2, సెప్టెంబర్ 2023, శనివారం

22 వ సామాన్య ఆదివారం

22  వ సామాన్య ఆదివారం
 12:1-2, మత్తయి 16:21-27
ఈనాటి దివ్య పఠణాలు దేవుని యొక్క శిష్యరికం గురించి బోధిస్తున్నాయి. దేవుని యొక్క శిష్యులుగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి కొన్ని లక్షణాలు ఉండాలి, ఏ విధముగానయితే ప్రతి ఒక్క ఉద్యోగానికి ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలో అలాగే ఏసుప్రభు యొక్క శిష్యులుగా ఉండాలి అంటే వారికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి ఆ అంశముల గురించే ఈనాడు పఠణాలు మనందరిని కూడా ధ్యానించమని కోరుతున్నాయి.  
ఈనాటి మొదటి పఠణంలో దేవుని యొక్క సేవకుడైన ఇర్మియ ప్రవక్త దైవ సందేశం అందించే సమయములో అనుభవించిన ఒక కష్టతరమైన సమయం గురించి తెలియజేస్తున్నాను.ఇర్మియ ప్రవక్త నీతిగా జీవిస్తూ సత్యమునకు సాక్షిగా ఉంటూ, దేవుని యొక్క సందేశమును రూడీగా ప్రకటించారు. యిర్మియ క్రీస్తుపూర్వం 650 నుండి 580 మధ్య యూదా లో ఉన్న యెరుషలేములో దేవుని యొక్క సందేశాన్ని అందజేశారు. ఇర్మియాను దేవుడు పిలిచిన సందర్భంలో నేను బాలుడను నీ సందేశమును బోధించలేను అని చెప్పిన సందర్భంలో యావే దేవుడు భయపడవలదు, నేను నీకు తోడై యుండును నీ నోటిలో నా మాటలు ఉంచుతాను అని అభయ వచనాలు చెప్పి తనకు ధైర్యం ఇచ్చి ప్రభు యొక్క సందేశమును యూదా ప్రజలకు అందచేయుటకు ఇర్మియాను యావే దేవుడు ఎన్నుకున్నారు. ఇర్మియ ప్రవక్త తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చటంలో ఏమాత్రం వెనుదీయక ప్రభువు యొక్క వాక్కును ప్రజలకు వెలుగెత్తి చాటాడు ప్రజల యొక్క పాపపు జీవితాన్ని ధైర్యముగా ఖండించారు. రాజులకు సైతం నిర్భయంగా దేవుని యొక్క మాటలను బోధించి దేవుని యొక్క ప్రణాళికలు, మార్గములు చూపించాడు. ఈ విధముగా ఇర్మియా దేవుని యొక్క పని చేసే సందర్భంలో తన సొంత ప్రజలే తనను అర్థం చేసుకోలేదు. అందుకే ఆయనను ఏ విధముగానైనా సరే హతమార్చాలి అని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇర్మియ ప్రవక్త ఈ సంఘటనలన్నీ చూసిన సందర్భంలో తన యొక్క మానవ బలహీనత వలన దేవుడు తనను విడిచిపెట్టారు అని తనకు ఇచ్చిన వాగ్దానం మరచిపోయారు అని ఒక విధమైన బాధను వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటాను ఎటువంటి ఆపద కలగకుండా చేస్తాను అని చెప్పిన ప్రభువు యొక్క మాటలు విశ్వసించిన 
