11, నవంబర్ 2023, శనివారం

32 వ సామాన్య ఆదివారం

32 వ సామాన్య ఆదివారం
సొలోమోను జ్ఞాన గ్రంధం 6:12-16
1తెస్సలోనిక 4: 13-18
మత్తయి 25:1-13
ప్రియమైన దేవుని విశ్వాసులారా రోజుకి మనము దైవార్చన సంవత్సర చివరి రోజులకి సమీపించుండగా తల్లి శ్రీ సభ మనందరినీ ధ్యానించమని తెలిపే అంశము ఏమిటి అంటే మన యొక్క చివరి రోజుల గురించి, మన మరణం, తుది తీర్పు, పరలోకం నరకం గురించి తెలుపుచున్నాయి. ఈనాడు మనం 32వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆదివార దివ్య గ్రంథములు మన యొక్క చివరి రోజుల యొక్క ప్రభావం గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పఠణం సొలోమోను జ్ఞాన గ్రంథం నుండి తీసుకొనబడింది జ్ఞాన గ్రంథం అని ఎందుకు పిలుస్తారు అంటే జ్ఞానము ద్వారా మన జీవితంలో చాలా మేలులు జరుగుతూ ఉంటాయి కాబట్టి దీనిని జ్ఞాన గ్రంధం అంటారు. సొలోమోను తన జీవితంలో దేవుడిని అర్ధించినది కేవలం జ్ఞానము కొరకే, జ్ఞానం సంపాదించుట వలన కలుగు ప్రయోజనములు, జ్ఞానము సంపాదించుటవలన పెరుగు కీర్తి, జ్ఞానము సంపాదించడం వలన ఒక వ్యక్తి జీవితంలో పొందే గొప్ప ఆశీర్వాదం తెలుసుకున్న వ్యక్తి మన అందరిని కూడా జ్ఞానమును వెతకమని చెబుతూ ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో మనందరం కూడా చెబుతుంటాం "ఒక్క ఐడియా మీ జీవితమనే మార్చి వేయను అని"అనగా జ్ఞానముతో తీసుకున్న ఒక ఆలోచనా నిర్ణయం వలన వారి జీవితమే మార్చబడుతుంది. మనకు జ్ఞానము ఉన్నట్లయితే దాని ద్వారా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనము అభివృద్ధి చెందగలుగుతూ ఉంటాం. ఎందుకంటే జ్ఞానము మనకు అంతయు కూడా సమకూర్చబడేలాగా చేస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు మనందరం కూడా ఈ జ్ఞానమును వెతకమని రచయిత తెలుపుచున్నారు. ఆయన చెప్పే మాటలు ఇంకా ఏమిటంటే ఎవరైతే ఈ జ్ఞానము కొరకు వెతుకుతుంటారో, ఎవరైతే జ్ఞానము కొరకు ఆశ పడుతూ ఉంటారో, ఇంకా ఎవరైతే జ్ఞానమును ప్రేమిస్తూ ఉంటారో అది సులువుగా దొరుకును అని తెలుపుతున్నారు. జ్ఞానం కొరకు ఎవరైతే గాలిస్తూ ఉంటారో వారికి అది తనంతట తాను తలుపు తీయును అని తెలుపుచున్నారు కావున మనం కూడా మన యొక్క అనుదిన జీవితంలో జ్ఞానం యొక్క ప్రాధాన్యత తెలుసుకొని దాన్ని పొందుట కొరకై ప్రయత్నం చేయాలి. జ్ఞానమును కొన్ని కొన్ని సందర్భాలలో దేవుడితో పోల్చితూ ఉంటారు కలిగి ఉండాలి. దేవుడు అనే జ్ఞానం మనందరం కూడా కలిగి ఉండాలి.
 ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తెస్సలోనిక  ప్రజలకు క్రైస్తవ పునరుత్థానము గురించి తెలియజేస్తున్నారు. తాము ప్రేమించిన వారిని కోల్పోయిన సందర్భములో మరణము తర్వాత  మరియొక జీవితము ఉన్నది అని అంశమును తెలియజేస్తున్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు యొక్క మరణ, పునరుత్థానము మన అందరి యొక్క పునరుత్థానమునకు నాంది పలికినది కావున పౌలు గారు విశ్వాసమును కోల్పోవద్దు అని తెలియజేస్తున్నారు. ప్రభువు యొక్క రాకడకై సంసిద్ధతను కలిగి జీవించమని తెలుపుచున్నారు ఎందుకంటే ఆయన కొరకు సంసిద్ధముగా ఉన్న వారిని తాను ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదిస్తూనే ఉంటారు.
ఈనాటి సువిశేష పఠణంలో ఏసుప్రభు పదిమంది కన్యల యొక్క గురించి తెలియజేస్తున్నారు. ఈ పదిమంది కన్యకల యొక్క సువిశేష భాగము ద్వారా మనందరినీ కూడా ప్రభువు తన యొక్క రాకడకై సంసిద్ధులై జీవించాలని కోరుతున్నారు. ఆయన గడియ ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు అకస్మాత్తుగా ఆయన వచ్చేస్తారు. కాబట్టి మనందరం కూడా అప్రమత్తులై ఆయన రాకకై మనం సంతోషముతో ఎదురుచూస్తూ ఆయనకు స్వాగతం పలకాలి.యూదుల సంప్రదాయం ప్రకారం పెండ్లి ఏడు రోజులపాటు కొనసాగుతుంది. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ను ఆమె ఇంటికి వచ్చి తనను తీసుకొని వెళ్తాడు అయితే పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు పెండ్లి కుమార్తెకు ఎవరైతే అతి సన్నిహితులుగా (కన్యలు) ఉంటారో, వారు పెండ్లి కుమారుడికి ఎదురేగి ఆహ్వానించుట అలనాటి సంప్రదాయం. ఒకరోజు జరిగిన పెండ్లిలో, పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమైనది అతని రాక కోసమై పదిమంది కన్యలు ఎదురుచూస్తున్నారు కానీ ఐదుగురు మాత్రమే ఆయన ఎప్పుడూ వచ్చినా సరే ఆయనను కాగడాలతో ఆహ్వానించుటకు వారితోపాటు నూనెను కూడా తీసుకొని వెళ్లి ఉన్నారు. మిగతా ఐదుగురు వారు ఊహించిన సమయమునకు భిన్నముగా పెండ్లి కుమారుడు రాలేదు. కావున వారు తమతో పాటు ఎక్కువ నూనె తీసుకొని పోలేదు అందువలన అతడిని ఆహ్వానించలేకపోయారు. మన జీవితంలో మనకి ఎప్పుడూ ఏమి జరుగునో అని ముందుగానే తెలిస్తే మనము దానికి సంసిద్ధమై ఉంటాము.ఉదాహరణకు బస్సు ఏ సమయమునకు వచ్చునో తెలిసిన యెడల మనము దాని ప్రకారంగా సిద్ధంగా ఉంటాం. సినిమా ఏ టైం కు ప్రారంభిస్తారని తెలిసిన యెడల దానికి కూడా ముందుగానే సిద్ధమై ఉంటాం కానీ ప్రభువు యొక్క రాకడ ఊహించని గడియలో జరుగును కాబట్టి దానికి ప్రతి రోజు కూడా మనందరం కూడా సిద్ధపడి ఉండాలి. ఈ పదిమంది కన్యలు మన క్రైస్తవ సంఘమునకు ఒక సూచన. పెండ్లి కుమారుడిని ఆహ్వానించడానికి పదిమంది కూడా వెళ్లి ఉన్నాను కానీ చివరికి ఐదుగురు మాత్రమే తనతో పాటు లోనికి ప్రవేశించి ఉన్నారు. అనగా కేవలము ఎవరైతే తమ జీవితములను తాము తయారు చేసుకుని ఉన్నారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని అర్థం. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించుట కష్టం కేవలము తమ జీవితాలను దేవుని కొరకు సంసిద్ధం చేస్తున్న వారు మాత్రమే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు.
