14, జనవరి 2023, శనివారం



2వ సామాన్య ఆదివారం

యెషయా 49:3,5-6

1 కొరింతి 1:1-3

యోహాను 1:29-34

 

ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనందరం కూడా దేవుని యొక్క గొర్రె పిల్ల వలె జీవించి, దేవునికి సాక్షులై జీవించాలని తెలుపుచున్నాయి.

దేవుని యొక్క సేవకై ఎన్నుకొనబడిన ప్రతి ఒక్క విశ్వాసి దేవునికి సాక్షులై జీవించాలి. ప్రతి ఒక్కరూ ఈ లోకంలోకి ఒక ప్రత్యేకమైన పని నెరవేర్చటానికి వచ్చి ఉన్నారు. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసి ఒక సేవకునిగా, అనుచరునిగా, అపోస్తులుగా ఉండాలని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు తెలుపుచున్నాయి.

మానవ జీవితంలో దేవునికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది, ఆ దైవ ప్రణాళికకు తగిన విధంగా మనం జీవించాలి.

ఈనాటి మొదటి పఠనంలో రెండోవ బాధామయ సేవకుని గీతం ద్వారా ఒక సేవకుని ఎన్నిక గురించి చెప్పబడింది.

ఈ సేవకుడు దేవుని యొక్క పని కోసం ఎన్నుకోబడ్డాడు, దేవుడే ప్రత్యేకంగా ఆయనను అందరిలో మి న్నగా తన సేవకు ఎన్నుకొన్నాడు.

దేవుని యొక్క ఎన్నిక చాలా గొప్పది, ఎందుకంటే ఎన్నుకొనేముంది దేవుడు వారి కొరకు ప్రార్ధించారు, వారి యొక్క సేవను విశ్వసించారు, వారి యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకొని వారికి దేవుడు తన యొక్క సేవ బాధ్యతలు అప్పజెప్పారు దేవుడు సేవకులను తమ యొక్క స్వార్థం కోసం కాదు ఎన్నుకొన్నది, ప్రజల కొరకు నిస్వార్ధ హృదయులై ఉండటానికి.

దేవుని యొక్క సేవకుని యొక్క ముఖ్యమైన కర్తవ్యం బాధ్యత ఏమిటంటే, ప్రజలందరిని దేవుని చెంతకు తీసుకొని రావాలి, ఇదే మాటలను పౌలు గారు కూడా పలుకుచున్నారు - గలతీ 1:15, రోమి 1:1, అపో 22:21.

తన యొక్క సేవకుని యావే దేవుడు ఇశ్రాయేలు తో పోల్చి పిలుస్తున్నారు - యెషయా 49:3.

ఈ మాటలు ఏసుప్రభు యొక్క జీవితానికి అక్షరాలా వర్తిస్తాయి ఎందుకంటే కేవలం మెస్సయ్య యొక్క జీవితం వలన తండ్రి దేవునికి కీర్తి కలుగును.

ఒక సేవకునిగా ఏసుప్రభు తండ్రికి సంపూర్ణ విధేయత చూపించారు. తల్లి గర్భముననే దేవుడు తన సేవకుని తన యొక్క పని నిమిత్తమై ఎన్నుకుంటున్నారు.

దేవుని చేత ఎన్నుకొనబడిన సేవకుడు ప్రజలందరినీ దేవుని చెంతకు చేర్చాలి, అనగా వారిని పుణ్య మార్గంలో నడిపించాలి. దేవుని యొక్క బాధ్యతలు విధులు తెలుపుతూ వారిని ముందుకు నడిపించాలి.

ఒక సేవకునిగా దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకంలో సృష్టించబడ్డాము - హెబ్రి 10:7, యోహాను :38, యోహాను 4:34.

కేవలం దేవుని ప్రజలను ఆయన చెంతకు చేర్చుట మాత్రమే కాదు ప్రవక్త యొక్క ముఖ్యమైన పని, వారికి జ్యోతి లాగా ఉండాలి.

