1, అక్టోబర్ 2022, శనివారం
27 వ సామాన్య ఆదివారం
30, సెప్టెంబర్ 2022, శుక్రవారం
27 వ సామాన్య ఆదివారం(2)
27 వ సామాన్య ఆదివారం
హబక్కూకు 1: 2-3, 2: 2-4 , 2 తిమోతి 1: 6-8, 13-14, లూకా 17: 5-10
ఈ నాటి మూడు పఠనాల ద్వారా తల్లి మనందరిని కూడా దేవుని పై మనకున్నటువంటి నమ్మకమును దృఢపరుచుకోమని
లేదా మన విశ్వాసమును సుదృఢపరుచుకోమని ఆహ్వానిస్తోంది.
దేవునికి మనకు మధ్య ఉన్న భందాన్ని దృఢపరుచుకోమని కోరుతుంది.
మరి ఎప్పుడు దేవునికి మనకి మధ్య ఉన్న ఆబంధం దృడంగా ఉంటుంది అంటే దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు, దేవునికి
ప్రియమైన వారిగా , నీతివంతమైన జీవితాన్ని జీవించినప్పుడు. ముఖ్యముగా క్రైస్తవ జీవితంలో వచ్చే ఆటంకాలకు,
సమస్యలకు భయపడకుండా, దేవుని యందు విశ్వాసముంచి జీవించినప్పుడు. దేవునికి ప్రియమైన వారిగా ఉంటాము.
మొదటి పఠనం
ఈ మొదటి పఠనం హబక్కూకు ప్రవక్త మరియు దేవాది దేవుడికి మధ్య జరిగిన సంభాషణ సన్నివేశాన్ని తెలియ చేస్తుంది.
అసలు దీనిగురించి ఈ సంభాషణ, ఏమిటి ఈ సంభాషణ ?
హబక్కూకు ప్రవక్త ప్రశ్న మరియు దేవుని సమాధానమే ఈ సంభాషణ.
క్రీస్తు పూర్వం 6 వ శతాబ్దం కాలంలో (609-597) . ఈ కాలానికి చెందినవాడు హబక్కూకు ప్రవక్త. అప్పుడు యూదా
రాజ్యాన్ని యెహోయాకీము రాజు పరిపాలిస్తున్నాడు. ప్రజల జీవితాలు, చీకటి జీవితలుగా మారిపోయాయి, మంచి
పరిపాలనలేదు, నీతి గల నాయకుడు లేడు. ఈ యోహాయాకీము రాజు అవినీతితో , అధర్మం , దౌర్జన్యం , దోపిడీ,
హింసలతో రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయం. దేవుని ప్రజలు ఆకలి తో అలమటిస్తున్నారు. రాజ్యం ఇలా ఉండగా ,
మరోవైపు బబులోనియా రాజు ఈజిప్టు ని ఓడించి యూదా ప్రజలమీద దండయాత్రకు , రాజ్యం వెలుపల సిద్ధంగా ఉన్నారు.
ఇలాంటి సమయంలో నీతివంతమైన జీవితాన్ని జీవిస్తున్న హబక్కూకు ప్రవక్త యూదా ప్రజల మధ్యవర్తిగా దేవుడికి పిర్యాదు
చేస్తున్నారు. దేవుడికి మొరపెడుతున్నారు. ?
2, 3 వచనాలను చుస్తే ప్రవక్త దేవుడిని ప్రశ్నిస్తున్నారు “నీవు ఆ దుష్కార్యములుచూసి ఎట్లు సహింతువు”? అని.
ఎందుకంటే మనము 4 వచనము ధ్యానిస్తే , ఇక్కడ ప్రవక్త అంటారు “ధర్మ శాస్త్రం బలహీనమైనది , నిష్ప్రయోజనమైనది
న్యాయం జరుగుటలేదు, దుష్టులు సజ్జనులను అణగద్రొక్కుతున్నారు , న్యాయం తారుమారగుచున్నది . నీవు
ఏమిచేస్తున్నావు” అని దేవుడిని ప్రశిస్తున్నాడు అని మొదటిభాగం మొదటి అధ్యాయంలో చూస్తున్నాం.
ఈ యోహాయాకీము రాజు , ధర్మశాస్త్రమును పాటించుటలేదు. ఏమిటి ఈ ధర్మశాస్త్రము ?
ధర్మశాస్త్రమంతా కూడా బోధించేది మనకు దేవుని ప్రేమిచడం మరియు మానవుని ప్రేమిచడం. ఇక్కడ ఈ రాజు రెండు
చేయుటలేదు. రాజ్యాన్ని అన్యాయముగా పరిపాలిస్తున్నాడు.
మరి ప్రవక్త అడిగిన ప్రశ్నకు సమాధానముగా దేవుడు 2 వ అధ్యాయంలో , సమాధానమిస్తున్నారు. ఇది రెండవభాగం.
ఇక్కడ దేవుని సంధానం ఏమిటి అంటే ; నిర్ణీత కాలమున సంస్తముకూడా జరుగుతుందని, ఆలస్యముగా జరుగుతుందని.
ఓపికతో వేచివుండుము అని, అప్పటివరకు నీతిమంతులుగా భక్తి విశ్వాసములతో జీవించమని దేవుడు
సమాధానమిస్తున్నారు.
