3, డిసెంబర్ 2022, శనివారం

 

ఆగమన కాలం రెండవ ఆదివారం

         యెషయా 11: 1-10

                                                రోమా 15: 4-9

                                                       మత్తయి 3: 1-12

ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు దేవుని యొక్క రాకడ, ఆయన జన్మం మనలో జరగాలంటే మనలో హృదయ పరివర్తన ఉండాలి అనే అంశం గురించి తెలియజేస్తున్నాయి.

 ఎవరి హృదయాలు అయితే పరిశుద్ధంగా ఉంటాయో అక్కడ ప్రభువు జన్మిస్తారు.  దేవుని జన్మం కోసం మన ఒక్క ఆలోచనలు, మనస్తత్వాలు, హృదయాలు  నూత్నీకరించాలి.

యొక్క ఆగమన కాలంలో మన యొక్క జీవితాలను మనం నూత్నీకరించుకోవాలి. దేవుని యొక్క రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం.

సృష్టి ప్రారంభం  నుండి దేవుడు మానవులను రక్షించాలని ఆశించారు.   పాపం చేయటం వలన మనిషి దేవునికి దూరమయ్యాడు. తన యొక్క ఆధ్యాత్మిక జీవితం క్షిణించినది అందుకే ప్రభుక్కు మానవ జాతిని రక్షించాలని ప్రవక్తలను పంపుచున్నారు. వారి యొక్క జీవితములను నూత్నీకరించమని తెలుపుచున్నారు.

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు విధంగా తాను ఎన్నుకొన్న ప్రజలను తన యొక్క కుమారుని ద్వారా నూత్నీకరిస్తారో యెషయా ప్రవక్త తెలుపుచున్నారు.

యెషయా ప్రవక్త ఈషాయి మొద్దునుండి ఒక పిలక పుట్టును అని తెలుపుచున్నారు. యొక్క మాటలు యేసుప్రభువు యొక్క జీవితంకు వర్తిస్తాయి.  ఈషాయి / జెస్సే దావీదు తండ్రి.  దావీదు వంశం మెస్సయ్యా జన్మిస్తాడని అర్ధం - దర్శన 22: 16, యిర్మీయా 23: 5. యెషయా ప్రవక్త దేవుడు దావీదుకు చేసిన వాగ్ధానాలను జ్ఞాపకం చేసుకుంటూ పలికిన మాటలివి (2 సమూ 7: 16).

దావీదు వంశమున జన్మించబోయే శిశువు రాజ్యమును పరిపాలించును అని, దావీదు యొక్క రాజ్యమును రాబోయే మెస్సయ్యా శాశ్వతముగా పరిపాలించును అని యెషయా ప్రవక్త ప్రవచించారు - యెషయా 9: 7.

దేవుని యొక్క ఆత్మ అతని మీద నిలుచును, ప్రభుని ఆత్మ రాజ్యపాలన చేయుటకు దావీదు వంశమున జన్మించు రాజుకు శక్తిని ఒసగును, కావలసిన వరములను దయచేయును (మత్తయి 3:16 - 17).

మెస్సయ్యా వచ్చినటువంటి కాలంలో దేవుడు తన ప్రజలను క్రొత్తవారిగా నూత్నీకరిస్తారు. ఆయన తన ప్రజలను న్యాయముగా తీర్పు చేస్తాడు. ఎటువంటి తారతమ్యములు, భేదాభిప్రాయాలు లేకుండా వారికి తీర్పు చేస్తారు.

ఇతరులవలే కాకుండా ప్రభువు మనయొక్క హృదయాలను పరిశీలించి తీర్పు చేస్తారు 1 సమూ 16: 17.

లోక న్యాయాధిపతులు కేవలం చూసిన దానిని బట్టి, వినిన దానిని బట్టి తీర్పు చేస్తారు కానీ ఈషాయి మొద్దునుండి పుట్టిన పిలక మెస్సయ్యా తన ప్రజలను న్యాయముగా తీర్పు చేస్తారు.

పేదలను, అవసరంలో ఉన్నవారిని అనాధారం చేయడు. ప్రతి ఒక్కరికి ఇవ్వవలసిన గౌరవమును ఇస్తారు. ఈలోక పాలకులవలె కాకుండా మెస్సయ్యా వచ్చినప్పుడు పేదలను ఆదుకొని వారికి తగిన విధంగా మేలు చేస్తారు.

ఎవరైతే దేవుని ప్రణాళికకు విరుద్ధంగా జీవిస్తారో వారు శిక్షించబడతారు. యెషయా ప్రవక్త యిస్రాయేలు ప్రజల్లో ఒక క్రొత్త నమ్మకమును తీసుకొని రావటానికి ప్రజలకు రెండవ దావీదు మెస్సయ్యా గురించి బోధిస్తున్నారు.

