11, సెప్టెంబర్ 2021, శనివారం

24 వ సామాన్య ఆదివారము

యెయా గ్రంధము 50: 5 -9

యాకోబు 2: 14 - 28

మార్క్ 8: 27 - 35

క్రీస్తునాధుని యందు ప్రియమైన సహోదరి సహోదయులారా ఈనాడు మనమందరం కూడా 24 సామాన్య ఆదివారంలోనికి ప్రవేచించియున్నాము. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలను మనం ధ్యానించినట్లైతే ఇవి ముఖ్యముగా మానవుని విశ్వాసము అనేది  క్రియల ద్వారా నిరూపించబడుతుందని మరియు విశ్వాసం ద్వారా క్రీస్తు మనకు ఎవరు అని ఈనాటి పఠనాలు తెలియజేస్తున్నాయి.

ముందుగా మొదటి పఠనంలో చూస్తున్నాము మానవునికి ఎన్ని ఆపదలు మరియు ఆటంకాలు వచ్చినా కూడా దేవునిపై మనకున్న విశ్వాసాన్ని కోల్పోకూడదని తెలియజేస్తుంది. రెండొవ పఠనంలో యొక్క విశ్వాసాన్ని మనయొక్క క్రియలద్వారా ఇతరులకు నిరూపించవచ్చు అన్నీ పునీత యాకోబు  గారు మనకు తెలియజేస్తున్నారు. మరియు మనం సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి అపోస్తులను రెండు ప్రశ్నలు అడగటం మనం చూస్తున్నాము, యొక్క ప్రశ్నలకు పునీత పేతురు గారు తన యొక్క విశ్వాసం క్రీస్తుపై ఉండటం ద్వారా నీవు దేవుని కుమారుడని చెప్పడము  మనమందరం కూడా వింటున్నాము .

మూడు దివ్య గ్రంథ పఠనాలు మనకు తెలియజేసేది ఏమిటంటే మనము దేవునితో ఎప్పుడైతే ఏకమై జీవిస్తామో అప్పుడే దేవుడు ఎవరని మనం తెలుసుకోగలుగుతామని, మనం తెలుసుకున్న దానిని ఇతరులతో పంచగలుగుతామని నాటి దివ్యగ్రంథ పఠనాలు క్రైస్తవులమైన మనకందరికీ కూడా తెలియజేస్తున్నాయి.

మొదటి పఠనము యెషెయా గ్రంధము 50: 5 -9

నాటి మొదటి పఠనంలో చూసినట్లయితే ఇందులోనుండి మనం గ్రహించవలసినది ఒకటి ఉంది అది ఏమిటంటే రాబోయే దైవసేవకుడు దేవునికి అనుగుణంగా విధేయుడై జీవిస్తాడని మరియు దేవునికి సంపూర్ణంగా విశ్వాసంలో జీవిస్తాడని దానికి ఫలితంగా అతని యొక్క జీవితంలో బాధలు మరియు హింసలు వస్తాయని, ఇవి అన్ని వచ్చిన కూడా ఓర్పుతో సహిస్తాడని అంతేకాకుండా, ఎన్ని అవమానాలు వచ్చినా కూడా, దెబ్బలు తిన్న కూడా మౌనంగా జీవిస్తాడని, అందరు ఎంత చీదరించుకున్న, అతనిపై ఉమ్మి వేసిన కూడా దేవునిపై నమ్మకము ఉంచి ఇది అంతాకూడా దేవుని యొక్క సంకల్పంతో జరుగుతుందని నమ్మకంతో జీవిస్తాడు. చివరికి దేవుడు అతనికి  అన్ని కష్టాలనుండి మరియు బాధలనుండి విముక్తి కలిగించి అతని యొక్క నమ్మకాన్ని వమ్ము చేయలేదు. చివరకు దేవునికి విశ్వాస పాత్రునిగా జీవించినటువంటి సేవకుని మహిమ పరచి తనకు ఇష్టమైన యాజకునిగా ప్రకటించాడు అతడే క్రీస్తు ని  ఈనాటి మొదటి పఠనము తెలియజేస్తుంది. ఎందుకంటే ఈయొక్క యెషయా ప్రవచనాలు నూతన గ్రంధములో యేసు క్రీస్తు యొక్క జీవితములో జరగబోయెటువంటి అంశాల గురించి యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఈయొక్క వచనాలు మొత్తం యేసు క్రీస్తు యొక్క జీవితములో అక్షరాలా నెరవేరిందని మనమందరము కూడా నూతన నిబంధనములో చూస్తున్నాము.