కాబట్టి మొదటి పఠనం నుండి మనము నేర్చుకోవలసినది; దేవునియందు విశ్వాసముంచి , ఓపిక గలిగి నీతివంతమైన
జీవితాన్ని జీవించడం.
రెండవ పఠనం
ఈ రెండవ పఠనం కూడా క్రీస్తునందు ప్రేమ, మరియు విశ్వాసము కలిగి జీవించుము అని తెలియచేస్తుంది.
ఏవిధంగానంటే
ఈ నాటి రెండవ పఠన చరిత్ర మనం చూస్తే ; ఇది పునీత పౌలు గారు రోమునగరమందు చెరసాలలో బందీగా ఉన్నప్పుడు
దైవ సేవకుడైన తిమోతీ గారికి సలహాలుగా , సూచనలుగా రాస్తున్న లేక ఇది.
క్రీ. శ 63 వ సంవత్సరంలో పౌలు గారు బందీ గా చేయబడ్డారు. ఎఫెసు నగరంలో తిమోతి గారు దైవసేవకుడిగా ఉన్నారు.
ఆ సమయంలో ఎఫెసు నగరంలో కొన్ని విభేదాలు, సమస్యలు, విభజనలు జరుగుతున్నాయి. ముఖ్యముగా నాస్తికుల
వాదనలు, విమర్శలు పెరిగాయి , క్రీస్తుని అనుసరించువారిని విశ్వాసంలో తప్పుదారిలో నడిపిస్తున్నారు, విశ్వాసులు క్రీస్తుకు
దూరమవుతున్నారు . ఇలాంటి అయోమయ స్థితిలో తిమోతిగారికి సువార్త పరిచర్య కష్టమవుతుంది. అందుకుగాను
పౌలుగారు తన సలహాలను, సూచనలను తిమోతి గారికి పంపిస్తున్నారు.
ఇక్కడ మనము ముఖ్యముగా మూడు సలహాలను చూడవచ్చు.
మొదటిగా
“నీకు జ్ఞాపకము చేయుచున్నాను” ఏమని, నీవు దేవుని సేవకుడవు, క్రీస్తు సేవకుడవు, నాలాగే నీవుకూడా “దేవుని
వరమును” (దేవుని శక్తి లేదా పవిత్రాత్మను) పొందియున్నావు. ఆ శక్తి నిన్ను పిరికివాని చేయదు. నిగ్రహము కలిగి ఉండుము
అని తెలియచేస్తున్నారు.
రెండవదిగా
క్రీస్తు ఒసగినటువంటి శక్తితో, సువార్త కొరకై నావలే పాటుపడుము. దేవునికి సాక్షిగా ఉండుటకు సిగ్గుపడకుము అని
అంటున్నారు . క్రీస్తు కొరకై శ్రమలు అనుభవించడానికి సిగ్గు పడకుము, భయపడకుము అని అంటున్నారు.
మూడవదిగా
“క్రీస్తు యేసునందు ఐక్యము” వలన అంటే “నీవు క్రీస్తు యేసుతో ఐక్యమై ఉండుము”. ప్రేమబందాన్నీ , విశ్వాస బంధాన్ని
కలిగి జీవించు అని అంటున్నారు. ఎప్పుడైతే అలాజీవిస్తావో క్రీస్తు కొరకు పాటుపడటానికి సాధ్యమవుతుంది.
ఈ రెండవ పఠనం నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే
క్రైస్తవులైన మనందరం కూడా జ్ఞానస్నానం ద్వారా పవిత్రాత్మ వరమును , శక్తిని పొందియున్నాము. కాబట్టి మనము కూడా
పైన పేర్కొనిన మూడు సిద్దాంతాల ప్రకారం జీవించాలని పునీత పౌలుగారివలె , తిమోతి గారివలె జీవించమని , క్రైస్తవులైన ,
దైవసేవకులైన మనందరికీ తెలియ చేస్తున్నారు.
1. మనలో కూడా పవిత్రాత్మ ఉన్నది.
2. మనము కూడా సువార్త కొరకై పాటుపడాలి, క్రీస్తుకు సాక్షిగా నిలవాలి
3. క్రీస్తునందు ప్రేమ, మరియు విశ్వాస భందాన్ని ఏర్పరుచుకోవాలి.
సువిశేష పఠనం
సువిశేష పఠనంలో కూడా శిష్యులు ప్రభువుతో “మా విశ్వాసము పెంపొందించుము” అని అంటున్నారు. ఎందుకు?
మనము ఈ నాటి సువిశేష పఠనం 1 నుండి 4 వచనాలు ధ్యానిస్తే ; క్రీస్తు ప్రభువు శిష్యులకు ఈ విధంగా ఉపదేశిస్తున్నారు.
“ఆటంకములు రాక తప్పవు. జాగరూకులు కండు” అని ఉపదేశించిన సందర్భంలో లోని మాటలు ఇవి. ఈ మాటలకి
శిష్యులు “మా విశ్వాసమును పెంపొందించుము” అని అంటున్నారు.
శిష్యులకి కూడా తమ వ్యక్తిగత జీవితాలలో ఆటంకములు, సమస్యలు రావచ్చును. తమ సోదరుల మధ్య ఉన్న
సంభందాలలో ఆటంకములు విమర్శలు రావచ్చును. ముఖ్యముగా తమ సువార్త పరిచర్యలో కష్టాలు, ఆటంకములు,
సమస్యలు రావచ్చును. ఇలా ఎన్ని వచ్చినాకూడా, క్రీస్తు అప్పగించిన, లేదా క్రీస్తు నిర్వహించిన కర్తవ్యమును నెరవేరుస్తారో
వారు మాత్రమే సేవకులంటున్నారు. ఉదాహరణకు రెండవ పఠనం , పునీత పౌలుగారి జీవితం.
