12, ఆగస్టు 2023, శనివారం

 

19 వ సామాన్య ఆదివారం

1రాజులు19:9, 11-13

రోమియులు 9:1-5

మత్తయి 14:22-23

 

ఈనాటి దివ్య పఠణాలు దేవుని యొక్క రక్షణము అనగా తన ప్రజలను రక్షించు విధానమును గురించి బోధిస్తున్నాయి. అదేవిధంగా ఆయన యందు మనం ఎల్లప్పుడూ విశ్వాసముంచాలి అనే అంశం గురించి తెలియచేస్తున్నాయి.దేవుడు మన యొక్క అన్ని సమయాలలో మనతోనే ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో నిరాశకు గురి అవ్వొచ్చు,కష్టాలు అనుభవించవచ్చు. అనేక సందర్భాలలో మనలని చాలామంది తిరస్కరించి ఉండవచ్చు, కొన్ని కొన్ని సందర్భాలలో దేవుడు మనకు జరిగే అన్యాయంలో న్యాయం చేయరా అనే ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ మన యొక్క పడిపోయే సమయాలలో, కృంగిపోయే సమయాలలో అనారోగ్య సమయాలలో, ఆస్తిపాస్తులు కోల్పోయిన సందర్భాలలో మనం దేవుని యొక్క స్వరమును దేవుని యొక్క స్నేహమును గుర్తించుకోవాలి. దేవుడు మనతోనే ఉంటారు.

ఈనాటి మొదటి పఠణంలో ఏలియా ప్రవక్త ఏ విధముగా దేవుని యొక్క సాన్నిద్యమును రక్షణమును తన జీవితంలో అనుభవించిన విధానము చదువుకుంటున్నాం. ఏలియా ప్రవక్త ఆహాబు కాలంలో దేవుని యొక్క సందేశమును అందజేశారు. ఏలియా  కార్మెల్ కొండమీద 450 మంది బాలు ప్రవక్తలను సవాలు చేశారు నిజమైన దేవుని యొక్క ఉనికిని నిరూపించమని ఆయన వారందరికీ కూడా ఒక సవాలు విసిరి ఉన్నారు. యావేదేవుని యందు ఉన్న నమ్మకమును బట్టి ఆయన ఈ యొక్క పని చేసి ఉన్నారు. యావే దేవుడు మాత్రమే నిజమైన దేవుడు అని తాను సమర్పించిన బలి ద్వారా నిరూపించబడినది. దాని తర్వాత ఏలియా ఈ 450 మంది బాలు ప్రవక్తలను చంపి వేశారు.

ఆ ప్రవక్తల యొక్క మరణం వార్తను విన్న ఎసబేలు రాణి ఏ విధముగానైనా సరే ఏలియాను హతమార్చాలి అని అనుకున్నది అందుకనే ఆమె సేవకులను పంపించి ఏలియా కొరకై వెదకుచున్నది,  అలాంటి ఒక వార్తను విన్న సందర్భంలో ఏలియా ప్రవక్త ప్రాణమును తగ్గించుకొనుటకై భయముతో హోరేబు కొండ చెంతకు పరిగెడుతున్నారు. అప్పటివరకు కూడా ధైర్యముగా ఉన్న ఏలియా ఒక్కసారిగా మానవ స్వభావముతో భయపడిపోతున్నారు. నిరాశతో, భయముతో కృంగిపోయిన సమయంలో యావే దేవుడు ఏలియా ప్రవక్తకు ప్రత్యక్షమవుతున్నారు. ఏలియాతో ప్రభువు ఈ విధంగా అన్నారు నీవు వెళ్లి పర్వతం మీద  నా సముఖమందు నిలిచి ఉండుము అని యావే ప్రభువు ప్రవక్తను ఆదేశించారు. అంతట యావే ఆ వైపున సంచరింపగా పెనుగాలి వచ్చింది, ఈ యావే దేవుని భయానికి పర్వతాలు బద్దలయ్యాయి శిలలు చిన్నాభిన్నమయ్యాయి కానీ యావే దేవుడు మాత్రము ఆ గాలిలో ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగినది కానీ అందులో కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు తరువాత మెరుపు పుట్టినది కానీ ఆ మెరుపులో కూడా యావే దేవుడు ప్రత్యక్షం కాలేదు మెరుపు ఆగిపోయిన తరువాత నిమ్మలంగా మాట్లాడే స్వరం ఒకటి వినిపించినది అది చల్లని స్వరం. ఆ స్వరము వినగానే ఏలియా తన ముఖాన్ని దుప్పటితో కప్పుకొని బయలుదేరి గృహ వాకిట్లో నిలిచి ఉన్నాడు. యావే దేవుడు పెను గాలిలో గాని, భూకంపం లో గాని,  మెరుపులో గాని , నిప్పులో గాని ప్రత్యక్షం కాలేదు కేవలము ప్రశాంతతలోనే ప్రత్యక్షమయ్యారు. దేవుడు అలజడలలో ప్రత్యక్షమవరు ప్రశాంతతలో మాత్రమే దేవుని మనము గుర్తించగలుగుతాం.