అతడికి ఒక చేదు అనుభవము ఎదురైనది అది తన సొంత ప్రజలే తనను అర్థం చేసుకోకపోవడం, దేవుని యొక్క సందేశాన్ని స్వీకరించకపోవడం మరియు తనను హతమార్చాలి అనుకోవడం ఇర్మియ ప్రవక్తను చాలా బాధపెట్టాయి అందుకనే తాను దేవుడిని అడుగుచున్నారడు నన్ను విడిచి పెట్టావా అని ఇలాంటి ఒక సమయములో తాను కూడా పరిచర్యను ఆపివేయాలనుకున్నాడు కానీ దేవుని యొక్క వాక్కుమాత్రం తన యొక్క హృదయములో అగ్ని జ్వాల  రగిలిపోతున్నది. ఆ యొక్క వాక్కు తనను ప్రశాంతముగా ఉండనీయలేదు తనకు కష్టంగాఉన్నా సరే తన ప్రజలు నిరాకరించిన సరే దేవుని యొక్క సందేశం మాత్రము ప్రకటించుట ఆపుటలేదు ఇది కేవలం దేవుని యొక్క అనుభవం మాత్రమే. కాబట్టి ఇర్మియా ఏ విధముగా అయితే దేవుని యొక్క పని చేస్తూ ఉన్నారో కష్టమైనా, నిందలు ఎదురైనా, తిరస్కరణల ఎదురైనా, బాధలు ఎదురైనా మనం కూడా అలాగే ముందుకు సాగాలి దేవుని యొక్క పనిని కొనసాగించాలి. ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు మనందరిని కూడా పరిశుద్ధ జీవితం జీవించుటకు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేష పఠణంలో పేతురు గారు ఏసుప్రభు యొక్క సిలువ శ్రమల యొక్క పాటులను
 తృణీకరిస్తున్నారు. పోయిన వారం చదివిన సువిశేష పఠణంలో పేతురు గారిని యేసు ప్రభువు మెచ్చుకొనుట మనం చూస్తూ ఉన్నా ఎందుకంటే ఎవరు ఇవ్వనటువంటి గొప్ప సమాధానం పేతురు మాత్రమే ఇచ్చారు కాబట్టి అతడిని ఏసుప్రభు మెచ్చుకుంటున్నారు. తనమీద రాతి సంఘమును నిర్మిస్తాను అని కూడా ప్రభువు పలికారు. కానీ ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు తన యొక్క సిలువ శ్రమల గురించి చెప్పినటువంటి సందర్భంలో పేతురు గారు ఇవి మీకు సంభవింపకుండునుగాక అని దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధముగా ఆయన మాట్లాడుచున్నారు. ఏసు ప్రభు పేతురు గారితో ఛీ!పో! సైతాను అని కోప్పడుచున్నారు ఎందుకంటే పేతురు యొక్క మాటలు మెస్సయ్య యొక్క పనికి ఆటంకముగా ఉన్నవి. ఏసుప్రభువును గురించి ఇంకా శిష్యులకు ఒక పూర్తి అవగాహన రాలేదు అందుకని ఆయనను ఒక పొలిటికల్ మెస్సయ్యగానే అర్థం చేసుకుంటున్నారు రోమీయులను జయించి పాలస్తీనా ప్రజలకు విముక్తిని కలగచేస్తారు అని వారి యొక్క ఆలోచనలు అందుకని ఆయనకు ఇలాంటి మరణము సంభవించకూడదు అని పేతురు గారు ఏసుప్రభుతో సిలువ శ్రమలు మీకు సంభవింపకూడదు అని పలుకుచున్నారు. అందుకనే ఏసుప్రభు మనుష్యకుమారుడు సిలువ శ్రమలో అనుభవించకపోతే రక్షణ కలగదు అని తెలుపుచున్నారు. 
చాలా సందర్భాలలో మనం కూడా పేతురు గారి వల్లే శ్రమలు మనకు వద్దు అని భావిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా సంతోషాన్ని కోరుతూ ఉంటాం. కష్టం విలువ తెలియని సంతోషం విలువ కూడా తెలియదు. గోధుమ గింజ భూమిలో పడి నశించకపోతే అది మొక్కగా ఎదగలేదు అలాగే మనం కూడా కష్టాలు అనుభవించకపోతే సంతోషం యొక్క అంతరార్థం గ్రహించలేము. 