అందుకే క్రీస్తు ప్రభువుకూడా -ఒక సేవకుని కర్తవ్యమును ఉదాహరణగా చూపిస్తున్నారు .
సేవకుడు ఎన్ని పనులు చేసిన , ఎంత అలిసిపోయిన , ఎన్ని ఆటంకాలు న్నా , తన యజమానుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం
జీవించడమే సేవకునియొక్క కర్తవ్యం అని క్రీస్తుప్రభువు తెలియచేస్తున్నారు. అలా జీవించడానికి కావలసినవి యజమానుని
యందు ప్రేమ మరియు యజమానుడు ఒసగిన కర్తవ్యాన్ని విశ్వాసంతో చేయడం.
అవిలేనిదే మనము ఏపనికూడా చేయలేము.
అందుకే క్రీస్తు ప్రభువు ఈ నాటి పఠనంలో అంటున్నారు మీకు ఆవగింజంత విశ్వాసము, ప్రేమ ఉన్న , వృక్షాలు సైతం
తొలగించవచ్చని.
మరి మంజీవితాలలో అలాంటి విశ్వాసం , ప్రేమ దేవునియెడల ఉన్నట్లయితే మన జీవితాలలో వృక్షాలుగా పాతుకుపోయిన
ఆటంకాలు, కష్టనష్టాలు , సమస్యలును కూడా ఎదుర్కొనవచును , వాటిని వేరుతో సహా పెళ్లగిలి బయట పారవేయవచ్చును
మరి ఒక్కసారి మనం ధ్యానిద్దాం , ఆత్మ పరిశీలన చేసుకుందాం.
మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఇలాంటి ఆటంకాలే వస్తాయి. ఏవిధంగా అయితే యూదా ప్రజలు
యోహాయాకీము రాజు అన్యాయ, అక్రమ పరిపాలనను అనుభవించారో, దైవ సేవకులైన పునీత పౌలుగారు మరియు
తిమోతి గారు నాస్తికుల విమర్శలకు మరియు కష్టాలు, శ్రమలకు గురయ్యారో, ఏవిధంగా క్రీస్తు ప్రభువు శిష్యులు విశ్వాస
పరీక్షలకు గురయ్యారో, మనము కూడా అలాంటి సమస్యలనే ఎదుర్కొంటాం. అలాంటి సమయాలలో కూడా మనము
పాటించవలసిన సిద్దాంతం.
1. మనలో కూడా దైవ వరం లేదా పవిత్రాత్మ శక్తి ఉందని గుర్తించాలి.
2. సమస్యలకు ఆటంకాలు భయపడకుండా, క్రీస్తుని సువార్తకై సాక్షిగా జీవించాలి.
3. క్రీస్తుని ప్రేమిస్తూ, ఆయనయందు విశ్వాసముంచి, మనజీవితాలలో ముందుకు సాగాలి.
బ్రదర్. సుభాష్ ఓ.సి.డి
24, సెప్టెంబర్ 2022, శనివారం
ఇరువది ఆరవ సామాన్య ఆదివారము (2)
ఇరువది ఆరవ సామాన్య ఆదివారము
ఆమోసు:6:1,4-7
1తిమో:6:11-16.
లూకా:16:19-31.
క్రీస్తునాధుని యందు ప్రియమైన సహోదరీ సహోదరులారా,ఈ నాడు మనమందరము కూడా ఇరువది ఆరవ సామాన్య ఆదివారములోనికి ప్రవేశిస్తున్నాము. ఈనాటి దివ్యగ్రంధ పఠనములను ధ్యానించినట్లయితే, మనకు మూడు విషయాలను తెలియజేస్తున్నాయి.
మొదటిది, ఐక్యమత్యముగా జీవించాలని, రెండవది,పేద, ధనిక వర్గాలు లేకుండా సోదరరుల్లాగా, ఒకరితో ఒకరు సహాయపడుతూ జీవించాలని. మూడవదిగా,పేదవారిపట్ల జాలి, దయ, కనికరము కలిగి ఆదరణతో జీవించాలని ఈ మూడు పఠనాలు మనకు తెలియజేస్తున్నాయి.
మొదటిపఠనము:
ఈనాటి మొదటి పఠనమును మనమందరము ధ్యానించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలమధ్య అన్యాయము, అవినీతి, మోసం, కుట్ర, అసూయ పెరిగిపోతున్నాయని మనకు తెలియజేస్తున్నాయి. ముఖ్యముగా వారిమధ్య ధనికులు,పేదవారు అని రెండు వర్గాలు ఏర్పడ్డాయి.మరి ఈధనికులు పెదవా రినుండి, అన్యాయముగా దోచుకొని, సుఖభాగ్యాలను అనుభవించడం మొదలుపెట్టారు. మరియు అనుదిన కలాపాలలో వ్యాపారములో ధనికులు పేదవారికి అన్యాయము జరిగి వారి సంపదలను పెంచుకున్నారు. వారు మేడలను కట్టుకొని సుఖభాగ్యాలతో జీవిస్తున్నారు. దీనిని గ్రహించినటువంటి దేవుడు, ఆమోసు ప్రవక్తను పంపి ధనికులను తీవ్రముగా కండిస్తున్నాడు.