ఏలియా ప్రవక్త దేవుని యొక్క స్వరమును ఆలకించిన తర్వాత ఆయన ప్రభువుని యొక్క రక్షణమును తన జీవితంలో చవిచూస్తున్నారు. దేవుడు తనకు తోడుగా ఉండారు అనే నమ్మకమును పెంచుకుంటున్నారు కాబట్టి ఈ అంశము ద్వారా మనందరం కూడా అర్థం చేసుకోవలసిన అంశం ఏమిటంటే దేవుడు మనలను విడిచిపెట్టరు. (ద్వితీయో 31:6) కీర్తన 23:4 మనము నశించిపోతే సంతోషించారు. కొన్ని కొన్ని సందర్భాలలో ఏలియా ప్రవక్త వలే మనం కూడా పారిపోతూ ఉంటూ ఉంటాం. కుటుంబ బాధ్యతలు నెరవేర్చకుండా, ఉద్యోగం చేయకుండా, చదవకుండా, అలాగే మనం గమ్యం యొక్క ఉద్దేశం తెలియకుండా మనం పారిపోతూ ఉంటాం కానీ పారిపోయిన సందర్భంలో దేవుడు మరొకసారి మనకు ఏమి చేయాలి అన్నది తెలియచేస్తుంటారు.

 దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు ఏలియాని కూడా ప్రోత్సహించారు. కాబట్టి తప్పక దేవుని స్వరమును ఆలకించాలి అదేవిధంగా ఆలకించినటువంటి స్వరము ప్రకారంగా దేవుడికి విధేయత చూపాలి ఏలియా ప్రవక్తతో దేవుడు అంటున్నారు ఇక్కడ ఏమి చేస్తున్నావని వెంటనే వెళ్ళమని ప్రభువు చెప్పగానే ఏలియా వెళుతూ తన యొక్క బాధ్యతలను నెరవేరుస్తున్నారు కాబట్టి మనం కూడా దేవునికి విధేయత చూపుతో ఆయన స్వరమును ఆలకిస్తూ జీవించాలి.  మనం గమనించవలసిన విషయం ఏమిటంటే మన యొక్క క్లిష్ట పరిస్థితిలో దేవుని స్వరాన్ని గుర్తిస్తున్నామా దేవుడు మనతో ఉన్నారు అని నమ్మకమును మనము కలిగి ఉంటున్నామా అన్నది అర్థం చేసుకోవాలి దేవుడు యెషయతో అంటున్నారు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను (41: 10).

అలాగే ఏసుప్రభు కూడా శిష్యులతో అంటున్నారు నేను మీతో యుగాంతం వరకు తోడుగా ఉంటానని (మత్తయి 28:20)  కాబట్టి మన జీవితంలో దేవుని స్వరమును ఆలకించి మనందరం కూడా ధైర్యముగా, విశ్వాసముతో జీవించాలి.

ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఏసుక్రీస్తు నందు సత్యమును మాత్రమే బోధిస్తున్నాను అని తెలియచేస్తున్నారు. పౌలు గారు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితమును చూసి బాధపడుతున్నారు ఎందుకంటే దేవుని చేత మిక్కులుగా ప్రేమించబడిన వ్యక్తులే ఆయనను మెస్సేయగా గుర్తించలేదు ఆయనను తిరస్కరించి ఉన్నారు తమ్ము తాము దేవుడి నుండి దూరం చేసుకున్నారు కాబట్టి పౌలు గారు వారి గురించి బాధపడుచున్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలు దయచేసినప్పటికీ వారిని ఉన్నతమైన స్థితికి ఎన్నుకున్నప్పటికీ వారు అన్ని మరచిపోయారు ఎందుకంటే దేవుడిని వారు విశ్వాసముతో వెదకలేదు అందుకే వారు దేవునికి దూరమయ్యారు. మెస్సయ్యాను విశ్వసించలేదు కాబట్టి పౌలు గారు వారి జీవితంలో చూసి బాధపడుతున్నారు మనం కూడా దేవుడిని విశ్వాసము ద్వారానే వెదకాలి. ఆయన యొక్క గొప్ప కార్యములు మన జీవితంలో గుర్తించాలి ఆయన యందు విశ్వాసము ఉంచాలి.

ఈనాటి సువిశేష పఠణంలో ఏసుప్రభు నీటి మీద నడిచి వచ్చుటను ధ్యానించుకుంటున్నాం. ఏసుప్రభు తన యొక్క పరిచర్య ముగించిన తర్వాత తన శిష్యులు పడవనికి గలలియ సరస్సు ఆవలి తీరం చేరాలని ప్రయత్నించారు కానీ ఆ సందర్భంలో గలలియ సరస్సులోని అలలు చెలరేగి పడవ అతలాకుతులమైపోయినది. శిష్యులు ఆ అలలు చూసి భయపడిపోయారు. వేకువ జామునే ఏసుప్రభు నీటి మీద నడుస్తూ వారి వద్దకు వచ్చారు. అది చూసి శిష్యులందరూ కూడా భయపడి పెనుభూతము అని కేకలు పెట్టారు వెంటనే ఏసు ప్రభు భయపడకుడు. ధైర్యం వహింపుడు నేనే కదా అని పలికి ఉన్నారు. ఇక్కడ ఆ సరస్సు ఈ లోకమును సూచిస్తూ ఉన్నది పడవ శ్రీ సభను సూచిస్తూ ఉంది శిష్యులు విశ్వాసులను సూచిస్తూ ఉన్నది. 

పెనుగాలికి పడవ అలలకు తాళలేక అతలాకుతలమైనట్లే శ్రీ సభ కూడా ఈ లోకంలో అనేక ఇబ్బందులకు, అవమానములకు, హింసలకు గురి అగుచున్నది. ఆపదలో ఉన్న శిష్యులకు దేవుడు తోడైయున్న విధంగానే శ్రీ సభకు కూడా ఎప్పుడూ దేవుడు తోడుగానే ఉంటూ ఉంటారు. మనందరం కూడా విశ్వాసముతో ఉండాలి. ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో నడిచి వాగ్దాత్వ భూమికి చేరే సందర్భంలో ఏ విధముగా తోడుగా ఉండి వారితో నడిచి ఉన్నారో అదేవిధంగా శిష్యులను గమ్యం చేర్చుటకు వారి చెంతకు చేరుతున్నారు. నిర్గమకాండములో ప్రజలు నీటి మీద నడిచిన విధంగా పేతురు గారు కూడా నీటి మీద నడుస్తూ ఉన్నారు. మనందరం కూడా ఇక్కడ తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే ఏసుక్రీస్తునకు సమస్తము మీద అధికారం ఇవ్వబడినది ప్రకృతి సైతము ఆయనకు లోబడుచున్నది.

ఒక అంశం ఏమిటంటే పేతురులో ఉన్నటువంటి కోరికను కూడా ఇక్కడ మనము తెలుసుకుంటున్నాం. ఏసుప్రభువును తనలాగే నీటి మీద నడిచి వచ్చుటకు అనుమతి దయచేయమంటున్నారు. పేతురు గారిని చాలా సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం ఆయన దేవుని విషయాలలో ఎప్పుడూ కూడా  సమాధానము చెప్పటానికి,ఆయనతో ప్రయాణం చేయటానికి మొదటి స్థానంలో ఉంటారు. నేను ఎవరని మీరు భావిస్తున్నారు అని చెప్పినప్పుడు కేవలం పేతురు మాత్రమే నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అని అంటున్నారు.