ఈ సువిశేష పఠణంలో మనము కొన్ని విషయములను చూస్తున్నాం:
1. ఆయన రాకడ కొరకై సంసిద్ధత కలిగి జీవించుట-ఐదుగురు వివేకవతులు పెండ్లి కుమారుడు ఏ సమయములో వచ్చినా సరే ఆయనను ఆహ్వానించుటకు వారు తమతో పాటు అన్నీ కూడా తీసుకుని వచ్చి ఉన్నారు అది ముందుచూపు కలిగి ఉండటానికి ఒక నిదర్శనం. మనము కూడా మన జీవితంలో మన యొక్క గమ్యం ఏమిటి అని ముందుచూపు కలిగి జీవించినట్లయితే మనందరం కూడా ఒక మంచి ప్రవర్తన కలిగి జీవిస్తాం.
2. ఆయన రాకడ తథ్యం అని నమ్మడం-పెండ్లి కుమారుడు ఏదో ఒక సమయమును తప్పనిసరిగా వస్తాడు అని వారు నమ్మి ఉన్నారు అందుకని ఆయన రాక కోసం అక్కడే ఎదురుచూస్తున్నారు.
3. సహనం కలిగి ఉన్నారు-ఈ పదిమంది వివేకవతులు పెండ్లి కుమారుడి ఎడల సహనంతో ఉన్నారు ఎందుకంటే ఆయన రాక ఆలస్యమైనప్పటికీ కూడా ఎంతో వినయము, సహనము కలిగి ఆయన కొరకు ఎదురుచూస్తున్నారు.
అదే విధముగా ఈ సువిశేష భాగములో మనము గమనించే ఇంకొక ప్రధానమైన అంశం ఏమిటంటే "నూనె". నీ నూనెను వివిధ రకాలైన గుర్తులతో పోల్చి వేద పండితులు చెబుతూ ఉంటారు అవి ఏమిటంటే 
1. ఈ నూనె దేవునితో మనకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధమును తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరికి సంబంధం చాలా ముఖ్యమైనది అది లేకపోతే మన క్రైస్తవ జీవితం ఫలించదు అదేవిధంగా దేవుడితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనము వేరే ఒకరి దగ్గర నుండి కాబట్టి మన జీవితం ఫలించాలి అంటే మనందరికీ కూడా దేవుడితో ఒక వ్యక్తిగత సంబంధం ఉండాలి.
2. నూనెను క్రైస్తవ విలువలతో కూడా పోల్చి చెప్తూ ఉంటారు, అవి వేరే వారి దగ్గర నుండి అరువు తెచ్చుకొనలేము. మనందరం కూడా క్రైస్తవ విలువలు కలిగి జీవించాలి.
3.నూనెను క్రైస్తవ విశ్వాసముతో కూడా పోల్చి చెబుతూ ఉంటారు విశ్వాసము లేనిదే దేవుడు రాజ్యంలో ప్రవేశించలేము.
4. నూనెను క్రైస్తవ జీవితములో ఉన్న ప్రేమ, క్షమాపణతో కూడా పోల్చి చెబుతూ ఉంటారు ఈ రెండును పాటించకపోతే మన జీవితంలో పరలోక రాజ్యములో ప్రవేశించలేము .
ఎవరి జీవితమునకు వారే బాధ్యులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాకడకై సంసిద్ధతను కలిగి జీవించాలి అప్పుడే మనందరం కూడా నిత్య పెళ్లికొడుకు అయిన క్రీస్తు ప్రభువుతో ఆయన రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాం.

