14, అక్టోబర్ 2023, శనివారం

28వ సామాన్య ఆదివారం

28వ సామాన్య ఆదివారం
యెషయ 25:6-10, ఫిలిప్పీ 4:12-14,19-20, మత్తయి 22:1-14

ఈనాటి దివ్య పఠణాలు దేవుడు సమర్పించే ప్రేమ విందు గురించి సెలవిస్తున్నాయి. ఏదైనా పండగ చేసుకునేటప్పుడు ఆహ్వానాన్ని పంపించడం మన యొక్క సాంప్రదాయం. ఇచ్చిన ఆహ్వానని మన్నించి వారి యొక్క ఆతిధ్యాన్ని స్వీకరించుట ఆహ్వానం పొందిన వారి యొక్క బాధ్యత. ఇది పరస్పర ప్రేమకు గుర్తు. యూదుల యొక్క ఆచారం ప్రకారం విందు జరుపుకునే ముందు ఆహ్వానం పంపించుట వారి యొక్క ఆనతి.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకై సిద్ధపరచినటువంటి విందు గురించి బోధించబడింది. ఈ విందు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం కొంతమందికి మాత్రమే కాదు అందరి కొరకై సిద్ధపరచబడినటువంటి విందు. ఈ విందు సకల జాతి జనులకు సిద్ధము చేయబడినది. సాధారణంగా మనము ఏదైనా పండుగ కానీ వివాహ సందర్భముగాని జరుపుకున్నట్లయితే మనం కేవలము మనకు తెలిసిన వారిని మనకు నచ్చిన వారిని మాత్రమే పిలుస్తుంటాం కానీ ఇక్కడ ప్రభువు ఈ విందును అందరికీ కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రతి విందు కూడా సంతోషకరమైనది. ఎందుకంటే మన యొక్క ఆనందం పంచిపెట్టుకొరకై వారికి మనము భోజనమును ఒక ప్రేమను వ్యక్తపరిచేదానిగా ఇస్తూ ఉంటాం. దేవుడు ఏర్పరచినటువంటి విందు నిజముగా ప్రజల యొక్క జీవితంలో ఉన్నటువంటి విచారమును తొలగించి వారిలో సంతోషాన్ని నింపినది. బహుశా ఆకలితో ఉన్న వారి యొక్క ఆకలిని తీర్చినప్పుడు ఆ వ్యక్తి ఏ విధముగానైతే సంతోషంగా ఉంటారు. అదేవిధంగా దేవుడు ప్రజలకు తన యొక్క ఆధ్యాత్మిక విందును ఏర్పరచినప్పుడు వారి యొక్క జీవితమును కూడా అంతే సంతోషముగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క విందు యొక్క ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరిని కూడా సమావేశపరచేటటువంటి విందు కేవలము కొలది మంది మాత్రమే అందరూ కూడా భాగస్తులై తమ యొక్క స్నేహమును, ప్రేమను వ్యక్తపరచుకునే విందు. అదేవిధంగా దేవుడు తన యొక్క ప్రజల యొక్క కన్నీళ్ళను తుడిచివేయను, తన ప్రజల యొక్క అవమానము తొలగించును. ప్రభువు తన ప్రజల పట్ల చూపించినటువంటి ఆ ప్రేమ, కరుణ వలన ప్రజలు ఇంకా ఆయన యందు విశ్వాసాన్ని పెంపొందించుకొని జీవిస్తారు. వారి యొక్క విశ్వాసమును కూడా ఈ విధముగా ప్రకటిస్తారు. మనము ప్రభువుని నమ్మితిని కావున ప్రభువు మనలను కాపాడును. మన పక్షమున దేవుడు పోరాడి శత్రు సైన్యమును నాశనము చేసెను అని దేవుని యొక్క రక్షణ మన గురించి సంతోషించెదరు. ఈ మొదటి పఠణం ద్వారా దేవుడు తన ప్రజల యొక్క ఆకలిని సంతృప్తి పరచే విధానమును మనము గ్రహిస్తున్న ఆయన ఏ విధముగానయితే అందరిమీద వర్షమును సూర్యుడిని ఒకే విధముగా పంపిస్తున్నారు అదేవిధంగా తన యొక్క ప్రేమ విందును అందరి కొరకై సిద్ధం చేస్తున్నారు.ఆయన దృష్టిలో అందరూ సరిసమానులే. ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే క్రీస్తు ప్రభువు అనుగ్రహించినటువంటి శక్తిచే ఎటువంటి కష్టములైన ఎదుర్కొనుటకు తాను సిద్ధము అని తెలుపుతున్నారు. తన యొక్క సువార్త పరిచర్య జీవితంలో ఆకలిగా ఉన్న లేదా కడుపునిండా భుజించిన తనకు కొద్దిగా లభించిన లేక ఎక్కువగా లభించునా గాని అన్ని సందర్భములను బట్టి జీవించుట నేర్చుకున్నాను అని పౌలు గారు తెలుపుతున్నారు. పౌలు గారు తన యొక్క సేవా జీవితంలో అన్ని పరిస్థితులకు తన జీవితమును అలవాటు చేసుకుని జీవింప సాగారు. మనము కూడా నాకు ఇది లేదు అది లేదు అని నిందించకుండా అన్నింటికీ సర్దుకుని జీవించాలి ప్రభువు ఇచ్చే శక్తిచే పౌలు గారు అన్నీ కూడా అర్థం చేసుకొని సర్దుకుని ఉన్నదానితో సంతృప్తి చెందుతూ జీవించారు మనము కూడా అదే విధముగా జీవించాలి.
ఈనాటి సువిశేష పఠణంలో ఏసుప్రభు ప్రజలకు పరలోక రాజ్యము గురించి ఒక ఉపమాన రీతిగా బోధించారు అది ఏమిటంటే ఒక రాజు తన ప్రజల కొరకై సిద్ధము చేసినటువంటి విందు ద్వారా దేవుడు ఏ విధముగా తన రాజ్యములోనికి ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ఒక రాజు తన యొక్క కుమారుని పెండ్లికి విందును సిద్ధం చేసి ఎవరినైతే ఆహ్వానించి ఉన్నారు వారిని పిలుచుటకు సేవకులను పంపిస్తున్నారు కానీ పిలవబడినటువంటి వారు ఈ యొక్క సేవకులను లక్షపెట్టలేదు వారి యొక్క పనులకు వారి పోయి మిగతావారు సేవకులను పట్టి, కొట్టి చంపారు. తర్వాత రాజు మండిపడి తన యొక్క సైనికులను పంపించి వారిని శిక్షిస్తున్నారు. ఇక్కడ రాజు యొక్క ఉద్దేశంను తెలుసుకుంటున్నాం ఆయన యధావిధిగా అందరికీ తన ప్రేమను వ్యక్తపరచుట కొరకు తన ఆనందంలో భాగస్తులై జీవించుట కొరకు యొక్క ఆహ్వానాన్ని పంపిస్తున్నారు కానీ దానిని తృణీకరిస్తున్నారు ఎందుకంటే ప్రభువు అందరి కంటే మొదటిగా ఆహ్వానం ఇచ్చినది ఇశ్రాయేలు ప్రజలకు కానీ వారే తన యొక్క మాటను వినకుండా వారి యొక్క ఇష్టానుసారంగా జీవించారు దాని ప్రతిఫలముగా దేవుడు అందరిని కూడా తన యొక్క విందులో భావిస్తులై జీవించుటకు పిలుస్తున్నారు అనగా దేవుని యొక్క ప్రేమ అన్యులకు సకల జాతి జనులకు పంచబడినది. రాజువసగినటువంటి విందులో తాను ఎవరినైతే పిలిచి ఉన్నారు వారి నుండి కోరుకున్నది ఒకే ఒక్కటి అది ఏమిటంటే వివాహ వస్త్రం ఈ వివాహ వస్త్రము పవిత్రతకు గుర్తు అదే విధముగా ప్రేమకు గుర్తు ఎందుకంటే దేవుని యొక్క విందులో పాల్గొనుటకు మనము ఎల్లప్పుడూ కూడా పవిత్రత కలిగి వినయము కలిగి ప్రేమ కలిగి స్వీకరించాలి అప్పుడు మాత్రమే ఆ విందు మనలను బలవంతులను చేస్తున్నది. ఈ విందు దివ్య సత్రసాధనకు సూచనగా ఉన్నది కాబట్టి దివ్య సత్రపసాదం స్వీకరించే సందర్భములో మనము కూడా పవిత్రముగా ఉండాలి. దేవుడు మనందరం కూడా పౌష్టికంగా ఉండాలి అదేవిధంగా ఆ యొక్క ఆహారంతో ముందుకు సాగాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క విందును ఏర్పరిచి కాబట్టి మనము ప్రభువు ఇచ్చిన విందును స్వీకరించి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగాలి.
రాజు వలె ప్రతిరోజు కూడా దేవుడు తన విందులో పాల్గొనటకు మనలను ఆహ్వానిస్తూనే ఉంటున్నారు కాబట్టి ప్రభువుని విందులో పాల్గొని దేవుని యొక్క మార్గంలో నడవాలి.
Fr. Bala Yesu OCD

7, అక్టోబర్ 2023, శనివారం

27 వ సామాన్య ఆదివారం

27 సామాన్య ఆదివారం

 

యెషయ 5:1-7

ఫిలిప్పీ 4:6-9

 మత్తయి 21:33-43

 

