7, జనవరి 2023, శనివారం


ప్రభువు సాక్షాత్కార పండుగ

యెషయా 60:1-6

ఎఫెసీ 3:2-6

మత్తయి 2:1-12

 

నేడు మనం యేసు క్రీస్తు ప్రభువు యొక్క సాక్షాత్కార పండుగను కొనియాడుచున్నాం. దీనిని ముగ్గురు రాజుల పండుగ అని కూడా పిలుస్తారు.

దేవుడు తనను తాను ఈ లోకానికి బయలుపరచుకొన్న గొప్ప రోజు మానవ చరిత్రలో జరిగిన అపూర్వమైన, ఆ సామాన్యమైన ఘటనను కనులారా చూసేందుకు ముగ్గురు రాజులు అన్వేషించి వచ్చారు.

సాక్షాత్కారం అంటే ఎరుకపరుచుట అని అర్థం దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి అంతటికి ఎరుకపరిచారు.

ఏసు సాక్షాత్కారం ద్వారా మానవలోకంలో దైవసాక్షాత్కారం జరిగింది.

దేవుడికి మానవులకు మధ్య తెరచాటు తొలగిపోయింది.

ఈ పండుగను మూడు విధాలుగా పిలుస్తారు.

1. ముగ్గురు రాజుల పండుగ

2. విశ్వాసుల పండుగ

3. అన్యుల క్రిస్మస్ పండుగ అని పిలుస్తారు.

ముగ్గురు జ్ఞానులు అయినప్పటికిని వారు దేవుడిని ఆరాధించారు, వారికి అంతయు తెలిసినప్పటికీని వారి కన్నా గొప్ప దేవుడు, గొప్ప రాజు అని వారు గ్రహించి ఆయనను ఆరాధించారు.

ముగ్గురు రాజులు: 

1. కాస్పర్ (అరేబియా) సాంబ్రాణి సమర్పించారు.

2. మెల్కియారు (ఇరాక్) బంగారం

3. బల్తజార్ (పర్షియా) పరిమళ ద్రవ్యం.

బంగారం: దైవత్వానికి గుర్తు, రాచరికనికి గుర్తు, అది విలువైనది. ఎఫెసి 1:20-22.

రాజుల సంప్రదాయం ప్రకారం ఒక రాజు ఇంకొక రాజును చూడటానికి వెళ్లే సమయంలో బంగారం తీసుకుని వెళ్లేవారు. 1 రాజు 10:10 షేభారాణి సొలోమోను చూడటానికి వెళ్ళినప్పుడు బంగారం ను తీసుకొని వెళ్లారు.

మనం కూడా చుట్టాలను చూడటానికి వెళ్లే సందర్భంలో ఏదో ఒకటి తీసుకుని వెళతాం. సృష్టిని చేసిన దేవుణ్ణి దర్శించటానికి వెళ్లే సమయంలో మనం ఏం తీసుకుని వెళుతున్నాం?

బంగారం ఎప్పుడూ కూడా దాని విలువను కోల్పోదు, రంగు మారదు ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది.

ఏసుప్రభు నీ జీవితం కూడా మారని జీవితం ఆయన నిన్నను, నేడును ఎప్పుడు అలాగే ఉంటారు హెబ్రీ 13:8.

ఈ బంగారం యేసు ప్రభువు రాజు అని, పరిశుద్ధుడు అని సూచిస్తుంది.

మనం చాలా సందర్భాలలో దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు బంగారం పెట్టుకొని వస్తాము కానీ బంగారము పట్టుకొని రాము. పట్టుకొని రావటం అంటే పరిశుద్ధతను చేకొని రావడం.

పరిశుద్ధత లేకుండా మనం దేవుడిని చూడలే, దర్శించలేము, ఆరాధించలేము.

యెషయా 59:2 - పరిశుద్ధత మనందరికీ కావాలి

కీర్తన 66:18 పరిశుద్ధత

రెండవ కానుక - సాంబ్రాణి యాజకత్వం కు గుర్తు. ఈ లోకంలో జన్మించిన వ్యక్తి నిజమైన యాజకుడని అర్థం.

తన యొక్క యాజకత్వ విధులు నిర్వహిస్తూ దేవునికి ప్రజలకు మధ్య ఒక నిచ్చెనగ ఉన్నారు, క్రీస్తు ప్రభువు.