రెండొవ పఠనము యాకోబు 2: 14 - 28

ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాసం అంటే ఏమిటో మనం మొదటి పఠనంలో చుసిన విధంగా ఈయొక్క రెండొవ పఠనము కూడా మనకు తెలియజేసేది ఏమిటంటే క్రైస్తవులమైన మనమందరము కూడా మనయొక్క విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించాలని లేదా నిరూపించాలని  పునీత యాకోబు గారు రెండొవ పఠనంలో తెలియజేస్తున్నారు. 2 : 18 వ వచనంలో చూస్తున్నాము క్రియలు లేకుండా నీయొక్క విశ్వాసము ఎట్లాఉండునో నాకు తెలియజెప్పుము, నా క్రియల ద్వారా నాయొక్క విశ్వాసాన్ని నేను నీకు ప్రదర్శింతును అని చెపుతున్నారు . అంతేకాకుండా పాత నిబంధనములో చుసిన విధంగా అబ్రాహాము అయన క్రియల ద్వారా తన విశ్వాసాన్ని నిరూపించుకున్నాడు, అందుకే తండ్రి దేవుడు అబ్రాహామును నీతిమంతునిగా పరిగణించాడు.

కాబట్టి క్రైస్తవులమైన మనయొక్క విశ్వాసం ఎటువంటిది అని మనం గమనించినట్లయితే మనయొక్క విశ్వాసము యదార్ధమైన విశ్వాసంగా ఉండాలి. ఎందుకంటె క్రైస్తవుల యొక్క విశ్వాసము దేవుని యొక్క ఆదేశాలను తూచాతప్పకా పాటిస్తుండాలి. అదేవిధంగా యదార్ధమైన విశ్వాసమే కలిగి ఉంటె వారి జీవితాలు పూర్తిగా యేసుక్రీస్తు ప్రభువుతో ఉంటాయని యాకోబు గారు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మనమందరం గమనించినట్లయితే యాకోబు గారు చెప్పిన విధంగా, యోహాను గారు తనయొక్క మొదటి లేఖలో తెలియజేస్తున్నారు 1 యోహాను 3 -17 లో క్రైస్తవ విశ్వాసం అనేది చేతలతో నిరూపించబడే ప్రేమ అని. ఇంకా పునీత పౌలు గారు అంటున్నారు ప్రేమ ద్వారా పని చేయు విశ్వాసమే క్రైస్తవ జీవితమని స్పష్టం చేస్తున్నారు(గలతి 5 :6 ). ఇవే మాటలను తన సొంత మాటలుగా యాకోబు గారు అంటున్నారు కార్య రూపం లేదా సేవారుపం చేసినపుడే  అదే మన క్రైస్తవ విశ్వాసం అవుతుందని తేల్చిచెబుతున్నారు.

అందుకే క్రీస్తు ప్రభు తనయొక్క క్రియల ద్వారా ఎన్నో అద్భుతాలు చేసి మానవాళి కొరకై తనయొక్క ప్రాణాన్ని బలిగా చేసి అయొక్క సిలువపై చూపిస్తున్నాడు. ఆలా చూపించడమే కాకుండా తనలాగా క్రైస్తవులందరూ కూడా పాటించాలని క్రీస్తు ప్రభువు ఒక గొప్ప ఉదాహరణను మనందరికీ ఇచ్చియున్నాడు, కనుక , మనమందరము కూడా మనయొక్క విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించాలని ఈనాటి రెండొవ పతనం మనకు తెలియజేస్తుంది.