యెషయా ప్రవక్త పలికినటువంటి మాటల్లో మెస్సయ్యా  తన యొక్క రాజ్య పరిపాలన చేసే సమయంలో కొన్ని క్రొత్త పరిణామాలు చోటుచేసుకుంటాయి, అవి ఏమిటంటే తోడేళ్ళు గొర్రె పిల్లలతో కలిసి జీవించును, చిరుతపులి మేకపిల్లలతో కలిసి నిద్రిస్తాయి. అదేవిధంగా కొదమ సింహం లేగ దూడలు కలిసి మేస్తాయి మరియు ఆవు ఎలుగుబంటి కలిసి మేతమేస్తాయి. వచనాలలో మనం అర్ధం చేసుకోవలసిన అంశమేమిటంటే మెస్సయ్యా యొక్క రాకతో క్రూర మృగాలు సైతం మిగతా సాదు జంతువులతో కలిసి మెలసి అన్యోన్యంగా జీవిస్తాయి. దేవుడు సృష్టిని చేసినప్పుడు మొదట్లో విధంగానైతే అన్ని జంతువులు కలిసి మెలసి జీవించాయో మరల అదే విధంగా ఉంటాయి అని ప్రవక్త తెలియజేస్తున్నారు.

మనిషి చేయనంతవరకు అన్ని జంతువులు శాంతియుతంగా జీవించాయి. మరలా మెస్సయ్యా వచ్చే సమయంలో అన్ని జంతువులు కలిసి ఉంటాయి, వాటి మధ్య శాంతి ఉంటుంది అని తెలిపారు.  అన్నింటి మధ్య శాంతి నెలకొల్పేది కేవలం యావేను గూర్చిన జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే (యెషయా 11: 9, యిర్మీయా 31: 34, హబక్కుకు 2:14).

దేవున్ని కేవలం మనస్సు ద్వారా తెలుసుకొనుట కాక ఆయన్ను హృదయ పూర్వకంగా స్వీకరిస్తే, దేవుని ఆజ్ఞాను ఆజ్ఞానుసారంగా జీవిస్తే ఇది సాధ్యం ని ప్రవక్త పలుకుచున్నారు.

దైవ జ్ఞానమంటే మానసిక పరిజ్ఞానం మాత్రమే కాదు, దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడం, విశ్వాసంతో ఆయన్ను వెంబడించుట.

మెస్సయ్యా తన ప్రజలకు చేరువలో వున్నంతవరకు ప్రజలలో శాంతి సమాధానాలు వుంటాయి. యిస్రాయేలు, యూదా రాజ్యాలు కలిసి మరలా యెరూషలేములో యావే దేవున్ని విశ్వసించి ఆరాధిస్తారు.

ఈషాయి వంశము నుండి పుట్టిన శిశువు వలన అందరు కూడా ఆశీర్వదిచబడతారు అని (ఆది 12: 3), కేవలం ఎన్నుకొనబడిన ప్రజలు మాత్రమే కాకుండా అందరు కూడా, అన్ని దేశాలు కూడా ప్రభువుకు ఆకర్షితులవుతారు.

మొదటి పఠనం ద్వారా మనం గ్రహించవలసిన అంశం ఏమిటంటే దేవునికి స్పందించి జీవిస్తే మనలో నూతనత్వం ఉంటుంది, అదే విధంగా దేవుని యొక్క కుమారుడును, ఈషాయి మొద్దునుండి జన్మించిన శిశువు రాక ద్వారా మనలో నూతనత్వం వస్తుంది.

ఈనాటి రెండవ పఠనంలోపునీత పౌలు గారు వివిధ రకాల వర్గాలు సఖ్యపడి, అందరూ కలిసి దేవున్ని ఏక కంఠంతో, హృదయంలో స్తుతించమని పలుకుచున్నారు. పౌలు గారు రోమీయులకు కొన్ని విశ్వాస సూచనలు తెలుపుచున్నారు. ఎవరైతే దేవుని రాక కోసం ఎదురు చూస్తున్నారో వారు ఎటువంటి బేధాభిప్రాయాలు లేకుండా జీవించాలి. ఒకరిని ఒకరు అంగీకరించుకొని, సహాయం చేసుకొని జీవించాలి.

క్రొత్తగా క్రైస్తవత్వంలోకి మారిన రోమీయ విశ్వసులకు పౌలు గారు మిగతా యూదా క్రైస్తవులను కలసిమెలసి జీవించమని పలికారు. అన్యులు అదేవిధంగా యూదా క్రైస్తవులు కలిసి జీవిస్తే వారి మధ్య శాంతి సమాధానం నెలకొనివుంటుంది. దేవుడు విధంగానైతే అందరిని అంగీకరించి జీవించారో మీరు కూడా ఎటువంటి భేదాలు లేకుండా పరస్పర అంగీకారం కలిగి జీవించమని కోరారు.