ప్రజలను సత్యం వైపు నడిపించేటువంటి వెలుగుగా సేవకుడు ఉండాలి.

ఆరవ వచనంలో ప్రభువు అంటున్నారు నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమిస్తున్నాను అని. అంటే ప్రవక్తగా, సేవకునిగా తన యొక్క పరిచర్య బాధ్యతలు సేవా తత్వం అందరికీ చెందినవి.

ఒక జ్యోతిగా అంటే వెలుగుగా ఉండాలి అని తెలుపుచున్నారు, వెలుగు దారిని చూపిన విధంగా ప్రజలు పుణ్య మార్గంలో నడుచుటకు ఒక ప్రవక్త, సేవకుడు ప్రజలకు దారి చూపించాలి.

తనలో ఎటువంటి అంధకారం లేకుండా ఇతరులను ముందుకు నడిపించాలి. వెలుగు తన కొరకు తాను ఎప్పుడూ ప్రకాశించదు అదే విధంగా ఒక సేవకుడు కూడా ఎప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఒక వెలుగు లాగా మనం కూడా ఇతరుల కొరకు జీవించాలి.

దేవుని చేత ఎన్నుకొనబడిన సేవకులందరికీ దేవుడే స్వయంగా శక్తిని ఒసగుతారు. వారి యొక్క పరిచర్యకు అవసరమైన ప్రతి యొక్క అనుగ్రహం దేవుడు దయ చేస్తారు.

మనందరం కూడా సేవకులుగా దేవుని యొక్క సాధనములు మాత్రమే కాబట్టి ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ప్రభువు యొక్క సేవ చేయాలి.

జ్ఞాన స్నానం ద్వారా దేవుడు మనలను తన సేవకు ఎన్నుకొన్నారు కాబట్టి మనం ప్రభువు కొరకు జీవించాలి. ఆయన నామంను ప్రకటించాలి అనేకమందిని ప్రభువు చెంతకు చేర్చాలి దేవునికి సాక్షులై జీవించాలి.

ఈనాటి రెండవ పఠనం లో పునీత పౌలు గారు తాను దేవుని యొక్క సంకల్పానుసారంగా అపోస్తులుడుగా దేవుని యొక్క పరిచర్యకై ఎన్నుకొన్నబడ్డారని పౌలు గారు కొరింతి వాసులకు తెలియజేస్తున్నారు.

పౌలు గారు కొరింతి సంఘస్తులకు తెలిపే అంశం ఏమిటంటే ఏ విధంగానైతే తాను దైవ సేవకై ఎన్నుకొనబడి పవిత్రపరచబడ్డాడో అదే విధంగా కొరింతి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ పవిత్రపరచబడ్డారు అని తెలిపారు.

ఏసుప్రభు యొక్క నామమును విశ్వసించే ప్రతి ఒక్కరూ దేవునికి సమర్పించబడిన వారే ఆయన యొక్క సేవ నిమిత్తమై వారు పవిత్ర పరపబడతారు అని పౌలు గారు తెలిపారు.

దేవుని యందు జ్ఞాన స్నానం పొందిన విశ్వాసులు, వారు ప్రభువు శరీరం నందు భాగస్తులవుతారు. దేవుని యొక్క పరిశుద్ధత వారికి అందజేయబడుతుంది. దేవుని యొక్క కృప అనుగ్రహాలు అందరికీ అందజేయబడుతాయి. కావున వెలుగుగా మనం దేవుని యొక్క సేవ చేయాలి.

ఏసుక్రీస్తు ద్వారా మనం అందరం పరిశుద్ధపరచబడ్డాం కావున ఆ పరిశుద్ధ జీవితం అలాగే కొనసాగించాలి పరిశుద్ధతతో ప్రార్థిస్తూ దేవుని యొక్క సేవ చేయాలి.

