9, అక్టోబర్ 2021, శనివారం

28 వ సామాన్య ఆదివారం (2)

28 వ సామాన్య ఆదివారం (2)

ఈనాటి దివ్య పఠనాలు దేవుడిచ్చిన జ్ఞానము వలన మనయొక్క జీవితములో దేవునికి  ప్రాధాన్యతనివ్వాలి అనే అంశమును గురించి భోదిస్తున్నాయి. మన జీవితములో దేవుణ్ణి పొందు కొని ఉంటె సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు, అనుగ్రహాలు అన్ని కూడా దేవుడే సమకూరుస్తారు అనే అంశమును గురించి కూడా బోధిస్తున్నారు. ఈనాటి మొదటి పఠనములో సొలొమోను మహారాజుకు జ్ఞానం పట్ల ఉన్నటువంటి ప్రీతిని గురించి భోదిస్తుంది. సొలొమోను జ్ఞానము కోసము దేవునికి ప్రార్ధన చేస్తున్నాడు. తనయొక్క జీవితములో దేవుడిని సంపదలు ఇవ్వమని అడుగలేదు, కీర్తిప్రతిష్టలు పెంచమని అడుగలేదు, కేవలము నాకు జ్ఞానము ఇవ్వండి అని ప్రార్ధన చేస్తున్నాడు. ఈలోకములోని ఆస్తిపాస్తుల కంటే, సిరిసంపదలు కంటే దేవుడు ప్రసాదించే జ్ఞానము ఎంత గొప్పదో తెలియపరుస్తున్నారు. సొలొమోను జ్ఞానము యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకున్నారు. ఈలోకంలో మానవులు వీటిని విలువైనవిగా, అమూల్యమైనవిగా భావిస్తారో వాటన్నింటికంటే జ్ఞానము విలువైనది అని గ్రహించారు. 8 వ వచనంలో సొలొమోను అంటారు, "సిరిసంపదలు కంటెను బంగారము కంటెను లౌకిక సంపదల కంటెను మణుల కంటెను ఎక్కువగా కోరుకున్నది జ్ఞానమే". ఆరోగ్యము కూడా అడుగలేదు, కేవలము జ్ఞానమే. ఎందుకంటే దేవుడు ఒసగే జ్ఞానము గొప్పదని గ్రహించాడు.
దైవజ్ఞానము ఉంటె మంచి చెడులు గ్రహించవచ్చు. ఏది ఉత్తమమైనదో కాదో తెలుసుకోవచ్చు. ఈవిధమును ఎలా సరిచేసుకోవాచ్చో  అర్ధమవుతుంది. జ్ఞానము ఉంటె అన్ని కూడా వాటంతట అవే వస్తాయి అని అయన గ్రహించారు. అందుకనే సొలొమోను దేవుడిని జ్ఞానము అడుగుతున్నారు.
జ్ఞానము మనలను నడిపిస్తుంది.
జ్ఞానము మనకు నేర్పిస్తుంది
జ్ఞానము మనకు ఏది మంచో ఏది చేదు చూపిస్తుంది
జ్ఞానము మనకు సత్యములను బయలు పరుస్తుంది.
జ్ఞానము మనకు సరిగ్గా తీర్పు చెప్పుటకు సహకరిస్తుంది
జ్ఞానము మన ఎదుగుదలకు సహాయపడుతుంది సామెతలు 3: 35
జ్ఞానము మనము శ్రమలనుండి బయటకు రావడానికి సహాయపడుతుంది
జ్ఞానము మనలను రక్షిస్తుంది సామెతలు 2:11-16
జ్ఞానము అందరి మన్ననలను పొందేలా చేస్తుంది సామెతలు 14:35
అందుకే సొలొమోను రాజు దేవుణ్ణి జ్ఞానము కోసము అడిగాడు
ఈ సొలొమోను గ్రంధమును ఆ రాజు పేరిట యూదాజాతికి చెందిన ఒక భక్తుడొకడు రాసారని బైబులు వేద పండితులు అంటారు. దీని ద్వారా ఆయన తెలియజేసే విషయము ఏమిటంటే దేవుని యొక్క అనుగ్రహము ద్వారా పొందిన జ్ఞాన వరము ఎలాగా సొలొమోను దైవధిక్కార కారణమున కోల్పోయారో లోతుగా అలోచించి ధ్యానించి మనము అలాగా చేయకూడదని రచయిత యొక్క ఆలోచన, భావన. దేవుడు ఒసగిన జ్ఞానాన్ని సొలొమోను సరిగ్గా వినియోగించుకోలేదు. దాని మూలముగా దైవ ప్రేమను కోల్పోయాడు. అన్యదైవములను పూజించుట ప్రారంభిచారు.