ఈనాటి సువిశేష పఠనంలో బాప్తిస్మ యోహాను గారు చేసిన భోధన గురించి వింటున్నాం.

దేవుని యొక్క రాకడ కోసం ప్రజల యొక్క హృదయాలను శుద్ధి చేసుకొని ప్రభువును స్వీకరించమని యోహాను గారు పలికారు.

బాప్తిస్మ యోహాను నూతన నిబంధన గ్రంధంలో మొదటి ప్రవక్త మరియు పూర్వ నిబంధనలో చివరి ప్రవక్తా. యిస్రాయేలు ప్రజల యొక్క చరిత్రలో మలాకీ ప్రవక్త  తరువాత దాదాపు 400  సంవత్సరాలు దేవుడు ప్రవక్తను తన ప్రజల చెంతకు పంపలేదు.

బాప్తిస్మ యోహాను క్రీస్తు ప్రభువు మార్గం సిద్ధం చేసిన ప్రవక్త. ఆయన యొక్క బోధన్ అందరిని ఉద్దేశించినది.  క్రీస్తు ప్రభువు యొక్క రాకతో దేవుని రాజ్యము సమీపించింది అని అందుకు హృదయ పరివర్తనం చెందమని పలికారు.

పవిత్ర గ్రంధంలో హృదయ పరివర్తనం గురించి అనేక సార్లు చెప్పబడినది ఎందుకంటే పశ్చాత్తాపము, హృదయ పరివర్తనం లేనిదే దేవుడిని మన హృదయంలోకి ఆహ్వానించలేము (లూకా 13 : 3 , అపో 3 : 38 , 3 : 19 , 2 రాజుల దిన 7 : 14 , యెషయా 55 : 7 , యెహెఙ్కేలు 18 : 21 ).

ప్రభువుకు ప్రతి ఒక్కరూ మార్గం సిద్ధం చేయాలి. దేవుడు మన జీవితం గుండా నడిచిపోవాలంటే మార్గం సిద్ధం చేసుకోవాలి. 

ప్రతి మార్గం మనలను గమ్యం చేరుటకు సహాయపడుతుంది. అదే విధంగా దేవుని కొరకు సిద్ధం చేసే మార్గం మనం పరలోకం చేరుటకు సహాయపడుతుంది (యెషయా 40: 3, ఆమోసు 4:12, హోషయా 10: 12, యావేలు 2: 12 -13).

మన యొక్క దారిలో ఏదైనా ఆటంకంగా ఉంటే ప్రయాణం సాగదు అన్నింటిని తొలగించుకోవాలి, అలాగే దేవుడు కూడా నీ/నా జీవితం గుండా వెళ్లాలంటే మనలో వున్నా ఆటంకాలు అన్నీ తొలగించుకోవాలి అందుకే హృదయ పరివర్తనం అవసరం.

బాప్తిస్మ యోహాను యొక్క భోధన ఫలిచింది అందుకనే అనేకమంది బాప్తిస్మము పొందుటకు యోహాను గారి దగ్గరికి వచ్చారు.  అక్కడవున్న వారు తాము పాపాత్ములమని గ్రహించారు. దేవుని రాక కొరకు పవిత్రంగా వుండాలని భావించారు.

యోహాను గారి సందేశం విన్న వారందరు కూడా సందేశానుసారంగా నడుచుకున్నారు, అందుకనే తమ తమ పాపాలు ఒప్పుకున్నారు. మరి మనం ఎంతమంది సందేశాన్ని అంగీకరించి జీవిస్తున్నాం. ఎంతమంది పాప సంకీర్తనం చేస్తున్నాం? ఎంతమంది హృదయ పరివర్తనం చెందుతున్నాం? ప్రతి ఒక్కరు కూడా ధ్యానించుకొని జీవించాలి. దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుంటే ప్రభువు సమాన పాపాలు ఒప్పుకుంటారు (అపో 5: 31, 13: 38, కీర్తన 103: 3, యిర్మీయా 31: 34).

పశ్చాత్తాపానికి పాప సంకీర్తనం అవసరం అప్పుడే మనలో నూతనత్వం ఉంటుంది (1 యోహాను 1:9, ఎజ్రా 10:11, కీర్తన 32:5, సామె2 8:13, యిర్మీయా 3: 13).

పరిసయ్యులను, సద్దూకయ్యులను యేసు ప్రభువు సర్ప సంతానమా అని సంభోదిచారు ఎందుకంటే య్యేహాను గారి యొక్క భోధనాల్లో బున్న దోషాలను మాత్రమే వారు వెదుకుటకు అక్కడికి వచ్చారే కానీ ఆయన యొక్క సందేశం విని హృదయ పరివర్తనం చెందుటకు కాదు. అందుకే వారిని ఉద్దేశించి యెహాను గారు మాటలు పలికారు.