సాంబ్రాణి మనందరికీ సువాసన ఇస్తుంది, ఆనందాన్నిస్తుంది దేవుని జీవితం కూడా మనకు ఆనందం ఇస్తుంది.

ఏసుక్రీస్తు ప్రభువు యాజకునికి మనకోసం తానే ఒక బలిగా సమర్పించబడ్డ నిజమైన యాజకుడు.

సాంబ్రాణి పవిత్ర గ్రంథంలో - నిర్గమ 25:1,2,6 35:4,8,27,29

నిర్గమ 30:7-8,2 రాజు దిన 13:11

సంఖ్యా 4:14

1 సమూ 2:28

సాంబ్రాణి దేవునికి సమర్పించేది ఆ విధంగానే ఏసుప్రభు జీవితం కూడా సమర్పించబడినది.

మూడవ కానుక - పరిమళ ద్రవ్యం - ఆయన మరణమునకు గుర్తు.

పరిమళ ద్రవ్యమును చాలా విధాలుగా వాడుతారు.

నిర్గమ 30:28

కీర్తన 45:8 వస్త్రాలకు

సామెత 7:17 పడక మీద

పరమగీతం 1:30 శరీరానికి

యోహాను 19:39-40 మృతదేహాలకు

ముక్కు రంధ్రంలో ఈ పరిమళ ద్రవ్యమును వేస్తే చాలాకాలం మృత శరీరాలను నిలవ చేయవచ్చును.

ఏసుప్రభుని శరీరమును పరిమళ ద్రవ్యముతో అభ్యాంగనము చేయుటకు ఈ విధంగా చేశారు.

ఈ ముగ్గురు రాజులు దేవుడిని తెలుసుకోవడానికి పవిత్ర గ్రంథమును చదవలేదు ఒక నక్షత్రంను అనుసరించుట ద్వారా రాజును కనుగొన్నారు.

1. అన్వేషించుట - వెదకుట

వెదకుట సర్వసాధారణం గా మనం మన జీవితంలో ప్రతిరోజు కూడా దేనికో దానికి వెతుకుతూనే ఉంటాం.

-సంతోషం కోసం వెదకుతాం

-ప్రేమ కోసం వెదకుతాం

పని కోసం వెదకుతాం

-నిజమైన స్నేహితుల కోసం వెదకుతాం.

పవిత్ర గ్రంథంలో వెదికేవారు

1. మరియమ్మ, యోసేపు

2. వర్తకుడు

3. పోగొట్టుకున్న నాణెం

4. తప్పిపోయిన గొర్రె

మనం నిజాయితీగా వెతికితే తప్పనిసరిగా దాని నీ కనుక్కుంటాం వెదకుడు మీకు దొరకబడును - మత్తయి 7:7.

మన యొక్క జీవితంలో దేవుని వెదకాలి, ఆయన చిత్తం వెదకాలి, ఆయన యొక్క సుగుణాలు వెదకాలి.

2. వారి యొక్క విశ్వాసం - యూదులు ధర్మశాస్త్రమును తెలిసినప్పటికిని ప్రభువు యొక్క జనన సాంకేతాలు గుర్తించలేదు. అనీలు జ్ఞానులు కేవలం నక్షత్రమును మాత్రమే ఆధారంగా చేసుకొని వెంబడించారు.

నక్షత్రం కేవలం రాత్రి మాత్రమే కనబడుతుంది కాబట్టి అది ఒక చీకటి ప్రయాణం దానికి మూలం విశ్వాసమే.

వారు అంతగా విశ్వసించారు కాబట్టి అయినా శ్రమించి ప్రయాణం చేశారు.

వారు విశ్వసించారు కాబట్టియే నడవసాగారు.

వారి ప్రయాణం అంత సామాన్యమైనది, సులభమైనది కాదు అయినప్పటికీ వారు ఓపికతో ప్రయాణం చేశారు. వారి ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఆ దేవుని విశ్వసించారు అందుకే ఆయనను చేరారు.

అన్ని రాత్రులు ప్రయాణం చేశారు ఎక్కడకు నక్షత్రం తీసుకొని వెళ్తుందో తెలియదు అయినా ప్రయాణం చేశారు ఎందుకంటే విశ్వసించారు.

3. నూతన మార్గానికి మలుపు - జ్ఞానులు బాల యేసును ఆరాధించిన తరువాత వారు వేరొక మార్గమున తిరిగి వెళ్లారు.