గ్రంధ రచయిత అంటారు గ్రీకు ప్రజల తాత్విక జ్ఞానం కంటే దైవం ప్రసాదించిన జ్ఞానం గొప్పదని తెలియజేస్తున్నారు. మన జీవితంలో కూడా దైవ జ్ఞానం కోసం ప్రార్థించాలి. దేవుడిని అడగాలి. దేవునికి  ప్రార్ధించుట ద్వారానే మనకు జ్ఞానం కలుగుతుంది. యాకోబు 1 : 5  సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానమును సరిగా వినియోగించుకోలేదు. ఆయన ఏ జ్ఞానమును అయితే అడిగితే దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకున్నారో అదే జ్ఞానం వల్ల పాపాలు చేసి దేవునికి దూరం అయ్యాడు. నిజానికి జ్ఞానం కోరుకుంటూ దేవునితో సత్సoబంధాలు కలిగే ఉంటె మిగతా వరాలన్నీ వాటంతట అవే వస్తాయి. దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా మనం ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడే ముఖ్యమని గ్రహించి ఆయన్ను అంటిపెట్టుకొని  జీవించాలి. మనం పొందే జ్ఞానం మనలను దేవుని వైపుకు నడిపించాలి దేవుని యొక్క ప్రణాలికను జ్ఞానం వలన తెలుసుకొని ఆయన మార్గంలో నడవాలి. దైవ జ్ఞానం కోసం ప్రార్ధించాలి అందరూ ఈ దైవజ్ఞానం కోసం మనం ఎదురు చూడాలి. వాస్తవంగా చెప్పాలంటే యేసు క్రీస్తు ప్రభువే మనుష్యవతారం ఎత్తిన దైవజ్ఞానం. ఆయన్ను కలిగి ఉంటె చాలు అన్ని సమకూర్చబడతాయి.
ఈనాటి రెండవ పఠనంలో రచయిత దేవుని యొక్క వాక్కుకు గల మహత్తరమైన శక్తి గురించి తెలియజేస్తున్నారు. దేవుని యొక్క వాక్కు  సజీవమైనది - చైతన్యవంతమైనది, అది రెండంచుల ఖడ్గం కంటెను పదునైనది. దేవుని యొక్క వాక్కు మానవుని జీవితంలో ఒక కొత్తదనమను   పుట్టిస్తుంది. రెండంచులు గల ఖడ్గము రెండువైపులా కత్తిరిస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్కు కూడా మానవుల జీవితాలను కత్తిరించి సరి చేస్తుంది.
దేవుని యొక్క వాక్కుకు పుట్టించే శక్తి ఉంది - లూకా 8 : 11
మనలో ప్రేమను పుట్టిస్తుంది
మనలో హృదయ పరివర్తనను పుట్టిస్తుంది
మనలో క్షమను పుట్టిస్తుంది
మనలో విధేయతను పుట్టిస్తుంది
అందుకే దేవుని యొక్క వాక్కు సజీవమైనది. మనలను బ్రతికించే వాక్యం.
దేవుని యొక్క వాక్కు మనలను నడిపిస్తుంది - కీర్తన 119 : 105
దేవుని యొక్క వాక్కు ఊరట నిచ్చేది - కీర్తన 138 : 7
కాబట్టి దేవుని యొక్క వాక్కును మనం శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకుంటే ఆ సజీవ వాక్కు మనలో క్రొత్త జీవితాన్ని ఏర్పరుస్తుంది దేవుని యొక్క వాక్కు మన పాపము జీవితాలను కట్ చేయాలి. స్వార్ధాలను కట్ చేయాలి అప్పుడు మనందరం కూడా దేవునికి దగ్గరగా ఉండి జీవించగలుగుతాం. దేవుని యొక్క వాక్కు మనలను పోషిస్తుంది, బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది కాబట్టి సావధానంగా విందాం, దాని ప్రకారం నడుచుకుందాం.
ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు దగ్గరకు ఒక ధనికుడు వచ్చి నిత్య జీవం పొందటానికి ఏమి చేయాలన్న విషయాన్ని సువిశేషంలో చదువుకున్నాం . మన జీవిత ప్రయాణంలో సంపదలు కలిగిన వ్యక్తులుగా మనం మారుతాం అయితే ఆ ధనం ఎలాగా సహాయం చేయుటకు వాడుకుంటున్నాం.