పరిసయ్యులు, సద్దూకయ్యులు దేవుని యొక్క తీర్పు వేరే వారికే కానీ తమకు కాదని భావించారు. వారిలో హృదయ పరివర్తనం బాహ్యంగానే ఉంది కానీ అంతరంగికంగా లేదు. తామే నీతిమంతులు మిగతా వారు పాపాత్ములు అనే ఆలోచనలతో ఉన్నారు కాబట్టి వారిని ఉద్దేశించి యోహాను గారు రూఢిగా మాట్లాడారు.

యెహాను గారి సందేశం నాలుగు ప్రధాన అంశాలు బోధిస్తుంది:

1. మనం కేవలం నామ మాత్రపు బాప్తిస్మము తీసుకున్న క్రైస్తవులుగా కాకుండా మంచి జీవితం, విశ్వాస జీవితం జీవించాలి (యోహాను 3: 36, ఎఫేసి 5: 5 -6, కీర్తన 2: 12). ఎన్ని సార్లు బాప్తిస్మము పొందాం అన్నది కాదు ముఖ్యం (కొంతమంది ఇతర దేవాలయాలకు వెళ్ళినప్పుడు బాప్తిస్మము తీసుకున్నా మళ్ళీ తీసుకుంటారు) మనం ఎంత మంచి జీవితం జీవించాం అన్నది ముఖ్యం.

2. పాపంకు పశ్చాత్తాప పది హృద పరివర్తనం చెందుడి అని చెప్పారు. బాహ్యంగా చూపించే పశ్చాత్తాపము కాదు ఆంతరంగిక పశ్చాత్తాపం ముఖ్యం. పశ్చాత్తాపం మనలో నూతనత్వం తీసుకు వస్తుంది.

3. మన యొక్క పూర్వీకుల చరిత్ర చూసి గర్వించక దేవుడు చెప్పిన పనులను ఆచరించాలి. పరిసయ్యులు, సద్దూకయ్యులు మేము అబ్రాహాము సంతతి వరం అని గర్వంతో హృదయ పరివర్తనం లేకుండా వున్నారు. మనం కూడా పుట్టు క్రైస్తవులము అనే గర్వంతో వుండి పాప సంకీర్తనం చేయటం లేదు, గుడికి రావటం లేదు.

మనం వ్యక్తిగతంగా దేవునికి జవాబు ఇవ్వాలి, ఎవరి జీవితానికి వారే బాధ్యులు, పూర్వికులతో ఏమి సంబంధం లేదు. మనలో ఉన్న పాపాలను మొదటిగా కడిగివేయాలి (యిర్మీయా 4: 14, రోమా 4: 4 -5, గలతి 3: 10 - 12).

4. దేవుని తీర్పు - మంచిగా జీవించని వారందరు కూడా దేవుని శిక్షకు పాత్రులగుతారు. తీర్పు అనేది అందరికి కేవలం కొద్ది మందికే కాదు కాబట్టి మనం జీవితాలను సరిచేసుకుంటూ జీవించాలి. దేవుడు మనందరినీ మంచిగా సృష్టించారు కాబట్టి మనం మంచి జీవితం జీవించాలి.

దివ్య గ్రంథ పఠనాలు మనలో నూతనత్వం గురించి బోధిస్తున్నాయి. కాబట్టి బాప్తిస్మ యోహాను గారి సందేశం అందరికి ఒక హెచ్చరిక, ఒక నూతన జీవితం జీవించుటకు ఒక దైవ పిలుపు. దానిని స్వీకరించి జీవితాలు మార్చుకొని దేవున్ని మన హృదయాలలోకి ఆహ్వానించుదాం.

 

 FR. BALAYESU OCD

 

 

26, నవంబర్ 2022, శనివారం

ఆగమనకాలం - మొదటి ఆదివారం

 

ఆగమనకాలం - మొదటి ఆదివారం 

యెషయా 2:1-5

రోమి 13:11-14

మత్తయి 24:37-44

ఈనాటి ఆదివారంతో మనం దైవార్చనలో ఒక కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాము. ఈరోజుతో మనం ఆగమన కాలంలో ప్రవేచించి యున్నాము. 

ఈ యొక్క ఆగమన కాలంలో దివ్య గ్రంథ పఠనాలు మనకు బోధించే అంశం ఏమిటంటే మనందరం ప్రభువు యొక్క రాకడ కోసం సంసిద్ధంగా ఉండుట.

ఈనాటి దివ్యగ్రంధ పట్టణాలు ప్రభువు యొక్క రాకడ గురించి బోధిస్తున్నాయి.