సువిశేష పఠనం మార్క్ 8: 27 - 35

యేసుప్రభు తన యొక్క శిష్యుల విశ్వాసాన్ని పరీక్షించుటకు వారిని రెండు ప్రశ్నలు అడుగుచున్నారు. రెండు ప్రశ్నలు కూడా శిష్యులకు యేసుప్రభువుపై  ఉన్నటువంటి విశ్వాసం ఎంతో తెలియజేస్తున్నాయి. రెండు ప్రశ్నలు మన ధ్యానించినట్లైతే

1) ప్రజలు నేను ఎవరని చెప్పుకొనుచున్నారు

2) మరి నన్ను గూర్చి మీరు ఏమనుకుంటున్నారు. అని యేసుప్రభు వారిని అడిగెను.

ముందుగా మొదటి దానిని మనం చూసినట్లయితే

1)   ప్రజలు నేను ఎవరని చెప్పుకొనుచున్నారు

అను దానిని మనం వివరించినట్లైతే ప్రభువు  వారిని ప్రశ్న అడిగినప్పుడు వారు రాకరాకల సమాధానాలు చెప్పియున్నారు, ఎందుకంటే ఒకరి గురించి ఇంకొకరు నుమానించుకొనుచున్నారు .

ఎందుకంటే నూతన నిభందనలో చూస్తున్నాము కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఏమనుకొనుచున్నారో మరియు వీరందరికి యేసుప్రభు లోకరక్షకుడని తెలిసి వారి యొక్క ఉదేశ్యాలను విధంగా తెలియజేస్తున్నారు.

వారు ఎవరు అంటే .

1. బాప్తిస్మ యోహాను గారు అంటున్నారు క్రీస్తు ప్రభువు  దేవుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించువాడు అని (యోహాను 1: 29) బాప్తిస్మ యోహాను తెలియజేస్తున్నారు.  

2. నీకొదేము అంటున్నాడు ,మీరు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువాని (యోహాను 3: 2), అంతే కాకుండా

3. సమారియా స్త్రీ  యేసు క్రీస్తు మాటలు విని ఈయన నిజముగా క్రీస్తు ఏమో అని (యోహాను 4: 29) లో మనకు తెలియజేస్తుంది, మాటలు విన్నాటువంటి సమరియులందరు వచ్చి క్రీస్తును చూసి ఈయన నిజముగా లోక రక్షకుడని మనకు తెలియును అని అంటున్నారు.

వీరి ముగ్గురిని మనం చూసినట్లయితే, వ్యక్తులు ముగ్గురు కూడా యేసుప్రభును రెండు లేదా మూడు సార్లు చూసి లేదా మాట్లాడి యేసుప్రభు గురించి ఎందరికి తెలియజేసారో మనమందరము చూస్తున్నాము.

అదేవిధంగా యేసుప్రభు మన దగ్గరకు వచ్చి నా గురించి మీరు ఏమి అనుకుంటున్నారు అన్ని మనలను అడిగినప్పుడు మన యొక్క సమాధానం ఏమిటి అన్ని మనం రెండొవ ప్రశ్న  వింటున్నాము .

