9, అక్టోబర్ 2021, శనివారం

28 వ సామాన్య ఆదివారము(3)

28 వ సామాన్య ఆదివారము(3)

మొదటిపఠనము:  విజ్ఞానము లోకములో దొరికే సంపదలకంటే గొప్పదని బోధిస్తుంది

రెండవ పఠనము: దైవ  వాక్కు  మహా  శక్తి కలది.

సువిశేషపఠనము:నిత్యజీవితముఅంటే ఏమిటి?దానినిచేరుమార్గమేమిటని  బోధిస్తుంది.

మొదటిపఠనము:

నాటి మొదటిపఠనములో సోలోమోను రాజు లోకములో జ్ఞానము కంటే గొప్పది ఏది కాదని తెలుసుకొని ప్రార్ధన ద్వారా దాన్ని పొందుతున్నాడు, అవి సింహాసనమైతేనేమి, రాజ్యాధికారం అయితేనేమి, సిరి సంపదనైతేనేమి, బంగారమైతేనేమి, ఆరోగ్యమైతేనేమి, సౌందర్యమైతేనేమి. ఎందుకంటె జ్ఞానము సమస్త ప్రశస్త వస్తువులను బహు సంపదలను గూడా తెచ్చును. అయితే జ్ఞానము వలన లాభమేంటి?.

1 దేవుని యొక్క పవిత్రతను,సత్సబంధ ప్రేమను తెలియజేస్తుంది. మోషే ప్రవక్త దేవునితో ముఖ్య ముఖి మాట్లాడాడు.

2 విజ్ఞానము దేవునినుండి వచ్చు బహుమానము ( యిర్మీయా 29 :11 )

3.విజ్ఞానము అంటే దేవునికి భయభక్తులు చూపడమే ( యోబు 28 :28 )

ఇది ఎలా వస్తుందంటే? దైవభయము వలన. “దైవభీతి విజ్ఞానమునకు మొదటిమెట్టు” (కీర్తన :111 :10) దేవునియొక్క జ్ఞానము మనల్ని మనం ఎలా  రక్షించుకోవాలో నేర్పిస్తుంది.

దేవునియొక్క జ్ఞానము గొప్ప గొప్ప విషయాలను మనకు తెలియజేస్తుంది.

 దేవునియొక్క జ్ఞానము విధేయతను,విశ్వాసమును నేర్పుతుంది.

దేవునియొక్క జ్ఞానము దేవునియొక్క నిగుడమైన ప్రేమను గూర్చి తెలియజేస్తుంది. ఎందుకంటే జ్ఞానము ఈలోకమునుండి కాక, సాక్షాత్తు దేవునినుండి వస్తుంది.అందుకనే ఈనాడు సొలొమోను రాజు  దీనికోసం ప్రార్ధన చేసింది. జ్ఞానము ద్వారానే అతడు తన రాజ్యాన్ని ఎంతో గొప్పగా పరిపాలించగలిగాడు. అయితే  ఈనాడు నువ్వు నేను ఈలోకసంపదలకు కాక, ఆశాలకోసంకాక, పరలోకం కోసం, పరలోకంలో వున్న దేవుడికోసం వెదకాలి. అప్పుడే మనకు గొప్ప బహుమానం కలుగుతుంది. యిర్మీయా :29: 11 లో, "నేను మీ క్షేమము కొరకు ఉద్దెశించిన పధకములు నాకు మాత్రమే తెలియును. నేను మీ అభివృద్ధినే కానీ, వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని"అని అంటున్నాడు. అయితే బంగారు భవిష్యత్తు నీకు నిత్యజీవితము చేకూర్చేది.

  సువిశేష పఠనములోచూస్తే:

 యేసు ప్రభువు యోర్దాను నది నుండి యెరూషలేము ప్రదేశానికి వెళ్లుచుండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి అయన ఎదుట మోకరించి,సద్భోధకుడా! నిత్య జీవితం పొందుటకు నేనే మి చేయాలి అని అడిగినపుడు,దేవుడియొక్క ఆజ్ఞలను పాటించమని పలికాడు. అప్పుడు యువకుడు మాటలకు నా చిన్ననాటినుండే ఇవన్నీ పాటిస్తూనే వున్నాను అని సంతోషముగా పలికాడు. అప్పుడు యేసు ప్రభువు అతని వంక ప్రేమతో చూసి,నీకు ఉన్నదంతా వెచ్చించి,పేదలకు దానం చేసి,అటు పిమ్మట నన్ను అనుసరింపుము.పరలోకమందు నీకు ధనము చేకూరును, అని అనెను. కానీ యువకుడు అధిక సంపదలు గలవాడగుటచే మొఖమును చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు.