ప్రభు యొక్క రాకడ మూడు విధాలుగా ఉంటుంది:

1. ఏసుప్రభు ఈ లోకంలో మానవ మాతృనిగా జన్మించిన విధానం ఆయన యొక్క మొదటి రాకడను సూచిస్తుంది.

2. దివ్యసత్ప్రసాద స్వీకరణ ద్వారా ఏసుప్రభు మన యొక్క హృదయంలోనికి వస్తున్నారు. అదే విధంగా దివ్య సంస్కారాల స్వీకరణ ద్వారా కూడా ప్రభువు యొక్క రాకడ జరుగుతుంది.

3. ప్రభు యొక్క రెండవ రాకడ ద్వారా ఆయన మరలా మన మధ్యకు వస్తారు. మనందరి గురించి తీర్పు చేయుటకు ప్రభువు రెండవసారి రాబోతున్నారు అప్పుడు ఆయన మంచివారిని రక్షిస్తాడు, చెడ్డవారిని శిక్షిస్తారు.

మనం ప్రభువు యొక్క రాకడకు సంసిద్ధంగా ఉండాలి. ఆయన యొక్క రెండవ రాకడ జరిగే సమయంలో మన యొక్క జీవితంలో పవిత్రత కలిగి ఉండాలి. ఆయన యొక్క రెండవ రాకడ సమయం లో మన యొక్క మాటల్లో, ఆలోచనలో, పనులలో పవిత్రత కలిగి ఉండాలి.

ఈనాటి మొదటి పఠనంలో యెషయా ప్రవక్త చూసిన దర్శనం గురించి తెలుపుచున్నారు. యూదాయేరుషలేము భవిష్యత్తు గురించి తెలిపారు. ప్రవక్త చూసిన దర్శనంలో అన్ని దేశములు, సకల జాతుల ప్రజలు సీయోను పర్వతము వద్ద దేవుని చెంతకు వస్తారు సకల జాతుల ప్రజలు సీయోను పర్వతంను దర్శిస్తారు.

యెషయా ప్రవక్త తన యొక్క దర్శనంలో రాబోయే రోజుల్లో దేవుడు ఏ విధంగా అందరి మధ్య తన యొక్క ఒడంబడికను ఏర్పరచుకుంటున్నారో తెలుపుచున్నారు. కేవలం ఇశ్రాయేలు ప్రజలతో మాత్రమే కాకుండా సకల జాతుల ప్రజలు దేవుని బిడ్డలు అవుతారు. అదే విధంగా యేరుషలేము దేవాలయం అందరి దేవాలయముకును, అందరూ యేరుషలేము దేవాలయంలో ప్రభువును ఆరాధిస్తారు అని ప్రవక్త తెలుపుచున్నారు.

సకల జాతి జనులు ఒకే దేవుడిని విశ్వసించి, ఆరాధించి జీవించుట ద్వారా అందరూ కూడా శాంతియుతంగా ఉంటారని యెషయా ప్రవక్త తెలుపుచున్నారు.

కడవరి దినములలో అందరూ యావే దేవుడు సజీవుడని తెలుసుకుంటారు, అదేవిధంగా ఆయన చెంతకు వచ్చి ఆరాధిస్తారు.

క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో దేవుని ప్రజలు రెండు రాజ్యాలుగా విడిపోయారు. ఉత్తర రాజ్య ఇశ్రాయేలు, దక్షిణాన యూదా  రెండుగా విభజించబడ్డాయి.

ఇశ్రాయేలు ప్రజలు అస్సిరియుల క్రింద బానిసత్వంలో మగ్గిపోయారు అలాగే యూదాలోని ప్రజలు బాబిలోనియా బానిసత్వంలో జీవించారు.

ఈ విధంగా బానిసత్వంలో ఉన్నప్పటికీని, రెండు రాజ్యాలుగా విభజింపబడినప్పటికిని కడవరి దినమున అందరూ ఐక్యమై జీవిస్తారని ప్రవక్త పలుకుచున్నారు. ఎప్పుడూ అని ప్రవక్త సమయం గురించి తెలుపుట లేదు కానీ కడవరి దినమున అని తెలుపుచున్నారు (పేతురు 1:10-11).

యాకోబు దేవాలయమున అందరూ సమావేశం అవుతున్నారు అని ప్రవక్త చూసిన దర్శనంలో పలుకుచున్నారు (యెషయా 2:3) యేరుషలేముకు అందరూ ఆకర్షించబడతారు - యెషయా 14:1,27:13,66:23 దేవుని యొక్క పర్వతము వద్ద ధర్మ శాస్త్రము బోధించబడుతుంది. ఆయన యొక్క సన్నిధి మానవులకు సూచనలు ఇచ్చే స్థలం (దానియేలు 2:35, ఆమోసు 4:1).

