13, ఆగస్టు 2021, శుక్రవారం

దైవభక్తుడైన యోసేపు

దైవభక్తుడైన యోసేపు

        యాకోబునకు  పండ్రెoడుగురు కొడుకులు కలరు. వారిలో యోసేపు చిన్నకుమారుడు. ఇతని తల్లి పేరు రాహేలు. తన తండ్రి స్థిరపడిన కనాను దేశమునందు యాకోబు నివసించెను. యోసేపు పనేడుసంవత్సరములు ప్రాయము కలవాడు. అతడింకను చిన్నవాడే. సోదరులతో కలిసి తండ్రి మందలను మేపెడివాడు.అతడు సోదరులు చేసిన చెడ్డ పనులు తండ్రికి చెప్పెను. ముదిమిన పుట్టిన బిడ్డడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతర కుమారులకంటే ఎక్కువగా ప్రేమించెను.అతనికి పొడుగు చేతుల నిలువుటంగీని కుట్టించెను.తమకంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడరైరి. 

యోసేపు కలలు కనేవాడు. అతనికి చిన్ననాడే రెండు కలలు వచ్చాయి.మొదటికలఇది: అతడి సోదరులు పొలములో పైరుకోసి కట్టలు కట్టారు.కానీ సోదరులకట్టలు నిలువుగా నిలబడి  వున్న అతనికట్టకు దండంపెట్టెను. అతడు సోదరుల మీద అధికారము నేర్పుతాడని ఈ కల భావము. రెండవకల ఇది: సూర్య చంద్రులు పదకొండు నక్షత్రాలు అతనికి నమస్కారం చేశాయి.సోదరులు తల్లి దండ్రులు యోసేపుకి దండం పెడతాయని ఈ కల యొక్క అర్ధము.ఈ కలలను విని తోబుట్టువులు యోసేపుపై మండిపడ్డారు.అతన్ని ఇంకా ద్వేషింపసాగారు.తండ్రి యోసేపుతో, నీసోదరులు షెకెములో మందలను మేపుచున్నారు.రమ్ము నిన్ను కుడా వారిదగ్గరకు పంపెదను అని అనెను .యోసేపు నేను సిద్ధముగావున్నాను అనెను.యోసేపు సోదరులు పట్టినబాటనే పోయి వారిని దోతానులో చూసేను.వారు ధారిణ ఉండగానే, అతనిని చూచిరి. 

అతడు దగ్గరకు రాకముందే అతనిని చంపవలెనని అన్నలు కుట్ర పన్నిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదనెను.మనకీ రక్తపాతమేల? యోసేపును ఈ అడవిమండలి గోతిలో త్రోయుడు. అతనికి ప్రాణహాని చేయకుడు, అని వారితో చెప్పెను.యోసేపు సోదరుల దగ్గరకు వచ్చెను.వారు అతను ధరించిన పొడవుచేతుల నిలువుటంగీని తీసివేసి గోతిలో పడవేసెను.అప్పుడు యూదా అప్పుడు తన సోదరులతో యోసేపునుచంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును ? రండు, అతనిని ఇష్మాలీయులకు అమ్మివేయుదము అని అతనిని ఇరువది నాణ్యములకు అమ్మిరి.ఇష్మాయేలీయులు యోసేపుకి సంకెళ్లు వేసి ఆతనిని బానిసగా ఈజిప్తుకు కొనిపోయి ఫోతీఫరునకు అమ్మిరి.ఫోతీఫరు ఫరోరాజుకాడ వున్న ఉద్యోగి. రాజా సంరక్షకులకు నాయకుడు. 

యోసేపు ఐగుప్తుదేశీయుడగు యజమాని ఇంటిలో ఉండెను.దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను.కావుననే అతడు అంచెలంచెలుగాదీవించబడెను.అతడు చక్కనిముర్తిగలవాడు, అందగాడు. కనుక యజమాని భార్య అతనిమీద కన్ను వేసెను. తనతో శయింపమనిరమ్మని కోరెను. కానీ యోసేపు దానికి అంగీకరింపలేదు.ఒకనాడు, అతడు ఎప్పటి మాదిరిగా యజమానుని ఇంటిలోపలికి వెళ్లెను.ఇంటిబలగములోనివారు ఒక్కడైననూ అప్పుడు అక్కడ లేడు. యజమానుని భార్య అతనిపైబట్ట పట్టుకొని, శయనింపరమ్మని కోరెను.అతడు ఆ పైబట్ట ఆమె చేతులలో వదలివేసి, ఇంటినుండి బయటకు పారిపోయెను.తన చేతికి చిక్కిన యోసేపు పై బట్టను భర్తకు చూపించి అతడునన్ను మానభంగముచేయదలచి తన గదిలోనికి వచ్చాడని తన భర్తకు పిర్యాదు చేసింది.ఆ మాటలు విని యజమానుడు మండిపడెను.