దేవుని యొక్క సేవ ప్రతి ఒక్కరూ చేసిన యెడల ఈ భూలోకం పరలోకంగా మారుతుంది. పరిశుద్ధ మనస్సు కలిగి నిస్వార్థంతో దైవ సేవ చేస్తే దేవునికి సాక్షులుగా ఉండగలుగుతాం.

ఈనాటి సువిశేష పఠనం లో బాప్తిస్మ యోహాను గారు ఏసుప్రభువును మెస్సయ్యగా సర్వేశ్వరుని గొర్రె పిల్లగా చూపిస్తున్నారు.

బాప్తిస్మ యోహాను గారు ఏసుప్రభువును సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని సంబోధిస్తూ ఈ లోకానికి చూపిస్తున్నారు. తనుకు ఉన్న దైవ అనుభవమును బట్టి దైవత్వమును గుర్తించి ప్రజలకు బాప్తిస్మయోహాను గారు దేవుని చూపిస్తున్నారు.

ఒక దైవ సేవకునిగా మనందరం చేయవలసిన పని ఏమిటంటే దేవుని ఇతరులకు చూపించాలి. మొదటిగా దైవ అనుభూతి మనం కలిగి ఉంటూ దేవుని ఇతరులకు చూపించాలి.

బాప్తిస్మ యోహాను గారు ఏసుప్రభు యొక్క స్వభావమును గొర్రె పిల్లతో పోల్చుతూ చెబుతున్నారు - యెషయా 53:7.

పవిత్ర గ్రంథంలో అన్నింటికన్నా అర్థవంతమైన పేరు ఏమిటంటే సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఈ పేరు 29 సార్లు పవిత్ర గ్రంథంలో చెప్పబడింది.

గొర్రెపిల్ల అనే పదం ఏసుప్రభు యొక్క వినమ్రతను, ప్రేమను, త్యాగాన్ని అదే విధంగా విజయంను సూచిస్తుంది.

గొర్రెపిల్ల దేవుని యొక్క బలి నిమిత్తమై వాడబడిన జంతువు. గొర్రె పిల్లగా ఏసుప్రభువును సంబోధించినప్పుడు యూదాలలో మూడు రకాల ఆలోచనలు ఉన్నాయి.

1. పాప పరిహార దినోత్సవం నాడు ప్రధానార్చకుడు తన ప్రజల పాపాలన్నింటినీ ఒక గొర్రె పిల్లపై మోపి దానిని క్రూర జంతువులకు ఆహారంగా అడవిలోనికి తోలి వదిలేస్తారు - లేవి 16:20-22.

2. ప్రతిరోజు ఉదయం సాయంత్రం యూదుల పాప పరిహారం కొరకు ఒక గొర్రె పిల్లను బలిగా అర్పిస్తారు - నిర్గమ 29:38-42.

3. గొర్రె పిల్లల రక్తమే ఐగుప్తులోని యూదుల కుటుంబాలలోని తొలిచూలు మగ శిశువులను కాపాడింది. అలాగే బాప్తిస్మ యోహాను పలికిన మాటలు ప్రతి ఏడాది పాస్కా పండుగనాడు తాము బలిగా అర్పించే గొర్రె పిల్లను గుర్తుకు తెచ్చి ఉండవచ్చు - నిర్గ 12:11.

బాప్తిస్మ యోహాను గారు ఏసుప్రభువును దేవుని గొర్రెపిల్ల అని పిలిచినప్పుడు దాని యొక్క అర్థం ఏమిటంటే ఈ గొర్రెపిల్ల దేవుని చేత ఎన్నుకొనబడినది దేవుని కొరకు సమర్పించబడే గొర్రెపిల్ల ప్రజల యొక్క పాప నిమిత్తమై తన యొక్క జీవితం ని త్యాగం చేసే నిష్కలంక గొర్రెపిల్ల.

