16, మార్చి 2024, శనివారం

తపస్సు కాలం ఐదవ ఆదివారం

తపస్సు కాలం ఐదవ ఆదివారం
యిర్మియ 31:31-34 హెబ్రీ 5:7-9, యోహాను 12:20-33

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు తన ప్రజలతో ఏర్పరచుకున్న నూతన ఒడంబడికను గురించి అదేవిధంగా ప్రభువు పొందబోవు మరణము గురించి తెలియజేస్తున్నాయి. ఏసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానమునకు దగ్గరవుతున్న వేళలో శ్రీ సభ మనమందరం ఆయన యొక్క మరణము, పునరుత్థానము గురించి ధ్యానించమని తెలుపుచున్నది.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు యిర్మియా ప్రవక్త ద్వారా తన ప్రజలతో ఏర్పరుచుకుంటున్న ఒక నూతన ఒడంబడిన గురించి తెలుపుచున్నారు. యిర్మియ ప్రవక్త క్రీస్తుపూర్వం 650 - 580  సంవత్సర మధ్యకాలంలో జీవించారు. ఆయన యొక్క పరిచర్య మొత్తం కూడా యెరూషలేములో జరిగినది. యిర్మియ ప్రవక్త ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడిని విస్మరించిన సందర్భంలో యూదుల మధ్య జీవించారు. యూదయ రాజ్యాన్ని అంధకారం ఆవరించినటువంటి సమయం అది. ప్రజలు పాపమునే ప్రేమించి దేవుడికి దూరమైన సందర్భంలో దేవుడు వారిని బాబిలోనియా  బానిసత్వమునకు పంపగా అక్కడ వారు జీవమును కోల్పోయిన విధముగా ఉన్న సమయంలో వారి బాధను చూసి దేవుడు, నూతన ఒడంబడిక ఏర్పరచుకుంటాన‌ని  తెలుపుచున్నారు. వాస్తవానికి ఎందుకు ఈ నూతన వడంబడిక? అని ధ్యానించినట్లయితే మనకు అర్థమయ్యే అంశము ఏమిటి అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మొదటి ఒడంబడిక నెరవేర్చుటలో విఫలమయ్యారు 2రాజలు దిన 36:14-16,21. అందుకే దేవుడు వారికి ఇంకొక అవకాశంను దయచేసి ఉన్నారు. ఇది ఆయన యొక్క మంచితనమునకు నిదర్శనం. పడిపోయినటువంటి తన ప్రజలు మరలా లేచి తనను అనుసరించాలి అన్నది ప్రభువు యొక్క కోరిక. అందుకని ఇంకొక ఒడంబడిక ద్వారా వారికి కొత్త జీవితం ఇస్తున్నారు. దేవుడు ప్రతి ఒక్కరి మార్పుకై అవకాశాన్ని ఇస్తూనే ఉంటూ ఉంటారు అందుకే ఆయన తన యొక్క సేవకులను పదేపదే వారి హృదయ పరివర్తనముకై పంపిస్తూ ఉంటారు. 
ఇశ్రాయేలు ప్రజలు దేవుడి యొక్క మాట ప్రకారంగా జీవించలేదు కాబట్టే ఆయన వారికి ఇంకొక అవకాశాన్ని దయచేసి ఒక నూతన క్షమించే ఒడంబడికను వారితో ఏర్పరచుకుంటున్నారు. పాత బడంబడిక రాతి పలక మీద దేవుని చట్టం రాయబడినట్లైతే, నూతన బడంబడిక ప్రతి ఒక్కరి యొక్క హృదయము మీద వ్రాయబడుతున్నది. రాతి పలక మీద రాసిన దేవుని చట్టం పగిలిపోవచ్చు, చెరిగిపోవచ్చు కానీ మానవుని యొక్క హృదయము మీద రాసినటువంటి దేవుని యొక్క చట్టము ఎన్నడూ మారదు, ఎవరూ కూడా దానిని ఎవరూ కూడా దానిని మన నుండి తీసివేయలేరు. ఇంతకుముందు  దేవుని చట్టం మనకు బయటగా ఉన్నది కానీ ఇప్పుడు మాత్రం దేవుని చట్టం మన హృదయాంతరంగంలోనే ఉన్నది ఆ చట్టం మనందరిని కూడా ప్రతినిత్యం ఎలా జీవించాలో? ఏమి చేయాలో ? అని ప్రేరేపిస్తూ ఉన్నది కావున ఇంకా ఎన్నడు మనము తప్పు చేయకుండా