పాతది విడిచిపెట్టి క్రొత్త మార్గం ను వెంబడించారు.

వేరొక మార్గం అంటే ఒక భౌగోళికమైన క్రొత్త దారి మాత్రమే కాదు అది ఒక మనస్తత్వం మానసిక స్వభావం, కొత్త హృదయం, జీవితం ఆనందమును దేవునికి సాన్నిద్యాన్ని మోసుకొని వెళుతున్నారు.

ప్రభు నీ తెలుసుకొన్న వారు కలుసుకున్న వారు ఎప్పుడూ పాత జీవితం జీవించరు.

-సౌలు

-జక్కయ్య

తెలుసుకొని కలుసుకున్న తరువాత మన జీవితం మునుపటి లాగా ఉండదు.

అప్పుడు వారు వేరే మార్గం ద్వారా ప్రయాణం చేస్తారు.

4. నక్షత్రం - వెలుగునిస్తుంది

వారు చూసిన నక్షత్రం వారిని సంతోషంతో నింపింది. మనం కూడా ఇతరులను సంతోషంతో నింపాలి. నక్షత్రం జ్ఞానులను నడిపించింది అలాగే మనం కూడా ఇతరులను దేవుని వైపునకు నడిపించాలి. ఈ నక్షత్రం వేలాది నక్షత్రాలలో ప్రత్యేకమైనది అలాగే మన జీవితం కూడా మిగతా వారి కన్నా ప్రత్యేకంగా ఉండాలి- ప్రేమించుటలో, ప్రార్థించుటలో, క్షమించుటలో etc..

నక్షత్రం ప్రత్యేకమైనది అయినా కానీ మిగతా నక్షత్రాల మధ్యనే ఉన్నది మనం కూడా అందరితో మంచిగా ఉండాలి.

5. వారిలో ఉన్న గాఢమైన కోరిక- దేవుణ్ణి చూడాలి, తాకాలి, ఆయన్ను ఆరాధించాలి అని అనుకున్నారు. కోరిక ప్రకారం శ్రమించారు అప్పుడు కార్యసాధకులుగా ఉంటున్నారు.

6.వారు జ్ఞానులు రాజులు అయినప్పటికీ అప్పుడే జన్మించిన శిష్కుని ఆరాధించారు సాష్టాంగ పడి నమస్కారం తెలిపారు అది వారి వినయంకు గుర్తు.

7. దేవుని మాటలకు విధేయత చూపారు.

8. దేవునికి విలువైన కానుకలు సమర్పించారు.

9. దేవునికి తమ కానుకలను సమర్పించారు.

10. దేవునికి, రాజుకు తమ హృదయాలను విప్పి పూర్ణ హృదయంతో ఆరాధించారు.

11. ముగ్గురు రాజులు కలిసి ఉంటున్నారు. వారి ప్రయాణం కలిసి సాగుతుంది మనం కూడా కలిసి ప్రయాణం చేయాలి.

12. గమ్యం కు నడుచుట - గమ్యం మరువలేదు.

 


30, డిసెంబర్ 2022, శుక్రవారం

మరియమ్మ గారి మాతృత్వ పండుగ


 మరియమ్మ గారి మాతృత్వ పండుగ

సంఖ్యా 6:22-27
గలతీ 4:4-7
లూకా 2:16-21

ఈరోజు మనందరికీ ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే ఒక పండుగ. హిందూ, ముస్లిం, క్రైస్తవ అనే భేదాలు లేకుండా అందరూ కూడా ఈ రోజున ఆనందంగా కొని ఆడతారు. ఈరోజు ముఖ్యంగా మనం నాలుగు ముఖ్య పండుగలు కొనియాడుచున్నాం.

1.మరియమ్మ గారి మాతృత్వ పండుగ - ఈ పండుగ కేవలం కతోలికలు మాత్రమే జరుపుకుంటారు.
2. ఏసుప్రభు యొక్క నామకరణ పండుగ - ఈ పండుగను క్రైస్తవులు అందరూ జరుపుకుంటారు.
3. నూతన సంవత్సరం - ఈ కొత్త సంవత్సరం అన్ని దేశాల ప్రజలు జరుపుకుంటారు.
4. ప్రపంచ శాంతి పండుగ - అందరూ శాంతియుతంగా జీవించాలని తెలిపే పండుగ. కేవలం మాటల ద్వారా మాత్రమే కాకుండా క్రియల ద్వారా శాంతిని ప్రకటింప చేయాలని తెలుపుతుంది.