ఇదివినిన  యజమానుడుమండిపడి యోసేపును చెరసాలలో బంధించెను. అయిననూ దేవుడు యోసేపుకి తోడుగా ఉండెను.ఒక రోజు ఆచెరలోనికి ఇద్దరు కొత్త   ఖైదీలు వచ్చారు. వారు ఫరోరాజు వంటవాడు, పానీయవాహకుడు.ఏదో నేరంపై ఆ ఇద్దరిమీద  రాజు కోపపడెను. వారు యోసేపు చెరసాలలో త్రోయబడ్డారు.ఒక రోజు ఆ ఇద్దరికి  వేరువేరు కలలు వచ్చాయి.యోసేపు స్వప్న వ్యాఖ్యానమునందు నిపుణుడు.అతడు ఆ ఇద్దరి కలలకు అర్ధం చెప్పాడు.పానీయవాహకుడికి మూడురోజులతరువాత ఫరోరాజు అతనిని విడుదలచేయించి,మరలా తనపనిని తనకు అప్పగిస్తాడని,వంటవానికి మూడు రోజులతరువాత ఫరో రాజు అతనిని ఉరి తీయిస్తాడని వివరించాడు.అది జరిగిన తరువాత, యోసేపు పానీయవాహకునితో నీవు నాకొక ఉపకారం చేసిపెట్టాలి,ఇక్కడ అన్యాయముగా నేను ఈ చెరలో త్రోయించబడ్డాను.నీవు ఫరోనుకలుసుకొనినప్పుడు,ఆ రాజుకి నాసంగతి తెలియజేసి,ఆయన నాపై దయపుట్టేలా చూడు అని చెప్పాడు.కానీ ఆ చెరనుండి విడుదల పొందిన పానీయవాహకుడు యోసేపును పూర్తిగా  మర్చిపోయాడు.   ఫరో ప్రభువు రెండు కలలుకనెను . 

తెల్లవారిన తరువాత  అతనికి మనస్సు కలవరపడెను .ఫరోరాజు ఉన్న ఆ  దేశములో  వున్న జ్ఞనులను  పిలిపించి ,వారికి తన కలలుగూర్చి చెప్పెను .కానీ వారిలో స్వప్న ఫలములను వివరించు వాళ్ళు ఒక్కరు లేరాయెను. అంతట పానీయవాహకుడు తన యేలికతో ఈ నాటికి నేను చేసిన తప్పులు నాకు తెలిసి వచ్చినవి .ఒకసారి ఏలినవారు దాసులమీద కోప పడితిరి .అప్పుడు నన్నును వంటవానిని అంగ రక్షకుని,  నాయకుని ఆదీనమునందుంచి చెరసాలలోఉంచిరి .ఒక రాత్రి మేమిరువురము కలలు గంటిమి .అవి వేరువేరు భావములు కలవి . చెరసాలలో మాతో పాటు ఒక హెబీయ పడుచువాడు ఉండెను.  అతడు   అంగరక్షానాయకుని  సేవకుడు. మేమతనికి మా కలలు చెప్పుకొంటిమి .అతడు చెప్పునట్టే  మా కలలు    నిజములైనవి . నాకు కొలువు దొరికినది వంటవానిని ఉరితీసిరి. 