  ఇక్కడ  యువకుడియొక్క జీవితాన్ని క్లుప్తంగా పరిశీలించినట్లయితే:

 1. అజ్ఞల యొక్క అంతరంగాన్ని కనుగొన లేక పోయాడు

2. లోక వ్యామోహాల ఊబిలో పడిపోయాడు

3. దేవుని యొక్క పిలుపును తిరస్కరించాడు.

4. మొఖము చిన్నబుచ్చుకొని వెళ్లిపోయాడు. 

 

1. ఆజ్ఞల యొక్క అంతరంగాన్ని కనుగొనలే పోవుట:

    దేవుడు మోషే ప్రవక్తద్వారా  ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలలో నిగూఢమైన  పరమార్థం గురించి  అర్ధంచేసుకోలేక పోయాడు. ఆజ్ఞలు రెండువిషయాలగురించి తెలియజేస్తున్నాయి.

1. దేవున్ని ప్రేమించుట

2. మానవుని ప్రేమించుట.

 ముందుగా అతడు యేసుప్రభువు ఆజ్ఞలను పాటించు అని అడిగినపుడు ధైర్యముగా, సంతోషముగా నేను అన్నీ పాటిస్తున్నాను అని చెప్పా గలిగాడే కానీ వాటిలో నిగుడతను తెలుసుకోలేకపోయారు, ఇంకా అర్ధం చేసుకోలేక పోయాడు. ఆజ్ఞలను దేవుడు మనకెందుకిచ్చాడంటే, దేవుడిని , మన పొరుగువారికి ప్రేమించడానికే.

2 . ఈలోక వ్యామోహాలలో పడిపోయాడు:

          యువకుడు ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు కానీ, అది  ఇచ్చినటువంటి దేవుడిని కాదు. అందుకే నీకున్నదంతా వెచ్చించి,పేదలకు దానము చేయుము, అటు పిమ్మట నన్ను అనుసరింపుము అన్నపుడు దేవుని యొక్క పిలుపును గ్రహించలేక , అర్ధం చేసుకోలేక బాధపడుతూ,మోహమును త్రిప్పుకొని వెళ్లి పోయాడు.

ఉదా:

   లూకా:12 :16 -20 లో ధనవంతుడి జీవితాన్ని మనం చూస్తే, తనకోసం, తన స్వార్థంకోసం ,కొట్లను నిర్మించి దానిలో సంపదలను కూడబెట్టి ఓనా ఆత్మమా తినుము, త్రాగుము, స్తుతించుము.  అప్పుడు దేవుడతనితో,ఓరీ! అవివేకి రాత్రికే నీ ప్రాణములు తీసుకొనిపోబడును.అప్పుడు నీవు కూడబెట్టిన డబ్బు ఎవరికీ చెందును అని అనెను. ఇంకా లూకా :16: 19-24 లో. ధనవంతుడు లాజరుగూర్చి తెలుపబడుతుంది.వీరిద్దరు జీవించిన జీవితం ద్వారా ధనవంతుడు నరకాగ్నిలోకి పోతే, లాజరు పేదవాడు మాత్రం అబ్రాహాము ఒడిలోకి చేర్చబడ్డాడు. దేవుని దృష్టిలో లాజరు గొప్పాజీవితాని జీవించాడు కానీ, ధనికుడు కాదు. ఎందుకంటే తనప్రక్కనే ఉన్నటువంటి లాజరును పట్టించుకోకుండా తన ఇష్టానుసారం జీవించి, దేవునియొక్క కోపాగ్నిపాలయ్యాడు.

  పు.మత్తయి:27:24లోఅంటారు,"ఈలోకంలోసంపదలుకూడబెట్టుకోవలదు.చెద పురుగులు,త్రుప్పు వానిని తినివేయును.దొంగలు కన్నమువేసి దోచుకొందురు" అంటున్నాడు. అయితే ధనవంతుడు మరియు యువకుడు దాచుకొనినట్లు మనంకూడా దనాన్ని కూడబెట్టుకున్నచో,అది మనము దక్కకుండా ఇతరులవశమవుతుంది.సామెతలు:  27: 24 "ధనం శాశ్వతంకాదు, సంపదలు కలకాలం నిలువవు". ఇక్కడ మనము ఉదాహరణకు పు.మదర్ తెరెసా గారిని తీసుకుంటే,ఆమె ఈలోకములో దనాన్ని కూడబెట్టుకోక పరలోకరాజ్యములో కూడబెట్టింది. కాబట్టే ఆమెను ఈనాడుమదర్అని పిలుస్తున్నాము.

