన రాజ్యం-

యేసు ప్రభువు ఈ లోకంలోనికి సంతోషమును తీసుకొచ్చిన రాజు.

- ఆయన జన్మం తల్లిదండ్రులకు సంతోషమును తెచ్చింది.

- ఆయన జన్మం గొర్రెల కాపరులకు సంతోషం నిచ్చింది.

- ఆయన సేవ రోగులకు సంతోషం ఇచ్చింది.

- ఆయన సిలువ భారం పాపులకు రక్షణ అనే సంతోషం నిచ్చింది.

ఆయన పేదవారికి నేనున్నాను అనే ఒక భరోసానిస్తూ సంతోషం ఇచ్చింది ఆయన రాజ్యంలో సంతోషమే ఉంటుంది ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటారు. మన బాధలు పంచుకొని మన కుటుంబాలలో ఒక వ్యక్తిగా జీవిస్తూ మనలో సంతోషమును తీసుకొని వచ్చినా రాజు. దేవుని రాజ్యమును స్థాపించినది దేవుడే అందుకే అది పవిత్రమైనది శాశ్వతమైనది శాంతి కరమైనది సమాధానములతో కూడినది.

-సమస్త సృష్టి ప్రాణులపై క్రీస్తుకు ఆధిపత్యం ఉంది. ఆయన రాజ్యాధికారం రెండు రకాలుగా అర్థమవుతుంది:

1. ఆయన సహజ సిద్ధంగా ఆయన హక్కులు కలిగి ఉన్నారు

2. రక్షకునిగా తన ప్రాణం ఫణంగా పెట్టి సంపాదించుకున్నాడు రాజు రక్తం ద్వారా మనకు విముక్తి కలిగింది.

- ప్రజలు ఏసుప్రభువును రాజుగా భావించి అంగీకరించారు. రోమా రాజ్యంపై దండయాత్ర చేసి వారిని ఓడించి నూతన సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు అని వారు తలంచారు.

- ఆయన మాటల్లో ఆకర్షణ చూసి ఆయన ప్రవర్తనలో ఆయన యొక్క కార్యాలలో ప్రజలకు ఆ నమ్మకం వచ్చింది.

- ఆకలితో ఉన్నవారికి రొట్టె ముక్కలను ఇచ్చి పోషించారు చేపలతో వారిని సంతృప్తి పరుస్తారు అని గమనించిన ప్రజలు ఆయన్ను రాజును చేయాలని అనుకున్నారు.

- వారి బానిసత్వ బ్రతుకు నుండి కాపాడే రక్షకుడని వారికోసం పోరాడే రాజుని ప్రజలు విశ్వసించారు.

- ఏసుప్రభు చేసిన అనేక గొప్ప కార్యాలు ఆయన్ని రాజుగా అంగీకరించేలా చేసినవి.

- అయితే ఆయన రాజ్యం ఈ లోకం కు చెందినది కాదని స్పష్టంగా ఫిలాతుకు తెలియజేశారు. ఈ లోక రాజులు అధికారంతో అహంతో స్వార్థంతో స్వబుద్ధితో పరిపాలన చేసేవారు కానీ క్రీస్తు రాజు వారికి భిన్నంగా జీవించారు.

ఆయన ఆల్ఫా ఒమేగా - ఆదియు అంతమునైన రాజు.

1 . మన రాజు మనల్ని ప్రేమిస్తారు:

ఆయన తన ప్రజల మధ్య ఎటువంటి తారతమ్యం లేకుండా ప్రేమిస్తారు.

- పేదలను ధనికులను ఒకే దృష్టితో ప్రేమించారు.

- సజ్జనులపై దుర్షనులపై ఒకే విధంగా వర్షంను సూర్యుణ్ణి కుమ్మరిస్తూ ప్రేమను చూపుతున్నారు.

- అందరినీ ప్రేమించారు.

- క్రీస్తు రాజు తన స్నేహితుల కోసం ప్రాణాలను అర్పించారు - యోహాను 15:13.

- దీనికి మించిన ప్రేమ వేరొకటి లేదు.

- రాజు మామూలుగా తన ప్రజలను యుద్ధం చేయటానికి తన కన్నా ముందుగా సైన్యం ను పంపిస్తారు కానీ మన రాజు తానే ముందుండి నడిపించారు.

- ఏ రాజు తన సైన్యం కోసం ప్రాణాలు సమర్పించారు కానీ క్రీస్తు రాజు తన ప్రాణాలు అందరికన్నా ముందుండి సమర్పించారు.

- ఆయన మనల్ని ప్రేమించారు కావున తనను తాను సమర్పించుకున్నారు.

-రెండవ పఠనం (దర్శన 1:5) క్రీస్తు మనల్ని ప్రేమించారు అందుకే మన పాపాల్ని కడిగి వేశారు.

- ఏ రాజు కూడా క్రీస్తు రాజు కన్నా ఉదార స్వభావి కాదు.

ఎందుకంటే ఆయన మనల్ని తన బిడ్డలుగా స్వీకరించారు జ్ఞాన స్నానం ద్వారా ఆయన మనతో తన జీవాన్ని పంచుకున్నారు.

- ఆయన తన యొక్క శరీర రక్తాలను తనతో పంచుకున్నారు దివ్యసప్రసాదం ద్వారా.

ఆయన తన యొక్క యాచకత్వమును మనకు ఇచ్చారు (దర్శన 1:6)

- దేవుడు మానవులను అమితంగా ప్రేమించారు కాబట్టే మనకు సహాయం చేశారు.