రెండవ పఠనం :
ఈ రెండవ పఠనంను మనం ధ్యానించినట్లయితే, ధనికులు- పేదలు అను రెండువర్గాలవారు ఎఫెసు సంఘమునందు ఇహలోక సంపదలు గూర్చి ఆలోచిస్తూ, దైవ సంపదను విడనాడారు. మరియు వారి హృదయములో నీతి, భక్తి,విశ్వాసము,ప్రేమ సహనములను విడనాడి వారి సుఖ సంతోషాల ప్రకారము జీవిస్తున్న సమయములో మనకు
పు.పౌలుగారి ద్వారా రెండు విషయాలను తెలియజేస్తుంది. అవి:
1. దనాకాంక్షను విడనాడుట.
2.విశ్వాసవంతమైన జీవితమునకై నీతి, భక్తి ప్రేమ,అనువాటి యందు జీవిచాలని తెలియజేస్తున్నాయి.
1. దనాకాంక్షను విడనాడుట:
ఆనాటి ప్రజలు వారి సంతోషముకోసము ఎన్నో చెడ్డ దారులను త్రొక్కుతూ, పేదవారిని పట్టించుకోకుండా విందులు వినోదములతో గడుపుతున్నారు. అందుకుగాను పు.పౌలుగారు ఈలేఖనుతిమోతీకి వ్రాస్తూ ఆప్రజల హృదయములు మార్చమని వారి హృదయములో ఇటువంటి ధనాకాంక్ష కాకుండా దేవుని యందు వారి మనసులను నిమగ్నము చేయాలని తెలియజేస్తున్నాడు.
2. విశ్వాసవంతమైన జీవితమునకై నీతి, భక్తి ప్రేమ,అనువాటి యందు జీవిచాలని
తెలియజేస్తున్నాయి:
పు. పౌలు గారు తమ జీవితములో దేవుని కోసమై ఒక ఉన్నతమైన జీవితమును జీవించాడు. అందుకే ఈనాడు ఆప్రజలతో ;విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్యజీవితమును పొందండి; అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా విశ్వాసవంతమైన జీవితమును జీవించి ఈలోక ఆశలకు దూరంగా ఉంటూ నిత్యజీవితమును పొందుటకు ప్రేమ, భక్తి, జాలి మన పొరుగువారిపై చూపిస్తూ ఒక నూతన జీవితమును జీవిద్దాము.
సువిశేష పఠనము :
ఈనాటి సువిశేష పఠనము ధనికుడు-లాజరు యొక్క ఉపమానమును తెలియజేస్తుంది. అయితే ఈ రెండు విషయాలను మనకు తెలియజేస్తుంది:
1 .పేదవానికి సహాయము చేసి నిత్యజీవితమును పొందటం: ఈనాటి సువిశేష పఠనములో ధనవంతుడు పేదవానికి సహాయము చేయకుండా తన స్వార్ధముకోసము జీవిచి పక్కనేవున్న లాజరును పట్టించుకోకుండా ధనమును దైవముగా భావించి నిత్యజీవమును కోల్పోయి నరకములో కన్నీరు కారుస్తున్నాడు. కానీ లాజరు మాత్రము ఈ ధనవంతుడియందు విశ్వాసముంచి అతడు తనకు ఏమయినా ఇస్తాడేమో అని ఎదురుచూస్తున్నాడు. కానీ, ఈ లాజరు ఏమి పొందలేకపోయారు. మనంకూడా ఈ లాజరు వలె దేవుని యందు నమ్మకము. విశ్వాసము ఉంచి ప్రార్ధనలో అడిగినట్లయితే మనకు లంకావలసినది ఇస్తాడు. మత్తయి:7 :7 లో చూస్తే, అడుగుడు నీకివ్వబడును, వెదకుడు నీకు దొరుకును, తట్టుడు నీకు తెరువబడును అని అంటున్నాడు. కాబట్టి మనము దేవునియందు విశ్వాసముంచి అడిగినట్లయితే ఆయనమనకు ఖచ్చితముగా ఇస్తాడు.
2 .పేదవారికి మనము ఎంతగా సహాయకులుగా వుంటున్నాము: మనయొక్క సహోదరులు కష్టాలలో ఉంటే వారిని పట్టించుకోకుండా మన సొంత అవసరాలను మాత్రమే మనము తీర్చుకుంటూన్నాము. దేవుడు ఇలా అంటున్నాడు, నన్ను ప్రేమించినట్లే, నీ పొరుగువారికి ప్రేమించండి అని అంటున్నాడు. ఇంకా,ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏఒక్కరికి ఇది చేసినప్పుడు ఆదినాకు చేసితిరి అని ప్రభువు పలుకుచున్నాడు. అంటే, ఈ సహాయము ఎవరికీ కావాలి అంటే పేదవారికి కావాలి. మనము మనతోవున్న ఈ పేదవారికి సహాయము చేసినప్పుడు మనము వారికి కాకుండా దేవునికి చేస్తున్నాము అని మనము అర్ధం చేసుకోవాలి. కానీ, ఈ ధనవంతుడు తన పక్కనే వున్న పేదవాడైనటువంటి లాజరును పట్టించుకోకుండా సంతోషముగా భుజిస్తూ,జీవిస్తున్నాడు. కానీ చివరికి అతను మరణించిన తరువాత అదే లాజరు సహాయమును ఆర్జిస్తున్నాడు. కాబట్టి, మనజీవితములో కూడా మన తోటివారితో ఎప్పుడు అవసరము వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనము అటువంటి సమయములో మనతోటివారిని తిరస్కరించనట్లయితే మనంకూడా ఈనాడు చూస్తున్నటువంటి ధనికునివలె దేవుని యొక్క ప్రేమను కరుణను కోల్పోయి, మరణమును కొనితెచ్చుకొని నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి మనము మన పేదవానికి సహాయకులుగా ఉంటూ, దేవుని యొక్క ప్రేమనుపొంది ఆ ప్రేమలో ఐక్యమగునట్లు జీవంచుటకు ప్రార్ధిద్దాము.