 అసలు నిత్యజీవితంఅంటే ఏమిటంటే,పరలోకం. మరి పరలోకాన్ని చేరాలంటే ముందుగా:

1.యేసు ప్రభువునందు విశ్వాసం కలిగి జీవించాలి:

యోహా 3: 36: "కుమారుని విశ్వసించువాడు నిత్యజీవమును పొందును". అంటే ఎవరైతే యేసుప్రభువునందు అచంచలమైన  విశ్వాసమును కలిగి జీవిస్తారో. సువిశేషపఠనములో యువకుడు సద్భోధకుడా! అని సంభోదించాడు కానీ, యేసు ప్రభువును దేవునిగా అంగీకరించలేదు.

2. తండ్రి చిత్తానుసారం జీవించాలి:

  మత్తయి:7: 21 "ప్రభూ! ప్రభూ! అని సంభోధించువాడు పరలోకములో ప్రవేశింపరు. కానీ,తండ్రి   చిత్తానుసారముగా వర్తించువాడే పరలోకమున ప్రవేశించును". మన సాధారణ జీవితములో ఎన్నో తపోక్రియలు చేసినా,దేవునికి గొప్పగా మొరపెట్టినా కానీ తండ్రి చిత్తానుసారం జీవించకపోతే వ్యర్ధము.  

. మారుమనస్సు పొందాలి:

   మత్తయి:18:3 మీరు పరివర్తన చెంది,చిన్నబిడ్డలవలే రూపొందిననే తప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను". అని దేవుడు పలుకుచున్నాడు. ఇక్కడ చిన్నబిడ్డలంటే,దేవునియందే ఆధారపడి జీవించేవారు.ఈలోకవస్తువులమీద ఆధారపడుతూ జీవించేవారుకాదు. అయితే యేసుప్రభువు యువకుడు జాలితో, మొఖమును చిన్నబుచ్చుకొని వెనుతిరిగి వెళ్తున్నప్పుడు తన శిష్యులతో ధనవంతుడు పరలోకరాజ్యమున ప్రవేశించుటకంటె, ఒంటె సూదిబెజ్జములో దూరిపోవుట సులభ తరము అని తెలియజేస్తున్నాడు. అంటే వారు పరలోక రాజ్యానికి ఎంతో దూరముగా వున్నారని, వారు ఎప్పటికి చేరబోరని తెలియజేస్తున్నాడు.

4. క్రీస్తుకొరకు జీవించాలి:

  ఉదాహరణకు శిష్యులజీవితాన్ని మనం చూస్తే,వారు మొదట వారిస్వార్ధం కోసం జీవించినా కానీ తరువాత క్రీస్తుకొరకే జీవించి మరణించడానికయినా వెనకంజ వేయలేదు. అది వారు మనకు చూపించిన గొప్ప ఆదర్శవంతమయిన జీవితము.

      అయితే ఈనాడు శిష్యులు మరి మేమంతా విడిచిపెట్టి వచ్చి మిమ్ము అనుసరించితిమి అని అంటున్నపుడు యేసుప్రభువు :నా నిమిత్తము అన్నదమ్ములను,అక్కచెల్లెలను, భార్యలను, పిల్లలను,భూములను విడిచిపెట్టి నన్ను అనుసరించు వాడు వాటిని అధికముగా తిరిగి పొందును.అని అంటున్నాడు. అయితే ఇక్కడ పూర్తి సమర్పణా జీవితం కలిగి జీవించాలని భోధిస్తున్నాడు. సమర్పణా జీవితం ద్వారా,దేవుడికి పూర్తిగా సమర్పించుకొని చేసుకొని, ఆయనను విశ్వసించి, అయన చిత్తానుసారము నడుస్తూ, మారుమనస్సు కలిగి ఆయనకొరకే జీవించాలి. అదే మననుండి దేవుడు కోరుకునేది. 