Fr. Bala Yesu OCD

4, నవంబర్ 2023, శనివారం

31వ సామాన్య ఆదివారం

31వ సామాన్య ఆదివారం
మలాకీ  1:4-2,8-10
1 తెస్సలోనిక 2:7-9,13
మత్తయి 23:1-12
ఈనాటి దివ్య పఠణములు దేవుని సేవకులైన యాజకుల యొక్క బాధ్యతలను వారు జీవించవలసిన విధానములు గురించి తెలియజేస్తున్నాయి. మనము ఈ లోకంలో వివిధ రకములైనటువంటి నాయకులను చూస్తూ ఉంటాం. మత బోధకులను చూస్తుంటాం. కొంతమంది తాము ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి జీవిస్తూ ఉంటారు. చాలామంది ఒకటి చెప్పి ఇంకొకటి అనుసరించేటటువంటి వారు ఉంటారు. ఈరోజు ప్రభువు తన ప్రతినిధులందరికీ కూడా తెలియచేసే అంశము ఏమిటంటే వారి జీవిత విధానము దేవుని యొక్క చిత్తానుసారముగా ఉండాలని. కేవలము ఈ యాజకుల యొక్క జీవితం మాత్రమే కాకుండా ఎవరైతే ఒక ప్రతినిధిగా ఉంటూ ఉన్నారో వారి గురించి కూడా మాట్లాడుతున్నారు. దేవుడు ఇచ్చిన బాధ్యతలు  సరియైనటువంటి రీతిలో నెరవేరుస్తున్నారా? లేదా అని ప్రభువు మనలను సవాలు చేస్తున్నారు. దానితోపాటు దేవుని యొక్క సేవకులు జీవితం నీ స్వార్థ జీవితంగా అదేవిధంగా విశ్వాసము - చేతలు కలిగిన జీవితముగా ఉండాలి అని ప్రభువు తెలుపుచున్నారు.
ఈనాటి మొదటి పఠణంలో బాబిలోనియా బానిసత్వం నుండి తిరిగి వచ్చిన మతాధికారులను అదేవిధంగా యాజకులను ఉద్దేశించి మాట్లాడుచున్నారు. దేవుడు మలాకీ ప్రవక్తను క్రీస్తుపూర్వం 515 వ సంవత్సరంలో ఎన్నుకొని తన రక్షణ సందేశమును అంద చేయుటకు నియమించి ఉన్నారు. దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా ఆనాటి అసత్య బోధకులు, మత నాయకులైన యాజకులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. దేవుడు వారి యొక్క స్వార్థపు జీవితమును చూసి వారిని శిక్షిస్తానని తెలుపుతున్నారు. ఎందుకు దేవుడు తాను ఎన్నుకున్నటువంటి వారిని శిక్షిస్తానని చెబుతున్నారంటే ఈ యాజకులు దేవుడి యొక్క పనిని కాకుండా, ఆయన చిత్తమును కాకుండా, తమ ఇష్టానుసారముగా స్వలాభము కోసం జీవించి ఉన్నారు అందుకనే వారిని ప్రభువు శిక్షిస్తానని తెలుపుచున్నారు. మలాకీ ప్రవక్త యొక్క కాలంలో యాజకుల యొక్క కపటత్వమును ఖండిస్తున్నారు. బాబిలోనియా నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలు  ప్రజలు యెరూషలేము దేవాలయమును రెండవసారి పునః నిర్మించి ఉన్నారు అప్పుడు యాజకులు వారి యొక్క విధులను నెరవేర్చుటలో విఫలమయ్యారు. వివిధ రకములైనటువంటి చెడు మార్గములను అవలంబించారు. అదే కాకుండా ప్రజలకు న్యాయం చేయుటకు బదులుగా అన్యాయం చేశారు. వితంతువులను ఆదుకొనుటకు బదులుగా వారిని నిరాకరించారు. ఈ యాజకులు దేవుని సందేశమును బోధించకుండా అలాగే ఆయన చిత్తమును నెరవేర్చకుండా తమ యొక్క సొంత ప్రణాళికలను అదేవిధంగా రాజుల యొక్క ప్రణాళికలను నెరవేర్చారు. అందుకనే వారి యొక్క జీవితములను చూచిన ప్రభువు కోపపడుతూ వారిని శిక్షిస్తానని తెలుపుచున్నారు.