 క్రీస్తు ప్రభువు ఎవరైతే తన యొక్క నిజమైన శిష్యులుగా ఉండాలి అనుకుంటున్నారో వారు మూడు లక్షణాలు కలిగి ఉండమని చెప్పుచున్నారు.
 మొట్టమొదటిగా తనను అనుసరించేటటువంటి తమ్ముతాము పరిత్యజించుకోమంటున్నారు. పరిత్యజించుట అంటే విడిచిపెట్టుట అనగా ఈ లోక సంబంధమైన ఆశలను, కోరికలను, స్వార్థమును అధికారమును, పక్కన పెట్టేసి దేవుని చిత్తము కొరకు త్యాగపూరితమైన జీవితం జీవించాలని ప్రభువు కోరుతున్నారు. ఏది అయితే దేవుని యొక్క పనికి ఆటంకం గా ఉంటుందో దానిని మనము విడిచిపెట్టటకు సిద్ధపడాలి కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి తల్లిదండ్రుల ప్రీతి కావచ్చు స్నేహితుల ప్రీతి కావచ్చు బంధుమిత్ర కావచ్చు అధికార ప్రతి కావచ్చు వీటన్నిటిని కూడా విడిచిపెట్టినప్పుడే క్రీస్తు ప్రభువుని వెంబడించగలం.
రెండవదిగా తనను అనుసరించే శిష్యులు సిలువను ఎత్తుకొని రమ్మంటున్నారు. సిలువ క్రైస్తవ జీవితంలో శ్రమలకు, అవమానాలకు గుర్తు రక్షణకు గుర్తు, నిందలకు గుర్తు, ఏసుప్రభువుని వెంబడించే వారందరు కూడా సిలువను ఎత్తుకొని రమ్మంటున్నారు అంటే ఎవరు కూడా తమ యొక్క బాధలను అవమానాలను కష్టాలను విడిచిపెట్టకుండా వాటన్నిటినీ చేకొని ప్రభువుని వెంబడించమని కోరుతున్నారు. అనేక సందర్భాలలో మన జీవితంలో సిలువను వదిలి వేస్తుంటాం కానీ క్రీస్తు ప్రభువు తన శిలువను ఎత్తుకొని మనందరి పాపాలు మోస్తూ ఆ కల్వరి కొండమీద తన ప్రాణములను త్యాగం చేసి మనకు రక్షణ ప్రసాదించి ఉన్నారు. అదే విధముగా ప్రతి ఒక్కరు కూడా సిలువను ఎత్తుకొని క్రీస్తు ప్రభువుని వెంబడించాలి కొన్నిసార్లు సిలువ భారం కష్టముగా ఉండవచ్చు అయినప్పటికీ కూడా దేవుని యొక్క సహాయంతో దానిని మోయాలి. 
మూడవదిగా క్రీస్తు ప్రభువు యొక్క శిష్యులకు ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఆయనను అనుసరించుట. అనుసరించుట అంటే కేవలం మనకు నచ్చినది మాత్రమే పాటించుట కాదు యేసు క్రీస్తు ప్రభువు తన జీవితములో ఏది అయితే పాటించి జీవించి ఉన్నారు అదేవిధంగా మన జీవితంలో కూడా ఆయన మార్గములో నడుస్తూ ఆయన బోధించిన అంశములను పాటిస్తూ మనము ఒక ఆదర్శవంతమైన జీవితము జీవించాలి. ఏసుప్రభుని అనుసరించేటప్పుడు మనకు శోధనలు ఎదురవుతూ ఉంటాయి కానీ వాటన్నిటిని ఎదుర్కొని ప్రభువుని వెంబడించాలి.అదే విధముగా ఈనాటి సువిశేషంలో యేసుప్రభు ఎవరైతే తన ప్రాణములను కాపాడుకోవాలని అనుకుంటున్నారో వారు దానిని కోల్పోతారంటున్నారు కానీ తన కొరకు ప్రాణములను సమర్పించేవారు దానిని పొందుతారని పలుకుచున్నారు అంటే విశ్వాస పరముగా ఎటువంటి భయము కూడా లేకుండా దేవుని కొరకు జీవించేవారు ఆయనలో ఎల్లప్పుడూ కూడా జీవిస్తూనే ఉంటారని తెలియచేస్తున్నారు. కొన్నిసార్లు కొంతమంది తమ యొక్క స్వార్థం కోసం విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి సైతం సిద్ధంగా ఉంటారు వారికి ప్రభువు చెప్పేది ఏమిటంటే తమ ప్రాణాలు కాపాడుకోవడానికి విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు కాబట్టి వారి జీవితమును కోల్పోతారు, దేవుని యొక్క కనికరమును కోల్పోతారు అని తెలుపుచున్నారు. ఈరోజు ప్రభువు మనందరినీ కూడా ఈ పఠణాల ద్వారా ఆహ్వానిస్తూ నేర్చుకోమని పలికేటటువంటి అంశములు ఏమిటంటే మన విశ్వాస జీవితంలో దేవునికి సాక్షియ జీవించే తరుణంలో కష్టాలు బాధలు అనుభవించవచ్చు ఆ సందర్భంలో దేవుడిని విడిచిపెట్టకుండా నిందించకుండా ప్రభువుని అనుసరించాలి. ఉత్తమ శిష్యులుగా జీవించాలి.
Fr. Bala Yesu OCD

26, ఆగస్టు 2023, శనివారం

21వ సామాన్య ఆదివారం

21 వ సామాన్య ఆదివారం
యెషయ 22:19-23, రోమియులు 11:33-36, మత్తయి 16:16-20
ఈనాటి దివ్య పఠణాలు అధికారం గురించి బోధిస్తున్నాయి. మానవాళికి దేవుడు అధికారం ఇచ్చినది సరైనటువంటి పాలన చేస్తూ అందరిని కూడా దేవుని వలే సన్మార్గంలో నడిపించాలి అని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అధికారం ఇచ్చి ఉన్నారు. దేవుడు తన అధికారాన్ని తన దగ్గరే వుంచుకొనకుండా మానవాళితో పంచుకుంటున్నారు. ఒక విధముగా చెప్పాలి అంటే ఈ ఆదివారాన్ని అధికార ఆదివారం అని పిలవవచ్చు ఎందుకంటే మూడు పఠణాలు కూడా ఇదే అంశము గురించి ఈ ప్రస్తావిస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పఠణంలో దేవుడు అవిశ్వాసులు, స్వార్ధపరులైన అధికారుల పట్ల నిరుత్సాహపడినటువంటి రీతిని, శిక్షించిన రీతిని మనం యెషయా గ్రంథం ద్వారా చదువుకుంటున్నాము. ఎవరైతే తమ అధికారాన్ని స్వార్ధం కోసం వినియోగించుకుంటారో వారిని దేవుడు తమ యొక్క అధికారాన్ని నుండి తొలగిస్తారు. ఈనాటి మొదటి పఠణంలో తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్న ప్రధానమంత్రి షెబ్నా యొక్క జీవిత పరిణామం గురించి, ఆయన్ను దేవుడు శిక్షించిన రీతిని గురించి వింటూ ఉన్నాం . క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దంలో షెబ్నా హెజెకియా రాజు వద్ద గృహ నిర్వాహకుడుగా నియమింపబడ్డాడు. ఆ కాలంలో అస్సిరియా రాజ్యం యూదాపై యుద్ధం చేయటానికి వచ్చే సందర్భంలో హెజెకియా రాజు భయపడుతున్నాడు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు ఐగుప్తు రాజ్యం యొక్క సహాయం కోరమని రాజును కోరారు ఆ యొక్క మాటలకు ప్రధానమంత్రి అయిన షెబ్నా ఎక్కువ ప్రోత్సాహాన్ని అందజేశాడు. నిజ దేవుడైన ఈ యావే మీద ఆధారపడి దేవుని సహాయమును కోరమని యెషయా ప్రవక్త తెలియచేశారు. యెషయా అన్య రాజ్యముల మీద ఆధారపడకుండా, వారి సైనిక బలం మీద నమ్మకం ఉంచవద్దని  ముందుగానే హెచ్చరించారు అయినప్పటికీ షెబ్నా గర్వంతో దేవుని యొక్క మాట వినకుండా