ఈరోజు చాలామంది బయట క్రొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటుంటే మనందరం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తున్నాం.
దేవుని యొక్క కృప ఉంటే చాలు నేను బ్రతికేదను, ఆశీర్వదించబడతాను అనే ఒక గొప్ప నమ్మకంతో క్రొత్త రోజు ప్రారంభమయ్యే సమయంలో మనం దేవునితో గడుపుతున్నాం.
ఒక సంవత్సరం అయిపోయి రెండవ (కొత్త) సంవత్సరం ప్రారంభమవుతుంది, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కేవలం దేవునికి మాత్రమే అంతా తెలుసు. దేవుడు మనందరి యొక్క అభివృద్ధి కొరకై మంచి ప్రణాళికలు తయారు చేస్తారు. - యిర్మీయా 29:11.
గడిచిన సంవత్సరం యొక్క చేదు అనుభవాలు విడిచిపెట్టి, రాబోయే రోజులను చూస్తూ ముందుకు సాగాలని పౌలు గారు అంటారు - పిలిప్పీ 3:12-14.
ప్రతి ఒక్క సంవత్సరంలో మనకు కష్టాలు, బాధలు, హింసలు, మనస్పార్ధాలు, కలహాలు, సంతోషాలు కలగవచ్చు అయితే అన్నింటిలో కూడా దేవుడిని అంటిపెట్టుకొని జీవించాలి.
మనందరి యొక్క జీవితాలను ఆశీర్వదించమని మనకు అన్ని సమయాలలో దేవుడు తోడుగా ఉడాలని మనందరం ప్రార్థన చేయాలి.
ఈ నూతన సంవత్సరం రోజున జరిగే దివ్యబలి పూజలో ప్రార్థనలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేయుట మన యొక్క సాంప్రదాయం. పరులకు ఈ సంవత్సరం మొత్తం కూడా మేలు కలగాలని మనం పొరుగు వారికి శుభాకాంక్షలు తెలుపుదాం.
ఈ క్రొత్త సంవత్సరం అందరూ కూడా బాగుండాలని సంతోషంగా ఉండాలని ప్రేమతో ఉండాలని దేవునితో ఉండాలని సిరిసంపదలతో హాయిగా ఉండాలని మనందరం ఈరోజు ప్రార్థించాలి.

ఈనాటి ఈ నాలుగు పండుగల యొక్క సారాంశం ను ధ్యానించుకుందాం.

1.మరియమ్మ గారి మాతృత్వ పండుగ - మరియమ్మ గారు దేవుని యొక్క తల్లి అని తెలిపే పండుగ, ఎందుకంటే క్రీ. శ 431 వ సంవత్సరంలో Bishop Nestorian మరియమ్మ గారు కేవలం క్రీస్తు తల్లియే అనే సిద్ధాంతంలో ప్రకటించారు. అయితే అదే సంవత్సరంలో ఎఫేసు నగరంలో జరిగిన సదస్సులో మరియమ్మ గారు దేవుని తల్లి అనే ప్రకటించడం జరిగింది.
మరియమ్మ గారు కేవలం మానవ స్వభావం కలిగిన క్రీస్తుకు మాత్రమే కాదు జన్మనిచ్చినది, రెండు మానవ, దైవ స్వభావం కలిగిన దేవుని బిడ్డకు జన్మనిచ్చారు. ఏసుక్రీస్తు త్రిత్వం లో రెండవ వ్యక్తి దేవుని కుమారుడు ఆయనయే దేవుడు కాబట్టి మరియమ్మ గారు దేవుని తల్లి అనీ ప్రకటించారు. మాతృత్వం అంటే తల్లి కావటం అని అర్థం, దాంపత్య జీవితంలో ఉన్న అందరూ కోరుకునేది తల్లి అవ్వటం.
అమ్మతనంలో గొప్ప మాదుర్యం  ఉన్నది. తల్లి లేనిదే మనం లేము. తల్లి ద్వారానే మనం ఈ లోకంలోనికి ప్రవేశిస్తుంన్నం కాబట్టి అందరి తల్లులకు కృతజ్ఞతలు తెలుపుదాం. మాతృత్వం అనే లోటు పిల్లలు లేని తల్లులకు మాత్రమే అర్థమవుతుంది. మరియమ్మ గారి యొక్క గొప్పతనం ఏమిటంటే సృష్టిని చేసిన దేవునికి మరియమ్మ గారు జన్మనిచ్చారు, మరియమ్మ గారు తనను ఈ లోకంలో సృష్టించిన దేవుణ్ణి మరలా తాను ఈ లోకంలో సృష్టించారు.

