20, ఫిబ్రవరి 2021, శనివారం

తపస్సు కాల మొదటి ఆదివారం

  

ఆదికాండము 9: 8-15 , 1 పేతురు 3: 18-22, మార్క్ 1:12-15

ప్రియా దేవుని బిడ్డలారా ,సహోదరి సహోదరులారా , ఈనాడు మనం  తపస్సుకాల మొదటి  ఆదివారాన్ని కొనియాడుతున్నాము.  ఈనాడు  తల్లి  తిరుసభ  మన జీవితములో మార్పు, మరియు  హృదయ పరివర్తన గురించి  ధ్యానించ  ఆహ్వానించుచున్నది. తపస్సు కాలము యొక్క  ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మానవుడు  తన చేదు క్రియలను, ఆలోచనలను , మాటలను  వదలి , మంచి  క్రియలవైపు , మంచి జీవితం, మంచి  ఆలోచనలవైపు మరియు  మంచి మాటలవైపు మరలడం.  అదే పలు  పశ్చాత్తాప, ఉపవాస మరియు  త్యాగ క్రియల ద్వారా తన  నడవడికను క్రీస్తులో నూత్నికరించుట.  ఈనాటి  సువిశేషంలో  క్రీస్తు ప్రభువు  హృదయ పరివర్తనకు ఆహ్వానము పలుకుచున్నాడు. కాలము  సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది. హృదయ పరివర్తన చెంది , సువార్తను విశ్వసింపుడు. (మార్కు :1, 15) అని ఆహ్వానిస్తున్నారు. 

మార్పు : 

మానవజీవితములో  మార్పు  అనేది సహజము.  లోకములో  ప్రతి  వస్తువు, ప్రతి విషయము మారుతు  ఉంటుంది.  మారాలి కూడా. ఎందుకంటే  మార్పులోనే అందము, ఆనందము ఉంటుంది.  అందుకే అంటారు, పాతోక  రోత , క్రొత్త ఒక వింత అని. కనుకనే మానవుడు ప్రతి విషయములోను కూడా  కొత్తదనం కోరుకుంటూ ఉంటాడు.  దైనందిన  జీవితములో కానివండి వ్యాపారములో కానివండి. ,భోజన పదార్థములో కానివ్వండి. ప్రతి  విషయములో కుడా  మార్పుదే విజయము. లోకములో అన్నింటిలోనూ మార్పు , క్రొత్తదనం  కోరుకుంటాడు మానవుడు . దానికి తగినట్లే  క్రొత్త క్రొత్త  విషయములను కనిపెడుతూ ఉంటాడు. ఈ మార్పు  అనే  సూత్రంతోనే  అన్నింటిలోనూ అభివృద్ధి  చెందుతూ ఉన్నాడు. 

 

ఈనాడు  టెక్నాలజీ  పెరిగింది , రక్త  సంభందాలు తగ్గినవి .  ఆస్తు పాస్తులు  పెరిగాయి , బంధుప్రీతి తగ్గినది. వస్తు వినియోగమపెరిగినది. మనిషి విలువ తగ్గినది, క్షణభంగురమైన , అశ్వాశత విషయములపై  ఆసక్తి పెరిగినది, శాశ్వత విషయములగు దేవుడు , ఆత్మ , ఆనందము, సంతోషం, ప్రేమ సహవాసము అను విషయములపై శ్రద్ద తగ్గినది.

ప్రియా దేవుని బిడ్డలారా మనం ఒకసారి  ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఎక్కువ  దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాము, లోకములో ఉన్న వాస్తువులకా లేక జీవిత మార్పుకా . 

ప్రేమ - హృదయ పరివర్తన 

నోవా కాలంలో మానవుడు ఘోరమైన  పాపంలో  జీవిస్తున్న సమయములో దేవుడు  కోపించి  మానవుని నాశనం  చేయాలనీ జలప్రళయమును పంపించాడు.  చివరకు నోవా కుటుంబ సభ్యులు  మాత్రమే  రక్షించబడ్డారు, ఈ యొక్క  పతనాన్ని  చూచి దేవుడు మనసు మార్చుకొని నోవాతో ఒడంబడిక  చేసుకుంటున్నాడు.  అది ఏమిటంటే  ఇక ఎన్నడూ ఇటువంటి ముప్పును పంపనని ఆది ఖాండము 9:11 . అలాంటి గొప్ప దేవుడు  మానసు మార్చుకొని  తన ఏకైక  కుమారుణ్ణి మన రక్షణార్థమై పంపియున్నాడు యోహాను3:16. మరి మనము ఎందుకు  హృదయ పరివర్తన చెందలేకున్నాము. 

చివరిగా ఈ తపస్సు కాలములో తరచుగా వినపడే మాటే ఇది .. హృదయ పరివర్తనలే కుండా  మనిషికి పర లోక రాజ్యములో తావులేదు. చక్కని గులాబీ పువ్వు చుట్టూ బోలెడన్ని ముల్లుంటాయి. గులాబీ కోయాలంటే మన చేయి ముల్లులలను ధాటి వెళ్ళాలి. అదే విధముగా పరలోకరాజ్యములో శశ్వతానందం పొందాలంటే  హృదయ పరివర్తన తప్పనిసరి. 