ప్రభువు మందిరమున ఆయన మార్గములు తెలియచేయబడును కాబట్టి ఆయన మాటలు బట్టి నడుచుకోవచ్చు. ఎన్నుకొనబడిన ప్రజలు తమ యొక్క అవిశ్వాసనీయత వలన దేవునికి విరుద్ధంగా జీవించారు, ఆయన యొక్క వడంబటికకు అవిధేయులై ఉన్నారు దాని ఫలితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు, ప్రేమ కోల్పోయారు. ఇప్పుడు యెరూషలేములో ప్రభువు మాటలు బోధించుట ద్వారా ఆయన బాటలో నడిచి విధేయులై జీవించవచ్చని ప్రవక్త తెలుపుచున్నారు.

సక్రమంగా జీవించుటకు దేవుని యొక్క సూచనలు ఇవ్వబడతాయి. దేవుని యొక్క త్రోవలో నడిస్తే అందరికీ లాభమే అది సక్రమమైన మార్గము మనలను జీవమునకు నడిపించు మార్గము.

యెషయా ప్రవక్త తన యొక్క గ్రంథంలో యూదాకు, ఎరుషలేముకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు.

ఎందుకంటే అవి దేవుని యొక్క నివాస స్థలాలు కాబట్టి. మరీ ముఖ్యంగా యేరుషలేము అక్కడ దేవుడు ఉంటారు దేవుని ఆలయం నిర్మించబడినది కాబట్టి. ఎరుషలేము, యూదా ప్రాంతాల గురించి పదే పదే తెలిపారు యెషయా 11:9, 25:5-7, 27:13, 30:29,57:13, 65:11, 66:20.

అన్నిసార్లు ఎందుకు ప్రవక్త ఎరుషలేము గురించి చెప్పారంటే దేవుడు తన యొక్క ఒడంబడికకు విధేయుడై ఉంటాడని తెలుపుటకు అదే విధంగా తన యొక్క ప్రజలను ఎల్లప్పుడూ ప్రభువు రక్షిస్తాడని తెలియచేయుటకు ప్రవక్త ఈ విధంగా అనేకసార్లు యేరుషలేము నగరం, సీయోను పర్వతం గురించి తెలిపారు.

ఎన్నుకొనబడిన ప్రజలు ఎంత మాత్రం అవిధేయులై అయినప్పటికీ దేవుడు మాత్రం వారిని రక్షిస్తాడు అంతటి గొప్ప దేవుడని తెలియచేయుటకు యెషయా ప్రవక్త ఈ విధంగా తెలిపారు.

ఈ మొదటి పఠనం చివరి వచనాలలో ప్రభువు అందరి సమస్యలు పరిష్కరిస్తారు అని తెలుపుచున్నారు అందరూ కూడా శాంతియుతంగా కలిసిమెలిసి జీవిస్తారు అని ప్రభువు తెలియజేస్తున్నారు. ప్రజల మధ్య ఇక విభేదాలు ఉండవు ఒక జాతి మరియొక జాతి మీద కత్తిదూయదు ఎటువంటి యుధాలూ  ఉండవు కేవలం వారి మధ్య శాంతి సమాధానాలు ఉంటాయి అని ప్రభువు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నారు.

శాంతి కేవలం ప్రభువు ప్రసాదించే వరం. తన యొక్క సాన్నిద్యం ద్వారా అందరిని శాంతియుతంగా జీవంప చేస్తారు.

ప్రభువు యూదాతోపాటు అన్ని దేశములను ప్రేమిస్తారు అని కూడా ప్రవక్త తెలియజేశారు. మనము ప్రభువు వెలుగులో నడిస్తే అందరం కూడా సంతోషంగా ఉంటాము.

భవిష్యత్తు గురించి ప్రవక్త తెలిపారు ఎందుకంటే దాని ద్వారా వర్తమాన కాలంలో మన జీవితాలను సరి చేసుకొని దేవునికి ఇష్టంగా జీవించాలి (1థెస్స 4:13-18, 2పేతురు 3:10-14, 1 యోహాను 3:2-3).

ఈనాటి రెండవ పఠనంలో  పౌలు గారు దేవుని యొక్క రాక కొరకు మనందరం కూడా మేల్కొని సంసిద్ధంగా ఉండమని తెలుపుచున్నారు.

ప్రభువు యొక్క రక్షణ లభించు సమయం వచ్చుచున్నది కాబట్టి అందరం కూడా చీకటి పనులు మానివేసి వెలుగులో జీవించాలి అని తెలుపుచున్నారు.

క్రైస్తవులు తమ యొక్క విధులు, బాధ్యతలు మరచి జీవిస్తున్న సందర్భంలో పౌలు గారు ప్రభువు రాకడ కోసం బాధ్యతాయుతంగా జీవించమని కోరారు.