మరియమ్మ గారి గురించి నాలుగు విశ్వాసలకు సంబంధించిన సిద్ధాంతాలు ప్రకటించబడ్డాయి (DOGMA).

1. దేవుని తల్లి             - MARY MOTHER OF GOD
2. నిత్య కన్యక             - PERPETUAL VIRGINITY OF MARY
3. నిష్కలంక మాత     - IMMACULATE CONCEPTION OF MARY
4. మోక్షరోహణం         - ASSUMPTION OF MARY

ఈ నాలుగు సిద్ధాంతాలు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ నాలుగు కూడా ఆమె యొక్క పవిత్రతను గొప్పతనం ను చాటి చెబుతున్నాయి.
దేవునికే తల్లి అవటం అన్నది చాలా గొప్ప వరం. దేవుడే స్వయంగా మరియమ్మ గారిని తన తల్లిగా ఎన్నుకొన్నారు. ఎందరో అందమైన వారు చదువుకున్న వారు ధనవంతులు ఉండవచ్చు కానీ మరియమ్మ గారిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నారు.
మరియమ్మ గారికి దేవుడిచ్చిన గొప్ప వరం ఇది, అందుకే దేవదూత సైతం ఆమెను గౌరవిస్తున్నారు - లూకా 1:28.
ఆమె గురించి యెషయా ప్రవక్త పలికిన మాటలు నెరవేరాయి - యెషయా 7:14, మత్తయి 1:22.
మరియమ్మ గారు  పవిత్రాత్మ ప్రభావమున గర్భం ధరించి వాక్కుగా ఉన్న దేవునికి జన్మనిచ్చారు - యోహాను 1:1.
మరియమ్మ గారు దేవుని యొక్క ప్రణాళిక కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేస్తుంది. అందుకే ఆమె దేవుని యొక్క తల్లి.
మరియ తల్లి దేవుని భారాన్ని మోసి, మానవుని భారాన్ని తీసివేసిన గొప్పతల్లి. ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితం తల్లి ద్వారా ప్రారంభమైనట్లే యేసు ప్రభువు యొక్క జీవితం మరియ తల్లి ద్వారా ప్రారంభమైంది. మన యొక్క తల్లులు త్యాగమూర్తులు వారి యొక్క త్యాగఫలమే మన యొక్క ఆనంద జీవితం. మరియ తల్లిని దేవుడు తన తల్లిగా అంగీకరించి ఆ తల్లిని మన తల్లిగా అందిస్తున్నారు. అమ్మ ప్రేమ గొప్పది అమ్మ ఆదరణకు ప్రతిరూపం కాబట్టి మనం మన యొక్క తల్లిని ప్రేమిస్తూ గౌరవిస్తూ జీవించాలి. స్వయంగా దేవుడే మరియమ్మ గారిని గౌరవించారు, తనను ప్రేమించారు.

ఈరోజు మనందరం కూడా మరియ తల్లి యొక్క ఔనత్వం తెలుసుకోవాలి. మనందరం కూడా ఆ తల్లిని గౌరవించాలి.
- రక్షకున్ని మోసిన గర్భం పవిత్రమైనది.
- రక్షకున్ని ఎత్తుకున్న చేతులు పవిత్రమైనవి.
- రక్షకున్ని నడిపించిన కాళ్లు పవిత్రమైనవి.
- రక్షకుని వాక్కును హృదయంలో పదులపరుచుకున్న హృదయం పవిత్రమైనది.
కాబట్టి ఆమెను ఆమె యొక్క మాతృత్వన్ని గౌరవించూద్దాం.

మనం ఈ లోకానికి రావడానికి కారణమైన మన తల్లిని ఎప్పుడూ గౌరవించి, ప్రేమించి చూసుకుందాం. తల్లి లేనిది మనం లేము అనే సత్యం గుర్తుంచుకొని అమ్మను ప్రేమిద్దాం.