ఈ యువకుడు తన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని చేత అంగీకరించబడాలనుకున్నాడు, ఆయన శిష్యుడుగా ఉండాలనుకున్నాడు. ఆయన జీవితంలో ఎంత సంపాదించినా సరే ఆయనలో నిజమైన సంతోష లేదు. ఆయన పరుగెత్తుకుంటూ యేసు ప్రభువు వద్దకు వస్తున్నాడు. ఎంత ఆశతో, కోరిక కలిగి యేసు ప్రభువు దగ్గరకు వస్తున్నాడో మనం నిజంగా ఆలోచించాలి. క్రీస్తు ప్రభువును ప్రవక్తగా దేవునిగా భోధకునిగా బహుశా ఇతడు గుర్తించి ఉండవచ్చు అందుకే సద్భోధకుడా అని సంభోదించాడు. ఆ యువకుడు అన్ని మంచి పనులు చేసినా ఇంకా ఎందుకు ఆయనలో నిత్యజీవితము పొందుతానని నమ్మకము కలగలేదు? అతడు చిన్ననాటినుండి దైవ ఆజ్ఞలను తు.చ తప్పకుండ పాటించాడు. దొంగతనము చేయలేదు, అబద్ధము ఆడలేదు, వ్యభిచరించలేదు, తల్లిదండ్రులును గౌరవించాడు కానీ ఆయనకు నిత్యజీవితము పొందుతానని నమ్మకము కలగలేదు. అతడు ఇవన్నీ చేసినా సరే అతి ముఖ్యమైనది చేయవలసినదేమిటంటే పేదవారిపట్ల ప్రేమ చూపటం అన్నీ వదలి దేవుణ్ణి నమ్ముకొని అనుసరించడం. ఆయన జీవితములో ధనము ఉంది. దేవుడు ఇచ్చిన ధనము పేదలకు పంచకుండా స్వార్ధంతో జీవించారు. దేవుని యొక్క సేవకునిగా ఉండాలన్న నిత్య  జీవం పొందాలన్నా వారిలో పరిత్యజించుకునే గుణం ఉండాలి.
ఈ యువకుని యొక్క ఉద్దేశము నిత్య జీవితము పొందుట మరి దానికోసం ఎందుకు తన యొక్క ధనం ను  వదలి వేయుట లేదు. దేవుని రాజ్యం కన్నా  ధనమే ముఖ్యమై నదా ? నిత్య జీవం కనా సంపదలే ముఖ్యమా? కొద్దిగా ఇవ్వటము ఇష్ట మేమో  కానీ దేవుడు  సంపూర్ణముగా ఇచ్చే మంటున్నారు . మానవ జీవితములో  కూడా అందరి యొక్క ఆశ  పర లోక రాజ్యంలో  ప్రవేశించాలన్నది. కానీ  చాలా మంది ఆ యొక్క ఉద్దేశం కోసం పని చెయ్యరు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా , దేవుని శిష్యులుగా ఉండాలన్న అలాగే నిత్య జీవితం పొందాలనుకున్న మన జీవితములో కూడా కొన్ని సార్లు వదలి వేసుకోలేం. యేసు ప్రభువు అతనితో నీకున్నదంతా పేదలకు దానము చేయుము అంటున్నారు. ఇక్కడ ఉన్నదంతా అంటే కేవలం ధనము మాత్రమే కాదు. ఆయనలో ఉండే ప్రేమ అయ్యి ఉండవచ్చు, మంచితనం అయ్యి ఉండవచ్చు, సేవా భావం అయ్యి ఉండవచ్చు. కానీ ఇతడు ఇవ్వటానికి సిద్దంగా లేడు. ఆయన యొక్క ఉద్దేశం కోసం ఆయన పని చేయుటలేదు. ధనాన్ని త్యజించుట కన్నా క్రీస్తుని త్యజించుట మేలు అని అనుకోని  బాధ పడుచు  వెళ్లుతున్నాడు. యేసుప్రభువు  యొక్క ఉద్దేశం  ఏమిటంటే  ఈ యొక్క యువకుని గురించి  ఆయన శిష్యుడిగా ఉండాలంటే కేవలం మంచి  పేరు ఉంటే చాలదు, దానితో పాటు పేదలకు సాయం చేసే గుణం, ప్రేమ ఉండాలనుకున్నారు. దేవుడిచ్చిన సంపదలు కూడా పెట్టుకోవడానికి కాదు పంచుకోవడానికి , పేదలకు పంచడానికి . దేవుడు పేద వానిగా ఈ లోకానికి వచ్చి  తన అనుగ్రహాలను పంచుకున్నప్పుడు మనం కూడా మనయొక్క సంపదలను పేద వారితో పంచుకొని జీవించాలి.