  అయితే ఈనాటి రెండవ పఠనము ద్వారా దేవుడు మనకు దేవుని వాక్కు యొక్క శక్తిని గూర్చి తెలియజేస్తుంది. ఇక్కడ, దేవుని యొక్క వాక్కు జీవమును,చైతన్యమైనది.అది రెండంచుల కత్తికంటే పదునైనదని తెలియ జేస్తుంది. ఉదా హరణకు :దేవుడు ఈలోకాన్ని సృష్టించినపుడు తన వాక్కు ద్వారా సృష్టించాడు. తన వాక్కు ద్వారా ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి విడిపించాడు. ఎడారిలో ఆకలిగా వున్నప్పుడు తన వాక్కు ద్వారా మన్నాను కలుగజేసి వారి ఆహారాన్నితీర్చాడు. కుమారుడైన యేసుప్రభువు, తన వాక్కు ద్వారా ఎంతోమందిని దీవించాడు. తన వాక్కు ద్వారా ఎంతోమందిని స్వస్థపరిచాడు.తనవాక్కు ద్వారానే ఎంతోమంది మరణించిన వారిని తిరిగి లేపాడు. ఇలా ఎన్నోరకాలుగా, దేవుడు తన వాక్కు ద్వారా ఎన్నో ఎన్నెన్నో గొప్పమేలులు, గొప్పకార్యాలు చేసాడు. అయితే వాక్కు అయినటువంటి యేసుప్రభువుని విశ్వసించి, ఆయనతోపాటు ఐక్యతకలిగి జీవించాలి. అప్పుడే వాక్కు మన హృదయములోకి చొచ్చుకొనిపోయి,మనలో ఉన్నటువంటి పాప కలంకములను, చెడు జీవితాన్ని, అవిశ్వాసపు జీవితాన్ని, రెండంచుల ఖడ్గములాగా వీటన్నిటిని ఛేదించుకొనిపోయి, నూతన జీవితాన్ని మనకు ప్రసాదిస్తుంది. 

    కాబట్టి మనమందరము అయన వాక్యానుసారము జీవిస్తే, దాని ఫలితం నిత్యజీవితాన్ని మనం సంతోషముగా పొందగలం. అయితే, దేవుని వాక్కు నందు విశ్వాసము కలిగి జీవించాలి .అప్పుడు నీవు దేవునికి వినయము కలిగి,ఆయనతో కలిసి సిలువదారిలో ప్రయాణిస్తావు. అది నిన్ను నన్ను దేవునితో ఐక్యపరిచి, ఒక్కటిగా చేసి,నిత్యజీవితములో పాలుపంచుకొనునట్లు చేస్తుంది.ఎందుకంటే దైవవాక్కు ద్వారా పాతనిభందనలో సృష్టిని సృష్టించాడు. వాక్కు ద్వారా ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశమునకు నడిపించి రక్షణను కల్పించాడు. అవిశ్వాసులను విశ్వాసులుగా మార్చాడు. మరణించినవారికి జీవాన్ని ఒసగాడు. అంత శక్తి దేవుని  యొక్క వాక్కుకి కలదు. ఎందుకంటే, కాబట్టి మన జీవితములో దేవునియొక్క వాక్కుని మన హృదయములోకి స్వీకరించి, స్వీకరించిన వాక్కుని అనుసరిస్తూ,నిత్యజీవితపు మార్గములో ప్రయాణించాలి. అప్పుడే మన జీవితానికి ఒక పరమార్ధం ఉంది. ఎందుకంటే, కాబట్టి మన జీవితములో దేవునియొక్క వాక్కుని మన హృదయములోకి స్వీకరించి, స్వీకరించిన వాక్కుని అనుసరిస్తూ,నిత్యజీవితపు మార్గములో ప్రయాణించాలి. అప్పుడే మన జీవితానికి ఒక పరమార్ధం ఉంది. కాబట్టి ఈనాటి దివ్య బలిపూజలో వాక్కుదారిఅయిన యేసు ప్రభువునియందు విశ్వాసము కలిగి జీవిద్దాం.ఆమెన్.