అంతటా ఫరో రాజు యోసేపును పిలువనంపెను .సేవకులు అతనిని శీఘ్రముగా కొనివచ్చారు అప్పుడు, ఫరో రాజు యోసేపుతో  తన కలలు చెప్పెను .దానికి యోసేపు దేవరువారు కన్నా కలలు రెండును ఒక్కటే దేవుడు తాను చేయబోవుపనిని ఏలినవారికి  తెలియజేసెను. ఈజిప్తులో మొదటి ఏడేండ్లు పంటలు బాగాపండుతాయి. ధాన్యం సమృద్ధిగా లభిస్తుంది కానీ తరువాత ఏడేండ్లు దారుణమైన  కరువు వస్తుంది.  ప్రజలు తిండి లేక మలమల మాడి   చస్తారు.అందుచేత రాజు ముందుగానే వివేకము ఉపాయముగల అధికారిని నియమించారు. ఆ ఉద్యోగి పంటలు బాగా పండిన ఏడేండ్ల కాలం లో ధాన్యాన్ని ప్రోగుచేసి ఆయానగరాలో నిలువచేయాలి .కరువు కాలం లో ఆగింజలను  ప్రజలకు పంచిపెట్టాలి అలా చేస్తే దేశం కరువుకు బలికాకుండా ఉన్నటుంది అని యోసేపు దైవ జ్ఞానంతో రాజు కలలను వివరించెను. ఫరో అతనిని మించిన వివేకి ఉపాయశీలి లేడని ఎంచి కరువుకాలానికి ధాన్యాన్ని నిలువచేసే అధికారాన్ని యోసేపుకి అప్పచెప్పాడు. అతనిని దేశంలో రాజు తరువాత రెండో అధికారిని చేసాడు. 

       కానానులోకూడా కరువు వచ్చుటచే ఇతరులతోపాటు ఇశ్రాయేలుకుమారులు కూడా ధాన్యాన్ని కొనుటకై ఐగుప్తు దేశం వచ్చారు యోసేపు ఐగుప్తుదేశములో సర్వాధికారి కదా దేశప్రజలకు ధాన్యమును అమ్మేడివాడు అతడే .యోసేపుసోదరులువచ్చి అతనికి సాష్ట్గాoగ ప్రణామములు చేసిరి. అతడు  సోదరులను చూసి గుర్తుపట్టెను.  కానీ వారు అతనిని గుర్తుపట్టలేదు. యోసేపు నటించి పౌరుషంగా మాట్లాడాడు. అతనికి వారిని గూర్చికన్న కలలను కూడా జ్ఞప్తికి తెచుకొనెను. అతడు వారితో మీరు గూఢచారులు మా దుర్గములు లోటుపాటులు తెలిసికొనుటకు వచ్చితిరి అని అనెను .వారిని మూడు నాళ్లు పాటు చెరలో త్రోయి oచాడు.వాళ్ళు లబోదిబో మొత్తుకొని తమ కుటుంబ  పరిస్థితులను తమ్ముని  ముందు ఎరుకపరిచారు. తమ ముసలి తండ్రి  యాకోబునీ గూర్చి తమ్ముడు   బెన్యామీనును  గూర్చివివరించారు .యోసేపు మీరు చెప్పేది నిజమైతే మీ  తమ్ముడు  బెంజమీనును ఇచటికి తీసుకుని రండి. అప్పటి దాకా మీలోఒక్కడు చేరలోఉండాలి  అన్నాడు. షియోనుని బంధించి కారాగారంలో ఉంచి మిగిలిన సోదరులను ధాన్యాన్నితీసికొని వెళ్ళమన్నాడు. దానితో అన్నలకు పశ్చాత్తపం కలిగింది. వాళ్ళు పూర్వం తాము యోసేపుకి చేసిన ద్రోహానికి చింతించారు. సోదరులు ఆ చింతనతో ధాన్యాన్ని యింటికి తీసికొని వెళ్లారు. సోదరులుమొదటి సారి తెచ్చ్చుకొన్న ధన్నము ఐపోఇంది. వాళ్ళు రెండొవసారి ధాన్యానికి వచ్చారు .యాకోబు చాలా అనిష్టం గానే  బెన్యామీనును  వాళ్ళు వెంట పంపాడు.  బెన్యామీనును  తన సొంత తల్లి కి పుట్టిన వాడు కనుక యోసేపుకి సొంత తమ్ముడు . ఇతడు పుట్టగానే తల్లి చనిపోయింది. ఇతడు యోసేపు  ఇల్లు  వీడివచ్చిన తర్వాత  పుట్టాడు . కనుక అతను తమ్ముడిని చూడ్డం ఇదే మొదటిసారి అతన్ని చూడగానే యోసేపుకి కన్నుల్లో నీళ్లు గిర్రున  తిరిగాయి .వెలుపలికి వెళ్లి  వెక్కివెక్కి ఏడ్చాడు. .యోసేపు అన్నలకు ఇంకా ఎక్కువ పశ్చాత్తపం పుట్టింప గోరాడు. అతడు తానుపానీయం సేవించే గిన్నెను  బెన్యామీను  గోతంలో పెట్టించాడు. .సోదరులు ధాన్యాము తీసికొని నగరం వీడి పొలిమేర వరకు వెళ్ళాక, వారి గోతాలు సోదాచేయంచాడు.  