ధనిక యువకుని జీవితంలో రెండు అంశాలు లోపించాయి.
1.        పేదల పట్ల కనికర భావం  కలిగి ఉండుట
2.      తనకు ఇచ్చిన సమృద్దిని పేదలతో పంచుకొను ట
సంపదలు అన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలే. దేవుడిచ్చిన ది వేరే వారితో  పంచుకొనటానికే. యేసు ప్రభువు శిష్యులతో అంటున్నారు 23 వ వచనం ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత కష్టం. ధనవంతులు అంటే కేవలం డబ్బు ఉన్నవారు మాత్రమే కాదు అధికంగా ఉన్నవారు. కొన్ని సార్లు మనమందరం కూడా ఉన్న వారమే.
-కోపం ఎక్కువగా ఉన్న వారమే
-ద్వేషం ఎక్కువుగా ఉన్న వారమే
-పగలు ఎక్కువగా ఉన్న వారమే
-పాపాలు ఎక్కువగా ఉన్న వారమే
-వ్యసనాలు ఎక్కువగా ఉన్న వారమే  ఇవన్నీ ఎక్కువగా ఉంటె మనం కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. అదే విధముగా దేవుడిచ్చిన సిరిసంపదలు  ఎవరైతే పేద వారితో పంచుకోరో వారు కూడ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఎందుకు ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించారు అంటే
1. వారు దేవుని మీద ఆధారపడరు
2.  సంపదలు ధనవంతుల జీవితాన్ని  ఈ లోకానికే  పరిమితం చేస్తుంది సంపద. మత్తయి 6:21
3.  సంపదలు మనిషిని స్వార్ధంతో   జీవించేలా చేస్తాయి. 
యేసు ప్రభువు ధనవంతులకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఆయన యొక్క స్నేహితుల్లో జక్కయ్య , నికోదెము, అరిమత్తయి యోసేపు వారు కూడా ధనవంతులే, కాకపోతే  దేవుడు ఖండించే విషయము ఏమిటంటే ధన వ్యామోహముతో జీవించుట. ధనమే శాశ్వతం అనుకోని దేవుడిని వద్దనుకునే వారి యొక్క ఆలోచనలు సరిచేసుకోవాలి. అని చెబుతున్నారు.
మానవ జీవితములో దైవమును ద్రవ్యమును ఒకే సారి పూజించలేరు. కాబట్టి ఒకటి వదలి వేసుకోవాలి. మత్తయి 6:24. ఈ ధనిక యువకునికి దైవ జ్ఞానము లేదు అది ఉంటే నిత్య జీవితం కోసం అన్నీ వదలి వేసుకునేవాడు. జ్ఞానం కలిగి ఉండినట్లయితే దేవుడు ఇంకా నాకు ఎక్కువగా ఇస్తాడు  అనే ఆలోచనతో తనకు ఉన్నదంతా దానం చేసేవాడు. పునీత ఆసీస్సీపుర ఫ్రాన్సిస్ గారు దేవుని కోసం తన యొక్క ఆస్తులను అన్నీ వదలి వేసుకున్నాడు. పునీత ఈజిప్టు ఆంథోనీ వారు అన్నీ వదలి వేసుకున్నారు. అందుకే దేవుడు వారిని  హెచ్చుగా దీవించారు.
సువిశేషంలో  పేతురు గారు దేవుని సేవ చేసేవారి గురించి ఒక ప్రశ్న అడుగుచున్నారు.  అంతయు విడిచి పెట్టి మేము నిన్ను అనుసరించితిమి అనెను. అప్పుడు ప్రభువు వారికి  చక్కని సమాధానం ఇస్తున్నారు. వారిని దీవిస్తానని నూరంతలుగా  ఫలాన్ని పొందుతారని  చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు. వారికి నిత్య  జీవితం కూడా దొరుకుతుంది అని యేసు ప్రభువు  తెలియచేస్తున్నారు. కాబట్టి మన యొక్క  విశ్వాస జీవితములో  దైవ జ్ఞానం కలిగి దేవుడిచ్చిన సంపదలు పేద వారికి పంచి , దేవుణ్ణి కలిగి జీవిస్తూ  , నిత్య జీవం పొందటానికి అర్హులగుదాం.
 BY REV.FR. BALA YESU OCD