కాబట్టి  ఈ తపస్సు కాలము మొత్తము కూడా దేవుని వాక్యాన్ని  ఆలకిస్తూ , పాటిస్తూ ,మన జీవితలను చిగురింప  చేయమని ప్రార్థనచేద్దాం '. 

 

బ్రదర్ అబ్బదాసరి రత్నరాజు ఓ  సి డి 

 

13, ఫిబ్రవరి 2021, శనివారం

6 వ సామాన్య ఆదివారము

 6 వ సామాన్య ఆదివారము

క్రీస్తు నాథుని యందు ప్రియమైన స్నేహితులారా!

దేవుడు మానవులకు ఒసగు వరములలో ముఖ్యమైనది దయ; ఈ దయనే కనికరము, 

జాలి, కరుణ అని అంటుంటాము. ‘వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు 

అక్కరలేదని యేసు ప్రభువు (మత్తయి 9:12) వ వచనములో చెప్పిన మాటలు ఈనాడు 

మనకు గుర్తుకువస్తుంటాయి. మనము ఈరోజు మూడు పఠణాలను చదివినపుడు మనకు 

దేవుడు ఇచ్చు సందేశము ఏమిటి అంటే, శారీరక, మానసిక వ్యాధులతో బాధపడు వారిని 

దేవుడు దయచేత స్వస్థపరుస్తున్నాడని అని అర్థం అవుతుంది. ఈనాటి మొదటి 

పఠనము కుష్ఠ రోగము పొందిన వ్యక్తి యొక్క జీవిత విధానాన్ని చాల క్లుప్తముగా 

వివరిస్తుంది.

 

పాత నిబంధనలో కుష్ఠరోగము ఉన్న వారి పరిస్థితి చాలా ఘోరముగా ఉంటుంది. వారిని 

అశుద్దులుగా పరిగణించేవారు. ఈనాటి మొదటి పఠనములో (లేవి 13 :45) వారికి 

ఉన్ననియమాలు, చిరిగిన బట్టలు, తల విరబోసుకోవాలి. అతడు లేక ఆమె ప్రజల 

మధ్యలోకి రావాలంటే, నేను అశుద్ధుడను, అశుద్ధురాలిని అని కేకలు పెట్టాలి. వారు ఊరి 

బయట జీవించాలి, అటువంటి నియమాలను గూర్చి తెలియజేస్తుంది. రెండవ 

పఠనములో పునీత పౌలు గారు, మీరు ఏమి చేసినను దేవుని మహిమ కొరకై 

చేయవలయునని, ఎవరినీ భాధ పెట్టకుండ, నిస్వార్ధముతో, అందరిని సంతోషచిత్తులను 

చేయ ప్రయత్నిచండి, అని చెబుతూ నేను ఏ విధముగానైతే క్రీస్తును అనుసరించానో 

మీరును నన్ను అనుసరించండి అని నేర్పుతున్నారు.

సువిశేష పఠనములో కుష్టు రోగి ఎంతో వినయముతో చేసిన తగ్గింపు ప్రార్ధన దేవుడు 

ఆలకించి, అయన మీద  జాలి, దయ, కనికరము, ప్రేమ చేత అతనిని తాకి స్వస్థ 

పరిచారు. మార్కు 1: 45 లో చూసినట్లయితే కుష్టు రోగి తాను పొందిన స్వస్థత 

అనుభవాన్నిఎక్కువగా ప్రచారము చేయసాగెను. నలుదెసల నుండి జనులను దేవుని 

యొద్దకునడిపించగలిగాడు.

 

కాబట్టి ప్రియా స్నేహితులారా! మనలో చాలామంది, అనేక రకములైన కుష్టు రోగములతో 

బాధపడుతున్నాము. కుళ్ళు, కుతంత్రాలతో మనము కూడా కుష్టు రోగులుగా 

మారిపోతున్నాము. అదే విధముగా కుల, మాత, ప్రాంతీయ, వర్గములుగ విడిపోయి, ఒకరి 

పట్ల ఒకరు ఈర్ష్య, అసూయ, గర్వము, అహంకారములతో కుష్టు రోగులుగా దేవునికి 

దూరముగా, సంఘానికి దూరముగా, కుటుంబానికి దూరముగా జీవిస్తున్నాము. ఎప్పుడైతే 

మనము మన స్థాయిని గమనించి పశ్చాత్తాపపడి, దేవుని యొద్దనుండి, స్వస్థత అడిగితే 

దేవుడు మనలను తాకి స్వస్థపరుస్తాడు. అప్పుడు మన హృదయాంతరంగాలు 

శుద్ధమై పునీత పౌలు గారివలె క్రీస్తును అనుసరించగలము, ఎంతోమందిని దేవుని 

యొద్దకు నడిపించగలము. కాబట్టి దేవుడు మనలను తాకి శారీరకంగాను, మానసికంగానూ 

స్వస్థపరచాలని వినయముతో ప్రార్ధించి దేవుని దయను పొందుదాము. ఆమెన్ 

                By  Br. Suresh kolakaluru OCD 

 


పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...