మనంతట మనమే పాపం నుండి మరణం నుండి విమోచన పొందగలిగే మార్గం లేదు. అందుకు పరిహార మూల్యం చెల్లించక తప్పదు. మనందరి పాపం నిమిత్తమే క్రీస్తు ప్రభువు మన కొరకు మరణించారు - 1 పేతురు 2:24, హెబ్రి 9:28.

బాప్తిస్మ యోహాను గారు దేవునికి సాక్ష్యం ఇచ్చారు. తన జీవితం ద్వారా సాక్ష్యం ఇచ్చారు దేవుని చేత ఎన్నుకొనబడిన సేవకునిగా తన యొక్క బాధ్యతలను నెరవేర్చారు.

మన యొక్క విశ్వాస జీవితంలో యేసు క్రీస్తును ఇతరులకు చూపించాలి దేవునికి సాక్షలై జీవించాలి.

మన యొక్క మాటల ద్వారా క్రియల ద్వారా ప్రభువుకు సాక్షలై జీవించాలి.

బాప్తిస్మ యోహాను గారు దేవుని సేవ కొరకు జీవించిన వ్యక్తి మనం కూడా దేవుని కొరకు జీవించాలి.

బాప్తిస్మ యోహాను మరియు యేసు ప్రభువు తన యొక్క బాధ్యతలను నెరవేర్చారు అదే విధంగా మనం కూడా నెరవేర్చాలి.

బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభువును ఉద్దేశించి పలికిన మాటలు ఆయన నాకంటే ముందుగా ఉన్న వ్యక్తి అని అన్నారు, సృష్టికి పూర్వము నుండి ఆయన ఉన్నవారు అని బాప్తీస్మ యోహాను గారికి తెలుసు - యోహాను 1:15.

బాప్తిస్మ యోహాను గారికి యేసు ప్రభువు గురించి వ్యక్తిగతంగా తెలుసు - లూకా 1:36.

బాప్తిస్మ యోహాను గారు గొప్ప విశ్వాసము ఉన్న దేవుని సేవకుడు, దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించిన వ్యక్తి సత్యమును ప్రకటించిన వ్యక్తి, దేవుని కొరకు తన ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప ప్రవక్త.

బాప్తిస్మ యోహాను గారు ప్రభువు యొక్క ఆత్మ యేసు ప్రభువు మీద దిగిరావడం చూసి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు.

యూదులకు పావురం పవిత్రమైనది. పావురం శాంతికి  చిహ్నం అదే విధంగా నిర్మలత్వంకు అమాయకత్వం కు గుర్తు.

పవిత్ర గ్రంథంలో పావురం పవిత్రాత్మకు గుర్తు పావురం యేసు మీదకి దిగిరావడం ద్వారా ఇతడే మెస్సయ్య అని తెలిపారు.

పాత నిబంధన గ్రంథంలో అనేకసార్లు దేవుని యొక్క ఆత్మ ప్రజల మీదకు వచ్చింది కానీ ఎవరి మీద ప్రత్యేకంగా నిలవలేదు, కేవలం యేసు ప్రభువు మీదనే ప్రత్యేకంగా దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది.

ఏసుప్రభు పొందిన జ్ఞాన స్నానం ద్వారా పరలోకం తెరవబడింది. ఆదాము, అవ్వ చేసిన పాపం ద్వారా మూసివేయబడిన పరలోకం మరలా క్రీస్తు ప్రభువు జ్ఞాన స్నానం ద్వారా తెరవబడింది.

ఏసుప్రభు జ్ఞాన స్నానం తరువాత సువార్త పరిచర్యను ప్రారంభించారు. దేవుని యొక్క రాజ్య స్థాపన కోసం ప్రభువు కృషి చేశారు. దేవుని చేత పంపబడిన సేవకునిగా ఏసుప్రభువు పరిచర్యను చేశారు. మనం కూడా దేవుని చేత ఎన్నుకోబడిన వారం కాబట్టి, ప్రభువు యొక్క సేవ చేయాలి.