 

 -   బ్ర.నందిగామ. జోసెఫ్ మారియో 

 

 

 

 

28 వ సామాన్య ఆదివారం (2)

28 వ సామాన్య ఆదివారం (2)

ఈనాటి దివ్య పఠనాలు దేవుడిచ్చిన జ్ఞానము వలన మనయొక్క జీవితములో దేవునికి  ప్రాధాన్యతనివ్వాలి అనే అంశమును గురించి భోదిస్తున్నాయి. మన జీవితములో దేవుణ్ణి పొందు కొని ఉంటె సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు, అనుగ్రహాలు అన్ని కూడా దేవుడే సమకూరుస్తారు అనే అంశమును గురించి కూడా బోధిస్తున్నారు. ఈనాటి మొదటి పఠనములో సొలొమోను మహారాజుకు జ్ఞానం పట్ల ఉన్నటువంటి ప్రీతిని గురించి భోదిస్తుంది. సొలొమోను జ్ఞానము కోసము దేవునికి ప్రార్ధన చేస్తున్నాడు. తనయొక్క జీవితములో దేవుడిని సంపదలు ఇవ్వమని అడుగలేదు, కీర్తిప్రతిష్టలు పెంచమని అడుగలేదు, కేవలము నాకు జ్ఞానము ఇవ్వండి అని ప్రార్ధన చేస్తున్నాడు. ఈలోకములోని ఆస్తిపాస్తుల కంటే, సిరిసంపదలు కంటే దేవుడు ప్రసాదించే జ్ఞానము ఎంత గొప్పదో తెలియపరుస్తున్నారు. సొలొమోను జ్ఞానము యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకున్నారు. ఈలోకంలో మానవులు వీటిని విలువైనవిగా, అమూల్యమైనవిగా భావిస్తారో వాటన్నింటికంటే జ్ఞానము విలువైనది అని గ్రహించారు. 8 వ వచనంలో సొలొమోను అంటారు, "సిరిసంపదలు కంటెను బంగారము కంటెను లౌకిక సంపదల కంటెను మణుల కంటెను ఎక్కువగా కోరుకున్నది జ్ఞానమే". ఆరోగ్యము కూడా అడుగలేదు, కేవలము జ్ఞానమే. ఎందుకంటే దేవుడు ఒసగే జ్ఞానము గొప్పదని గ్రహించాడు.
దైవజ్ఞానము ఉంటె మంచి చెడులు గ్రహించవచ్చు. ఏది ఉత్తమమైనదో కాదో తెలుసుకోవచ్చు. ఈవిధమును ఎలా సరిచేసుకోవాచ్చో  అర్ధమవుతుంది. జ్ఞానము ఉంటె అన్ని కూడా వాటంతట అవే వస్తాయి అని అయన గ్రహించారు. అందుకనే సొలొమోను దేవుడిని జ్ఞానము అడుగుతున్నారు.
జ్ఞానము మనలను నడిపిస్తుంది.
జ్ఞానము మనకు నేర్పిస్తుంది
జ్ఞానము మనకు ఏది మంచో ఏది చేదు చూపిస్తుంది
జ్ఞానము మనకు సత్యములను బయలు పరుస్తుంది.
జ్ఞానము మనకు సరిగ్గా తీర్పు చెప్పుటకు సహకరిస్తుంది
జ్ఞానము మన ఎదుగుదలకు సహాయపడుతుంది సామెతలు 3: 35
జ్ఞానము మనము శ్రమలనుండి బయటకు రావడానికి సహాయపడుతుంది
జ్ఞానము మనలను రక్షిస్తుంది సామెతలు 2:11-16
జ్ఞానము అందరి మన్ననలను పొందేలా చేస్తుంది సామెతలు 14:35
అందుకే సొలొమోను రాజు దేవుణ్ణి జ్ఞానము కోసము అడిగాడు
ఈ సొలొమోను గ్రంధమును ఆ రాజు పేరిట యూదాజాతికి చెందిన ఒక భక్తుడొకడు రాసారని బైబులు వేద పండితులు అంటారు. దీని ద్వారా ఆయన తెలియజేసే విషయము ఏమిటంటే దేవుని యొక్క అనుగ్రహము ద్వారా పొందిన జ్ఞాన వరము ఎలాగా సొలొమోను దైవధిక్కార కారణమున కోల్పోయారో లోతుగా అలోచించి ధ్యానించి మనము అలాగా చేయకూడదని రచయిత యొక్క ఆలోచన, భావన. దేవుడు ఒసగిన జ్ఞానాన్ని సొలొమోను సరిగ్గా వినియోగించుకోలేదు. దాని మూలముగా దైవ ప్రేమను కోల్పోయాడు. అన్యదైవములను పూజించుట ప్రారంభిచారు.