అన్య రాజుల మీద ఆధారపడాలని కోరుకున్నాడు హెజెకియా రాజును దాని కొరకు ప్రోత్సహించాడు. దేవుని యొక్క మాటను ధిక్కరించి గర్వంతో, అవిశ్వాసిగా జీవించిన షెబ్నాను దేవుడు తన యొక్క అధికారం నుండి తొలగిస్తున్నారు. అదే విధముగా షెబ్నా తనకున్నటువంటి ధనంతో అధికారంతో యెరుషలేము లోనే ఒక మంచి సమాధిని తన కొరకై నిర్మించుకున్నాడు తన మరణించిన తర్వాత దానిలో పాతి పెట్ట పడటానికి కానీ ఆయన తన యొక్క దనమను, అధికారాన్ని దుర్వినియోగం చేసుకొనుట ద్వారా దేవుడు తనని శిక్షిస్తున్న ఆయన బానిసత్వం లోనే చనిపోతున్నారు. దేవునికి విధేయత చూపించకుండా గర్వంతో అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి షెబ్నా నుండి అధికారం తొలగించి హిల్కియా కుమారుడు ఎలియాకీము కు అధికారమును ఇస్తున్నారు. షెబ్నా దేవుని మార్గములకు దూరంగా ఉంటే ఎల్యా కీమా మాత్రం దేవునికి దగ్గరగా ఉన్నారు. ఆయనకు విధేయత చూపించారు, దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రభువు ఈ విధంగా పలకు చున్నారు నీ అధికార వస్త్రములను నీ నడికట్టును అతనికి కట్టుబెట్టుదును, నీ అధికారమును అతనికి అప్పగించును అలాగే దావీదు వంశపు రాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద దాల్చినట్లు చేయుదును (21,22(. షెబ్నా యొక్క పూర్తి బాధ్యతలన్నిటిని దేవుడు ఎలియాకీముకు ఇస్తున్నారు. తాళపు చెవి అధికారాన్ని సూచిస్తూ ఉన్నది. ఎందుకంటే దేవుడే స్వయముగా పేతురు గారికి పరలోకపు తాళంలను అప్పజెప్పి అధికారాన్నిస్తున్నారు. ఒక విచారణ గురువు ఇంకొక విచారణకు బదిలీ అయి వెళ్లేటప్పుడు కొత్తగా వచ్చిన విచారణ గురువుకు ఆయన అప్ప చెప్పేది దివ్య మందసము యొక్క తాళపు చెవి. ఆ తాళపు చెవి తన యొక్క విచారణ బాధ్యతలను అధికారాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ మొదటి పఠణంలో మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే దేవుడు మనకు ప్రసాదించిన అధికారమును మనము మంచి కొరకై వినియోగించుకోవాలి అంతేకానీ దుర్వినియోగం చేసుకోకూడదు స్వార్థంగా జీవించకూడదు. పవిత్ర గ్రంథంలో చాలామంది తమ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు దాని ప్రతిఫలంగా దేవుని యొక్క శిక్షణ పొందుతున్నారు.
- సౌలును దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా చేశారు కానీ తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. దేవుడు అతడిని తన పదవి నుండి తొలగిస్తున్నారు.
- సొలోమోనుకు దేవుడు ఎవరికి ఇవ్వనటువంటి జ్ఞానమిచ్చారు కానీ ఆయన కూడా తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని అనేకమంది అన్యులను వివాహమాడి తన దేశములోనికి అన్య  దేవుళ్ళను ఆహ్వానించారు దాని ప్రతిఫలంగా దేవుడి నుండి దూరమయ్యారు.