బెన్యామీనుపై నేరం మోపి, అందరిని తిరిగి తన చెంతకు రప్పించాడు. ఈ కారణంగా సోదరులు ఇరకాటంలో పడి,  బిక్కముఖం  వేసి కొని నిలబడ్డారు.యూదా తన చిన్న తమ్మునికి తాను పూటపడతానని అతనికి బదులుగా తాను చెరలో ఉంటానని, తమ్ముడిని తండ్రి వద్దకి పంపివేయమని విన్నవించుకున్నాడు .యోసేపు దు;ఖం ఆపుకోలేకపొయాడు. అతను సేవకులందరిని ఆవలకు పంపివేసి సోదరులకు తన్నుతాను తెలియజేసికొన్నాడు.  ఎప్పుడో గతించాడనుకొన్న సోదరులు  తమ్ముణ్ణి  చూచి, దిగ్రాంతి  చెందారు .యోసేపు దైవలీలలను వారికి వివరించాడు .మీరు నన్ను బానిసగా అమ్మివేసి నందుకు చింతించకండి. మీ ప్రాణాలను, ఐగుప్తు ప్రజల ప్రాణాలను నిలబెట్టడానికి  మీకు ముందుగా   దేవుడే  నన్నిక్కడికి  పంపాడు. నన్ను ఈ ఐగుప్తుకి ప్రధానమంత్రిని చేసింది భగవంతుడే అని చెప్పాడు.  అతడు తన తండ్రిని కుటుంబ సమేతంగా ఈ ఐగుప్తుకి రప్పించి,సారవంతమైన గోషెను మండలంలో వారికి నివాసం కప్పించాడు. ఆ కుటుంబం వాళ్ళు మొత్తం  డెభైమంది. యోసేపు యొక్క ఇద్దరు కొడుకులు  ఎఫ్రాయిము, మనస్సే లను యాకోబు దత్తతు తీసికొన్నాడు. ఈ ఇద్దరు కుమారులతో కలసి ఇశ్రాయేలు గోత్రాలు పండ్రెడుఅయ్యాయి. తర్వాత యూదులు, లేవి, యోసేపులను గోత్ర కర్తలు గా లెక్కలోకి తీసికోలేదు. యాకోబు చనిపోయాక, సోదరులకు బెదరు పుట్టింది. కనుక వాళ్ళు ఓ కథ అల్లుకొని వచ్చారు. 

తన తండ్రి యోసేపుకు వర్తమానం తెలియజేయమన్నాడు అని సోదరులు తన తమ్ముడు తో ఇలాపలికారు. తెలిసో తెలియకో నీ సోదరులు నీకు కీడు చేసారు. నీవు వాళ్లను క్షమించు వదలియేయి. ఈ మాటలు విని యోసేపు మనస్సు నొచ్చుకొన్నాడు.  

అతడు వారితో మీరు నాకు కీడు తల పెట్టారు. కానీ దేవుడు ఆకీడును మేలుగా మార్చాడు. నన్ను మీకంటే ముందుగా ఎక్కడికిపంపి ఈ కరువు కాలంలో నేను మీ ప్రాణాలను, ఇంకా చాలామంది  ప్రాణాలనునిలబెట్టేలా చేసాడు. కనుక జరిగిన దానికి మీరేమీ బాధపడకండి. నేను మిమ్ముమీ బిడ్డలను తప్పక కాపాడతాను అన్నాడు. యోసేపు  ఈ ఐగుప్తులో నూటపది సంవస్సరాలు  జీవించాడు . అది నీతిమంతుల ఆయుస్సు. అతడు చనిపోకముందు సోదరులను ఒక కోరిక కోరాడు. దేవుడు మిమ్ము ఈ దేశం నుండి  మరలా కనాను మండలానికి తీసికొనిపోతాడు. అప్పుడు  నా అస్థికలను   మీవెంట కొనిపోండి అని చెప్పాడు. అతడు చెప్పెన విధంగా మోషే కాలంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలిపోయెనపుడు.   పుణ్యపురుషుని, అస్థికలను గూడా తమవెంట తీసికొనిపోయారు.