2. యేసు నామకరణం - ఏసుప్రభువుకు పేరు పెడుతున్నారు యూదుల ఆచారం ప్రకారం, శిశువు పుట్టిన ఎనిమిది రోజులకు పేరు పెడతారు.
బాప్తిస్మ యోహానుకు 8 రోజులకు పేరు పెట్టారు - లూకా 1:59, లూకా 2:21.
ఏసు అనే గ్రీకు నామం హెబ్రియా భాషకు చెందిన యెహోషువ నామం కు సమానం అంటే YHWH రక్షకుడు అని అర్థం.
ఏ విధంగానైతే మొదటి యెహోషువ (మోషే తరువాత నాయకుడు) ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల నుండి కాపాడారు అదేవిధంగా రెండవ యెహోషువ (యేసు) ప్రజలను పాపం నుండి కాపాడుతారు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. మనల్ని అన్ని విధాలుగా రక్షించే దేవుడు యేసు ప్రభువు. దేవుని యొక్క నామం ఉచ్చరించటం ద్వారా మనందరికీ దేవుని యొక్క ఆశీర్వాదం కలుగుతుంది.
యేసు నామకరణం ద్వారా చరిత్రలో ఒక కొత్త సంవత్సరం ప్రారంభమైంది. రక్షక నామంతో ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది.
ఏసుప్రభు యొక్క నామాన్ని పలికి ప్రతి ఒక్కరూ రక్షించబడతారు - అపో 2:21.
దేవుని యొక్క నామం తలంచుకున్నప్పుడు మనలోకి దైవ శక్తి వస్తుంది.
శిష్యులు యేసు ప్రభువు యొక్క నామమున అనేక అద్భుత కార్యాలు చేశారు కాబట్టి యేసు నామం జపించి దీవెనలు పొందుదాం.

3. నూతన సంవత్సరం 
- ఈ నూతన సంవత్సరం దేవునితో ప్రారంభిస్తున్నాం.
ఈ నూతన సంవత్సర ప్రారంభంలో దేవుని యొక్క వాక్యం ఆశీర్వాదం గురించి తెలుపుతుంది.
మనందరి జీవితంలో దేవుని యొక్క దీవెనలు కావాలి. దీవెనలు ఎందుకంటే మనం ఎన్ని కష్టాలు బాధలు సమస్యలు వచ్చినా పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు యొక్క ఆశీర్వాదం ఉంటే అన్ని అధికమించవచ్చు.
దీవించుట అంటే పవిత్రపరచుట అభిషేకించుట, దేవుని అనుగ్రహాన్ని ఖాక్షించుట, మంచి జరగాలని కోరటం ఆనందింప చేయుట లేదా అదృష్టాన్ని కలిగించుట అని చెప్పవచ్చు.

ఈనాటి మొదటి పఠనం లో ఈ నూతన సంవత్సరంలో కావలసిన మూడు రకాల దీవెనల గురించి తెలియజేయబడింది.

1. యావే మిమ్ము కాపాడును గాక.
2. యావే మిమ్ము కరుణించును గాక.
3. యావే మీకు సమాధానము ఒసుకుగాక.

మొదటి ఆశీర్వాదం కాపాడుట గురించి - మోషే కాలంలో ఇది ప్రధానంగా శత్రువుల దాడి నుండి కరువు నుండి అనేక రకాల ఆపదల నుండి కాపాడుటను సూచిస్తుంది.
దేవుని యొక్క సంరక్షణ మనకు ఎంతో అవసరం, ఈ సంవత్సరం మొత్తం మనందరం అనేక విషయాలలో కాపాడబడాలి.
దేవుడి మనలను       -ఆటంకముల నుండి
                                -సమస్యల నుండి
                                -ప్రాణాపాయము నుండి
                                -రాబోయే వైరస్ ల నుండి
                                -అనారోగ్యముల నుండి
                                -ఆర్థిక సమస్యల నుండి
                                -యుద్ధాల నుండి
                                -సైతాను శక్తుల నుండి
దేవుడు అనేక విధాలుగా మనలను రక్షించాలి, అందుకే మొదటిగా దేవుని యొక్క కాపుదల మనకి అవసరం.
ఒక గొర్రెల కాపరి  తన మందను ఏ విధంగానైతే కాపాడారు అదే విధంగా దేవుడు మనల్ని కాపాడితే మనకు ఎటువంటి ఇబ్బందులు రావు.