2, అక్టోబర్ 2021, శనివారం

27 వ సామాన్య ఆదివారం

 27 వ  సామాన్య ఆదివారం
 ఆది 2:18-24, హెబ్రీ 2:9-11, మార్కు 10:2-16
క్రీస్తు నాధుని యందు ప్రియ మిత్రులారా ఈనాటి దివ్య పఠనాలు దేవుడు ఏర్పరిచిన పవిత్ర  వివాహ బంధము గురించి  బోధిస్తున్నాయి.  పవిత్ర  వివాహము  దేవుడు  స్థాపించిన ఏడు  దివ్య సంస్కారములలో  ఒకటి మరియు ముఖ్యమైనది.  ఈరోజు   తల్లి  శ్రీ సభ  వివాహ బంధాలు ఎలాగా ఉన్నాయని  ఆత్మ  పరిశీలన చేసుకొని వాటిని  సరి దిద్దుకోమని అందరినీ ఆహ్వానిస్తుంది.


ఈనాటి మొదటి పఠనములో  దేవుడు స్త్రీ పురుషులను   విధముగా సృష్టించా రో  అలాగే  వారిని విధముగా  ఒక పవిత్ర కుటుంబముగా   చేశారో మనము వింటున్నాం. సృష్టి ప్రారంభము నుండి యే  దేవుడు వివాహ బంధమును ఏర్పరిచారు.  స్త్రీ, పురుషులను  ఏకం చేసి ఒక కుటుంబమును ఏర్పరిచారు. ఏది  మానవ  జీవితానికి  ప్రాథమికమైనది. దీని ద్వారా  మానవ జీవితము  అభివృద్ధి  చెందుతుంది.
ఆది కాండము 2:18   వచనం మనందరికీ  తెలియచేసే విషయము ఏమిటంటే  మగవాని  యొక్క  జీవితములో  ఆడ వారియొక్క తోడు , సహకారం ఎంతో అవసరం .ఈనాటి మొదటి పఠనములో దేవుడు ఆదాము కు ఎవమ్మ ను తోడు గా ఉండటంకు  ఇస్తున్నారు. దేవుడు స్త్రీని ఆదాము ను చేసిన విధముగా మట్టి తీసుకొని చేయలేదు. కానీ ఆదాము యొక్క శరీర అవయవము ద్వార  సృష్టించారు. దేవుడు స్త్రీని ఆదాము  ప్రక్కటెముక తీసుకొని సృజించారు. వారిద్దరి జీవితము ఒకేలా  ఉండాలని దీనికి వేరొక అర్దం మనం చెప్పుకోవచ్చు. స్త్రీని ప్రక్కటెముక నుండి  తీసుకొని  సృష్టించారు ఎందుకంటే భార్య ఎప్పుడు భర్త  హృదయాన్ని అంటిపెట్టుకుని  దగ్గరగా ఉండాలి. ప్రక్కటెముకలు మన హృదయాన్ని కాపాడిన విధముగా భార్యలు తమ భర్తలను కాపాడాలి.