-Br. Simon



9, ఆగస్టు 2021, సోమవారం

సంసోను యొక్క జీవిత కథ

సంసోను యొక్క జీవిత కథ

ఇశ్రాయేలీయులును దేవుడు తన సొంత ప్రజలుగా ఎన్నుకొని అయన చేసిన వాగ్దానాలను నెరవేరుస్తూ వారిని కంటికి రెప్పవలె కాపాడుతున్నాడు, కానీ వారు మాత్రం దేవునికి వ్యతిరేకంగా దుష్క్యార్యములను చేస్తున్నారు. ఆ సమయంలో ఇశ్రాయేలీయులను యావే దేవుడు నలువది యేండ్ల పాటు వారిని ఫిలిస్తీయుల వశము చేసెను. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఘోరమైన బానిసత్వ జీవితం జీవిస్తున్నారు అనేకమైన కష్టాలు, బాధలు పడుచున్నారు. ఆవిధంగా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే వారు దేవునికి ఇష్టమైన వారు. కనుక వారందరిని రక్షించటానికి, కాపాడటానికి ఒక నాయకుడు కావలయును వారినందరిని ఎదురించటానికి ఒక వీరుడు కావాలి, కనుక దేవుడు ఒక గొప్ప వ్యక్తిని ఎన్నుకున్నాడు. అతడే సంసోను. సంసోను పుట్టుక అలాంటిది ఇలాంటిది కాదు. 
మనం బైబిల్ గ్రంధం చూసినట్లయితే ముగ్గురు వ్యక్తుల యొక్క పుట్టుక గురించి దేవదూత పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి శుభవార్తను తీసుకొని వచ్చింది, అందులో మొదటి వ్యక్తి సంసోను. సంసోను జన్మించినప్పటినుంచి దైవానుగ్రహం కలవాడు. అతడు జన్మించినప్పటినుండి మరణించినవరకు వ్రత తాత్పరుడై జీవించెను. ఆ వ్రతము నజరేయ వ్రతము, ఈ వ్రతము చేపట్టడం అంత సాధారణమైనది కాదు. ఎందుకంటే ఆ వ్రతం చేపట్టు వారు ద్రాక్షరసం గాని, తల జుట్టు కత్తరించకూడదు. ఎవరైతే ఈ వ్రతాన్ని చేపడతారో వారు దేవుని శక్తి పొందిఉంటారు. అయితే ఈ వ్రతాన్ని చేపడుతున్న సంసోనుకు దేవుని ఆత్మ, శక్తి కలిగి ఉన్నాడు.
ఒకానొకరోజున సంసోను తిమ్నాతుకు చేరెను ఆ నగరచివరిలో ఒకద్రాక్షతోటను చేరగానే అక్కడ ఒక కొదమసింహం గర్జించుచు అతని మీదికి దూకెను. ఆసమయంలో సింహం మీదపడి మేకపిల్లను చీల్చినట్లు చీల్చివేసెను. ఈసన్నివేశం సంసోనుయొక్క ధైర్యాన్ని, వీరత్వాన్ని మనకు తెలియజేస్తుంది తరువాత సింహండొక్కనుండి చేసిన పట్టు తేనే త్రాగి  మిగిలినది సంసోను తల్లిదండ్రులకు ఇచ్చెను.
సంసోను వివాహం చేసుకోబోయే యువతిని చూసిన తరవాత వారికీ విందు చేసెను. అక్కడ పెండ్లికుమార్తె వైపువారు సంసోనుయొక్కశరీర దారుఢ్యాన్ని, కండలుతిరిగినబలాన్ని, అతని ఎత్తునుచూసి, భయపడి వారికీ తోడుగా ముప్పదిమంది మనుషులను తెచ్చుకొనెను. సంసోనుకు శరీరబలమేకాకా తనకు జ్ఞానంకూడా ఎంతోమిక్కుటంగాఉన్నది, అతని వివాహానికివచ్చిన ముప్పదిమందిలో తనయొక్కజ్ఞానముతో