చీకటి సమయంలో సైతాను ఎక్కువగా పని చేయును (2పేతురు 1:19, 2కొరింతి 4:4, ఎఫేసి 2:2).

క్రైస్తవులు అందరూ కూడా ప్రభువు ప్రజలుగా జీవించాలి అందుకే పౌలు గారు వెలుగులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి జీవించాలి అని తెలుపుచున్నారు.

దేవుని యెడల విశ్వాసం కలిగి నీతివంతమైన జీవితం జీవిస్తూ పాపమును విడిచిపెట్టి జీవించాలి అని పౌలు గారు పలుకుచున్నారు.

క్రైస్తవ జీవితం అనేది విందులతో వినోదాలతో భోగ విలాసాలతో కూడుకొని ఉన్నది కాదు దేవుని  జీవితమును జీవింపవలసింది. ఆయనకు అనుగుణంగా జీవించాలి.

క్రైస్తవులుగా మారిన రోమీయులు ఇంకా వారి యొక్క పాత అలవాట్లు మరువలేదు అందుకే పౌలు గారు వారిని సత్ప్రవర్తన కలిగి ఉండమని కోరుచున్నారు.

క్రైస్తవ జీవితం పవిత్రంగా ఉండాలి ఆయన యొక్క రాకడ కోసం సంసిద్ధంగా ఉండాలి అదే విధంగా క్రీస్తును ధరించిన జీవితం లాగా ఉండాలి.

క్రీస్తును ధరించుట అంటే ఆయనలో ఉన్న సుగుణాలను ధరించుట, ప్రేమను, మంచితనంను, క్షమను, త్యాగమను ధరించుట అని అర్థం (ఎఫీసి 4:24, కోలోస్సి 3:10).

దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తే తప్పనిసరిగా మనకు రక్షణ కలుగుతుంది అదేవిధంగా మనం వెలుగులో జీవిస్తాం.

ప్రభువు యొక్క రెండవ రాకడ జరుగును కావున ఆ సమయంలో పాపంలో జీవింపకుండా నీతిమంతులుగా జీవిస్తూ ఆయన ప్రసాదించే రక్షణకు సంసిద్ధత కలిగి ఉండాలి.

పౌలు గారు దేవుడు వచ్చే సమయం ఆసన్నమగుచున్నది కావున దాని కొరకు నిద్ర నుండి మేల్కొని జాగరు కథ కలిగి జీవించాలి అని కూడా తెలుపుచున్నారు. నిద్రలో ఉన్నప్పుడు మనం సంసిద్ధంగా లేనట్టే మేల్కొని ఉంటేనే మనం ఏ విధంగానైనా సరే స్పందిస్తాం కావున దేవుని రాకడ కొరకు మంచి మార్గం ద్వారా స్పందించి రక్షణ పొందాలి.

ఈనాటి సువిశేషంలో మనుష్య కుమారుని యొక్క రాకడ నోవా దినములతో పోల్చబడినది ఎందుకంటే ప్రజలు అప్రమత్తంగా లేరు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధంగా లేరు. నోవా కాలంలో ప్రజలు నైతిక విలువలు లేకుండా జీవించారు భోగ విలాసాలతో, సోమరితనంతో దేవుని మరచి జీవించారు.

నోవా కాలంలో ప్రజలు ఊహించని విధంగా అనూహ్యమైన సమయం వచ్చి వారిని నాశనం అయ్యేలా చేసింది.

అక్కడి ప్రజలలో ఎటువంటి భయం లేదు అదే విధంగా రోజు వారి జీవితం జీవించేవారు. దేవుని రాకడ గురించి దేవుని తీర్పు గురించి ఎటువంటి ఆలోచన లేదు అందుకనే అక్రమ మార్గాలు ఎంచుకున్నారు, దైవమును మరచి జీవించారు.

నోవా కాలంలో ఉన్నట్లే మనుష్య కుమారుడు వచ్చే సమయంలో కూడా ఉండును. సమయం అనేది ఎప్పుడో తెలియదు కాబట్టి సిద్ధంగా ఉండాలి.

నోవా కాలంలో కొందరు మాత్రమే రక్షింపబడ్డారు. కేవలం తన కుటుంబం వారిని ప్రభువు రక్షించారు వేరే వారిని శిక్షించారు అదేవిధంగా మనుష్య కుమారుడు వచ్చే సమయంలో పొలములో పనిచేసే ఇద్దరిలో ఒక్కడిని దేవుడు తీసుకొని వెళతాడు వేరొక వానిని అక్కడే విడిచి పెడతారు అని తెలిపారు. ఎందుకంటే ఒకరు సంసిద్ధత కలిగి ఉన్నారు. వేరొకరు దేవుని రాకడ కొరకు సిద్ధంగా లేరు.