ఏసుప్రభు మరణం గురించి తెలియచేసినప్పుడు మీకు ఇది సంభవింపకుండును గాక అని పేతురు మాత్రమే పలుకుతున్నాడు. ఏసుప్రభు పడవ మీద నడిచేటప్పుడు నేను కూడా నడుస్తాను అని పేతురు మాత్రమే అడుగుతున్నారు. ఏసుప్రభు శిష్యుల పాదాలు కడిగినప్పుడు నా పాదాలు మీరు కడగ వద్దని పేతురు మాత్రమే అంటున్నారు.

నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు అని ఏసుప్రభు పలికిన సందర్భంలో పేతురు మాత్రమే నేనా ప్రభువు అని అంటున్నారు ఇలా చాలా సందర్భాలలో పేతురు ఏసుప్రభు విషయంలో చొరవ చేసుకొని అడుగుచున్నారు. ఇది ఆయనకు దేవుడి మీద ఉన్న ప్రేమ వలన దేవునికి దగ్గరగా ఉండాలి అనేటటువంటి ఆలోచన వలన కాబట్టి మనలో కూడా దేవుని విషయాలలో ముందుగా ఉండాలి అనే ఆలోచన ఎప్పుడూ ఉండాలి. పేతురు గారు ఆయన నీటి మీద నడిచే సందర్భంలో పెనుగాలిని చూసి భయపడుతున్నారు. ఎందుకంటే ఆయనలో విశ్వాసము సన్నగిల్లిపోయింది దేవుడిని చూస్తూ దేవుడి మీద విశ్వాసం ఉంచి మనము ముందుకు సాగితే ఎటువంటి కష్టమైనా, సమస్య అయినా, ఆయన మనము పరిష్కరించగలము. 

మన యొక్క ఇక్కట్లు సమయంలో విశ్వాసము బలహీనమైపోకూడదు. మన యొక్క కష్టకాలములో ప్రభువా నన్ను ఆదుకొనుము అని ప్రార్ధన చేయాలి. దేవుడి మీదే భారము వేయాలి. ఎప్పుడూ కూడా ధైర్యం కోల్పోకూడదు విశ్వాసము కోల్పోకూడదు కాబట్టి దేవుడు మనతో ప్రయాణం చేస్తారు అనే సత్యమును తెలుసుకొని మనందరం కూడా విశ్వాసముతో ప్రభువుకి ప్రార్థన చేయాలి. 

దేవుని యొక్క స్వరమును గుర్తించాలి ఆయన ఎవరి ద్వారా ఎప్పుడు ఏ విధముగా మాట్లాడుతారో మనకు తెలియదు కాబట్టి ప్రతి మంచి మాట కూడా మాట కూడా దేవుని స్వరమని గుర్తించి మనము ధైర్యంగా జీవించాలి. మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు అనగా మనతో అన్ని సమయాలలో ఉండే దేవుడు కాబట్టి ఆయనకు విధేయులై జీవించుదాం ఆయన యొక్క రక్షణమును మనందరం మన జీవితంలో చవిచూద్దాం. విశ్వాసము కోల్పోకుండా జీవించుదాం.

Fr. Bala Yesu OCD

5, ఆగస్టు 2023, శనివారం

 

18 సామాన్య ఆదివారం (ఆగస్టు 6) ఏసు దివ్య రూప ధారణ మహోత్సవం.