Fr. Balayesu OCD

 

7, జనవరి 2023, శనివారం


ప్రభువు సాక్షాత్కార పండుగ

యెషయా 60:1-6

ఎఫెసీ 3:2-6

మత్తయి 2:1-12

 

నేడు మనం యేసు క్రీస్తు ప్రభువు యొక్క సాక్షాత్కార పండుగను కొనియాడుచున్నాం. దీనిని ముగ్గురు రాజుల పండుగ అని కూడా పిలుస్తారు.

దేవుడు తనను తాను ఈ లోకానికి బయలుపరచుకొన్న గొప్ప రోజు మానవ చరిత్రలో జరిగిన అపూర్వమైన, ఆ సామాన్యమైన ఘటనను కనులారా చూసేందుకు ముగ్గురు రాజులు అన్వేషించి వచ్చారు.

సాక్షాత్కారం అంటే ఎరుకపరుచుట అని అర్థం దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి అంతటికి ఎరుకపరిచారు.

ఏసు సాక్షాత్కారం ద్వారా మానవలోకంలో దైవసాక్షాత్కారం జరిగింది.

దేవుడికి మానవులకు మధ్య తెరచాటు తొలగిపోయింది.

ఈ పండుగను మూడు విధాలుగా పిలుస్తారు.

1. ముగ్గురు రాజుల పండుగ

2. విశ్వాసుల పండుగ

3. అన్యుల క్రిస్మస్ పండుగ అని పిలుస్తారు.

ముగ్గురు జ్ఞానులు అయినప్పటికిని వారు దేవుడిని ఆరాధించారు, వారికి అంతయు తెలిసినప్పటికీని వారి కన్నా గొప్ప దేవుడు, గొప్ప రాజు అని వారు గ్రహించి ఆయనను ఆరాధించారు.

ముగ్గురు రాజులు: 

1. కాస్పర్ (అరేబియా) సాంబ్రాణి సమర్పించారు.

2. మెల్కియారు (ఇరాక్) బంగారం

3. బల్తజార్ (పర్షియా) పరిమళ ద్రవ్యం.

బంగారం: దైవత్వానికి గుర్తు, రాచరికనికి గుర్తు, అది విలువైనది. ఎఫెసి 1:20-22.

రాజుల సంప్రదాయం ప్రకారం ఒక రాజు ఇంకొక రాజును చూడటానికి వెళ్లే సమయంలో బంగారం తీసుకుని వెళ్లేవారు. 1 రాజు 10:10 షేభారాణి సొలోమోను చూడటానికి వెళ్ళినప్పుడు బంగారం ను తీసుకొని వెళ్లారు.

మనం కూడా చుట్టాలను చూడటానికి వెళ్లే సందర్భంలో ఏదో ఒకటి తీసుకుని వెళతాం. సృష్టిని చేసిన దేవుణ్ణి దర్శించటానికి వెళ్లే సమయంలో మనం ఏం తీసుకుని వెళుతున్నాం?

బంగారం ఎప్పుడూ కూడా దాని విలువను కోల్పోదు, రంగు మారదు ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది.

ఏసుప్రభు నీ జీవితం కూడా మారని జీవితం ఆయన నిన్నను, నేడును ఎప్పుడు అలాగే ఉంటారు హెబ్రీ 13:8.

ఈ బంగారం యేసు ప్రభువు రాజు అని, పరిశుద్ధుడు అని సూచిస్తుంది.

మనం చాలా సందర్భాలలో దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు బంగారం పెట్టుకొని వస్తాము కానీ బంగారము పట్టుకొని రాము. పట్టుకొని రావటం అంటే పరిశుద్ధతను చేకొని రావడం.

పరిశుద్ధత లేకుండా మనం దేవుడిని చూడలే, దర్శించలేము, ఆరాధించలేము.