దేవుడు స్త్రీని మగవాని ఆధీనములో ఉండటంకు అతని పాదం నుండి సృష్టించబడలేదు. మగవాని పై భర్త పై చెలాయించడానికి తన తల నుండి సృష్టించబడలేదు. కానీ ప్రక్కటెముక తీసుకొని సృష్టించారు. ఎల్లప్పుడు  తనకు తోడు గా ఉంది తనలో ఒకటై  ఉంది తనకు సహకరించి  తన ప్రేమను పంచుకోవాలనే ఉద్దేశముతో దేవుడు అలా చేశారు.
దేవుడు వారిద్దరినీ ఒకటిగా చేసింది దేవుని ప్రణాళికను నెరవేర్చటంకు. ఇద్దరు కూడా  ఏక శరీరులై ఉండాలని కోరుతున్నారు. ఒకరి జీవితము ఒకరు పంచుకొను   ద్వార వారిద్దరూ  ఒక దేహంగా రూపొందారు. వివాహముకు ముందు  ఇద్దరు వ్యక్తులుగా ఉన్న వారు వివాహము తరువాత ఒకటిగా మారుతున్నారు. అప్పటి వరకు భిన్న ఆలోచనలు, మనస్తత్వాలు , అభిప్రాయాలు కానీ వివాహము తరువాతే  ఒకే జీవితము , ఒకే మనస్సు , ఒకే హృదయం ఇదే వివాహ జీవితం కు ఉన్న గొప్పతనం. భార్య భర్తలు ఇద్దరు  అన్నింటిలోనూ సరి సమానులే ఎవ్వరూ తక్కువ కాదు ఎవ్వరూ ఎక్కువ కాదు . ఆది 1:27-29. స్త్రీని దేవుడు ఆదాముకు తోడు గా ఇచ్చారు, ఆమె ఎల్లప్పుడు  ఆయనకు తోడు గా ఉండాలి


-కష్టములో తోడు గా ఉండాలి
-సంతోషములో తోడు గా ఉండాలి


- సమస్యలలో తోడు గా ఉండాలి
- ఆర్ధిక ఇబ్బందిలో తోడు గా ఉండాలి


-నిరాశలో తోడు గా ఉండాలి
-కుంగిపోయిన వేళలో తోడు గా ఉండాలి


-బాధ్యత లో తోడు గా ఉండాలి
తన జీవిత ప్రతి అవసర సమయంలో స్త్రీ భర్తకు తోడు గా ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళికా . అలాగే భర్త కూడా భార్యకి తోడు గా నిలవాలి . వివాహం రోజున ఇచ్చిన వాగ్దానముకు కట్టుబడి  జీవించాలి. భార్యను ఇచ్చింది తన యొక్క సంతోషాన్ని , ప్రేమను అన్నింటినీ పంచుకోటానికి తన జీవితమను పంచుకోటానికి దేవుడు సృష్టించారు. వారిద్దరినీ  ఏకం చేసింది. దేవుడే. దేవుడే స్వయంగా అవ్వను  ను   సృష్టించిన తరువాత  స్వయంగా దేవుడే అవ్వ ను ఆదాము చెంతకు తీసుకొని వస్తున్నారు. తాను  వారిని ఒక  కుటుంబముగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వారందరి వివాహ బంధం ప్రారంభమైనది దేవుని వలనే. దేవుడు మీకు భర్త ను ఏర్పరిచారు, భార్యను ఏర్పరిచారు. బిన్న శరీరములుగా ఉన్నవారు ఏక శరీరులుగా మారాలంటే ఏమీ చేయాలి. అన్నీ మొదటి నుంచి ప్రారంభించాలి, నేర్చుకోవాలి మనం మొదట బడికి వెళ్ళినప్పుడు ఎలాగైతే అన్నీ మొదటి నుంచి  నేర్చుకుంటా మో అలాగే వివాహపు అంతస్తులో కి  అడుగు పెట్టినవారు అన్నీ మొదటి నుండి  ప్రారంభించి  , నేర్చుకోవాలి.