17, సెప్టెంబర్ 2022, శనివారం
ఇరువది అయిదవ సామాన్య ఆదివారము
25వ సామాన్య ఆదివారము
1తిమోతి 2:- 1-8
లూకా 16:- 1-13
ఈనాటి
మూడు పఠనముల ద్వారా దేవుడు మనలను తన యందు ఆధారపడిజీవించు శిష్యుల సేవకులలాగా జీవిస్తూ, ఈలోగా ఆశలకు దూరముగా జీవించుటకు ప్రయత్నించాలి అని తెలియజేస్తు న్నాయి.
మొదటి పఠనము :
ఈనాటి మొదటి పఠనము ముఖ్యముగా "ధనవంతుల అన్యాయపు దోపిడి" మరియు "పేదల కష్టాలను లేదా శ్రమలను" గూర్చి తెలియజేస్తుంది.
ఎందుకు ఇలా ఆనాటి కాలములో జరిగినది అని మనము ఆరా తీస్తే మనకు అర్ధం అయ్యే అంశము ఏమిటంటే: యూదా దేశాన్ని ఉజియా రాజు మరియు ఇశ్రాయేలీయులను యరొబాము రాజు పరిపాలించిన కాలములో సామ్రాజ్యము బాగా విస్తరించి ఎంతో అభివృద్ధి చెందింది. మరియు ఆర్ధికంగా పుంజుకుంది. అయితే అభివృద్ధితో పాటు కష్టనష్టాలు కూడా ఎదురయ్యాయి ఇటువంటి సమయములోఎవరు చిత్తశుద్ధితో ఆలోచించకుండా, అవినీతితో జీవించడం మొదలుపెట్టారు. ఇటువంటి సమయములో ఆ దేవాతో దేవుడు తన సేవకుడిగా ఆమోసు ప్రవక్తను ఎన్నుకొని ఈప్రజల దగ్గరికి పంపిస్తూ, వారు చేసిన పాపాలను గుర్తు చేస్తూ, వారికి ఒక మంచి జీవితమును ఇవ్వడానికి ప్రయాసపడుతున్నాడు.
మరి వారు చేసిన పాపములు ఏమిటి అంటే:
1. దీనుల తలమీద కాలుమోపుచు అంటే, ఒక సాధారణ ప్రజలను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ, వారిని బానిసలుగా చేస్తూ, పేదలుగాఉన్నవారి జీవితములను నాశనము చేస్తున్నారని భావం. వారి చేసే మోసము, దోపిడి ఏమిటంటే,
2.వారి
ప్రలాభాలకోసం దేవునికే కేటాయించేటటువంటి పవిత్రమైనరోజు విశ్రాంతిదినము ఎప్పుడు దాటిపోవును అని తలంచుచున్నారు.
3.గోధుమలను
అమ్మినపుడు కొలమానములను తగ్గించి, తూకములను పెంచుచున్నారు.
4.దొంగ త్రాసులతో జనులను మోసగించుచున్నారు.
5.తాలు గోధుమలను ఎక్కువ ధరలకు అమ్మతున్నారు.
6.బాకీలు చెల్లింపలేని చెప్పుల జోడు వెలకూడా
చెల్లింపలేని పెదాలను వారి బానిసలుగా చేసుకొనుచున్నారు.
7 .చచ్చుధాన్యములను అమ్ముకోవచ్చు అని వారు తలంచుచున్నారు.
దేవుడు అంటున్నాడు
మత్త:5 :3 లో : "దీనాత్ములు ధన్యులు దైవారాజ్యము వారిదని".
ఈనాడు ఈమొదటిపతనములో ఉన్నటువంటి దీనులకు, పేదప్రజలకు తన రాజ్యమును ఇవ్వడానికి తన సేవకుడైనటువంటి ఆమోసును వారిదగ్గరకు పంపించి అతని ద్వారా వారికి విముక్తిని కలుగజేస్తున్నాడు.
దేవుడు వారికి విమోచనను కలిగించాలను కుంటున్నాడు. లూకా సువార్తలో చూస్తే, దేవుడు ఇలా అంటున్నాడు"పీడితులకు
విమోచన
కలిగించుటకు
అయన
నన్ను
పంపెను”
(లూకా:4:18), అని అంటున్నాడు. అంటే యేసుప్రభువు ఈలోకానికి వచ్చినది ప్రతిఒక్క వ్యక్తికి కూడా విడుదలను, విమోచనమును కలిగించుటకు వచ్చి వున్నాడు అని తెలియజేస్తుంది.