 ఒక విధముగా చెప్పాలంటే వారు దేవుని యొక్క మార్గము నుండి వైదొలిగి జీవించి ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుటలేదు. అందుకనే మలాకీ ద్వారా దేవుడు మరియొకసారి యాజకులను ఖండిస్తున్నారు. వారు దేవునికి సమర్పించేటటువంటి ఆ యొక్క బలి అర్పణలో కూడా వారు మేలైనది దేవునికి సమర్పించకుండా అనారోగ్యంతో ఉన్నటువంటివి దేవునికి సమర్పించేటటువంటివారు. ప్రభువు చాలా బాధపడుతూ పలికినటువంటి మాట ఏమిటంటే "యాజకులు దారి తప్పితిరి" అని తెలుపుచున్నారు అనగా దేవుని యొక్క మార్గములకు వ్యతిరేకంగా జీవించుటకు ఇష్టపడ్డవారు.వాస్తవానికి దేవుడే వారిని ప్రత్యేకంగా ఎన్నుకొని తన యొక్క సేవ చేయుటకు నియమించి ఉన్నారు కానీ వారే దేవునికి విరుద్ధముగా జీవిస్తూ, ప్రజలను కూడా పాపములోనికి నడిపించి ఉన్నారు కాబట్టి ప్రభువు అట్టి వారిపట్ల అసహనమును వ్యక్తపరుస్తున్నారు. ఆనాటి కాలంలో కూడా అసత్య ప్రవక్తలు ఉన్నారు సత్య ప్రవక్తలు ఉన్నారు. దేవుని కొరకు జీవించేవారు ఉన్నారు. దేవుని కొరకు జీవిస్తున్నామని చెప్పుకొని నటించేవారు కూడా ఉన్నారు.ఈ మొదటి పఠణము ద్వారా మనము తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే యాజకుల వలె దేవుడు  మనందరికీ కూడా బాధ్యతలను ఇచ్చి ఉన్నారు కాబట్టి అట్టి బాధ్యతలు మనము ఎలాగ మన జీవితంలో కపటత్వము లేకుండా నెరవేరుస్తున్నాము అని ప్రశ్నించుకోవాలి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తెస్సలోనికా ప్రజల యొక్క విశ్వాస జీవితము గురించి తెలియజేస్తున్నారు వారి మధ్య సువార్తను ప్రకటించే సందర్భంలో దేవుని యొక్క సువార్తను వారు అందరు కూడా స్వీకరించి ఉన్నారు ఆ సందేశమును బట్టి వారు తమ జీవితములను మార్చుకున్నారు. వారి జీవితంలో పౌలు గారు అదేవిధంగా మిగతా సేవకులు బోధించిన వాక్యము మానవ సంబంధమైన వాక్యము కాదు దైవ సంబంధమైన వాక్కు అని వారు గ్రహించి ఉన్నారు కాబట్టి దాని ప్రకారముగా వారి జీవితములను సరి చేసుకుంటూ జీవింపసాగారు అందుకుగాను పౌలు గారు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పౌలు గారు తెస్సలోనిక ప్రజల మధ్య జీవించే సమయములో ప్రజల మీద ఎటువంటి భారము మోపకుండా వారిని ప్రేమిస్తూ, వారికి సుమాత్రకుగా జీవిస్తూ, వారికి దైవ ప్రణాళికలను సందేశమును అందజేసి ఉన్నారు. మనందరం కూడా తెస్సలోనికా ప్రజల యొక్క జీవితము నుండి నేర్చుకోవలసిన సందేశం ఏమిటి అంటే వారు అపోస్తుల నుండి ప్రకటింపబడిన సత్యము, దేవుని సత్యము, సందేశము అని గ్రహించి దాని ప్రకారముగా జీవింప సాగారు అలాగే మనము కూడా యాజకులు బోధించిన దైవ సందేశము ప్రకారముగా జీవింప సాగాలి.
ఈనాడు మనము చదివిన సువిశేష భాగములో ప్రజలను ధర్మ శాస్త్ర బోధకుల, పరిసయ్యుల  యొక్క కపటత్వము గురించి జాగరుకులై ఉండమని తెలుపుతున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్ర బోధకులు అనేక సందర్భంలో కేవలం నీతి వాక్యములను బోధించే వారు కానీ ఆచరించే వారు కాదు. పరిసయ్యులో దాదాపు 7 వర్గాలు కలిగినటువంటి లేదా ఏడు మనస్తత్వములు కలిగిన  వ్యక్తులు ఉన్నారు. 