-అర్దం చేసుకోవటం నేర్చుకోవాలి
-ప్రేమించడం నేర్చుకోవాలి


 -క్షమించడం నేర్చుకోవాలి
 -సహించడం నేర్చుకోవాలి


 -విధేయించడం నేర్చుకోవాలి
  -సహకరించడం నేర్చుకోవాలి


 -నమ్మకంతో జీవించడము నేర్చుకోవాలిఇవన్నీ నేర్చుకొని జీవిస్తే తప్పనిసరిగా వారి వివాహ జీవితము  సంతోషముగా ఉంటుంది. వివాహబంధం అనేది కేవలము కలిసి జీవించేందుకు లేక పరస్పర అంగీకారంతో ఇష్టంతో  చేసుకునే ఒప్పందం మాత్రమే  కాదు కానీ ఒక్కొక్కరి యొక్క బలాలను, బలహీనతలను, ప్రేమలను ద్వేషాలను అవమానాలను, సుఖ సంతోషాలను, కష్ట నష్టాలను  మనస్ఫూర్తిగా  అంగీకరించుకొని  జీవించే బంధం  వివాహ బంధం .


మనం
ఒకరి కోసం ఒకరుగా , ఒకరినుండి ఒకరుగా చేయబడ్డాం. ఒకసారి తాళి కట్టిన తరువాత దానిని  విప్పే  అధికారం కట్టిన వానికి కూడా ఉండదు, ఎందుకంటే  తాళి కట్టే సమయములో  ఒక్కొముడి వేసే సమయములో ఆ వ్యక్తి   త్రీత్వం  లో  ఒక్కొక్కరి ని తలచుకుంటూ ముడి  వేస్తాడు .  మొదటి ముడి పిత దేవుని నామమును తలచుకుంటూ వేస్తాం. దీన్తో  బంధం ఏర్పడుతుంది రెండవ ముడి పుత్రుడైన యేసు ప్రభువును తలచుకుంటూ వేస్తాం. దీన్తో అనుబంధం ఏర్పడుతుంది, మూడవది పవిత్రాత్మ దేవుని నామమును తలచుకొని వేస్తాం దీన్తో విడదీయ వీలు కాని బంధం ఏర్పడుతుంది.వివాహ జీవితం బలంగా ఉండాలంటే మన కుటుంబ జీవితములో ఎలాంటి లక్షణాలు  కలిగి ఉండాలి . ఒక భార్యగా ఎలా ఉండాలి ఒక భర్తగా ఎలాగా ఉండాలని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క కోరిక స్త్రీ పురుషులిద్దరు జీవితాంతం ఒకరికొకరు  తోడు గా ఉండాలన్నది.  
వారిద్దరూ జీవితాంతం తోడు గా ఉంటారు లక్షణాలు కలిగి జీవిస్తే
భర్తకు ఉండవలసి లక్షణాలు
1.  భర్త అంటే  భరించేవాడిలా ఉండాలి బాధించేలా ఉండకూడదు   1 సమూ 1;8 ఏల్కాన  అనే భర్త అన్నకు  సంతానం లేక లేనప్పుడు తన భార్య యొక్క బలహీనతను అర్దం చేసుకున్నారుఆమెతో అంటున్నారు నీకు  బిడ్డలు లేక పోతే ఏమీ నేను పది మంది బిడ్డలతో సమానమని తనను తన బాదను భరిస్తున్నాడు.  పవిత్ర గ్రంధములో హొషేయా ప్రవక్త యొక్క భార్య  తనను పట్టించుకోకుండా ఉన్న   కానీ హొషేయా  ప్రవక్త తన భార్యను  భరిస్తూ మంచి మనస్సుతో స్వీకరించారు.