2) మీరు నన్ను గూర్చి ఏమి అనుకుంటున్నారు ని   రోజు క్రీస్తు మనందరినీ అడుగుచున్నారు అంతేకాక మనయొక్క విశ్వాసాన్ని పరీక్షించుచున్నారు. మరి  క్రీస్తు అడిగిన ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉన్నదా అన్ని మనం చూసినట్లయితే పునీత పేతురు గారు క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని ఏవిధంగానైతే వెలుగులోనికి తీసుకోని వచ్చారో అదేవిధంగా క్రీస్తును నివ్వు "క్రీస్తువు" అని గట్టిగా వక్కాణించి యేసుప్రభుతో పలుకుచున్నారు, అంతే కాకుండా దేవుని యొక్క శ్రమలలో పేతురు క్రీస్తును మూడు సార్లు నాకు అయన ఎవరో తెలియదు అని తృణీకరించిన, క్రీస్తు మాత్రం పేతురును తన యొక్క శ్రీసభకు పేతురును అధిపతిగా నియమించాడు.

కావున క్రీస్తునాధునియందు ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభువు నిజంగా మన దగ్గరకు వచ్చి నివ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని అడిగినప్పుడు మన యొక్క ప్రత్యుత్తరము ఏమిటి, క్రైస్తవులమైన మనము పుట్టుకతోనే బాప్తిసము ద్వారా క్రీస్తు యొక్క అనుచరులుగా నియమింపబడ్డాము, కానీ క్రీస్తుపై విశ్వాసం ఏమిటి అని ఒక్క సారి ధ్యానించుకున్నామా? అని మనం చుసినట్లైతే లేనే లేదు, ఎందుకంటే, మనకు  క్రైస్తవులని  పేరే తప్ప మన యొక్క విశ్వాసం మాత్రం అంతంత మాత్రమే, ఎందుకంటే కొన్ని కుటుంబ జీవితాలలో చుస్తే చాల మంది క్రైస్తవులు ప్రార్థన జీవితం అనే పేరే మరచిపోతున్నారు, ఎప్పుడు శారీరక అవసరాలు మాత్రమే ఆలోచిస్తారు తప్ప, వారికీ నిత్యా జీవితాన్ని మరియు వాటినంటిని ఇచ్చేటువంటి దేవుని మాత్రం మరచిపోతున్నారు. క్రైస్తవులమైన మనము ఎప్పుడైతే విశ్వాసంతో మరియు ప్రార్థన జీవితం జీవిస్తామో అప్పుడే మనం క్రీస్తుతో ఏకమౌతామని మరియు క్రీస్తు ఎవరో తెలుసుకుంటామని అంతేకాకుండా ఏవిధంగానైతే పేతురు తనయొక్క విశ్వాన్ని క్రీస్తుకు చుపించాడో అదేవిధంగా మనము కూడా యేసు క్రీస్తు సాక్షాత్తు  లోకరక్షకుడని చెప్పగలమా? అని మనలను మనము ప్రశ్నించుకోవాలి, మరియు క్రీస్తును నువ్వు లోకరక్షకుడవని మనమందరము కూడా చెప్పగలగాలి, ఆలా చెప్పడమే కాకుండా దేవునితో ఐక్యమై మన యొక్క విశ్వసన్ని  ఇతరులతో పంచాలని ప్రార్దించుదాము. "ఆమెన్"

Br.v. Johannes ocD

4, సెప్టెంబర్ 2021, శనివారం

23 వ సామాన్య ఆదివారం

నేటి  దివ్య గ్రంధ పఠనాలు దేవుని మీద విశ్వాసము ఉంచిన  వారి  జీవితములో దేవుడు  వారికి
ఎల్లప్పుడు  తోడుగా వుండును అని   వారికి  సకాలములో  దీవెనలు  ఒసగుతారు అనే అంశమును
బోధిస్తున్నాయి. మరియు   దేవుని  మీద భారం వేసి  తన చెంతకు  వచ్చిన  వారి  అక్కరలను
తీర్చి   దేవుడు ఎప్పుడు  కూడా చేరువలోనే  ఉంటారు అనే అంశాన్ని ఈనాటి పఠనాలు
తెలియచేస్తున్నాయి. ఈనాటి మొదటి పఠనంలో
  దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఒక నూతన 
 ఉత్తేజమును , నూతన సంతోషమును ,నూతన ధైర్యమును నింపుచున్నారు.