- కొంతమంది మోషే ధర్మ శాస్త్రమును పాటిస్తూ మంచి క్రియలను చేసేటటువంటి వారు. వీరు కేవలము ప్రజల పొగడ్తలకై ఇష్టపడేవారు.
-కొంతమంది కేవలం మాటలు మాత్రమే చెప్పి క్రియలు చేయ కుండా సాకులు చెప్పేవారు.
- కొంతమంది ఇతరుల ఎదుట పుణ్యాత్ములనపించుకొనుటకు నటించేవారు. వారు నడిచేటప్పుడు ఎవరైనా స్త్రీలు కనపడినప్పుడు వారిని చూడకుండా తమ యొక్క శరీరములను గాయపరచుకుంటారు అట్టివారిని ప్రజలు చూసినప్పుడు వారు నిగ్రహ శక్తి కలిగిన వారు, మంచివారు అని అనుకొనుటకు నటించేవారు.
-ఇంకా కొంతమంది వినయాన్ని వ్యక్తపరచుటకు గూని వాని వలె వంగి నడిచేవారు మీరు కూడా ప్రజల యొక్క దృష్టిలో మంచివారు అనిపించుకొనుటక ఇట్లా జీవించేవారు.
-కొంతమంది దేవుని నుండి మెప్పు పొందుటకై సత్కార్యాలు చేయటానికి ఇష్టపడేవారు. వారి యొక్క స్వార్థం కొరకే ఇలాగ జీవించేవారు.
-మరి కొంతమంది దేవుని శిక్షకు భయపడేటటువంటివారు అనగా బయటకు మంచిగా జీవిస్తూ అంతరంగికంగా తాము చేసిన తప్పులకు బాధపడేవారు.
-చివరిగా కొంతమంది పరిసయ్యులు దైవభయం కలిగి దేవుని ప్రేమిస్తూ సేవిస్తూ ఆయనకు విధేయులై జీవించేవారు. పైన చెప్పబడినటువంటి పరిసయ్యుల యొక్క జీవితము దాదాపుగా ఇతరులకు చూపించట కొరకే గానీ వారు తమ జీవితంలో ఒక్క నిజాయితీని గానీ,నిజమైన విశ్వాసమును గాని ప్రకటించుట చాలా అరుదు అందుకే ప్రభువు కేవలం వారి యొక్క బోధనలను పాటించమని చెబుతూ ఉన్నారు వారి యొక్క క్రియలను కాదు ఎందుకంటే చాలా సందర్భాలలో బోధించేవారు ఇతరులకు సుమాత్రుకగ ఉండరు. అది వారి బలహీనత వలన కావచ్చు, వారి యొక్క స్వార్థం వలన కావచ్చు, లేదా వారి యొక్క శోధన వల్ల కావచ్చు కాబట్టి ఈ ధర్మశాస్త్ర బోధకులు గాని పరిసయ్యులు గాని అదే విధముగా యాజకులు గాని బోధించిన ఏ మంచి సందేశమైన మనము స్వీకరించటానికి మనము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. కానీ అనేక సందర్భంలో మనము వారి జీవితాన్ని చూస్తాము కానీ వారి యొక్క మాటలను బోధనలను మన జీవితంలో అనుసరించడానికి ఇష్టపడము కానీ ఈ సువిశేష ప్రారంభంలోనే ప్రభువు వారి జీవితము కాక వారి బోధనలను పాటించమని తెలియజేస్తున్నాను కాబట్టి మనకు మంచిని ప్రకటించినప్పుడు దానిని ఆచరించడానికి సిద్ధపడుతూ జీవించుదాం. దేవుడు మనకు ఇచ్చిన ప్రతి బాధ్యతను కపటం లేకుండా నీతిగా నిజాయితీగా నిర్వహించుదాం.
Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...