దానియేలు 7:9-10,13-14

 2 పేతురు 1:16-19

మత్తయి 17:1-9

 

ఈనాడు తల్లి శ్రీ సభ ఏసు క్రీస్తు ప్రభువుని యొక్క దివ్యరూప ధారణ మహోత్సవమును కొని యాడుచున్నది. యొక్క పండుగ తొమ్మిదవ శతాబ్దం నుండి జరుపుకొనుట ప్రారంభమైనది అప్పటి పాపుగారు అయినటువంటి  Callixtus III ప్రతి సంవత్సరం ఆగస్టు 6 తారీఖున యావత్ ప్రపంచంలో పండుగ కొనియాడాలని తెలియచేశారు. ఏసుక్రీస్తు మహిమలో భాగస్తులై జీవించాలంటే ఆయన యొక్క బాటలో మనందరం కూడా ప్రయాణం చేయాలి. కష్టము అనుభవించలేనిదే ఎవరూ కూడా సుఖము విలువ తెలుకోలేరు. భూమిలో విత్తనం మరణించిననే తప్ప అది మొలకెత్తి పెరిగి,పెద్దదై ఫలించదు. ఎవరైతే చెమటోడ్చి విత్తనం వేస్తారో వారు మాత్రమే ఆనందంతో పంటను కోయగలరు. మనం జీవిత కిరీటాన్ని పొందాలి అంటే కష్టాలు అనుభవించాలి అదేవిధంగా ఆధ్యాత్మిక మహిమను పొందాలి అంటే మనము కూడా క్రీస్తు వలే శ్రమలు అనుభవించాలి. శ్రమల ద్వారానే మనము మహిమను పొందుతాం.

ఈనాటి మొదటి పఠణంలో దానియేలు ప్రవక్త ఆయన చూసినటువంటి దర్శనం గురించి బోధిస్తున్నారు. మనుష్య కుమారుని యొక్క మహిమను ముందుగానే ఆయన ఒక దృశ్యం ద్వారా చూస్తున్నారు. ఆయన చూసిన దర్శనంలో మనుష్య కుమారుని దేవుని సింహాసనం ఎదుట చూశారు. అక్కడ సింహాసనములు వేయుటను దానియేలు చూశారు అక్కడ శాశ్వత జీవి ఒకరు కూర్చున్నారు. ఆయన వస్త్రములు మంచు వలె తెల్లగాను అలాగే ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెపిల్ల వెంట్రుకలు వలె తెల్లగా ఉండెను.

ఆయన సింహాసనము అగ్ని జ్వాల వలె మండుచుండెను అనేకమంది ఆయనకు పరిచర్యలు చేయుచుండరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుటకై గ్రంధాలు తెరవబడునె అదేవిధంగా ఇంకా దానియేలు దర్శనం చూస్తుండగా ఆకాశము నుండి మనుష్య కుమారుని పోలిన ఒకరు వచ్చి శాశ్వత జీవి ఎదుట నిలబడెను సందర్భంలో సకల జనులు రాష్ట్రములు,  ఆయా భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించినట్లు,  ప్రభుత్వమును,  మహిమయును, ఆధిపత్యం ఆయనకు ఇవ్వబడును. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది ఆయన రాజ్యము కలకాలము ఉండును దానియేలు చూసిన దర్శనంలో శాశ్వత జీవి, సింహాసనము మీద వున్న వారు తండ్రి అయిన యావే దేవుడు. ఆయన వస్త్రాలు తల వెంట్రుకలు మండే అగ్నిజ్వాలలు అలాగే అక్కడ ఉన్నటువంటి పరిచర్యకులు అన్నియు దేవుని మహిమను వైభవాన్ని అధికారాన్ని సూచిస్తున్నాయి ఆయన ప్రజలకు తీర్పు విధించుచున్నాడు అలాంటి సమయంలో మనుష్యకుమారుడు మేఘారూరుడై వచ్చి సర్వేశ్వరుని ఎదుట మహిమను సకల జాతుల పై  అధికారము పొందుచున్నాడు. తండ్రి తన కుమారునికి సమస్తము మీద ఆధిపత్యం ఇచ్చి ఉన్నారు