నోవా కాలంలో దృష్టులు శిక్షించబడిన విధంగా మనుష్య కుమారుని కాలంలో అలాగే దృష్టులు శిక్షించబడతారు.

నోవా దేవుని కొరకు తన యొక్క జీవితమును తన్ను తాను సంసిద్ధం చేసుకున్నారు. జల ప్రళయం వస్తుందని ప్రభువు ముందుగానే చెప్పారు అందుకనే చెప్పిన విధంగా నోవా తాయారు అయ్యాడు.

నోవాతో ఓడను తయారు చేయమని చెప్పాడు (ఆది 6:14) నోవా తన కుటుంబాన్ని తయారు చేశాడు, అలాగే నోవా దేవుడు చెప్పినట్లు చేశారు - ఆది 6:22.

నోవా తాయారు అయినప్పుడు మిగతావారు ఆయన్ను హేళన చేశారు ఇష్టం వచ్చిన విధంగా జీవించారు. జీవితం కేవలం విందులకే వినోదాలకి పరిమితం అన్నట్లు జీవించారు. వివాహాలు చేసుకుంటూ అప్రమత్తం లేకుండా జీవించారు అందుకే జలప్రళయము వారిని ముంచి వేసింది.

మనందరిని దేవుడు ఒక విధంగా హెచ్చరిస్తున్నాడు. మనం చాలా సందర్భాలలో వేరే విషయాలకు తయారవుతం కానీ దేవుని రాకడకు సిద్ధం కాము.

- వర్షాకాలం వచ్చినప్పుడు గొరుగులతో సిద్ధంగా ఉంటాం.

- చలికాలం వచ్చినప్పుడు చలికోటులతో సిద్ధంగా ఉంటాం.

అలాగే ఎండాకాలంలో AC లతో సిద్ధంగా ఉంటాం. బస్సు కోసం ఉద్యోగం కోసం మనం సిద్ధంగానే ఉంటాం మరి ప్రభువు రాకడ కొరకు ఎందుకు సిద్ధంగా ఉండలేకపోతున్నాం?

ప్రభువు ఎప్పుడూ అని క్లుప్తంగా చెప్పలేదు కాబట్టి అనునిత్యం సిద్ధంగా ఉండాలి. మానవ జీవితంలో ఎన్నో విషయాలకు మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి దేవుని రాక కోసం కూడా అదే విధంగా సిద్ధపడాలి.

మనం ఈ లోక ఆశల్లో వాంఛల్లో పడిపోయి జీవింపకుండా దేవుని తెలుసుకొని ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి.

ప్రభువు వచ్చే సమయంలో మంచి వారిని చెడ్డవారిని వేరుపరచి వారికి తగిన విధంగా తీర్పు చేస్తారు కాబట్టి మనం మంచిగా పవిత్రంగా నీతివంతంగా జీవించాలి.

విశ్వాసులందరూ జాగరుకులై ఉండాలి అంటే ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండుట. మనం సిద్ధంగా ఉంటే దొంగలు మన ఇంట్లోకి ప్రవేశించరు. జాగరు కథ కలిగి ఉంటే తప్పులు జరగవు.

మనుష్య కుమారుడు కూడా ఊహించనీ ఘడియలలో వస్తారు కావున ఎలాగా మనం ఆయన రాకడ కోసం సిద్ధంగా ఉంటున్నాం అని అందరూ కూడా వ్యక్తిగతంగా ధ్యానించుకొని మన జీవితాలు సరి చేసుకుని ఆయన చిత్తానుసారంగా జీవించుదాం.

ప్రభువుని యొక్క రాకడ మనలో శాంతిని తీసుకొని వస్తుంది ఆయన ఈ లోకంలో మొదటిగా జన్మించినప్పుడు పరలోక దూతలు ఈ విధంగా పాడారు మహోన్నతమైన సర్వేశ్వరునికి భూలోకమున మనుషులకు శాంతి కలుగును గాక అని - లూకా 2:14.

ఈనాటి దివ్య పఠనాలు  కూడా ప్రభువు రాకతో మనలో శాంతి వస్తుంది అని తెలుపుచున్నవి.

మొదటి  పఠనంలో దేవుడు అందరి మధ్య శాంతి నెలకొల్పుతారు అని యెషయా ప్రవక్త పలికారు.

రెండవ పఠనంలో వెలుగులో జీవించుట ద్వారా సత్ప్రవర్తన కలిగి జీవించుట ద్వారా శాంతియుతంగా ఉంటామని పౌలు గారు తెలిపారు.

సువిశేషంలో ప్రభువు రెండవ రాకడ కోసం తాయారు అయితే శాంతి ఉంటుందని తెలిపారు.

by FR. BALAYESU OCD

 

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...