మిమ్మొక పొడుపుకత అడిగెదను పెండ్లిపండుగ ఏడురోజులు ముగియకమునుపే కథ విప్పెదరే మీకు ముప్పది కప్పడములు, ముప్పదికట్టుబట్టలు బహుమానంగాఇచ్చెదను. విప్పలేకుంటే మీరు ఏదైనా బహుమానం నాకు ఇవ్వండి. ఇది పందెం అని వారికీ సవాలు విసిరెను. సంసోను తినెడు దానినుండి తినబడునది వచ్చే బలమైనదాని నుండి తీయనిది వచ్చే అని వారికీ పొడుపు కథ వేసెను. వారికీ మూడురోజులు గడిచినగాని శతవిధాలుగా ప్రయత్నించినా ఎలాంటి సమాధానం దొరకలేదు. చివరికి అతని భార్యపోరు పడలేక పొడుపుకథ విప్పిచెప్పెను. సమాధానంచెప్పిన వారికీ బహుమానంఇచ్చి మిగతావారందరిని కోపంతో చంపివేసెను.
కొంతకాలం తరవాత తన భార్యను చూడటానికి వెళ్ళినప్పుడు ఆమె తండ్రి సంసోనుకి అడ్డువచ్చి నీకు ఆమెమీద అయిష్టము కలిగిందనుకొని స్నేహితునకుఇచ్చి పెండ్లిచేశాను అని చెప్పగా ఆవేశంతో వారిపంటలను, ద్రాక్ష, తోటలను, ఓలీవు తోటలను గుంటనక్కలచేత త్రొక్కించి వాటికి నిప్పంటించి కాల్చివేసెను. దీనంతటికి సంసోనే, కారకుడని  తెలుసుకొని తిమ్నాతు పౌరుని కుమార్తెను పెండ్లాడుననుకొని వారందరిని నిలువునా కాల్చి చంపిరి. సంసోను ఇది అంత  విని మీరింత పాడు పని చేసిరి అని ఫిలిస్తీయుల మీదపడి చిక్కిన వారిని చికినట్లుగా చీల్చి చండాడి చంపివేసెను. ఇది అంతయు కూడా దేవుని అనుగ్రహం వలన జరుగుతున్నది. ఫిలిస్తీయులు యూదా మీదికి దండెత్తి వచ్చి లేహి  నగరమును ముట్టడించిరని చూసిన యూదియులు సంసోనును ఫిలిస్తీయులకు అప్పగించి ఆ వీరునకు యూదియులు రెండు క్రొత్త తాళ్లతో బందించి కొండా గుహ నుండి వెలుపలకు  తీసుకోని వచ్చారు. సంసోను ఫిలిస్తీయులను చూడగానే యావే ఆత్మ సంసోనును ఆవేశింపగా అతని బంధములనియునిపండుకొనిన నారా త్రాళ్లు  ఆవిధంగా అవుతాయో ఆవిధంగా త్రాళ్లు అన్ని ఆయను. 
ఆ త్రాటి కత్తులన్నియు కూడా ఒక్కసారిగా సడలిపోయెను. అదే స్థలములో ఒక పచ్చి పచ్చిగా నున్న గాడిద దౌడ ఎముక ఒకటి సముసోను కంట పడెను. అతడు ఆ ఎముకను అందుకొని ఒక వీరుడు, సైనికుడు ఏవిధంగానైతే తన ప్రజల కోసం పోరాడుతారో అదేవిధంగా సంసోను కూడా ఫిలిస్తీయులతో పోరాడి ఒక్కొక్కరిని గాడిదలను కొట్టినట్టు కొట్టి, ఒక వీరుడివలె వేయి మందిని చంపెను. చేతిలోని దౌడ ఎముకను పారవేసిన స్థలమును రామతులేహి అని పేరు వచ్చెను, మహా విజయం సంసోను దప్పికగొనినపుడు దేవునికి ప్రార్థన చేయగా నెల బ్రద్దలై గోయి ఏర్పడి దాని నుండి నీరు వచ్చెను. ఆ నీరు త్రాగి సంసోను సేద తీర్చుకొనెను కనుక ఆ ఊటకు అన్హాకోరే అనే పేరు వచ్చెను.
