23, డిసెంబర్ 2023, శనివారం

ఆగమన కాలం నాలుగవ ఆదివారం

ఆగమన కాలం నాలుగవ ఆదివారం
2 సమూయేలు  7:1-5,8-12,14,16, రోమి 16: 25-27
లూకా 1:26-38

ఈనాటి దివ్య గ్రంథ పఠనములు ఏసుప్రభు యొక్క మొదటి రాకడను(మనిషావతారం) గురించి తెలియజేస్తున్నది. క్రీస్తు జన్మదినమునకు అతి చేరువలో ఉన్నటువంటి సమయంలో ఈనాటి పరిశుద్ధ గ్రంథ వచనములు ప్రభువు యొక్క రాక కొరకు మన జీవితములను తయారు చేసుకుని సిద్ధగావుండాలి. ఈనాటి మొదటి పఠణంలో దేవుడు దావీదు రాజుకు చేసిన వాగ్దానము గురించి చదువుకుంటున్నాము. దావీదు రాజు దేవుడు తన జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యములు తలచుకొని అదే విధముగా ఆయనను శత్రువుల బారి నుండి కాపాడినటువంటి గొప్ప దేవునికి నివాసము ఉండుటకు  యెరూషలేములో  ఒక దేవాలయమును   నిర్మించాలని భావించి ఉన్నారు కానీ దేవుడు మాత్రము దావీదు కాకుండా ఆయన వంశస్థుడు తనకు దేవాలయమును నిర్మిస్తారని తెలుపుచున్నారు. ప్రభువు దావీదుకు తన వలె ఇశ్రాయేలు ప్రజలను శాంతియుతంగా పరిపాలించుటకు ఒక రాజును పంపిస్తానని తెలుపుతున్నారు. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రకారముగ ప్రభువు ప్రజలను శాంతియుతంగా పాలించుటకు సొలోమోను ఎన్నుకున్నారు అయితే సొలోమోను దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టి దేవునికి దూరమై జీవించి అయితే ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి దావీదు యొక్క రాజ్యం కలకాలం నిలుచును కాబట్టి ఆయన యొక్క రాజ్యము కలకాలము ఉండుట కొరకై దేవుడు తన యొక్క కుమారుడిని ఈ లోకానికి పంపిస్తున్నారు. దావీదు విషయంలో దేవుడు మొదటగా చొరవ తీసుకుని ఆయన ఉన్నతమైన స్థితికి ఎన్నుకుంటున్నారు దేవుడికి దగ్గరగా జీవించారు కాబట్టే ఆయన యొక్క రాజ్యము వారసత్వం కలకాలం ఉండుటకై ప్రజల కొరకు మెస్సయ్యను దావీదు వంశం నుండి జన్మించేలా చేస్తున్నారు
ఈనాటి రెండవ పఠణములో పునీత పౌలు గారు దాచబడిన దేవుని యొక్క పరమ రహస్యం ప్రజలకు తెలియచేయబడినది అని తెలుపుచున్నారు మన యొక్క రక్షణ.
 ఇంకొక విధముగా చెప్పుకోవాలి అంటే దాచబడిన దేవుని యొక్క పరమ రహస్యం అనగా దేవుని యొక్క రూపము అనేక సంవత్సరాలుగా దాచబడినది ఎందుకంటే దేవుడిని ఎన్నడు ఎవరు కనులారా చూడలేదు కానీ మొట్టమొదటిసారిగా దేవుని యొక్క ముఖము ప్రజలందరికీ కూడా తెలియజేయబడినది. ఇంకొక విధముగా చెప్పుకోవాలి అంటే దేవుని యొక్క పరమ రహస్యము ఎన్నో సంవత్సరాలుగా అన్యుల నుండి దాచబడినది కానీ పౌలు గారి యొక్క సువార్త పరిచర్య ద్వారా అది వారికి తెలియజేయబడినది. మనందరి జీవితంలో ఏది అయినా కొత్తది మనకు తెలిసిన యెడల దానిని మనం సంతోషిస్తాము అదేవిధంగా దేవుని యొక్క పరమ రహస్యం మనకు తెలియజేయబడిన సందర్భంలో మనము కూడా సంతోషించాలి. ఈనాటి సువిశేష భాగములో మరియ తల్లికి మంగళవార్తను గాబ్రియేలు దూత తెలియచేయుటను వింటున్నాము మరియ తల్లి దేవుని యొక్క సందేశం మొత్తము కూడా ఆలకించి ఆలకించినటువంటి వాక్యమును విశ్వసించినది. మరియ తల్లి యొక్క విశ్వాస జీవితము చాలా గొప్పది ఎందుకంటే ప్రవక్తల యొక్క ప్రవచనములను సంపూర్ణముగా విశ్వసించినది ఇదిగో కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనును ఆయన ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించును అన్నటువంటి వాక్యము మరియ తల్లి సంపూర్ణంగా విశ్వసించి ఉన్నది కాబట్టి దేవునికి జన్మనివ్వటకు ఆ తల్లి సిద్ధంగాన్నది అదే విధముగా ఆమె తన జీవితమును దేవుని కొరకు సంసిద్ధం చేసుకున్నది దేవుడిని వాక్కు రూపంలో తనలోకి స్వీకరించాలి అని ఆధ్యాత్మికంగా తాను తయారయ్యారు అందుకే మరియ తల్లి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని పలుకుతూ ఉన్నారు. శూన్యము నుండి సృష్టిని చేసినటువంటి దేవుడు, సముద్రం నుండి దారిని చేసిన దేవుడు, ఎడారి గుండా గమ్యమును మార్గం సిద్ధం చేసిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అందుకని మరియతల్లి దేవుని యొక్క వాక్కు జీవము పొందుకుంటుంది అని సంపూర్ణంగా విశ్వసించినది. ఈరోజు మనందరం కూడా క్రీస్తు ప్రభువు యొక్క జననము మన హృదయములో జరగాలి అని మనందరం ఎదురు చూస్తున్న అయితే ఈ నాలుగు వారాల ఆగమన కాల యొక్క సిద్ధపాటు మన జీవితంలో దేవుని యొక్క రాకకు మార్గమును సిద్ధము చేసిన విధంగా ఉంటూ ఉన్నదా? అన్నది మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే క్రిస్మస్ ద్వారా దేవుడు మనకు దగ్గరవుతున్నారు కాబట్టి ఆయన రాక కొరకు మనం మార్గం సిద్ధం చేయాలి.
Fr. Bala Yesu OCD