దేవుడు ఈలోకమునకు వచ్చినది ధనవంతులకోసం కాదు,
అధికారులకోసం కాదు,
రాజుల కోసం కాదు. కానీ పాపాత్ముల కోసం, దీనులకోసం, మరియు అవసరాలలో వున్నవారిని ఆదుకోవటం కోసం వచ్చివున్నాడు. అందుకే తన పనిని తన శిష్యుల ద్వారా చేస్తున్నాడు. కాబట్టి మనందరి లక్ష్యం ఏమిటంటే దేవుడు నియమించిన పనిని సంపూర్తిగా చేయాలి.
రెండవ
పఠనము:
ఈనాటి రెండవ పఠనమును మనము పునీత. పౌలు గారు
తిమోతికి వ్రాసిన మొదటి లేక నుంచి తీసుకొనబడినది. అయితే ఈ లేఖ యొక్క అంతరార్ధం ఏమిటంటే, దైవ సంఘముకోసం, మరియు వారి రక్షణార్ధము కోసం మనము రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్ధన చేయాలి అని తెలుపుచున్నాడు.
ఎందుకు రాజుల కోసం, అధికారుల కోసం, ఇంకా ప్రతిఒక్క ప్రజలకోసం ప్రార్ధన చేయాలి అంటే:
1 .సత్ప్రవర్తన కలిగిన జీవితమును గడపడానికి.
2 .సంపూర్ణమగు
దైవ భక్తితో జీవించడానికి.
3 .ఎటువంటి
ఒడిదుడుకులులేని ప్రశాంతజీవితమును జీవించడానికి.
ప్రతిఒక్క రాజు కూడా తన రాజ్యమును సత్ప్రవర్తన కలిగిన రాజ్యముగా తీర్చిదిద్దాలి. తన రాజ్యములో ఎటువంటి వర్గభేదాలు తారతమ్యాలు, ఒడిదుడుకులు, అశాంతి, మనస్పర్ధలులే కుండా జీవించాలి. అప్పుడే ఆరాజ్యములో ఉన్నటువంటి రాజు మరియు అధికారులు తమ పనిని సక్రమముగా నిర్వర్తించినవారవుతారు. అందుకుగాను మనమందరముకూడా ప్రతియొక్క రాజు కోసం, అధికారుల కోసం ప్రార్ధన చేయాలి అని పు.పౌలుగారు తనకు ప్రీతిపాత్రుడైనటువంటి తిమోతికిఈలేఖను ప్రేమగా, సంతోషముగా వ్రాస్తున్నాడు.
కాబట్టి మనమందరం ముఖ్యముగా ముందుగా చేయవలిసిన పని ఏమిటంటే ప్రార్ధన చేయాలి. ఆ ప్రార్ధనే మనలను దేవుని చెంతకు నడిపిస్తుంది. కాబిట్టి మనమందరము కూడా ఈలోక వ్యక్తులను, వస్తువులను, వనరులను ఇష్టపడక, మన మధ్యలో ఉన్నటువంటి దేవుని మాత్రమే ఇష్టపడుతూ, ఎల్లయెడల క్రోధముగాని, తర్కముగాని లేకుండా చేతులుజోడించి భక్తితో ప్రార్ధన ఛేధ్ధాం (Iతిమో:2:8). అలా చేసిన ప్రార్ధన ద్వారా ప్రతివ్యక్తి కూడా దేవునియొక్క దీవెనలతో వినయము కలిగి జీవిస్తాడు.
దేవుడంటున్నాడు, "తన్ను నమ్ము వారికి, తన్ను వెదకువారికి ప్రభువు మేలుచేయును" (విలా:3 :25 -26 ) అని. ఇంకా జెఫ:1:6 లో,"ప్రభువు నీ నడుమనున్నాడు"
అంటున్నాడు. ఆ దేవాతి దేవుడయినటువంటి మన యేసు ప్రభువు మనకు తండ్రికి మధ్యవర్తిగా వుండి మన రక్షణార్ధమై తనను తాను అర్పించుకున్నాడు. ఎందుకంటే, మనము రక్షింపబడాలని అయన కోరిక (Iతిమో:2 :5 -6). కాబిట్టి
మనమందరము కూడా ఈలోక వ్యక్తులను, వస్తువులను, వనరులను ఇష్టపడక, మన మధ్యలో ఉన్నటువంటి దేవుని మాత్రమే ఇష్టపడుతూ, విశ్వాసపూరితమైన జీవితమును జీవించడానికి పట్టుదలతో
ప్రార్ధన చేస్తూ జీవిద్దాo.
ఈనాటి సువిశేష పఠనము ముందుచూపుకలిగిన
గృహనిర్వాహుకుడి
ఉపమానమును మనము చూస్తున్నాం. ఈ ఉపమానమును మనము చదివినప్పుడు మనకు కొంచెం వింతగా అనిపిస్తుంది. కానీ ఇందులో అందరాని నిగూడ అర్ధం దాగివుంది.
మొదటిది, దేవుని రాకకోసం సిద్ధపాటు కలిగి జీవించాలి అని తెలియజేస్తుంది.
రెండవదిగా, ధనము ద్వారా స్నేహితులను చేసుకోమని తెలియజేస్తుంది.