2.
భర్తలు ఎప్పుడు కూడా తమ భార్యలను ప్రేమించాలి ఎఫెసీ 5:8, రోమి 12:10  దేవుడు స్త్రీని  నరుని పక్కటెముక  నుంచి చేశారు. అనగా తన పక్కటెముక దగ్గర ఉన్న ఆమె కష్టమను , కన్నీరును వచ్చినప్పుడు కౌగిలించుకొని ఉండాలని అదే విధముగా పక్కటెముక హృదయం వెనుక ఉన్న హృదయంతో ఆమెను ఎప్పుడు కూడా ప్రేమించాలని.
 3. భర్త భార్యను మంచిగా చూసుకోవాలి. ఆది 24:67. ఇస్సాకు తన భార్య రెబ్కా ను బాగా చూసుకున్నారు. చాలా మంది భర్తలు తమ భార్యలను అసలు పట్టించుకోరు వారు తిన్నారా ,లేదా సంతోషంతో ఉన్నారా లేదా అన్నది . నిజమైన భర్తలు తమ భార్యలను పట్టించుకోని జీవించాలి.1 పెతురు 3:7



 4.
విశ్వాస పాత్రుడిగా జీవించుటఒకరి పట్ల ఒకరు విశ్వాస పాత్రులుగా జీవించుట చాలా ముఖ్యం. వివాహ బంధములో . వివాహ బంధములో  మోసం చేయకూడదు. దేవుడు కూడా  ఇస్రాయేలు  ప్రజలనుండి  కోరినది విశ్వసనీయతే. ఒకరి పట్ల ఒకరు విశ్వాసం గా ఉండాలి.
     మంచి భార్యకు ఉండవలసి లక్షణాలు
1. భర్తని ప్రేమిస్తూ ఆపదలనుండి కాపాడాలి. 1 సమూ 25:2 అబీగాయిలు  నాబాలు యొక్క భార్య ఆయన మొరటు వాడు , పిసినారి , ధనవంతుడు కానీ దావీదు  సహాయము చేయమన్నప్పుడు చేయకుండా తనను కించపరిచిన  దానికి ప్రతి ఫలంగా దావీదు అతనిని శిక్షించాలనుకున్నప్పుడు అబీగాయిలు తన భర్తని దావీదు నుండి కాపాడుతుంది. అలానే ప్రతి భార్య కూడా తన భర్త గౌరవాన్ని కాపాడాలి . సమాజములో ఎప్పుడు కూడా ఆయనను మర్యాదతో పిలిచి , గౌరవించాలి. అవమానాలనుండి ఆపదలనుండి కాపాడాలి. మంచి భార్యలు ఎప్పుడు కూడా దేవుని నుండి వస్తారు. సామె 19:14 . మంచి భార్యను  కలిగిన వ్యక్తి లాభం కలుగుతుంది. సీరా 26:1
2. వేకువనే లేచి భోజనం సిద్దం చేయాలి  సామె 31:15 అంటే కుటుంబము నడిపించుటకు తాను ఎప్పుడు సిద్దముగా ఉండాలి . కుటుంబంలో అన్నీ సక్రమముగా జరగాలంటే ఇల్లాలు ముందు ఉండాలి .
3.  నోటిని అదుపులో  ఉంచుకోవాలి సామె 27:15,16 ,సీరా 26:14
4. అత్త మామలను తల్లిదండ్రుల వలె ప్రేమించాలి రూతు 1:15 . రూతు తన అత్తను ఆపదలో వదలి  వేయలేదు, తనకు తోడు గా నిలిచింది.
5. భార్య భర్తలు విడిపోవటంకు దేవుడు అనుమతి ఇవ్వలేదు. ప్రజల కాఠిన్యం వలనే మోషే విడాకులు తీసుకొనటంకు అనుమతి ఇచ్చారు. ఎందుకంటే వారి హృదయ కాఠిన్యం అంటువంటిది. దేవుని ప్రణాళికా విడాకులు కావు. మూడు ముళ్ల బంధం నూరేళ్ళ బంధం దేవుని ప్రకారం వివాహ జీవితం గట్టిగా ఉండాలంటే వారి కుటుంబంలో ప్రార్థన ఉండాలి. తోబితు , సారా వారిద్దరూ ప్రార్థించారు. ఒకరిలపట్ల ఒకరికి నమ్మకం ఉండాలి. క్షమాపణ ఉండాలి మత్తయి 5:23,24, ఐక్యమత్యం ఉండాలి, యోహను 7:21-22. విధముగా జీవిస్తే తప్పనిసరిగా వారి యొక్క వివాహ బంధం శాశ్వతముగా ఉంటుంది.
     By Rev. Fr. Bala Yesu OCD


 

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...