జీవిస్తాం. యిర్మియా ప్రవక్త యొక్క నూతన ఒడంబడిక  దేవుడు ఒక కొత్త జీవితానికి సూచనగా ఉన్నది అలాగే ఈ నూతన ఒడంబడిక యెహెజ్కేలు( 16:26-27)గ్రంథములో ఉన్న నూతన హృదయమును సూచిస్తున్నది దేవుడు మానవులలో ఉన్నటువంటి కఠిన హృదయమును తీసివేసి మాంసపు ముద్ద కలిగిన హృదయాన్ని దయచేస్తానని అంటున్నారు అనగా ప్రతి ఒక్కరికి కొత్త జీవితాన్ని దయచేస్తానంటున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో ఏసుప్రభు ఏ విధంగా తండ్రికి విధేయత చూపించి ఉన్నారో తెలియచేయబడినది. ఆయన తండ్రితో అన్నిటిలో సరిసమానమైనప్పటికీ కూడా ఆయన చిత్తమును ఈ భూలోకములో ఎంత కష్టమైనా నెరవేర్చి ఉన్నారు.
ఈనాటి సువిశేష భాగములో యేసు ప్రభువు మనము జీవించాలి(పవిత్రముగా దేవునితో) అంటే మరణించాలి అని (పాపానికి)  చెబుతున్నారు. కొందరు గ్రీకులు యేసు ప్రభువుని చూడటానికి వచ్చిన సందర్భంలో ఫిలిప్పుతో ఏసుప్రభు ని చూడాలి అని అడిగిన వేళ ఫిలిప్పు అంద్రెయ్యతో వారు ప్రభువుని చూడాలని తెలిపాడు. ప్రభువు దానికి గాను మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది అని తెలిపారు అదేవిధంగా ఏసుప్రభు ఈ విధంగా అంటున్నారు మనిషి కుమారుడు పైకి ఎత్తబడినప్పుడు అందరూ ఆయన వద్దకు ఆకర్షితులవుతారని అన్నారు. ఆయన మరణించక ముందే జ్ఞానానికి ప్రసిద్ధిగాంచినటువంటి గ్రీకు దేశస్తులే ఆయన యొక్క గొప్పతనమును చూడాలని ఏసుప్రభు చెంతకు వస్తున్నారు బహుశా వారు యూదా మతమును అనుచరించుటకు హృదయ పరివర్తనము చెందినటువంటివారై ఉండవచ్చు లేదా ఏసుప్రభు యొక్క గొప్పతనం విని ఆయనను చూడాలని అనుకుని ఉండవచ్చు. ఇది చాలా గొప్పదైన విషయం జ్ఞానులు సైతం దేవుడిని గుర్తించి ఆయన దగ్గరకు రావడం. ఈ యొక్క సందర్భంలో ఏసుప్రభు గోధుమ గింజ భూమిలో పడి నశించనంతవరకు అది అట్లే ఉండును కానీ నశిస్తే దాని నుండి కొత్త జీవము పుట్టును అని తెలిపారు. ఇక్కడ విత్తనము నశించితేనే తప్ప కొత్త జీవితం రావటం లేదు అదే విధంగా విత్తనము తనను తాను త్యాగం చేసుకుని మొక్కకు జన్మనిస్తుంది, ఉప్పు కూడా తనను తాను కరిగిపోతూ ఇతరులకు రుచిని అందజేస్తూ ఉన్నది అలాగే కొవ్వొత్తి కూడా  తాను కరిగిపోతూ ఇతరులకు వెలుగునిస్తుంది. 
వాస్తవానికి మనందరం కూడా నశించాలి. నశించుట అంటే మన యొక్క పాత జీవితానికి, 
- పాపపు జీవితానికి,
- స్వార్థానికి
- కోపానికి
- అసూయలకు
- సుఖ భోగాలకు
- ఈ లోక సంబంధమైన వాంఛలకు
- చెడు వ్యసనాలకు మనము మరణించినట్లయితే అప్పుడే మనలో కొత్త జీవితం కలుగుతుంది.
అదేవిధంగా ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు మన అందరిని కూడా ఆయనకు సాక్షులుగా ఉండమని తెలుపుచున్నారు. తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్యజీవమునుకై కాపాడుకొనును, నన్ను సేవింప గోరువాడు నన్ను వెంబడింపవలెను అని క్రీస్తు ప్రభువు తెలియచేశారు అనగా మన యొక్క జీవితం క్రీస్తు జీవితం వలే త్యాగ పూరితమైన జీవితంలా ఉండాలి.

