25, మే 2024, శనివారం

త్రియేక దేవుని పండుగ

త్రియేక దేవుని పండుగ 
ద్వితీయో 4:32-34, 39-40
రోమి 8:14-17, మత్తయి28:16-20
ఈనాడు తల్లి శ్రీ సభ త్రియేక దేవుని పండుగను కొన్ని యాడుచున్నది. ప్రతి ఆదివారం కూడా వీరి ముగ్గురి పండుగ ఎందుకనగా, పితదేవుడు ఆదివారం రోజున సృష్టిని ప్రారంభించారు. పుత్రుడైన దేవుడు ఆదివారం రోజున మరణమును గెలిచి పునరుత్థానం అయ్యారు. పవిత్రాత్మ దేవుడు శిష్యుల మీదకు పెంతుకోస్తు ఆదివారం రోజున వేంచేశారు కావున ప్రతి ఆదివారము వీరి ముగ్గు పండుగను జరుపుకుంటాం. ఈరోజు ప్రత్యేకంగా దైవార్చన ఆదివారం ప్రకారం వీరి యొక్క రక్షణ పాత్రను ప్రత్యేకంగా ధ్యానించమని శ్రీ సభ కోరుచున్నది. 
మనం ఉదయం లేచిన దగ్గర నుండి నిద్రించే వరకు పితా, పుత్ర పవిత్రాత్మ నామమున ప్రార్థన చేస్తూ ఉంటాము వారి ద్వారానే ఏ కార్యమైనా తలపెడుతుంటాం, వారి ద్వారానే ఏ దివ్య సంస్కారమైనా అందచేయబడుతుంది. ఈ ముగ్గురు వ్యక్తులు అన్నిటిలో సరిసమానులు, శాశ్వతమైన వారు, ఒకే స్వభావము కలిగి ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో ఆలోచిస్తే ఇది మానవ ఆలోచనలకు అందనిది సత్యం. పునీత ఆగస్టీను గారు కూడా ఈ యొక్క పరమ రహస్యమును తన యొక్క జ్ఞానముతో అర్థం చేసుకోవాలని ప్రయత్నించారు కానీ అది సాధ్యపడలేదు. దేవుని పరమ రహస్యం మన యొక్క ఆలోచనల ద్వారా అర్థం చేసుకోవాలి అంటే సాధ్యపడని విషయం అయినప్పటికీ దేవుడే తనను అర్థం చేసుకున్నటకై నూతన నిబంధన గ్రంధంలో ప్రత్యేక విధముగా కొన్ని ఉదాహరణలతో వారు ముగ్గురు  వ్యక్తులు కానీ  ఒకే స్వభావం కలిగిన త్రియేక దేవుడు. సృష్టి ప్రారంభం కాకము నుపే వీరి ముగ్గురు కలిసి ఉన్నారు. 
తండ్రి సృష్టిని చేశారు (ఆది1:3)
ఆదిలో వాక్కుగా ఏసుప్రభువు ఉన్నారు (యోహాను 1:1)
దేవుని యొక్క ఆత్మ నీటిపై తిరుగు చుండెను (ఆది 1:2).
ఒకరు సృష్టిని చేస్తే మరొకరు సృష్టిని రక్షించారు ఇంకొకరు సృష్టిని పవిత్ర పరిచారు. 
- ఏసుప్రభు యొక్క జన్మమునకు ముందు గాబ్రియేలు దూత మరియమాతకు మంగళవార్త చెప్పిన సందర్భంలో పితా,పుత్రా,పవిత్రాత్మ ముగ్గురు ప్రత్యక్షమై ఉన్నారు. తండ్రి దేవుడు గాబ్రియేలు దూతను పంపించారు. పుత్రుడైన యేసు ప్రభువు మరియ తల్లి గర్భమందు శరీర రక్తముల ద్వారా రూపం పొందుకున్నారు. పవిత్రాత్మ మరియు తల్లి మీద వేంచేసి వచ్చారు.
- ఏసుప్రభు జ్ఞాన స్నానం పొందిన తర్వాత ఆకాశము తెలవబడి, తండ్రి పావుర రూపమున ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను గూర్చి నేను ఆనందిస్తున్నాను అని పలికారు.
- తాబోరు కొండమీద కూడా పితా,పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు ఉన్నారు.
- ఏసుప్రభు యొక్క మోక్షారోహణ సమయంలో కూడా పితా,పుత్రా,పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం ఇవ్వమని కోరారు .
త్రియేక దేవుని పండుగ జరుపుకుంటున్న సందర్భంలో మనం నేర్చుకోవలసిన అంశములు ఏమిటి అంటే 
1. త్రియేక దేవుని వలె మనము ఒకరితో ఒకరము బంధము కలిగి జీవించాలి. 
2. త్రియేక దేవుని వలె ఒకరికి ఒకరు సహకరించుకోవాలి 
3. త్రియేక దేవుని వలె ప్రేమ కలిగి జీవించాలి. 
4. త్రియేక దేవుని వలె కలసి మెలసి జీవించాలి 
5. త్రియేక దేవుని వలె అర్థం చేసుకుని ఉండాలి.
6. త్రియేక దేవుడు ముగ్గురు వ్యక్తులు అయినప్పటికీ వారు ఒకే  దేవుడు అని తెలుపుటకు మనకు కొన్ని ఉదాహరణలు ఉన్నవి. 
1. సూర్యుడు, సూర్యకిరణాలు, వేడి ఈ మూడు కూడా ఒకటే. 
2. నీరు,ఆవిరి, మంచు ఈ మూడు కూడా ఒకదానికి చెందినవే.
3. ఒక ఆపిల్ పండు యొక్క తోలు, కండ, విత్తనం మొత్తం కూడా ఒకటే (ఆపిల్) ఈ యొక్క ఉదాహరణలు మూడు భిన్నమైనవి ఒకటిగా ఉంటుంది.
ఈరోజు మన విశ్వాస సంబంధమైన త్రియేక దేవుని పండుగను కొనియాడుతున్న సందర్భంగా మనందరం కూడా పితా పుత్ర పవిత్రాత్మ వలే కలిసిమెలిసి జీవించుట ప్రయత్నించుదాం 

Fr. Bala Yesu OCD

17వ సామాన్య ఆదివారం

2 రాజుల 4: 42-44, ఎఫేసి 4:1-6, యోహాను 6:1-15 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల యొక్క ఆకలిని సంతృప్తి పరచు విధానం గురించి తెలుపుచున్...