ఒక విధముగా చెప్పాలంటే  బాబిలోనియా బానిసత్వములోమగ్గుతున్నా ఇస్రాయేలీయులకు
 దేవుడు విముక్తి  కలు చేస్తారనే ఒక  శుభవార్తను యెషయా ప్రవక్త  ద్వారా వెల్లడిస్తున్నారు.
ఇస్రాయేలు ప్రజలు  దేవుని మరిచిన  సమయములో  వారికి అనేక విషయాలు  నేర్పించుటకు
ప్రభువు వారిని  బానిసలుగా  వెళ్ళడానికి  సమ్మతిస్తున్నారు.ఇది కేవలము  యిస్రాయేలు మరలా  దేవుని గొప్పతనం  తెలుసుకొని ఆయనవద్దకు రావాలనేఉద్దేశము వల్లనే.  క్రీస్తు పూర్వము 587 వ సంవత్సరములో నెబుకద్నేసర్ రాజు పాలనలోయొరుషలేము పై దండెత్తి  జయించారు. ఆ సమయములో  ఇస్రాయేలు  ప్రజలు  తమ రాజ్యాన్నికోల్పోయారు, వారికి ఇష్టమైన  యొరుషలేము  దేవాలయమును కోల్పోయారుచాలామందినిబానిసలుగా  బాబిలోనియకు , ఈడ్చుకొని పోయారు. అంతటి దురదృష్టకరం దేవునుని విడిచిపెట్టడంవల్ల , అన్య దైవములను  కొలుచుటవలన  వీరికి ఇంతటి హీనస్థితి ఏర్పడింది.  అయితే దేవుడు వారిని శాశ్వతముగా  బానిసలుగా ఉంచకుండా  50సంవత్సరాల తరువాతపర్షియా రాజు కోరెషు ద్వారా విముక్తినికలుగజేస్తున్నారు. వారికి స్వేచ్ఛనిస్తున్నారు,  మాతృభూమినిస్తున్నారు ,అలాగే వారి దైవాన్నిపూజించుటకు యెరూషలేము వెళ్ళమన్నారు. బాబిలోనియా నుండి బయటకు వచ్చిన యిస్రాయేలు ప్రజలకు చెప్పిన  విలువైన మాటలను మనము ఈరోజు వింటున్నారు. తనను  పిలిచిన  ప్రజలకు, తన మీద  ఆధారపడిన వారికి దేవుడు ఎప్పుడు దగ్గర లోనే ఉంటారు అని  తెలుపుతున్నారు.
యూదా  ప్రజలు దాదాపు 50 సంవత్సరాల తరువాత యెరుషలేముకు తిరిగివచ్చారు, అప్పటికే అక్కడ ఏదోమీయులు నివసించడము ప్రారంభించారు. వారి మధ్య ఒక రకమైన ఘర్షణ ఉన్నసమయములో దేవుడు యెషయా ద్వారా పలుకుచున్నారు వారికీ తోడుగా ఉంటానని. 1.దేవుడు తన ప్రజల పక్షాన  నిలిచి కాపాడతాడని తెలుపుచున్నాడు. 2. దేవుడు తన ప్రజలతో ఉండే సమయములో చాలా గొప్ప కార్యాలు  జరుగుతాయని యెషయా ప్రవక్త  పలుకుచున్నాడు. అవి ఏమిటి అంటే  గ్రుడ్డివారు చూస్తారు, చెవిటివారు  వింటారు, మూగ వారుమాట్లాడుతారు,  కుంటివారు లేడివలె గంతులు వేస్తారు, ఎడారిలో జలములు పెల్లుబుకును అని చెపుతున్నారు.దేవుడు తన ప్రజలతో ఉంటే వారికి కలిగే ప్రయోజనాలు ఇవి, తనకు మొరపెట్టిన ప్రజలమనవులను ప్రభువు ఆలకించి  వారికి ఇవ్వవలసిన వరాలు దయ చేస్తారు.