16, డిసెంబర్ 2023, శనివారం

ఆగమన కాలం మూడవ ఆదివారం

ఆగమన కాలం మూడవ ఆదివారం
యెషయా 61:1-2, 10-11
1తెస్సలోని 5:16-24
యోహాను 1:6-8,19-28
ఈనాటి ఆదివారమును లతీన్ భాషలో "గౌదేతే "ఆదివారం అని పిలుస్తారు అనగా 'ఆనందించు' ఆదివారము అని అర్థం. దివ్య బాల యేసు యొక్క రాక అతి చేరువులోవున్నది, మన యొక్క రక్షణ కూడా అతి సమీపంలో ఉన్నది కాబట్టి ఆయన యొక్క రాక కొరకై మనందరం కూడా ఆనందంతో సంసిద్ధత కలిగి ఎదురు చూస్తున్నాం. ప్రభువు నందు ఎల్లప్పుడూ సంతోషించాలి మనం.
ఈనాటి దివ్య గ్రంథ పఠనంలు కూడా దేవుని యొక్క రాక కొరకై త్వరపడి చేయవలసిన ఆధ్యాత్మిక పనులు చేసి సిద్ధంగా ఉండాలి అనే అంశము గురించి బోధిస్తున్నాయి. మొదటి పఠనంలో దేవుడు యెషయా ప్రవక్తను అభిషేకించిన విధానమును వింటున్నాం.  బాబిలోనియా బానిసత్వంలో జీవిస్తున్నటువంటి యూదులకు దేవుడు సంతోషకరమైన వార్తను అందచేస్తున్నారు అది ఏమిటంటే  "పేదలకు సువార్తను బోధించటానికి, హృదయ వేదననొందిన వారిని దృఢపరుచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును తన యొక్క సేవకుడిని ఎన్నుకుంటున్నాను అని ప్రభువు తెలియచేస్తున్నారు. ఈ మాటలను ఒక్కొక్కటి మనము ధ్యానం చేసుకోవాలి ఎందుకనగా మాటలు కేవలం యెషయా ప్రవక్తకు సంబంధించినవి మాత్రమే కాదు అవి బాధామయ సేవకుడైన ఏసుప్రభుకు సంబంధించిన వచనములు. మెస్సయ్య తన యొక్క భూలోక జీవితంలో చేసినది ఈ పనియే.
పేదలు అనగా లేనివారు- ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క సాన్నిధ్యం లేకుండ జీవిస్తున్నారో వారికి దేవుడిని అందజేయుట. పేదవారు దేవునియందు నిండు నమ్మకం ఉంచి ఆయనపై పూర్తిగా ఆధారపడి జీవించేవారు. దేవుడే వారి యొక్క ఐశ్వర్యం. ప్రవక్త దేవుడి మీద ఆధారపడి జీవించే వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు అని తెలిపారు.
హృదయ వేదననొందిన వారిని దృఢపరుచుటకు దేవుడు ప్రవక్తను అభిషేకిస్తున్నారు అంటే బానిసత్వములో బాధలు అనుభవిస్తూ, నిరాశలో, నిస్పృహలో అన్ని కోల్పోయాము అని బాధలో ఉన్న వారిని బలపరచడానికి ప్రవక్త అభిషేకమును పొందుచున్నారు.
చెరలో ఉన్నవారికి అదే విధముగా బంధింపబడిన  వారికి విముక్తిని కలుగ చేయుటకు అభిషేకమును దయచేస్తున్నారు. ప్రవక్త యొక్క ప్రధానమైన బాధ్యత ఏమిటంటే ఎవరైతే ఈ లోక సంబంధమైన కోరికలలో, పాపములో చిక్కుకుని పోయి ఉన్నారో వారిని విడుదల చేయుటకు అభిషేకమును పొందుతున్నారు. అలాగే శిక్షించేటటువంటి వారిని ఓదార్చుటకు ప్రవక్త నియమింపబడుతున్నారు. ఈ మొదటి పఠనం ద్వారా మనము గ్రహించవలసిన అంశం ఏమిటంటే దేవుడు ప్రజలకు సంతోషమును దయ చేయుటకు వారి మార్గములను సరి చేయుటకు వారికి తాను ఎప్పుడూ తోడుగా ఉన్నారు అని తెలియచేయుటకు ప్రవక్తలను ఎన్నుకొని వారిని తన యొక్క సాధనములుగా ప్రజల మధ్య ఉంచుతున్నారు.