-ఆహాబును దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా ఎన్నుకున్నారు కానీ ఆయన యెసబేలు రాణి వివాహమాడి తన రాజ్యంలో బాలుదేవతలను ఆరాధించుట ప్రారంభించారు దాని ప్రతిఫలంగా దేవుని యొక్క కోపమును, శిక్షను పొందుకున్నాడు.
-హామానుకు దేవుడు అధికారము కానీ అతడు హెబ్రీయులను హతమార్చాలనుకున్నాడు కానీ ఆయనే చనిపోయాడు.
-యూదా ఇస్కారియతకు దేవుడు అధికారం ఇచ్చారు కానీ ఆయన తన ధనమును దుర్వినియోగం చేసుకొని దేవుడిని అప్పగించాడు దాని ప్రతిఫలంగా ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ విధంగా చాలామంది పవిత్ర గ్రంథంలో దేవుడు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోకుండా తమ స్వార్థం కోసం దానిని వినియోగించి దేవుని శిక్షకు పాత్రులగు చున్నారు. అధికారమివ్వబడినది మంచి కోసం. కాబట్టి వినయం కలిగి మంచిని చేస్తూ జీవించాలి.
ఈనాటి రెండవ పఠణంలో పౌలు గారు దేవుని యొక్క వివేకం గురించి గొప్పగా చెప్తున్నారు ఎందుకంటే దేవుడు అన్యుల ద్వారా కొంతమంది యూదులు మారే విధముగా చేశారు. పౌలు గారి యొక్క సువార్త పరిచర్య ద్వారా అనేకమంది యొక్క రక్షణకు దేవుడు కారకుడయ్యారు అందుకని దేవుని యొక్క మనసు ఎవరికి తెలుసు దేవుని యొక్క వివేకం చాలా గొప్పది ఆయన అందరి యొక్క రక్షణకు పాత్రుడు అని పౌలు గారు దేవుని యొక్క గొప్పతనం గురించి ఈనాటి రెండవ పఠణంలో తెలియచేస్తున్నారు.
ఈనాటి సువిశేష భాగంలో యేసు ప్రభు శిష్యులను ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న అడుగుతున్నారు అది ఏమిటంటే ప్రజలు నా గురించి ఏమని భావిస్తున్నారు అని. ఎందుకు ఏసుప్రభు తన గురించి ఏమని అనుకుంటున్నారు అంటే ఆయన ఉన్నటువంటి ప్రదేశం కైసరియా ఫిలిప్పీ ఆ ప్రాంతం రాజకీయపరంగా పేరు ప్రసిద్ధిగాంచినది అక్కడే సీజర్,  సీజర్ ఆగస్టస్ ఇంకా చాలా మంది రాజకీయపరంగా ప్రసిద్ధిగాంచారు అలాగే ఏసుప్రభు యొక్క పుణ్యకార్యాలు చూసినటువంటి ప్రజలు కూడా ఆయనను పొలిటికల్(రాజకీయ) మెస్సేయగానే చూశారు కానీ రక్షకునిగా గ్రహించలేకపోయారు అందుకే ఏసుప్రభు ప్రజలు నన్ను ఏమని భావిస్తున్నారు అని అడుగుతున్నారు అయితే శిష్యులు వివిధ రకాలైనటువంటి సమాధానములు ఇస్తున్నారు. -కొందరు బప్తిస్మ యెహను  అంటున్నారు, ఎందుకంటే బప్తిస్మ యోహానును అన్యాయంగా శిక్షించారు ఆయన  ఎటువంటి పాపం చేయకుండా దేవుడికి విధేయుడై జీవించారు కాబట్టి ఒకవేళ ఆయన మరలా వచ్చి ఉండవచ్చని కొంతమంది యొక్క అభిప్రాయం.