గ్రుడ్డివారు చూస్తారు అని పలికారు. ఎవరైతే దేవుని అద్భుతాలు చూడలేరో  వారందరు ఒకరకంగా
 గ్రుడ్డివారే, ఎందుకంటే దేవుని గొప్ప కార్యాలు వారు చూడలేక పోతున్నారు ఈ అద్భుతాలు అన్ని 
చేయడము ద్వారా దేవుడు ఇంకా కొన్ని విషయాలు తెలుపుచున్నాడు. 1. మరల యొరుషలేము
 వచ్చినప్పుడు దేవుడు వారిని పూర్వంలానే ఆశీర్వదిస్తానని తెలుపుచున్నాడు. 2. దేవుని యొక్క అభయం ఎప్పుడు వారిమీద ఉంటుందని తెలుపుచున్నాడు. 3. దేవుడు తన ప్రజలకు సమృద్ధిగా అన్ని ఇస్తారని కూడా తెలుపుచున్నారు. ఆరోగ్యం, నీరు,మొదలుగునవి. 4. దేవుడు  వారిని శత్రువుల బారినుండి కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. 5దేవుని చెంతకు నిరాశలో, బాధలో, ఉన్నవారు నమ్మకంతో మరలీ  వస్తే వారిని ఆదుకుంటాను అని కూడా ప్రభువు తెలియ చేస్తున్నాడు.

మనము విశ్వసించే దేవుడు  మనలను ఆదుకోవడానికి వస్తారు , తన కుమారుని ద్వారా మన
 మధ్యకు వచ్చారు. మొదటి పఠనంలో చెప్పబడినవి అన్ని కుడా తన కుమారుని ద్వారా
  నెరవేర్చబడ్డాయి. మూగవారు మాట్లాడారు , చెవిటివారు విన్నారు ,గ్రుడ్డివారు చూడగలిగారు ,బీడు భూములుగా ఉన్న జీవితాలలో వెలుగులు నిండాయి.