గ్రంధ రచయిత అంటారు గ్రీకు ప్రజల తాత్విక జ్ఞానం కంటే దైవం ప్రసాదించిన జ్ఞానం గొప్పదని తెలియజేస్తున్నారు. మన జీవితంలో కూడా దైవ జ్ఞానం కోసం ప్రార్థించాలి. దేవుడిని అడగాలి. దేవునికి  ప్రార్ధించుట ద్వారానే మనకు జ్ఞానం కలుగుతుంది. యాకోబు 1 : 5  సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానమును సరిగా వినియోగించుకోలేదు. ఆయన ఏ జ్ఞానమును అయితే అడిగితే దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకున్నారో అదే జ్ఞానం వల్ల పాపాలు చేసి దేవునికి దూరం అయ్యాడు. నిజానికి జ్ఞానం కోరుకుంటూ దేవునితో సత్సoబంధాలు కలిగే ఉంటె మిగతా వరాలన్నీ వాటంతట అవే వస్తాయి. దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా మనం ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడే ముఖ్యమని గ్రహించి ఆయన్ను అంటిపెట్టుకొని  జీవించాలి. మనం పొందే జ్ఞానం మనలను దేవుని వైపుకు నడిపించాలి దేవుని యొక్క ప్రణాలికను జ్ఞానం వలన తెలుసుకొని ఆయన మార్గంలో నడవాలి. దైవ జ్ఞానం కోసం ప్రార్ధించాలి అందరూ ఈ దైవజ్ఞానం కోసం మనం ఎదురు చూడాలి. వాస్తవంగా చెప్పాలంటే యేసు క్రీస్తు ప్రభువే మనుష్యవతారం ఎత్తిన దైవజ్ఞానం. ఆయన్ను కలిగి ఉంటె చాలు అన్ని సమకూర్చబడతాయి.
ఈనాటి రెండవ పఠనంలో రచయిత దేవుని యొక్క వాక్కుకు గల మహత్తరమైన శక్తి గురించి తెలియజేస్తున్నారు. దేవుని యొక్క వాక్కు  సజీవమైనది - చైతన్యవంతమైనది, అది రెండంచుల ఖడ్గం కంటెను పదునైనది. దేవుని యొక్క వాక్కు మానవుని జీవితంలో ఒక కొత్తదనమను   పుట్టిస్తుంది. రెండంచులు గల ఖడ్గము రెండువైపులా కత్తిరిస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్కు కూడా మానవుల జీవితాలను కత్తిరించి సరి చేస్తుంది.
దేవుని యొక్క వాక్కుకు పుట్టించే శక్తి ఉంది - లూకా 8 : 11
మనలో ప్రేమను పుట్టిస్తుంది
మనలో హృదయ పరివర్తనను పుట్టిస్తుంది
మనలో క్షమను పుట్టిస్తుంది
మనలో విధేయతను పుట్టిస్తుంది
అందుకే దేవుని యొక్క వాక్కు సజీవమైనది. మనలను బ్రతికించే వాక్యం.
దేవుని యొక్క వాక్కు మనలను నడిపిస్తుంది - కీర్తన 119 : 105
దేవుని యొక్క వాక్కు ఊరట నిచ్చేది - కీర్తన 138 : 7
కాబట్టి దేవుని యొక్క వాక్కును మనం శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకుంటే ఆ సజీవ వాక్కు మనలో క్రొత్త జీవితాన్ని ఏర్పరుస్తుంది దేవుని యొక్క వాక్కు మన పాపము జీవితాలను కట్ చేయాలి. స్వార్ధాలను కట్ చేయాలి అప్పుడు మనందరం కూడా దేవునికి దగ్గరగా ఉండి జీవించగలుగుతాం. దేవుని యొక్క వాక్కు మనలను పోషిస్తుంది, బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది కాబట్టి సావధానంగా విందాం, దాని ప్రకారం నడుచుకుందాం.
ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు దగ్గరకు ఒక ధనికుడు వచ్చి నిత్య జీవం పొందటానికి ఏమి చేయాలన్న విషయాన్ని సువిశేషంలో చదువుకున్నాం . మన జీవిత ప్రయాణంలో సంపదలు కలిగిన వ్యక్తులుగా మనం మారుతాం అయితే ఆ ధనం ఎలాగా సహాయం చేయుటకు వాడుకుంటున్నాం.