యెషయా 59:2 - పరిశుద్ధత మనందరికీ కావాలి

కీర్తన 66:18 పరిశుద్ధత

రెండవ కానుక - సాంబ్రాణి యాజకత్వం కు గుర్తు. ఈ లోకంలో జన్మించిన వ్యక్తి నిజమైన యాజకుడని అర్థం.

తన యొక్క యాజకత్వ విధులు నిర్వహిస్తూ దేవునికి ప్రజలకు మధ్య ఒక నిచ్చెనగ ఉన్నారు, క్రీస్తు ప్రభువు.

సాంబ్రాణి మనందరికీ సువాసన ఇస్తుంది, ఆనందాన్నిస్తుంది దేవుని జీవితం కూడా మనకు ఆనందం ఇస్తుంది.

ఏసుక్రీస్తు ప్రభువు యాజకునికి మనకోసం తానే ఒక బలిగా సమర్పించబడ్డ నిజమైన యాజకుడు.

సాంబ్రాణి పవిత్ర గ్రంథంలో - నిర్గమ 25:1,2,6 35:4,8,27,29

నిర్గమ 30:7-8,2 రాజు దిన 13:11

సంఖ్యా 4:14

1 సమూ 2:28

సాంబ్రాణి దేవునికి సమర్పించేది ఆ విధంగానే ఏసుప్రభు జీవితం కూడా సమర్పించబడినది.

మూడవ కానుక - పరిమళ ద్రవ్యం - ఆయన మరణమునకు గుర్తు.

పరిమళ ద్రవ్యమును చాలా విధాలుగా వాడుతారు.

నిర్గమ 30:28

కీర్తన 45:8 వస్త్రాలకు

సామెత 7:17 పడక మీద

పరమగీతం 1:30 శరీరానికి

యోహాను 19:39-40 మృతదేహాలకు

ముక్కు రంధ్రంలో ఈ పరిమళ ద్రవ్యమును వేస్తే చాలాకాలం మృత శరీరాలను నిలవ చేయవచ్చును.

ఏసుప్రభుని శరీరమును పరిమళ ద్రవ్యముతో అభ్యాంగనము చేయుటకు ఈ విధంగా చేశారు.

ఈ ముగ్గురు రాజులు దేవుడిని తెలుసుకోవడానికి పవిత్ర గ్రంథమును చదవలేదు ఒక నక్షత్రంను అనుసరించుట ద్వారా రాజును కనుగొన్నారు.

1. అన్వేషించుట - వెదకుట

వెదకుట సర్వసాధారణం గా మనం మన జీవితంలో ప్రతిరోజు కూడా దేనికో దానికి వెతుకుతూనే ఉంటాం.

-సంతోషం కోసం వెదకుతాం

-ప్రేమ కోసం వెదకుతాం

పని కోసం వెదకుతాం

-నిజమైన స్నేహితుల కోసం వెదకుతాం.

పవిత్ర గ్రంథంలో వెదికేవారు

1. మరియమ్మ, యోసేపు

2. వర్తకుడు

3. పోగొట్టుకున్న నాణెం

4. తప్పిపోయిన గొర్రె

మనం నిజాయితీగా వెతికితే తప్పనిసరిగా దాని నీ కనుక్కుంటాం వెదకుడు మీకు దొరకబడును - మత్తయి 7:7.

మన యొక్క జీవితంలో దేవుని వెదకాలి, ఆయన చిత్తం వెదకాలి, ఆయన యొక్క సుగుణాలు వెదకాలి.

2. వారి యొక్క విశ్వాసం - యూదులు ధర్మశాస్త్రమును తెలిసినప్పటికిని ప్రభువు యొక్క జనన సాంకేతాలు గుర్తించలేదు. అనీలు జ్ఞానులు కేవలం నక్షత్రమును మాత్రమే ఆధారంగా చేసుకొని వెంబడించారు.

నక్షత్రం కేవలం రాత్రి మాత్రమే కనబడుతుంది కాబట్టి అది ఒక చీకటి ప్రయాణం దానికి మూలం విశ్వాసమే.