2. రెండోవ ఆశీర్వాదం - దేవుని యొక్క ముఖ కాంతి మనపై ప్రకాశిస్తుంది. ముఖ కాంతి దేవుని యొక్క సాన్నిథ్యంకు గుర్తు. మోషే దేవునితో సినాయి పర్వతము వద్ద 40 రోజులు ఉన్నప్పుడు ఆయన యొక్క మొఖం  కూడా ప్రకాశించింది. దేవుని యొక్క సానిద్యంతో నింపబడింది.
మనం కూడా దేవునితో కలిసి ఉన్నప్పుడు మనం ఆయన యొక్క ముఖ కాంతితో ఆయన యొక్క సాన్నిధ్యంతో నింపబడుతాం.
దేవుని యొక్క కరుణ కూడా ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటుంది.

3. దేవుని యొక్క కృప తోడుగా ఉండి శాంతి సమాధానాలతో దీవించబడతారు.

ఎవరైతే సంపూర్ణంగా కేవలం దేవుని ఎడల మాత్రమే విశ్వాసముంచుతారో వారు శాంతి సమాధానాలతో జీవిస్తారు - యెషయా 26:3-4.
ఏసుక్రీస్తు ప్రభువు శాంతి రాజు, సమాధానకర్త అనేక పేద వారి హృదయాలలో సమాధానమును దయచేసిన ప్రభువు.
మనం దేవుని మీద ఆధారపడి జీవిస్తే దేవుని యొక్క శాంతి మనలో ఎప్పుడూ ఉంటుంది.
ఈ మూడు ఆశీర్వాదాలు మన యొక్క అనుదిన జీవితాలలో చాలా అవసరం.
దేవుని యొక్క సంరక్షణ దేవునితో గడపటం అదేవిధంగా దేవుని యొక్క సమాధానం తోడుగా ఉంటే అన్నివేళలా మనకు మేలు కలుగుతుంది.
యాకోబు దేవునితో కృస్తీపట్టే సమయంలో ఆయన సంపదల కోసమో, రాజ్య విస్తరణ కోసం అడగలేదు, దేవుని ఆశీర్వాదం కోసం అడిగాడు - ఆది 32:26.
మనం కూడా ఆశీర్వదించుటకు ఆశీర్వాదం పొందుటకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి.
ప్రభువు యొక్క ఆశీర్వాదం ఉంటే అభివృద్ధి చెందుతాం, కష్టాలు అధిగమించవచ్చు, శత్రువులను జయిస్తాం, పుణ్య మార్గంలో నడుస్తాం, మంచిని అలవర్చుకుంటాం, కాబట్టి ఆశీర్వాదం కోసం దేవునికి ప్రార్థిద్దాం.

ఈ నూతన సంవత్సరం నూతనంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి.

1. పాతది విడిచి పెట్టాలి క్రొత్తదనంను ధరించాలి.

పాతది విడిచి పెడితేనే మనం క్రొత్తది స్వీకరించగలం అందుకే పౌలు గారు ఎఫెసీ 4:22-24 పాత పాపమును విడిచిపెట్టి జీవించమని ఆహ్వానిస్తున్నారు.
                      -పాత  వ్యసనాలను   విడిచిపెట్టాలి.
                      -పాపం విడిచి పెట్టాలి.
                      -కోపం గర్వం విడిచిపెట్టాలి.
                      -అసూయ ద్వేషాలు విడిచిపెట్టాలి.
                      -పగలు స్వార్ధాలు విడిచిపెట్టాలి.
                       -అన్యాయపు జీవితం విడిచిపెట్టాలి.
                       -కుట్రలు కుతంత్రాలు విడిచిపెట్టాలి.
                       -పాత చెడు స్నేహాలు విడిచి క్రొత్త మంచి స్నేహాలు పాటించాలి.

పాత భవనం కూలిస్తే గాని క్రొత్త భవనంలో నిర్మించలేము అందుకే పాత పాపపు జీవితంను విడిచి క్రొత్త జీవితం అలవర్చుకోవాలి.
చీకటి పనులు మానివేసి వెలుగుకు సంబంధించిన పనులు చేయాలి - రోమా 13:12.
క్రొత్త ప్రేమ సేవ నిస్వార్థం విశ్వాసం మంచితనం వినయం అలవర్చుకొని జీవిస్తే కృత సంవత్సరం క్రొత్తదిగా ఉంటుంది లేదంటే క్యాలెండర్లో అంకెలు మాత్రమే మారతాయి గాని మన యొక్క జీవితాలు మారవు.
క్రీస్తు ప్రభువును ధరించి జీవిస్తే మన జీవితాలలో నూతనత్వము ఉంటుంది క్రీస్తు అనే రక్షణ కవచం ధరించి జీవిస్తే మనం దీవించబడతాం.