ఈ యువకుడు తన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని చేత అంగీకరించబడాలనుకున్నాడు, ఆయన శిష్యుడుగా ఉండాలనుకున్నాడు. ఆయన జీవితంలో ఎంత సంపాదించినా సరే ఆయనలో నిజమైన సంతోష లేదు. ఆయన పరుగెత్తుకుంటూ యేసు ప్రభువు వద్దకు వస్తున్నాడు. ఎంత ఆశతో, కోరిక కలిగి యేసు ప్రభువు దగ్గరకు వస్తున్నాడో మనం నిజంగా ఆలోచించాలి. క్రీస్తు ప్రభువును ప్రవక్తగా దేవునిగా భోధకునిగా బహుశా ఇతడు గుర్తించి ఉండవచ్చు అందుకే సద్భోధకుడా అని సంభోదించాడు. ఆ యువకుడు అన్ని మంచి పనులు చేసినా ఇంకా ఎందుకు ఆయనలో నిత్యజీవితము పొందుతానని నమ్మకము కలగలేదు? అతడు చిన్ననాటినుండి దైవ ఆజ్ఞలను తు.చ తప్పకుండ పాటించాడు. దొంగతనము చేయలేదు, అబద్ధము ఆడలేదు, వ్యభిచరించలేదు, తల్లిదండ్రులును గౌరవించాడు కానీ ఆయనకు నిత్యజీవితము పొందుతానని నమ్మకము కలగలేదు. అతడు ఇవన్నీ చేసినా సరే అతి ముఖ్యమైనది చేయవలసినదేమిటంటే పేదవారిపట్ల ప్రేమ చూపటం అన్నీ వదలి దేవుణ్ణి నమ్ముకొని అనుసరించడం. ఆయన జీవితములో ధనము ఉంది. దేవుడు ఇచ్చిన ధనము పేదలకు పంచకుండా స్వార్ధంతో జీవించారు. దేవుని యొక్క సేవకునిగా ఉండాలన్న నిత్య  జీవం పొందాలన్నా వారిలో పరిత్యజించుకునే గుణం ఉండాలి.
ఈ యువకుని యొక్క ఉద్దేశము నిత్య జీవితము పొందుట మరి దానికోసం ఎందుకు తన యొక్క ధనం ను  వదలి వేయుట లేదు. దేవుని రాజ్యం కన్నా  ధనమే ముఖ్యమై నదా ? నిత్య జీవం కనా సంపదలే ముఖ్యమా? కొద్దిగా ఇవ్వటము ఇష్ట మేమో  కానీ దేవుడు  సంపూర్ణముగా ఇచ్చే మంటున్నారు . మానవ జీవితములో  కూడా అందరి యొక్క ఆశ  పర లోక రాజ్యంలో  ప్రవేశించాలన్నది. కానీ  చాలా మంది ఆ యొక్క ఉద్దేశం కోసం పని చెయ్యరు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా , దేవుని శిష్యులుగా ఉండాలన్న అలాగే నిత్య జీవితం పొందాలనుకున్న మన జీవితములో కూడా కొన్ని సార్లు వదలి వేసుకోలేం. యేసు ప్రభువు అతనితో నీకున్నదంతా పేదలకు దానము చేయుము అంటున్నారు. ఇక్కడ ఉన్నదంతా అంటే కేవలం ధనము మాత్రమే కాదు. ఆయనలో ఉండే ప్రేమ అయ్యి ఉండవచ్చు, మంచితనం అయ్యి ఉండవచ్చు, సేవా భావం అయ్యి ఉండవచ్చు. కానీ ఇతడు ఇవ్వటానికి సిద్దంగా లేడు. ఆయన యొక్క ఉద్దేశం కోసం ఆయన పని చేయుటలేదు. ధనాన్ని త్యజించుట కన్నా క్రీస్తుని త్యజించుట మేలు అని అనుకోని  బాధ పడుచు  వెళ్లుతున్నాడు. యేసుప్రభువు  యొక్క ఉద్దేశం  ఏమిటంటే  ఈ యొక్క యువకుని గురించి  ఆయన శిష్యుడిగా ఉండాలంటే కేవలం మంచి  పేరు ఉంటే చాలదు, దానితో పాటు పేదలకు సాయం చేసే గుణం, ప్రేమ ఉండాలనుకున్నారు. దేవుడిచ్చిన సంపదలు కూడా పెట్టుకోవడానికి కాదు పంచుకోవడానికి , పేదలకు పంచడానికి . దేవుడు పేద వానిగా ఈ లోకానికి వచ్చి  తన అనుగ్రహాలను పంచుకున్నప్పుడు మనం కూడా మనయొక్క సంపదలను పేద వారితో పంచుకొని జీవించాలి.
ధనిక యువకుని జీవితంలో రెండు అంశాలు లోపించాయి.