- కొందరు ఏలియా అంటున్నారు ఎందుకంటే ఆయన ప్రవక్తల అందరిలో గొప్ప ప్రవక్త అలాగే మెస్సయ్య కన్నా ముందుగా వస్తాడు అని ఏలియా ముందుగానే చెప్పారు కాబట్టి  కొందరూఏలియా అనుకుంటున్నారు మలాకి 4:5. -కొంతమంది యిర్మీయా అని మరికొందరు యెషయా అని అనుకుంటున్నారు ఎందుకంటే దేవుడు ఇర్మియాను అలాగే యెషయాను సహాయం చేయుటకు పంపిస్తానని తెలియజేస్తున్నారు. అదే విధంగా కొంతమంది ప్రవక్తలలో ఒకరిని భావిస్తున్నారు ఎందుకంటే ఏసుప్రభు యొక్క పరిచర్య కూడా ధైర్యంగా అన్యాయమును ఎదిరించే విధముగా, ప్రజల కొరకు నిలబడే విధంగా ఉన్నది. కాబట్టి ప్రవక్తలలో ఒకరు అని భావిస్తున్నారు ఇది ప్రజల యొక్క అభిప్రాయం అయితే ఏసుప్రభు తన శిష్యులను కూడా అడుగుతూ ఉన్నారు మీరు నన్నే మని భావించుచున్నారు అందుకు పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని సమాధానం ఇస్తున్నారు ఇది వ్యక్తిగతమైన సమాధానం. పేతురు గారు దేవుని యొక్క ప్రేరణ వలన ఈ సమాధానమిచ్చారు అలాగే పేతురు తన యొక్క వ్యక్తిగత అనుభవమును బట్టి కూడా ఈ సమాధానము చెప్పి ఉండవచ్చు ఎందుకంటే ఆయన జీవితంలో యేసు ప్రభువుతో పనిచేసిన సందర్భంలో అనేక రకములైన అద్భుత కార్యములు, ఎవరూ చేయనటువంటి గొప్ప కార్యములు తన యొక్క కనులారా తాను స్వయంగా చూసి ఉన్నారు కాబట్టి ఇంతటి మహత్తర కార్యములు చేసేది కేవలం దేవుడి అని ఆయన విశ్వసించి ఉన్నారు అందుకని నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన మెస్సయ్య అని అందరికంటే ముందుగా సమాధానమిస్తున్నారు. పేతురు గారిని ఈ సమయంలో ఏసుప్రభు మెచ్చుకుంటూ తనమీద తన యొక్క సంఘమును నిర్మిస్తానని తెలియజేస్తున్నారు ప్రభువు పలికిన విధంగానే పేతురు యొక్క సమాధి మీద తిరుసభ నిర్మించబడినది.(Vatican St. Peter's Basilica). పేతురు గారికి ప్రభువు పరలోకపు తాళపు చెవులను అప్పగిస్తున్నారు అంటే పేతురు గారికి నాయకత్వ బాధ్యతలను అప్పజెప్తున్నారు. పేతురు గారు తన యొక్క బాధ్యతలను అన్నియు కూడా సక్రమముగా నెరవేర్చి దేవునికి విధేయత చూపించారు కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవుడు మనకు ఇచ్చిన అధికారమును ఏ విధముగా మనందరం సద్వినియోగం చేసుకుంటున్నాం అని ధ్యానించుకోవాలి 
ఒక తల్లిగా బాధ్యతలు ఇవ్వబడ్డాయి, తండ్రిగ, గురువుగా ఉపాధ్యాయునిగా అనేక విధాలుగా మనకు బాధ్యతలు ఇవ్వబడ్డాయి వాటిని ఏ విధంగా నెరవేరుస్తున్నాం. కేవలము దేవుని యొక్క అనుభూతి ద్వారానే మనందరం ప్రభువు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలం దానికి నిదర్శనం పునీత పేతురు గారి యొక్క జీవితం కాబట్టి వ్యక్తిగతంగా దేవుని యొక్క అనుభూతి పొందుతూ మంచిని చేస్తూ దేవుడికి ఇష్టకరమైన జీవితం జీవించుదాం.
Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...