ఈనాటి దివ్య పఠణాలు క్రైస్తవ యొక్క జీవితము ఫలించాలి అనే అంశము గురించి బోధిస్తున్నాయి,  అనగా మన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రతిరూపమును, మంచితనమును, ప్రేమను ప్రపంచమునకు చూపించి జీవించుటయే. మానవుల యొక్క జీవితం  మోడు బారిన జీవితం లాగా ఉండకూడదు. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి ఫలము నివ్వకుండా మనం జీవిస్తే మనకు దేవుని యొక్క శిక్ష వస్తుంది అని ప్రభువు వాక్కు ద్వారా మనకు తన హెచ్చరికలను కూడా తెలియజేస్తున్నారు.

 ఈనాటి మొదటి పఠణంలో యెషయా  ప్రవక్త ద్రాక్ష తోట గురించి పాడినటువంటి ఒక గీతము గురించి తెలియజేస్తున్నారు అంటే దేవుడు తన యొక్క ప్రజలకు ఉన్నటువంటి బంధమును ద్రాక్ష తోట యజమానుడు అని పోలుస్తూ చెబుతున్నారు. వారి యొక్క బంధము విడదీయ రానటువంటి బంధం. వారు అనునిత్యం ఒకరికి ఒకరు తోడుగా ఉండేటటువంటి బంధం ఎందుకంటే యజమానుడు ప్రతిసారి ద్రాక్ష తోట చూడటానికి, పనిచేయటానికి ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటారు అందుకనే వారి బంధం కలిసి ఉండేటటువంటి బంధం. యొక్క పఠణంలో యజమానుడు సారవంతమైన కొండమీద ఒక ద్రాక్ష తోట నాటించారు. ద్రాక్ష చెట్లు ఎదుగుదలకు కావలసినది ప్రతిదీ కూడా యజమానుడు సమకూర్చారు.

యొక్క ద్రాక్ష చెట్టు ఎదుగుదలకు ఆయన ప్రత్యేక శ్రద్ధను కనబరిచి తానే స్వయంగా ఎరువులు వేసి అంతయు సిద్ధం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో అతనికి నిరాశ ఎదురైనది మంచి పండ్లకు బదులుగా పుల్లని కాయలు కాసెను అందుకుగాను యజమానుడు నిరాశ చెందుతున్నారు. యజమానుడు నేను చేయవలసినది అంతయు చేసింది అయినప్పటికీ కూడా ఎందుకని మంచి ప్రతిఫలము రాలేదు అని  చింతిస్తున్నాడు అందుకు గారు ఆయనే తాను మంచి ఫలములు ఇవ్వని చెట్లను తీసి వేస్తాను అని తెలుపుచున్నారు. మన యొక్క జీవితంలో అనేక సందర్భాలలో మనం కూడా నిరాశకు గురవుతుంటాం ఎందుకంటే ఎదుటి వ్యక్తికి ఎంత మేలు చేసినప్పటికీ  వ్యక్తి గుర్తించకపోతే మనము చాలా బాధపడుతాం.

మేలు చేసిన వారిని గుర్తించుకోకుండా  చాలా సందర్భాలలో మర్చిపోతారు. ప్రేమించిన వ్యక్తినే ద్వేషిస్తా, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల యొక్క మేలులను మరచిపోతారు. మొదటి పఠణంలో దేవుడు ద్రాక్ష తోట ద్వారా తెలియచేసే సందేశం ఏమిటంటే ఆయన ఇశ్రాయేలు ప్రజల యొక్క అభివృద్ధి కొరకై వారికి ఇవ్వవలసినది మొత్తము కూడా ఇచ్చారు. అబ్రహామును ఎన్నుకున్నటువంటి నాటినుండి చివరి వరకు కూడా తన యొక్క సేవకులను ప్రవక్తలను పంపిస్తూనే ఉన్నారు ఫలించాలని.

- యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు స్వేచ్ఛనిచ్చారు

- తన సొంత బిడ్డ లాగా అంగీకరించారు

-తానే స్వయముగా రాత్రి

 అగ్నిస్తంభమై పగలు మేఘస్తంభమై వారిని వాగ్దాత్న భూమికి నడిపించారు

-ఎడారిలో వారికి పరలోక దూతల భుజించే మన్నాను దయచేసారు

-వారి యొక్క అభివృద్ధి కొరకై ప్రవక్తలను పంపించారు

-ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల బారి నుండి కాపాడారు.