1.        పేదల పట్ల కనికర భావం  కలిగి ఉండుట
2.      తనకు ఇచ్చిన సమృద్దిని పేదలతో పంచుకొను ట
సంపదలు అన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలే. దేవుడిచ్చిన ది వేరే వారితో  పంచుకొనటానికే. యేసు ప్రభువు శిష్యులతో అంటున్నారు 23 వ వచనం ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత కష్టం. ధనవంతులు అంటే కేవలం డబ్బు ఉన్నవారు మాత్రమే కాదు అధికంగా ఉన్నవారు. కొన్ని సార్లు మనమందరం కూడా ఉన్న వారమే.
-కోపం ఎక్కువగా ఉన్న వారమే
-ద్వేషం ఎక్కువుగా ఉన్న వారమే
-పగలు ఎక్కువగా ఉన్న వారమే
-పాపాలు ఎక్కువగా ఉన్న వారమే
-వ్యసనాలు ఎక్కువగా ఉన్న వారమే  ఇవన్నీ ఎక్కువగా ఉంటె మనం కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. అదే విధముగా దేవుడిచ్చిన సిరిసంపదలు  ఎవరైతే పేద వారితో పంచుకోరో వారు కూడ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఎందుకు ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించారు అంటే
1. వారు దేవుని మీద ఆధారపడరు
2.  సంపదలు ధనవంతుల జీవితాన్ని  ఈ లోకానికే  పరిమితం చేస్తుంది సంపద. మత్తయి 6:21
3.  సంపదలు మనిషిని స్వార్ధంతో   జీవించేలా చేస్తాయి. 
యేసు ప్రభువు ధనవంతులకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఆయన యొక్క స్నేహితుల్లో జక్కయ్య , నికోదెము, అరిమత్తయి యోసేపు వారు కూడా ధనవంతులే, కాకపోతే  దేవుడు ఖండించే విషయము ఏమిటంటే ధన వ్యామోహముతో జీవించుట. ధనమే శాశ్వతం అనుకోని దేవుడిని వద్దనుకునే వారి యొక్క ఆలోచనలు సరిచేసుకోవాలి. అని చెబుతున్నారు.
మానవ జీవితములో దైవమును ద్రవ్యమును ఒకే సారి పూజించలేరు. కాబట్టి ఒకటి వదలి వేసుకోవాలి. మత్తయి 6:24. ఈ ధనిక యువకునికి దైవ జ్ఞానము లేదు అది ఉంటే నిత్య జీవితం కోసం అన్నీ వదలి వేసుకునేవాడు. జ్ఞానం కలిగి ఉండినట్లయితే దేవుడు ఇంకా నాకు ఎక్కువగా ఇస్తాడు  అనే ఆలోచనతో తనకు ఉన్నదంతా దానం చేసేవాడు. పునీత ఆసీస్సీపుర ఫ్రాన్సిస్ గారు దేవుని కోసం తన యొక్క ఆస్తులను అన్నీ వదలి వేసుకున్నాడు. పునీత ఈజిప్టు ఆంథోనీ వారు అన్నీ వదలి వేసుకున్నారు. అందుకే దేవుడు వారిని  హెచ్చుగా దీవించారు.
సువిశేషంలో  పేతురు గారు దేవుని సేవ చేసేవారి గురించి ఒక ప్రశ్న అడుగుచున్నారు.  అంతయు విడిచి పెట్టి మేము నిన్ను అనుసరించితిమి అనెను. అప్పుడు ప్రభువు వారికి  చక్కని సమాధానం ఇస్తున్నారు. వారిని దీవిస్తానని నూరంతలుగా  ఫలాన్ని పొందుతారని  చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు. వారికి నిత్య  జీవితం కూడా దొరుకుతుంది అని యేసు ప్రభువు  తెలియచేస్తున్నారు. కాబట్టి మన యొక్క  విశ్వాస జీవితములో  దైవ జ్ఞానం కలిగి దేవుడిచ్చిన సంపదలు పేద వారికి పంచి , దేవుణ్ణి కలిగి జీవిస్తూ  , నిత్య జీవం పొందటానికి అర్హులగుదాం.
 BY REV.FR. BALA YESU OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...