ఉదా:
పేదలకు సహాయం చేయడం, ఆపదలో వున్నవారికి సహాయపడటం.
మూడవదిగా, ప్రతిఒక్క సేవకుడు వెలుగు బిడ్డలుగా ఉండాలని సూచిస్తుంది.
ఎందుకంటే
వీళ్ళు దేవునియొక్క ఆత్మచే నింపబడినవాళ్లు. దీనిద్వారా ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తూ, ఇతరులను ఈ ఆధ్యాత్మిక లేక పరిశుద్ధ బాటలో నడిపిస్తారు.
లోక సంబంధ ప్రజలు అంటే: ఈలోక ఆశలకు, ఆశయాలకు, చెడు వ్యసనాలకు, చెడు జీవితమునకు అలవాటుపడి జీవించేవారు.
ముందుగా ఈ ఉపమానమును యేసు ప్రభువు తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వారుకూడా ఈ గృహ నిర్వాహకుడివలె జాగరూపత కలిగి జీవిచాలని అదేవిధముగా తన తండ్రియొక్క నివాస స్థలములో వారు పాలి భాగస్థులవ్వాలని
దేవుని కోరిక.
అయితే అందుకుగాను ఆ శిష్యులు ఏమి చేయాలి?
ముందుగా, ప్రతియొక్క శిష్యుడు కూడా వారు చేసినటువంటి పాపాలను నేరాలను కూడా గుర్తుచేసుకొని తగిన పశ్తాతాపమును పొందాలి. ఎందుకంటే, ఈనాటి సువిశేష మొదటి వచనంలో, ఒక ధనవంతుని వద్ద ఉన్నటువంటి గృహ నిర్వాహకుడు తన సంపదను (దేవుడు ఇచ్చు దీవెనలను, జీవితమును) అంతా వృధా చేస్తున్నాడని నేరము మోపాడు (లూకా: 16:1). ఇక్కడ ధనవంతుడు ఎవరయ్యా అంటే, దేవుడు.గృహనిర్వాహకుడు-శిష్యులు.
దేవుడు తన జీవితములో ఇచ్చినటువంటి దీవెనలను అర్ధం చేసుకోలేక తన స్వార్ధముకోసం ఈలోక ఆశలలో పడిపోతున్నాడు. అప్పుడు యజమానుడు తనను పిలిచి, లెక్కలను అప్పగింపుము,నీవు ఇక నా గృహనిర్వాహకుడిగా పనికిరావు అని అంటుంన్నాడు (లూకా :16:2). ఇది ప్రతిఒక్క శిష్యునికి కూడా దేవుడు వారి తప్పులను ఏదో ఒక విధముగా తెలియజేస్తుంటాడు. అప్పుడు ప్రతిఒక్క శిష్యుడు చేసే పని ఏమిటంటే,
1 .దేవుని యొక్క గొప్పతనమును అర్ధం చేసుకోవాలి.
2 .తాను చేసిన తప్పులకు గానూ పశ్చాత్తాపపడాలి.
3 .దేవునియందు తన పాపములను ఒప్పుకోవాలి.
4 .దేవునియొక్క దీవెనలను పొందాలి.
1 .దేవుని యొక్క గొప్పతనమును అర్ధం చేసుకోవాలి:
ఈ సేవకుడు తన యజమానుడు తనజీవితములో చేసిన గొప్పతనమును గుర్తుచేసుకున్నాడు. తన యజమానుడు తన (సేవకుని) మీద నమ్మకము ఉంచి, తాను దూర దేశమునకు వెళ్ళాడు. అన్నిటి మీద అధికారమును తనకు అప్పగించాడు. సేవకునిగా వున్న అతడ్ని తన సంపదకు అధికారిని చేస్తున్నాడు.
ఉదా: తప్పిపియిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి స్వీకరించి తనతో ఒకటిగా చేర్చుకున్నాడు.
2 .తాను చేసిన తప్పులకు గానూ పశ్చాత్తాపపడాలి:
ఇదంతా గ్రహించిన ఈ సేవకుడు పశ్చాత్తాపపడుచున్నాడు. ఇది ఎలాంటి పశ్చాత్తాపముఅంటే, తాను మారక పోతే తన యజమాని పనిలోనుండి తీసివేస్తాడేమోనని భయపడి పశ్చాత్తాపపడి, తాను చేయవలిసిన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాడు.
ఆ కర్తవ్యం ఏమిటంటే:
1 .యజమానుని ఋణస్థులను పిలిచాడు.
2 .ఋణస్థుల ఋణములను తగ్గించాడు.
3 .ఆ ఋణస్థులను సంతోషపరిచాడు.
4 .యజమానుడు సేవకుని మెచ్చుకున్నాడు.
ఇక్కడ ప్రతిఒక్క శిష్యుడు కూడా ఈ సేవకుని పోలి జీవించాలి. ఎందుకంటే, ప్రతిఒక్క శిష్యుడు తన దగ్గరకు వచ్చేటటువంటి విశ్వాసులకు ఆధ్యాత్మికంగా వారికి సహాయ పడాలి. వారు ఆ ఆధ్యాత్మికతలో ఎదగలేనప్పుడు వారికి సహాయం చేయాలి.
ఇక్కడ సేవకుడు చేసిన పనేమిటి:
1 .ఋణస్థులను పిలిచాడు.