మనుష్యకుమారుడు మెస్సయ్యె. ఈనాటి రెండవ పఠణంలో పేతురు గారు ఆయన చూసిన దర్శనంలో ఏసుప్రభు యొక్క దివ్య రూప ధారణ నిజమైనది అని ఆనాటి విశ్వాసులకు తెలియజేస్తున్నారు. దివ్య రూప ధారణ సమయములో ఈయన నా ప్రియమైన కుమారుడు ఇతనిని గూర్చి నేను సంతోషిస్తున్నాను అనే వానిని పేతురు గారు మిగతా శిష్యులు విన్నారు అని వారు తెలియజేస్తున్నారు. పాత నిబంధన గ్రంథంలో మెస్సయ్య గురించి ముందుగానే తెలియచేయబడినది. దివ్య రూప ధారణ ఒక కట్టు కథ కాదు అది నిజమైన వాస్తవము అని పేతురు గారు తెలియచేస్తున్నారు విధంగానైతే దివ్యరూపధారణ నిజమో అదే విధముగా యేసు క్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ జరగటం నిజము అనే సత్యమును కూడా పేతురు గారు తెలియజేస్తున్నారు

ప్రవక్తల యొక్క సందేశమును శ్రద్ధగా ఆలకించుట మంచిది అని పేతురు గారు తెలియచేస్తున్నారు ఎందుకంటే వారు బోధించినది ఏది తమ సొంతగా కాకుండా దేవుని యొక్క సందేశమును మాత్రమే వారు బోధించుతిరి అందుకుగాను అది ఆలకించి పాటిస్తే వారి జీవితము ధన్యం అవుతున్నది తెలియ చేసి ఉన్నారు. ఈనాటి సువిశేష పఠణంలో ఏసుప్రభు తాబోరు కొండమీద శిష్యులకు తన దివ్య మహిమను, పరలోక అనుభూతిని కలుగజేసిన విధానమును చదువుకుంటున్నాము. దివ్యరూపధారణ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే యేసు ప్రభువు తన యొక్క తండ్రిని సంప్రదించుట. ఆయన పొందబోయేటటువంటి సిలువ శ్రమలు, మరణము, పునరుత్థానము తండ్రి చిత్తానుసారంగా ఉన్నాయా లేదా అని తెలుసుకునుటకు ప్రభు తాబోరు కొండమీద తండ్రిని సంప్రదిస్తున్నారు. రెండవదిగా శిష్యులకు పరలోక మహిమను తెలియజేయుటకు అదే విధముగా వారు లోక సంబంధమైన ఆశలు కలిగి జీవించకుండా, పరలోకం మీద దృష్టి పెట్టి పవిత్ర జీవితం జీవించుటకు లోక సంబంధ ఆశలు, కోరికల కన్నా ముఖ్యమైనది దేవుని బాటలో ప్రయాణించుట అని తెలుపుటకు ప్రభువు వారిని తాబోరు కొండమీదకి తీసుకెళ్తున్నారు, ఇంక శిష్యుల యొక్క విశ్వాసమును అదేవిధంగా వారి యొక్క నమ్మకమును బలపరుచుటకు ప్రభువు వారికి పరలోక అనుభూతిని దయచేసినారు. ఏసుప్రభు తాబోరు కొండమీదకి వెళ్లేటప్పుడు పేతురు యోహాను యాకోబులను మాత్రమే తీసుకొని వెళ్ళి ఉన్నారు ఎందుకు ముగ్గురిని మాత్రమే తీసుకుని వెళ్లి ఉన్నారంటే ఏసుప్రభు పట్ల, ఆయన రాజ్యము పట్ల వారికి ఉన్నటువంటి ఆలోచనలు లోక సంబంధమైనవి. పేతురు ఆయనను మెస్సయ్యగా గుర్తించారు కానీ సిలువ శ్రమలు అనుభవించటానికి ఇష్టపడలేదు అలాగే యోహాను యాకోబులు లోక సంబంధమైన అధికారం కోసం ప్రాకులాడుతున్నారు అందుకనే మహిమను పొందాలి అంటే సిలువ శ్రమలు అనుభవించాలి.