కొన్ని రోజుల తరవాత సంసోను గాజాకు వెళ్లి అక్కడ ఒక వేశ్య ఇంటికి వెళ్ళినపుడు సంసోను వచ్చినన్ని విని ఆ ఊరి జనులందరు ప్రోగై నగర ద్వారమున కాపలా ఉండగా సంసోనును చంపవచ్చుగా అనుకోని రాత్రంతయు ఊరకుండిరి. సంసోను నది రాత్రి వరకు అలంటి సద్దా చేయక నిద్రపోయాను. కానీ అతడు అర్ద రాత్రి లేచి నగర ద్వారము తలుపులను, ద్వారా బంధాలను, అడ్డుకర్రలతో సహా ఊడబెరికి చకశక్యంగా అంతో బలమైన ద్వారములనియు భుజాలపైన వేసుకొని హెబ్రోను ఎదురుగ ఉన్న కొండా పైకి ఎక్కి వాటన్నిటిని అక్కడే వదలిపెట్టెను. 
ఆ తరవాత సారెకు లోయలో నివసించే డెలీలా కు వచ్చి పచ్చిగా ఉన్న అల్లే త్రాడులను ఏడింటిని ఇచ్చి ఆమె చేత సంసోను బందీ చేసెను.  సంసోను మాత్రం ఆ త్రాళను అన్నిటిని నిప్పంటించిన నారా తరాల వాలే సునాయాసంగా తెంచివేసెను. ఆ తర్వాత ఎవరు వాడని కొత్త తాళ్లతో సంసోను బంధించిరి. కానీ సంసోను తన చేస్తి కట్టులన్నియు దారములవలె త్రెంచి వేసెను మరల మరొకసారి సంసోను నిద్ర పోయిన సమయంలో అతని తలా జాడలను ఏడూ పడుగులకు వేసి మీకునకు బిగగొట్టి బంధించిరి అతడు నిద్ర లేచి తల వెంట్రుకలను వానిని కట్టిన మేకులను తన బలంతో ఒక్క ఊపున ఊడబీకేను. ఆవిధంగా తన వీరత్వాన్ని, బలాన్ని ఫిలిస్తీయుల ఎదుట నిరూపించుకొనెను.  
చివరకు ఫిలిస్తీయులు సంసోను యిత్తడి గొలుసుతో బంధించి సంకెళ్లు వేసిరి. అక్కడ సంసోను అందరి ఎదుట వీర కార్యాలు చేసెను. ఆ మందిరములో ఫిలిస్తీయ దొరలూ మరియు మూడువేలమంది స్త్రీ పురుషులు పై అంతస్తున కూర్చుండి సంసోను చేయు వీర కార్యాలను చుస్తునారు.ఆ సమయంలో ఫిలిస్తీయులపై ఒక్క దెబ్బతో పాగా తీర్చుకోవటానికికి అతడు మందిరమును మోయు మూలా స్తంభాలను రెండింటి మీద చేతులు మోపి, కుడి చేతితో ఒక దాని మీద, ఎడమ చేతిని ఇంకో దాని మీద మోపి రెండు కంబములపై తన బలము చూపెను.
సంసోను ముందుకు వంగి స్తంభములను శక్తి కొలది నెట్టెను, ఆ నెట్టుకు మందిరము పెళ్లున కూలి, సర్దారుల మీద, ప్రేక్షకుల మీద  పడెను, సంసోను తాను బ్రతికి ఉండగా చంపినా వారి కంటే చనిపోవుచు చంపిన వారే ఎక్కువ. ఆ తర్వాత సంసోను, సోదరులు, బంధువులు వచ్చి మృత దేహాన్ని జోరా, ఏస్తవోలు నగరము మధ్యనున్న మనోవా సమాధిలోనే అతనిని కూడా పాతిపెట్టిరి.
ఈ విధంగా సంసోను ఫిలిస్తీయుల ఎదుట అనేక వీర కార్యాలు ప్రదర్చించి ఇశ్రాయేలు ప్రజలకు ఇరవై యేండ్ల పాటు న్యాయాధిపతిగా ఉండెను. సంసోను బ్రతికినంత కాలం ఫిలిస్తీయులకు హడలెతించెను..
-బ్రదర్. సాలి. రాజు . ఓ.సి.డి.

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...