దేవుడు వారికి అన్ని విధములుగా సహకరిస్తూ మంచిని చేస్తున్నప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు దేవుడి యొక్క మేలులను మరచి ఆయనకే వ్యతిరేకంగా జీవించారు. ప్రభు కూడా అనేక సందర్భాలలో మన యొక్క పవిత్రత కొరకై, శ్రేయస్సు కొరకై అనేక విధాలుగా మేలు చేస్తున్నారు. ప్రభువు బైబిల్ గ్రంధము ద్వారా మరియు యాజకుల బోధన ద్వారా దివ్య సంస్కారములు ద్వారా మనందరం కూడా ఫలమును ఇచ్చేటటువంటి వ్యక్తులుగా ఉండుటకు కృషి చేస్తున్నారు మరి ఆయన యొక్క వాక్యము ప్రకారంగా దివ్య సంస్కారములు ప్రకారంగా మనము మంచి జీవితాన్ని జీవిస్తున్నామా? లేదా అని మనము ప్రశ్నించుకోవాలి. ప్రభు మనందరం కూడా మంచి వారిగా ఉండాలని ప్రతినిత్యం కూడా కోరుకుంటున్నారు.

ఈనాటి రెండవ పఠణంలో కూడా పౌలు గారు ఫలమునిచ్చేటటువంటి వ్యక్తులుగా జీవించమని కోరుతున్నారు. దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన ఎడల కృతజ్ఞతా భావం కలిగి నీతిని, న్యాయమును ప్రకటిస్తూ ఒక మంచి విశ్వాస జీవితాన్ని జీవిస్తూ  ఫలము ఇచ్చేటటువంటి వ్యక్తులుగా ఉండమని పౌలు గారు ఫిలిప్పు ప్రజలకు తెలియజేస్తున్నారు.

ఈనాటి సువిషేశ పఠణంలో కూడా ఏసుప్రభు భూస్వామి కవులు దార్లు అనే ఉపమానము ద్వారా దేవుడు ఏవిధముగా తన యొక్క ప్రతిఫలం కోసం ఎదురుచూస్తున్నారు అనేటటువంటి అంశం గురించి తెలుపుతున్నారు. యొక్క ఉపమానములో భూస్వామి స్వయముగా యావే దేవుడు కౌలుదారులు ఆనాటి ఇశ్రాయేలు మత పెద్దలు,అధికారులు. ప్రభువు తన యొక్క ద్రాక్ష తోట అయినటువంటి ఇశ్రాయేలు జన సమూహమును, నాటి అధికారులకు అప్పగించారు అప్పుడు వారు దానిని దుర్వినియోగం చేసుకున్నారు.

ప్రజలకు మంచిని బోధించుటకు బదులుగా వారి యొక్క సొంత ఉద్దేశంలు బోధించి ఉన్నారు. దేవుని యొక్క చిత్తానుసారంగా కాకుండా తమ యొక్క చిత్తానుసారంగా బోధించి వారిని దేవుని నుండి దూరం చేశారు. ప్రభువు తన యొక్క ప్రజల నుండి విధేయత, విశ్వాసం కోరారు కానీ అది ఏమి కూడా దొరకలేదు అందుకనే వారి గురించి బాధపడుతున్నారు. యొక్క సువిశేషం ద్వారా ప్రభువు మన రక్షణ సందేశం కూడా తెలియచేస్తున్నారు ఎందుకంటే విధంగానైతే యజమానుడు తన యొక్క కూలి వాళ్లను తన వేతనం వసూలు చేసుకోవడానికి పంపించి ఉన్నారో అదేవిధంగా దేవుడు ప్రవక్తలను పంపిస్తూ ప్రజలను తన తన బాటలో నడిపించుటకు కృషి చేశారు.

కానీ మత పెద్దలు అధికారులు యొక్క ప్రవక్తలను హింసించి, శిక్షించి మరణమునకు గురి చేశారు తర్వాత  చివరికి తన యొక్క ఏకైక కుమారుడిని లోకమునకు మన అందరి యొక్క రక్షణ నిమిత్తమై మనందరం ఫలించుటకు ఆయనను పంపించారు కానీ చివరికి ఆయనను కూడా సిలువ వేసి మరణమునకు కారణమయ్యారు ప్రభువు మన యొక్క జీవితంలో కోరేది ఏమిటంటే మనందరం కూడా ఫలించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుని యొక్క మాట ప్రకారం గా మనము జీవించే వ్యక్తిగా ఉండాలి. ఫలించుట అనగ హృదయ పరివర్తనం చెందుట, క్షమాగుణం కలిగి ఉండుట ,వినయముగా ఉండుట కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా ఫలించే వ్యక్తులుగానే ఉండాలి.  ఈరోజు ప్రభు దివ్య గ్రంథ పఠనములు ద్వారా మనందరికీ కూడా నేర్పించే అంశమేమిటంటే ఆయన వాక్కు మన జీవితంలో ప్రేరణ కలిగించి మనందరినీ కూడా మార్చాలి.

 

Fr. Bala Yesu OCD


పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...