2. మన హృదయాలు దేవుని కొరకు తెరవాలి.

ఏ కుటుంబ ద్వారాలు అయితే దేవుని కొరకు తెరుస్తారు అక్కడ దేవుడు ప్రవేశిస్తారు.
ఏసుప్రభు అనేకమంది గృహాలలోకి ప్రవేశించాలని బెత్లెహేములో వారి తలుపులు తట్టారు కానీ ఎవరు ఆయనకు తలుపు తీయలేదు - యోహాను 1:11.
ఏసుప్రభు కొరకు మనం తలుపు తీస్తేనే ఆయన మనలోనికి వచ్చి ఉంటారు - దర్శన 3:20.
ప్రతి హృదయపు తలుపులు దేవుడు తడుతుంటారు  మనందరం ఆయన్ను మనలోనికి ఆహ్వానించాలి.
మనం ప్రభువును ఆహ్వానిస్తే చాలు మన జీవితాలు మారతాయి.
జక్కయ్య ఏసుప్రభును తన ఇంటిలోనికి ఆహ్వానించారు తన జీవితమే మారిపోయింది, అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తము మనం దేవుని మన యొక్క హృదయాలలోనికి ప్రార్ధన ద్వారా, వాక్యం చదవడం ద్వారా, దివ్య సప్రసాదం స్వీకరించుట ద్వారా, మనలోనికి ఆహ్వానిస్తే మనం నిచ్చింతగా  ఉండవచ్చు.
మన యొక్క హృదయపు తలుపులు తెరిస్తేనే మనం దేవుని ఆహ్వానించగలం అదే విధంగా మనం కూడా మంచి చేయగలుగుతాం.

3. దేనికి ప్రాముఖ్యత ఇచ్చి జీవించాలి - 

మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో దైవ ప్రేమ సోదర ప్రేమకు ప్రాముఖ్యతను జీవించాలి - మత్తయి 22:36-39, మత్తయి 6:25-33.
దైవ ప్రేమ, సోదర ప్రేమ పాటిస్తే మనల్ని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు.
కేవలం దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపి జీవించిన వారు  దైవమును, సోదరులను, ప్రేమించగలరు. ఈ రెండింటిలో ఏది పాటించకపోయినా సరే జీవితాలకు నిజమైన అర్థం ఉండదు.
ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇవ్వాలి.
దేవాలయాలకు వెళ్ళుటకు ప్రాముఖ్యతనివ్వాలి.
అవసరాలలో ఉన్న వారికి ప్రాముఖ్యతను ఇవ్వాలి.
ఈ కొత్త సంవత్సరంలో మనం క్రొత్తగా ఉండాలంటే ఈ యొక్క గొప్ప విషయాలు పాటించాలి.

4. ప్రపంచ శాంతి రోజు - 

యొక్క పండుగను పరిశుద్ధ 6 వ పౌలు పాపుగారు 1968 లో ప్రారంభించారు. ఈ ప్రపంచంలో ఉన్న అందరూ కోరుకునేది శాంతియే. చాలామంది శాంతిని ప్రకటిస్తారు కానీ శాంతి యుతంగా జీవించరు.
కుటుంబంలో శాంతి లేదు, మతాల మధ్య శాంతి లేదు, రాజకీయ పార్టీలలో శాంతి లేదు.
నిజమైన శాంతి అంటే ఒకరినొకరు గౌరవించుటయే ,అర్థం చేసుకొనుటయే, ప్రేమించుటయే.
మనం ఎప్పుడైతే నిజాయితీగా జీవిస్తామో ధైర్యంగా ఉంటామో, దేవుని మీద ఆధారపడి జీవిస్తామో, అప్పుడు మనం శాంతియుతంగా ఉండగలుగుతాం.
మనం దేవుని కొరకు జీవిస్తామో, అప్పుడు శాంతియుతంగా జీవించగలుగుతాం. దేవుని కలిగి ఉంటాము. అప్పుడు శాంతియుతంగా జీవిస్తాం.
ఈ నూతన సంవత్సరం దేవునితో ప్రారంభిస్తున్నాం కాబట్టి అన్నివేళలా దేవుని అంటిపెట్టుకొని జీవించాలి.

FR. BALAYESU OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...