ఈనాటి రెండవ పఠనంలో పౌలు గారు తెస్సలోనిక ప్రజలను సర్వదా సంతోషించమని, ప్రార్థించమని మరియు దేవునికి కృతజ్ఞత తెలియజేయమని తెలుపుచున్నారు. ప్రభువు యొక్క రాకడ జరుగును కావున ఆ అంశం మీద ఎల్లప్పుడూ సంతోషించమని తెలుపుతూ ఉన్నారు. అలాగే దేవునికి ప్రార్ధన చేస్తూ ప్రభువు పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞులై జీవించమని తెలుపుతున్నారు. పౌలు గారు ఈ లోకంలో అంతయు పరీక్షించి కేవలం మనిషిని మాత్రమే అనుసరించమని తెలుపుచున్నారు ఎందుకనగా మంచిని చేసినట్లయితే మనము ఎప్పుడు కూడా సంతోషంతోనే జీవిస్తూ ఉంటాం. అదేవిధంగా దేవుని యొక్క ఆత్మనుసారంగా మనము జీవించాలని పౌలు గారు తెలుపుతున్నారు.
ఈనాటి సువిశేష  భాగములో బప్తిస్మ యోహాను గారు గురించి చెప్పబడినది బప్తిస్మ యోహాను గారు ఈ లోకంలో క్రీస్తునకు సాక్షమిచ్చుటకు వచ్చి ఉన్నారు. అలాగే క్రీస్తు  కొరకు ప్రజలలో మార్గమును సిద్ధం చేయుటకు వచ్చి ఉన్నారు. ఆయన సువార్త పరిచర్య చేసే సమయంలో అనేకమంది ప్రజలలో యోహాను గారే మెస్సయ్య లేదా ఇంకా వేరే ఒకరి కొరకు ఎదురు చూడాలా అనే సందేహాలు చాలా ఉన్నాయి దానికిగాను యెరుషలేములో ఉన్న యూదులు కొందరు యాజకులను, లేవీయులను యోహాను గారి దగ్గరికి పంపిస్తున్నారు, ఆయన ఎవరు అని తెలుసుకొనుటకు. యోహాను గారు తాను క్రీస్తుని కాదని ఒప్పుకొనుటకు ఎటువంటి నిరాకరణ చేయలేదు. ఆయన ఆ సందర్భంలో నేనే క్రీస్తు అని చెప్పినట్లయితే అనేకమంది ఆయనను నమ్మి ఉండి ఉండవచ్చు కానీ యోహాను గారు, నేను ఆయనను కాదు కేవలము ఆయన కొరకు మార్గమును సిద్ధం చేయుట కొరకై పంపబడిన వాడిని పలికారు మరియు నేను ఆయన పాదరక్షలను విప్పుటకైన యోగ్యుడను కాను అని తనను తాను తగ్గించుకొని క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చారు. బప్తిస్మ  యోహాను గారు ఏసుప్రభుకు సాక్ష్యం ఇచ్చుటలో సంతోషంగా ఉన్నారు.ఈయనలో అంత వినయము ఉన్నది కాబట్టే దేవుడు అతని జీవితమును దీవించారు అందుకే ఏసుప్రభు ఈ భూలోకంలో బప్తిస్మ యోహాను గారు గొప్పవారు అని తెలుపుతున్నారు.
ఈనాటి పరిశుద్ధ వాక్యం మనం దేవుడి యందు సంతోషించాలి అనే అంశమును తెలుపుతూ ఉన్నారు కాబట్టి మనం కూడా మంచిని చేస్తూ, మంచిగా జీవిస్తూ, ప్రభు రాకడ కొరకై మన జీవితంను సిద్ధపరచుకుంటూ ఆయన వస్తాడు అనేటటువంటి ఆశతో, ఆనందంతో, ఎదురుచూసి రక్షకుని మన ఇంటికి ఆహ్వానించుదాం.
Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...