2. క్రీస్తు రాజు నమ్మదగిన/విశ్వసింపదగిన రాజు

రాజు న్యాయం చేస్తాడని చాలామంది వారిని సంప్రదిస్తారు కానీ కొందరు రాజులు అందరికీ న్యాయం చేయరు అందరు రాజులు కూడా విశ్వసింపదగిన రాజులు కారు. వాగ్దానాలు చేస్తారు కానీ నెరవేర్చరు.

- క్రీస్తు రాజు మాత్రము నమ్మదగిన రాజు తన మీద నమ్మకం ఉంచి తన చెంతకు వచ్చిన వారికి న్యాయం చేసే రాజు ప్రజల యొక్క అవసరాలల్లో తోడుగా ఉండి వారు అడిగిన వెంటనే సానుకూలంగా వారికి సహకరించి దీవెనలు ఇచ్చే రాజు.

- శతాధిపతి నమ్మకం వచ్చి అడిగాడు అప్పుడు క్రీస్తు రాజు తన సేవకుని ఇచ్చారు.

- భర్తీమయి నమ్మకంతో అడిగాడు - చూపు పొందాడు.

- కమనీయ స్త్రీ నమ్మి ఆశ్రయించినది ప్రభువు దీవెనలిచ్చారు.

- నమ్మకమును నిలబెట్టుకోవటం కూడా ఒక సత్యమైన వ్యక్తిత్వం కు గుర్తు.

3. క్రీస్తు రాజు అందరినీ కూడా గౌరవించే రాజు సాధారణంగా సమాజంలో రాజులు పేదవారికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వరు.

- ధనవంతులతో సమాజంలో పేరు ఉన్న వారితో సన్నిహితంగా ఉంటారు.

- క్రీస్తు రాజు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వమును గౌరవిస్తారు.

- ఆయన ధనికులను మాత్రమే కాదు చేరదీసింది పేదవారిని వితంతువులను అనాధలను అందరినీ కూడా గౌరవించారు.

- ఆయన పేదవాని స్నేహితుడిగా పిలువబడ్డాడు.

- సుంకరులతో పాపులతో కలిసి భుజించారు అది ఆయన యొక్క గొప్పతనం.

4. క్రీస్తు రాజు మన కుటుంబంలోని రాజు/మానవ కుటుంబం కు చెందిన రాజు

- క్రీస్తు రాజు మనుష్య కుమారుడు ఈ లోకంలోనే మానవ రూపం దాల్చారు.

- దానియేలు మనుష్యకుమారుని రాకడ గురించి చెప్పారు. దానియేలు 7:13. ఇవి క్రీస్తుని ఉద్దేశించి పలికిన మాటలు.

- ఆయన మనలో ఒకనిగా మానవ రూపం దాల్చి జీవించారు పేదవానిగా జీవించారు- మత్తయి 8:20.

- ఈ లోక సంబంధ రాజులు ప్రజల యొక్క బాధలు చాలా తక్కువగా జరిగి ఉంటారు కానీ క్రీస్తు రాజు ప్రజలతో సంచరించారు ప్రజల నడుమ జీవించారు తన పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకంలో మానవునిగా జన్మించి మనలాగే ఆకలి తప్పులు బాధలను సంతోషాలు కలిగి జీవించినా రాజు- హెబ్రి 4:15, మార్కు 10:12, యోహాను 4:7.

- క్రీస్తు రాజు ప్రతి ఒక్కరినీ కూడా చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నా రాజు. ఆయన మన కుటుంబానికి చెందిన రాజు అని చెప్పినప్పుడు మనకి ఆయనకు బంధం ఉందని అర్థం. మనం ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళం.

- మన కుటుంబంలోని రాజు కాబట్టి మనలను అర్థం చేసుకొని మనకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం ను తొలగిస్తారు.

5. క్రీస్తు రాజు శక్తి కలిగిన రాజు:

క్రీస్తు ప్రభువుకు సైన్యం లేనప్పటికీ ఆయన శక్తి కలిగిన రాజు ఆయుధాలు లేవు అయినా సరే క్రీస్తు ప్రభువు రాజే.

- ఆయన మాటలలో శక్తి ఉంది

- ఆయన అంగీలో శక్తి ఉంది

- ఆయన స్పర్శలో శక్తి ఉంది

ఈ భూలోక రాజులను పరిపాలించే రాజు (దర్శన 1:5) ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు (దర్శన 19:16)

- రోమా చక్రవర్తులు/రాజులు వారే శక్తివంతులు అని అనుకున్నారు వారి యొక్క సైనిక బలంతో అంతా చేయించవచ్చు అని అనుకున్నారు వారు చెప్పింది జరుగుతుంది అని నమ్మారు. కానీ తొలి క్రైస్తవులను రాజు యొక్క విగ్రహాన్ని ఆరాధించమని చెప్పినప్పుడు ఆ క్రైస్తవులు ఆరాధించలేదు ఎందుకంటే క్రీస్తు నిజమైన దేవుడు ఏకైక రాజు అని వారు గ్రహించారు.

- క్రీస్తుకు సమస్తము ఇవ్వబడింది - మత్తయి 28:18, ఆయన రాజ్యంకు అంతమే ఉండదు- లూకా 1:33, దాని 7:13,14.

క్రీస్తు రాజు తన యొక్క శక్తిని అంతటినీ ఇతరుల మేలు కోసం వినియోగించారు.

క్రీస్తు ప్రభువు నిజమైన రాజు ముల్లకిరేటం ఆయన యొక్క రాజకిరేయటం సిలువయే ఆయన సింహాసనం కాబట్టి మనం క్రీస్తు రాజును మన జీవితాల రాజుగా గుర్తించి మనలను పాలించేలా సహకరిద్దాం.

- ఆయన రాజ్యంలో దొరికే శాంతి సమాధానం కోసం ప్రేమ కోసం జీవించూద్దాం.


FR. BALAYESU OCD

 


పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...