2 . వారి సామర్ధ్యమును భట్టి వారి యొక్క రుణమును తగ్గించాడు.
"చెడ్డవాడిని డబ్బులిచ్చి వదిలించుకోవాలట- మంచివాడిని డబ్బులిచ్చి సంపాదించుకోవాలట".
రక్షణ చరిత్రలో ఎంతోమంది, అల్పమయిన దానికై అధికమైనదానిని కోల్పోయారు.
ఉదా: అల్పమైన పండుకోసం అవ్వ ఆదాము దేవుడితో నివసించు అవకాశాన్ని కోల్పోయారు.(అది:3:22-23)
పూట భోజనం కోసం తండ్రి దీవెనలను కోల్పోయిన ఏశావు (ఆది:25:27-34).
పశుసంపదకోసం రాజరికాన్నే కోల్పోయిన సౌలు రాజు (Iసమూ:15:1-24)
స్త్రీ కోసం ఆత్మ బలాన్ని కోల్పోయిన సంసోను.(న్యాయ:16:1-31 )
ఆస్తికోసం దైవ రాజ్యాన్నే కోల్పోయిన యువకుడు (మత్త: 19:16-29 ).
ఇలా ఎంతో మంది అల్పమైన వాటికై ప్రాకులాడి చివరికి ఏమి సాధించలేక పోయారు.
కానీ ఈనాటి సువిశేష పఠనంలో ఉన్నటువంటి సేవకుడు మాత్రం ముందుచూపు కలిగిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన తప్పులన్నీ తన యజమానికి తెలిసినవి అని తనకు తెలిసిన వెంటనే ఏమిచేయాలో అలోచించి, దానికి తగ్గట్టుగా చేసాడు. దాని ఫలితం తాను తన యజమానినుండి పొందాడు.
యజమానుని ఋణము తగ్గించడానికి కారణము:
ముందుగా ఈ సేవకుడు తన యజమానుని ఆస్తిని తన ఇష్టానుసారంగ ధనము మీద ఆశతో ప్రజలకు ఎక్కువ పన్నులకు, వడ్డీలకు ఇచ్చాడు. కానీ తనను గురించి తెలుసుకున్న యజమానుని దగ్గర నుంచి కోల్పోబోతున్న తన పనిని తిరిగి సంపాదించడానికి, మరియు ఒకవేళ తన యజమానుడు అతడ్ని వెళ్లగొడితే, తెరిగి వీళ్ళయినా చేరదీస్తారన్న ఒక చిన్న ఆశతో వారి ఋణములను తగ్గిస్తున్నాడు. దాని ద్వారా వారు తన స్నేహితులుగా మారుతున్నారు.
మరి ప్రతి ఒక్క శిష్యునికి వుండవలిసిన లక్షణాలు ఏమిటంటే:
1.దేవునియొక్క రాకకోసం ఎదురుచూడాలి.
2.ప్రతియొక్క శిష్యుడు కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలి.
3.పేదప్రజలకు సహాయము చేయాలి.
4.దేవునియొక్క ప్రేమను ఈలోకమంతటా తెలియజేయాలి.
మరి కుటుంబజీవితములో
మనము ఎలాంటి జీవితమును జీవించాలి:
1 . ఒకరినొకరు అర్ధం చేసుకొని జీవించాలి.
2 .ఒకరికొకరు సహాయము చేసుకుంటూ జీవించాలి.
3 .ఒకరినొకరు ప్రేమించుకోవాలి.
చివరి వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు, "దైవమును, ద్రవ్యమును సేవింపలేరు" అని. ఎందుకంటే దైవము, ద్రవ్యము ఒకటికాదు. దేవుడు మనకు జీవితమును ఇస్తే, ఈ ధనము మాత్రము మన ప్రాణములను తీసుకునేలా చేస్తుంది. కాబట్టి, మనము ఇద్దరు యజమానులు సేవించు సేవకులుగా కాక ఒకే ఒక యజమానికి సేవచేసే సేవకుడిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన సాదారణ జీవితములో ఒక వైపు దేవుడిని, దైవమును ఒకేలాగా చూస్తూవున్నాం. ఒకొక్కసారి ధనంకోసం దేవుడినే మర్చిపోతున్నాం. లూకా:16:13 లో చెప్పిన విధముగా: ఏ సేవకుడు ఇద్దరు యజమానులు సేవింపజాలడు. ఏలయన, వాడు ఒకరిని ద్వేషించును. మరొకరిని ప్రేమించును అని. ధనమునకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా నీకు జీవితమును ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవునికి, నీతో వుంటున్నటువంటి, నిన్ను ప్రేమిస్తున్నటువంటి నీ కుటుంబీకులకు ప్రాధాన్యత ఇవ్వడానికి మనము వెనకంజ వేయకుడదు.
కాబట్టి ఈనాటి మూడు పఠనముల ద్వారా దేవుడు మనలను తన యందు ఆధారపడిజీవించు శిష్యుల/సేవకులలాగా జీవిస్తూ, ఈలోక ఆశలకు దూరముగా జీవించుటకు ప్రయత్నించాలి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి జీవితమును జీవించడానికి ప్రయాసపడదాం.ఆమెన్.
బ్రదర్.యన్.జోసెఫ్ మారియో .ఓసిడి.
నిత్య జీవము ఎలా వస్తుంది
యోహాను 6: 22-29 మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...