 ఏసుప్రభు ప్రార్థించుటకు తాబోరు కొండమీదకు వెళ్ళుచున్నారు. పవిత్ర గ్రంథంలో పర్వతం దేవుడిని కలుసుకొనుటకు ఒక స్థలంగా ఉన్నది ఎందుకంటే అబ్రహాము మోరియా పర్వతం మీద, మోషే ప్రవక్త  సీనాయి పర్వతం మీద, ఏలియా ప్రవక్త హోరేబు పర్వతం మీద యావే దేవుడిని కలుసుకున్నారు. పాత నిబంధన గ్రంథంలో మోషే ప్రవక్త సీనాయి పర్వతం దగ్గర దేవుడిని కలుసుకున్నటువంటి సందర్భంలో ఆయన ముఖము కూడా ప్రకాశించెను. ( నిర్గమ 34:29-35).

ప్రార్థనలో దేవునితో ఉన్నటువంటి సందర్భంలో మనందరం కూడా మార్పు చెందుతుంటాం. మోషే ప్రవక్త ఏలియా ప్రవక్త పర్వతం మీద దేవుడిని కలుసుకున్న సందర్భంలో వారు జీవితంలో ఒక నూతన మార్పు అనేది జరిగింది మోషే ప్రవక్త యొక్క మొఖము ప్రకాశించినది అది ఎన్నడూ లేని విధంగా ఉన్నది ప్రజలు ఆయన ముఖము చూడలేకపోయారు. ఏలియా ప్రవక్త కూడా హోరేబు కొండమీద దేవుడిని కలుసుకున్న సందర్భంలో ఆయన బలవంతుడై తన యొక్క పరిచర్యను ప్రారంభిస్తున్నారు అదే విధముగా మనము కూడా దేవుడిని ప్రార్థనలో కలుసుకొని మనము కూడా మార్పు చెంది దేవుడి ప్రకారముగా జీవించాలి. ఎందుకు మోషే ప్రవక్త యు అదేవిధంగా ఏలియా ప్రవక్తలు మాత్రమే దర్శనములో పేతురు గారికి మిగతా శిష్యులకు కనపడ్డారు అంటే మోషే ప్రవక్త ధర్మ శాస్త్రమును ఇచ్చినవారు ఏలియా ప్రవక్త అందరి ప్రవక్తల కంటే గొప్పవారు. అప్పటి యూదులు వీరిద్దరినీ గొప్ప ప్రవక్తలుగా భావించారు ఎందుకంటే వారు లోక సంబంధమైన మరణము పొందకుండా దేవుని చేత ఆకాశంలోనికి తీసుకొని పోబడ్డారు అని వారి నమ్మిక. (ద్వితీయో 34:5-6), (2 రాజులు 2:11). 

మనుష్యకుమారుడు  సిలువ శ్రమల ద్వారా రక్షణము చేకూరుస్తారు. ఏసుప్రభు ధర్మశాస్త్రమును అదేవిధంగా ప్రవక్తల ప్రబోధమును నెరవేర్చుటకు భూలోకమునకు వచ్చి ఉన్నారు అంటే ఆయన గురించి ఏది అయితే ధర్మశాస్త్రములో, ప్రవక్తలు బోధించారో అది అక్షరాల నెరవేరుతుంది అందుకే ఇద్దరు ప్రవక్తలు ఏసుప్రభు తో సంభాషిస్తున్నారు. దివ్య రూప ధారణ సమయంలో ఆకాశము తెరవబడి ప్రభువు యొక్క స్వరము ఈయన నా కుమారుడు ఇతనిని ఆలకింపుడు అని తండ్రి దేవుడు కుమారునితో సంభాషించారు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు అనేకసార్లు మేఘరూపమున మాట్లాడి ఉన్నారు (నిర్గమ 24:15-1; 13:21-22; 34:5; 40:34; 1రాజులు 8:10:11).

తండ్రి దేవుడు కుమారుని స్వరమును ఆలకించమని మనలను కోరుచున్నారు. దేవుని యొక్క స్వరము ఆలకించినట్లయితే మనందరం కూడా సంతోషముగా జీవించగలుగుతాం దానికి కొన్ని ముఖ్య ఉదాహరణలు పవిత్ర గ్రంథంలోని మనకు ఉన్నాయి.