 రెండవ పఠనంలో యాకోబుగారు  ఎటువంటి పక్షపాతం లేకుండా అందరు క్రీస్తునందు 
విశ్వాసము గలవారు ,పేదలను,  ధనికులను ఒకే దృష్టితో  చూడాలని  తెలుపుచున్నారు. ఆనాడు ఈనాడు, దేవుడు ఎలాగైతే తన ప్రజలను సమదృష్టితో చూసారో మనము కూడా  మన పొరుగు వారిపట్ల అలాగే ఉండాలి. అపోస్తుల కార్యాలు 10:34-43 వరకు చదివితే అక్కడ పేతురుగారు దేవుడు ఎటువంటి పక్షపాతము చూపించరు అని చెపుతున్నారు. ఆయన సకాలములో వర్షముకాని,ఎండకాని అందరికి దయ చేస్తారు ఎటువంటి భేదము లేకుండా. మత్తయి 5:45. దేవుడు అందరిని సమ దృష్టితో చూస్తారు. (ద్వితీయోపదేశకాండము 10:17 రోమి 2:11,) దేవుని దృష్టిలో అందరు  సరిసమానులే , అందరు ఆయన బిడ్డలే, మనం పక్షపాతము చూపించుట ద్వారా పేద, ధనిక అనే విభజనను చేస్తున్నాము. దీని ద్వారా సంఘము  విడిపోతుంది. ఈనాటి  ఈ రెండవ పఠనముద్వారా యాకోబు గారు ఒక ఆచరణాత్మక విషయము మనకు వెల్లడిస్తున్నారు, మనమందరం ఒకరినొకరు సహోదరిసహోదరులుగా జీవించాలి . మనమందరం ఒకే దేవుని బిడ్డలము కాబట్టి కలిసి జీవించాలి. యాకోబుగారు ఈ లోకములోని  పేదవారు తొందరగా పరలోక రాజ్యములోచేరతారని అంటారు ఎందుకంటే వారి విశ్వాసములో ధనికులు. దేవుని మీద ఆధారపడుటలో వారు ధనికులు. యేసు ప్రభువు  కూడా పేదవారు ధన్యులు దేవా రాజ్యం వారిది అని పలికారు. యేసు ప్రభువు ధనికుడు - లాజరు  అను  ఉపమానమును ద్వారా పేదవారు దేవుని రాజ్యములోతొందరగా ప్రవేశిస్తారు అని తెలుపుచున్నాడు. మన సమాజములో మనం ఈ వ్యత్యాసాలుచూపిస్తాం. ధనికులతో మంచిగా ఉండటం, పేదవారిని దూరముగా ఉంచుతాము,కానీ యాకోబుగారు  మనము అందరిని ఒకేరీతిగా  చూడాలని తెలుపుచున్నాడు. యేసు ప్రభువు అందరితో సమానముగా  వున్నారు, పాపులతో  సుంకరులతో కలిసి జీవించారు. కాబట్టి  మనము కూడా  అందరితో  కలిసిమెలిసి జీవించి దేవుని రాజ్య స్థాపనకు  కృషి చేయాలి. దేవుడు పేదల పక్షాన  ఎప్పుడు  ఉంటూనే ఉంటారు. నాయీను వితంతువు కుమారుడు చనిపోతే తనకు ఓదార్పు ఇచ్చుటకు తన కుమారుని బ్రతికించారు. పేద విధవరాలు సమర్పించిన  రెండు నాణెములను కూడా ఎక్కువుగా  అంగీకరించారు. మనము కూడా పేదవాని పట్ల, మంచి మనస్సు కలిగి జీవించాలి. వర్ణ , వర్గ , జాతి భేదాలు లేకుండా  పరస్పర ప్రేమ కలిగి జీవించాలి.

      ఈనాటి సువిశేష పఠనములో యేసు ప్రభువు గొప్ప అద్భుతము గురించి వింటున్నాము. యేసుప్రభువు మూగ ,చెవిటివానికి స్వస్థత ఇచ్చిన విధమును తెలుసుకుంటున్నాము. దెకపొలి అనే ప్రాంతములో  అన్యులు  ఎక్కువగా ఉండేవారు అక్కడ అనేక సంవత్సరాలుగా బాధపడే వ్యక్తిని స్వస్థత పరుస్తున్నాడు, ఈ అద్భుతములో యేసు ప్రభువు అందరికి దేవుడని, అందరిని
 సమదృష్టితో చూస్తారని తెలియపరుస్తున్నారు. దేవునియందు, విశ్వాసము ఉంచిన వారందరు
తనబిడ్డలేనని క్రీస్తుప్రభువు తెలుపుచున్నాడు, అందరు సమానులే. ఈ వ్యక్తిని స్వస్థపరిచిన
 విధానము చుస్తే మనకు జ్ఞానస్నానం సాంగ్యములో జరిగే విషయాలు గుర్తుకు వస్తాయి.