వారు అంతగా విశ్వసించారు కాబట్టి అయినా శ్రమించి ప్రయాణం చేశారు.

వారు విశ్వసించారు కాబట్టియే నడవసాగారు.

వారి ప్రయాణం అంత సామాన్యమైనది, సులభమైనది కాదు అయినప్పటికీ వారు ఓపికతో ప్రయాణం చేశారు. వారి ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఆ దేవుని విశ్వసించారు అందుకే ఆయనను చేరారు.

అన్ని రాత్రులు ప్రయాణం చేశారు ఎక్కడకు నక్షత్రం తీసుకొని వెళ్తుందో తెలియదు అయినా ప్రయాణం చేశారు ఎందుకంటే విశ్వసించారు.

3. నూతన మార్గానికి మలుపు - జ్ఞానులు బాల యేసును ఆరాధించిన తరువాత వారు వేరొక మార్గమున తిరిగి వెళ్లారు.

పాతది విడిచిపెట్టి క్రొత్త మార్గం ను వెంబడించారు.

వేరొక మార్గం అంటే ఒక భౌగోళికమైన క్రొత్త దారి మాత్రమే కాదు అది ఒక మనస్తత్వం మానసిక స్వభావం, కొత్త హృదయం, జీవితం ఆనందమును దేవునికి సాన్నిద్యాన్ని మోసుకొని వెళుతున్నారు.

ప్రభు నీ తెలుసుకొన్న వారు కలుసుకున్న వారు ఎప్పుడూ పాత జీవితం జీవించరు.

-సౌలు

-జక్కయ్య

తెలుసుకొని కలుసుకున్న తరువాత మన జీవితం మునుపటి లాగా ఉండదు.

అప్పుడు వారు వేరే మార్గం ద్వారా ప్రయాణం చేస్తారు.

4. నక్షత్రం - వెలుగునిస్తుంది

వారు చూసిన నక్షత్రం వారిని సంతోషంతో నింపింది. మనం కూడా ఇతరులను సంతోషంతో నింపాలి. నక్షత్రం జ్ఞానులను నడిపించింది అలాగే మనం కూడా ఇతరులను దేవుని వైపునకు నడిపించాలి. ఈ నక్షత్రం వేలాది నక్షత్రాలలో ప్రత్యేకమైనది అలాగే మన జీవితం కూడా మిగతా వారి కన్నా ప్రత్యేకంగా ఉండాలి- ప్రేమించుటలో, ప్రార్థించుటలో, క్షమించుటలో etc..

నక్షత్రం ప్రత్యేకమైనది అయినా కానీ మిగతా నక్షత్రాల మధ్యనే ఉన్నది మనం కూడా అందరితో మంచిగా ఉండాలి.

5. వారిలో ఉన్న గాఢమైన కోరిక- దేవుణ్ణి చూడాలి, తాకాలి, ఆయన్ను ఆరాధించాలి అని అనుకున్నారు. కోరిక ప్రకారం శ్రమించారు అప్పుడు కార్యసాధకులుగా ఉంటున్నారు.

6.వారు జ్ఞానులు రాజులు అయినప్పటికీ అప్పుడే జన్మించిన శిష్కుని ఆరాధించారు సాష్టాంగ పడి నమస్కారం తెలిపారు అది వారి వినయంకు గుర్తు.

7. దేవుని మాటలకు విధేయత చూపారు.

8. దేవునికి విలువైన కానుకలు సమర్పించారు.

9. దేవునికి తమ కానుకలను సమర్పించారు.

10. దేవునికి, రాజుకు తమ హృదయాలను విప్పి పూర్ణ హృదయంతో ఆరాధించారు.

11. ముగ్గురు రాజులు కలిసి ఉంటున్నారు. వారి ప్రయాణం కలిసి సాగుతుంది మనం కూడా కలిసి ప్రయాణం చేయాలి.

12. గమ్యం కు నడుచుట - గమ్యం మరువలేదు.

 


పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...