Fr. Bala Yesu OCD

9, మార్చి 2024, శనివారం

తపస్సుకాలం నాలుగవ ఆదివారం

తపస్సుకాలం నాలుగవ ఆదివారం
2 రాజుల దినచర్య 36:14 -16, 19-23, ఎఫేసి 2:4-10, యోహాను 3:14-21
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని యొక్క దయార్ధ హృదయము గురించి తెలియజేయుచున్నవి. దేవుడు రక్షణను అందరికీ దయచేసి ఉన్నారు, తన యొక్క కుమారుడు యొక్క మరణ, పునరుత్థానము ద్వారా అయితే మన యొక్క రక్షణ నిమిత్తమై ప్రతినిత్యం మనందరం కూడా కృషి చేయాలి. ప్రభువు మనందరికీ కూడా రక్షణ ఉచితముగా ఇచ్చి ఉన్నారు అనే సత్యం తెలుసుకొని మనము కూడా ఆయనకు విశ్వాసపాత్రులుగా జీవించాలి. ఈ తపస్సు కాల నాలుగు ఆదివారాన్ని Gaudate Sunday అని పిలుస్తారు అనగా ఆనందించు ఆదివారము అని అర్థం. ప్రభువు యొక్క పునరుత్థానము దగ్గరలో ఉన్నది కాబట్టి మనందరం సంతోషించాలి.
ఈనాటి మొదటి పఠణంలో దేవుని యొక్క దయ గురించి తెలుపుచున్నారు అదేవిధంగా దేవుని యొక్క సహనం గురించి తెలుపుతున్నారు. రాజుల దినచర్య రెండవ గ్రంథము ఇశ్రాయేలు ప్రజల యొక్క మొదటి రాజు సౌలు రాజు దగ్గర నుండి (1030 B.C), యూదా ప్రజలు బాబిలోనియా (550) బానిసత్వము గురించి తెలుపుచున్నది. మొదటి రాజు దగ్గర నుండి బానిసత్వం వరకు కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా వారికి తోడై దీవించి వారి నడిపించారని తెలుపుచున్నది అదే విధముగా బానిసత్వం అనేది వారి యొక్క పాపము జీవితమునకు శిక్షగా దేవుడు వారికి ఇస్తున్నారు. యూదులు ఇతర ప్రజల నుండి ఆ గౌరవప్రదమైన ఆచారాలు నేర్చుకున్నారు. ఈరోజు విన్న ఈ భాగంలో ఏ విధముగా ఇస్రాయేలు ప్రజలు దేవుని నివాస మైనటువంటి యెరుషలేము దేవాలయమును, సొంత భూమిని కోల్పోయినటువంటి అంశమును చదువుకుంటున్నాము. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవాలయమునకు ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను ఇవ్వలేదు ప్రభువు యొక్క పవిత్ర మందిరమును అమంగళము చేశారు. ఇది వారి యొక్క పాపపు జీవితమునకు, గర్వమునకు నిదర్శనం. దేవుడిని కాదని అన్య దైవముల వెంట వెళుతూ వారు ఈ యొక్క పాపపు క్రియలకు పాల్పడ్డారు. వారు ఎంత పాపం చేసినప్పటికీ దేవుడు మాత్రము వారి యొక్క హృదయ పరివర్తన నిమిత్తమై ప్రవక్త తర్వాత ప్రవక్తలను పంపుచున్నారు ఇది ఆయన యొక్క దయార్ధ హృదయమునకు నిదర్శనముగా ఉంటుంది ఆయన వారు మారాలనుకున్నారు కాబట్టి వారి కొరకు ప్రవక్తను పంపిస్తున్నారు. కొన్ని సందర్భాలలో ప్రజలు హృదయ పరివర్తనం చెందనప్పుడు వారిని శిక్షిస్తున్నారు, చెందినప్పుడు వారిని దీవిస్తున్నారు. ఈ యొక్క శిక్ష సరిదిద్దుటకే కానీ నాశనం చేయటానికి కాదు. ఆయన శిక్షలో ప్రేమ ఉంది ఆయన కోపములో అనురాగం ఉంది ఆయని యొక్క ప్రేమ, కరుణతో కూడుకున్నటువంటి ప్రేమ. ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి పారశీక దేశ రాజు అయిన సైరస్ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విముక్తులను చేస్తున్నారు వారు మరొకసారి సొంత భూమికి వెళ్లి, సొంత దేవాలయమునకు దేవాలయమును తిరిగి నిర్మించుటకు అవకాశము దయ చేస్తున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో కూడా దేవుని యొక్క కృప అపారమైనది అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆయన మన పట్ల చూపిన ప్రేమ అమితమైనది అని తెలుపుతున్నారు. కేవలము దేవుని యొక్క కృప వలన ద్వారానే మనందరం కూడా రక్షించబడుతిమి. మనందరం కూడా క్రీస్తు ప్రభువుతో ఐక్యమై జీవించినట్లయితే దేవుని యొక్క రాజ్యములో, మనము ప్రభువుతో పాటు కూర్చుండ చేస్తారు. పౌలు గారు ఇదంతా కూడా దేవుడు మానవునికి ఉచితంగా ఇచ్చినటువంటి బహుమానం కాబట్టి ఆయన ఇచ్చిన వరమును మనము ఎప్పుడూ కూడా సద్వినియోగపరచుకుని జీవించాలని పలికారు.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు నికోదేముతో సంభాషించిన అంశము గురించి తెలుపుచున్నది. నికోదేము ఒక ధనవంతుడు, పరిసయ్యుడు. ఆయనకు ఏసుప్రభు నందు విశ్వాసము ఉన్నది అందుకు కాబట్టే పరలోక సంబంధమైనటువంటి అంశములను గురించి చర్చించారు. నికోదేము ఏసుప్రభు తో సంభాషించేటప్పుడు ప్రభువు రక్షణము గురించి తెలియజేస్తున్నారు.
మోషే ప్రవక్త ఎడారిలో ఏ విధముగానైతే సర్పము నెత్తి ఉన్నారో ఆ సర్పమును చూసినటువంటి వారందరూ కూడా రక్షించబడితిరి. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4-9 వచనాలలో చదువుకునేది ఏమిటంటే ఇజ్రాయేల్ ప్రజలు మోషే ప్రవక్తకు దేవునికి విరుద్ధముగా మాట్లాడిన సందర్భంలో దేవుడు వారిని పాము కాటు ద్వారా శిక్షిస్తున్నారు. వారిని రక్షించుట నిమిత్తమై మరొకసారి దేవుడు మోషేను కంచు సర్పము చేయమని తెలుపుచున్నారు. ఈ యొక్క కంచు సర్ఫము వైపు ఎవరైతే పశ్చాతాపముతో చూస్తారో వారందరూ కూడా రక్షించబడుతారు అని ప్రభువు తెలుపుతున్నారు, వారు పశ్చాతాపంతో చూసిన విధముగానే రక్షింపబడ్డారు. అదే విధముగా ఏసుప్రభువు కూడా ఎత్తబడిన సందర్భములో మనందరం కూడా ఆయన యొక్క సిలువను చూసి పశ్చాతాపబడినప్పుడు మనము కూడా రక్షించబడతాము. ఆ సిలువ నాథుడు మనందరి యొక్క రక్షణకు కారణం అవుతారు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించారు కాబట్టి ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమవలన బారమైనటువంటి ఆ శిలువను మోసుకుని వెళ్లారు. ఆయన మనలను రక్షించుటకే వచ్చారు కానీ ఖండించుటకు రాలేదు కాబట్టి మనము కూడా ఆ యొక్క సిలువను చూస్తూ హృదయ పరివర్తనం చెందుతూ జీవించాలి. ఏసుప్రభును విశ్వసించేవారు ఖండింపబడరు కానీ ఎవరైతే విశ్వసింపరు వారు ఖండించబడి ఉన్నారు అని తెలుపుతున్నారు. ప్రభువు యొక్క శిలువను చూస్తూ ఆయన విశ్వసిస్తే ఆయన మన మీద చెప్పిన కరుణను ప్రేమను దయను మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క అనుదిన జీవితాల్లో కూడా ఇవి పాటించేలాగా మనం మారాలి అలాగే దేవుడు యొక్క వెలుగును మనందరం కూడా కలిగి ఆ వెలుగును ఇతరులకు పంచాలి.
Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...