 జ్ఞానస్నానములో కూడా ఏప్ఫతా
  సాంగ్యం ఉంది. వీటీద్వారా వినికిడి మాటలాడే వరం
 లభిస్తుంది. ఈ వ్యక్తిని స్వస్థపరచుటలో 7 విధానాలు వాడారు . ఆయన్ను ప్రక్కకు  తీసుకొని వెళ్లారు.(ఎందుకుఅంటే మిగతావారు ఆయనను చిన్నచూపు చూడకుండా ఉండటానికి) 2. తన వ్రేళ్ళు అతని చెవులలో ఉంచారు- దేవుని యొక్క స్పర్శను  అందించారు. దేవుని స్పర్శ తగిలి  స్వస్థత పొందిన వారు అనేకులు . దేవుని స్పర్శ మనలో ఉంటె మనలో కూడా స్వస్థత వస్తుంది. మనము కూడా దేవుని వాక్కు చే తాకబడాలి. దీవెనలు పొందాలి. 3. తన సొంత  వ్రేళ్ళపై  ఉమ్మి  వేసుకున్నారు-
యేసు ప్రభువుకొన్ని సార్లు స్వస్థత ఇచ్చినప్పుడు ఉమ్మితో  చాల మందిని స్వస్తపరిచారు. ఉదా..
బేత్సయిదాలో గ్రుడ్డివానికి స్వస్థత నిచ్చినప్పుడు (మార్కు 8:23), పుట్టుగుడ్డివానికి చూపు
నిచ్చినపుడు (యోహాను 9:6) ఈ రోజు విన్న సువిశేషం మార్కు7:33. ఇదంతా యేసు ప్రభువుకు అవసరము లేదు ఎందుకంటే ఆయన సర్వ శక్తివంతుడు, ఎందుకు ప్రభువు విధముగా  స్వస్థత చేసారు అంటే  అప్పటి ప్రజలు రోమీయులు , యూదా ప్రజలు ముఖ్యముగా బోధకులు ఈ ఉమ్మిలో స్వస్తతను ఇచ్చే గుణం వుంది అని నమ్మేవారు. వారి నమ్మకమును నిజము చేయుటకు ప్రభువు ఉమ్మిని వాడుతున్నారు. 5.తన నాలుకను ఉమ్మితో తాకారు, ఒక పవితమైన వ్యక్తి ఉమ్మిలో స్వస్థతను ఇచ్చే శక్తి ఉందని అప్పటి ప్రజల నమ్మకం. 5. పరలోకం వైపు కన్నులెత్తి  చూశారు, తండ్రికి  ప్రార్థి స్తున్నారు ,తన తండ్రికి కృతఙ్ఞతలు తెలుపుచున్నారు. 6. నిట్టూర్చాడు - ప్రార్ధించాడు దేవుని దీవెన కోసం ప్రభువు తండ్రికి మనవి చేసాడు. 7. ఎప్ఫతా అని పలికారు - తెరవబడుము  అని అనగానే ఆయన చెవులు , పెదాలుతెరవబడ్డాయి. ఎప్ఫతా అనే పదము గురించి మనము ధ్యానించుకుందాము.

- మనందరి యొక్క హృదయాలు కూడా అనేక విషయాలకు తెరువబడాలి.
-దేవుని వాక్కును  ప్రేమతో  మన ,  చెవులు తెరువబడాలి.
-క్షమించుటకు  మన   హృదయము తెరువబడాలి
-దేవుని వాక్కును బహిరంగముగా చాటుటకు మన  పెదవులు తెరవబడాలి.
-దేవుని కార్యాలు విశ్వాసించుటకు మన మనసులు తెరువబడాలి 
- దేవుని ప్రార్దించుటకు , అనుసరించుటకు , ఆరాధించుటకు మన ఆత్మ తెరువబడాలి.
-తల్లిదండ్రులు చెప్పిన లేక చెప్పే మాటలు వినుటకు మన చెవులు తెరువబడాలి .
ఇతరులను సమానముగా చూచుటకు మన మనసు , హృదయం తెరువబడాలి.
దేవుని మీద నమ్మకము ఉంచిన ప్రతి వ్యక్తిని ప్రభువు స్వస్థ పరిచారు. మన జ్ఞాన స్నాన సాంగ్యము
 లో   కూడా మన చెవులనునోటిని తాకుతారు ఎందుకంటే దేవుని వాక్కు  సావధానముగా వినాలని,అనుసరించాలని అదే విధముగా  ఆయన గొప్ప కార్యములునలుగురికి చాటిచెప్పాలని కాబట్టి దేవుని వాక్కు  విని , అనుసరించి భోదిద్దాము.


 By.Rev. Fr. Bala Yesu  OCD



పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...