1. నోవా దేవుని యొక్క స్వరమును ఆలకించారు అందుకని ఆయన కుటుంబము రక్షించబడినది (ఆది6-9)

2. అబ్రహాము దేవుని స్వరం ఆలకించారు దానికి ప్రతిఫలంగా ఆయన అనేక జాతులకు తండ్రిగా పిలువబడ్డారు.(ఆది12)

3.మోషే దేవుని యొక్క స్వరాన్ని ఆలకించారు దానికి ప్రతిఫలంగా ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా దేవుడు అతడిని నియమించారు.(నిర్గమ3)

4. యెహోషువ దేవుని స్వరమును ఆలకించి ఉన్నారు అందుకే మోషే ప్రవక్త తర్వాత ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధ్యతను దేవుడు అతనికి అప్పచెప్పారు.

5. దానియేలు ప్రవక్త దేవుని స్వరమును ఆలకించి ఉన్నారు అందుకే ఆయన సింహపు బోనులో రక్షణను పొంది ఉన్నారు. (దాని 6)

6. మరియ తల్లి దేవుని స్వరమును ఆలకించారు అందుకే ఆమెను దేవుడు తన తల్లిగా ఎన్నుకున్నారు.

7. పేతురు దేవుని స్వరమును ఆలకించి ఉన్నారు అందుకే వల చినుగునన్ను చేపలు ఆయన పొందగలిగాడు. ఇంకా చాలామంది దేవుని యొక్క స్వరమును ఆలకించి ప్రభు దీవెనలు పొంది ఉన్నారు.

ఆయన స్వరమును ఆలకించక పోతే మన జీవితములు నరకమునకు సిద్ధం చేసుకున్నట్లే. అలాంటి వారి జీవితంలో సంతోషము ఉండదు,శాంతి ఉండదు,  సమాధానము ఉండదు దేవుని యొక్క కృపను కూడా పొందలేరు దానికి ముఖ్య నిదర్శనం సౌలు రాజు యొక్క జీవితం ఆయన దేవుని స్వరమున ఆలకించలేదు అందుకని ఇశ్రాయేలు రాజుగా తృణీకరింపబడ్డాడు, ఏలి కుమారులు దేవుని స్వరమును ఆలకించలేదు అందుకని వారు శిక్షింపబడ్డారు, కొన్నిసార్లు ఇస్రాయేలు ప్రజల దేవుని స్వరమును ఆలకించలేదు అందుకని బానిసత్వంలోనికి పంపివేయబడ్డారు కాబట్టి ఈరోజు మనందరం కూడా ఏసుప్రభు యొక్క దివ్య రూప దారుణ పండుగ కొనియాడే సందర్భంలో మనము కూడా పరలోక మహిమను పొందాలి అంటే ఏసుక్రీస్తు ప్రభువులా మారాలి అంటే ఆయన చూపించిన మార్గమును మనము అనుసరించాలి ఆయన స్వరమును ఆలకించి అనుసరించాలి అప్పుడు మాత్రమే మనలో మార్పు అనేది ఉంటుంది. మన యొక్క అనుదిన జీవితంలో కూడా పర్వతం ఎక్కాలి, అంటే కష్టాలు ఉన్న ,బాధలు ఉన్న, శోధనలు ఉన్నా, సమస్యలు ఉన్నా వీటన్నిటిని కూడా ఎదుర్కొని మనం ముందుకు సాగినప్పుడు మాత్రమే దైవ అనుభూతుని మనము పొందగలుగుతాం లేదంటే కొండ కింద మాత్రమే మనము మనకు నచ్చిన జీవితాన్ని జీవిస్తాము ఇశ్రాయేలు ప్రజలు విధంగా అయితే సీనాయి పర్వతం కింద పాపపు జీవితాన్ని జీవించారు అలాగే మనం కూడా పాపంలోనే ఉంటాము కానీ దైవ అనుభూతుని పొందలేము కాబట్టి మనం కూడా పవిత్రత అనే పర్వతమును ఎక్కి దేవుని కలుసుకోవాలి. దేవుని యొక్క స్వరమును ఆలకించి అనుసరించాలి. అనునిత్యం కూడా ప్రార్థించాలి. దేవుని యొక్క సిలువ శ్రమలు పొందటానికి సిద్ధపడాలి.

Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...