23, సెప్టెంబర్ 2023, శనివారం
25 వ సామాన్య ఆదివారం
16, సెప్టెంబర్ 2023, శనివారం
24 వ సామాన్య ఆదివారం
24 వ సామాన్య ఆదివారం
సిరాకు27:30-28:7, రోమా 14:7-9, మత్తయి 18:21-35
ఈనాటి దివ్య పఠణములు క్రైస్తవ జీవితంలో కలిగి ఉండవలసిన ఒక ముఖ్యమైన లక్షణం/గుణం గురించి తెలియజేస్తూ ఉన్నవి. అది ఏమిటంటే క్షమాగుణం. మనలను గాయపరిచిన వ్యక్తులను క్షమించుట అలాగే వారితో సఖ్యత పడి జీవించుట కష్టం అయినప్పటికీ ప్రభువు దానిని మన జీవితంలో పాటించమని బోధిస్తున్నారు. చాలా సందర్భాలలో చాలామంది వ్యక్తులు అనేక రకాలైనటువంటి పాపాలు, మోసాలు, తప్పిదాలు చేస్తూ ఉంటారు అలాంటి వారిని క్షమించుట కష్టం కానీ ఈనాటి పఠణములు మనందరం కూడా క్షమించే మనస్సును కలిగి ఉండాలని తెలుపుచున్నవి. అన్యాయం చేసిన వారిని ద్వేషిస్తూ ఉంటాం అలాగే దూరం పెడుతూ ఉంటాం. మోసం చేసిన వారిని ఎన్నడూ కూడా క్షమించలేకపోతున్నాము, అబద్ధం ఆడిన వారిని సహించలేకపోతున్నాం. దేవుడు మనము తన యొక్క అనుచరులుగా ఉండాలి అంటే మన క్రైస్తవ జీవితం పరిపూర్ణం కావాలంటే మనందరం కూడా ఈ క్షమాభావమును కలిగి ఉండి పరస్పరము క్షమించుకొని అంగీకరించుకొని జీవించమని ప్రభువు కోరుచున్నారు. ఏసుప్రభు క్షమా అనే అంశమును పరాకాష్టకు తీసుకుని వెళ్లారు. క్షమించుట ద్వారా మనకు బంధం ఏర్పడుతుంది అలాగే ఎదుటి వ్యక్తిని మరొకసారి మనము నమ్ముతున్నాం.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు 'ఏ వ్యక్తియు పగ, కోపము పెంచుకోకుండా ఒకరి తప్పిదములు ఇంకొకరు క్షమించుకొని జీవించమని తెలుపుచున్నారు. సిరాకు 27:30 వ వచనములో ప్రభువు పలికే మాటలు ఏమిటంటే పగ, కోపము ఘోరమైనవి అని. పాపి ఈ రెండిటికి వశుడగును అని తెలుపుచున్నారు. దేవుని యెడల భయము విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి తన యొక్క జీవితములో పగ పెంచుకొనుటకు, కోపమును కొనసాగించుటకు ఎన్నడూ ఇష్టపడడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన/ఆమె జీవించాలి అనుకుంటున్నారు కాబట్టి అతడు/ఆమె తన జీవితమును సరి చేసుకుని దేవుని యొక్క వాక్కునుసారముగా జీవిస్తూ ఉంటారు.ఎవరైతే దైవ భయము లేకుండా పాపములో జీవించాలి అనుకునేటటువంటి వారు మాత్రమే బ్రతికినంత కాలం పగ, కోపము పెట్టుకొని జీవిస్తూ ఉంటారు అలాంటి వారిని ప్రభువు శిక్షిస్తానంటున్నారు వారి పాపములను, క్షమించమంటున్నారు, వారి ప్రార్థనలను ఆలకించనంటున్నారు.ప్రభువు నరుల యొక్క పాపములెల్ల గమనించును ఎవరైతే పగ తీర్చుకుంటూ ఉంటారో వారి మీద ప్రభువు కూడా పగ తీర్చుకుంటా అంటున్నారు. మన యొక్క అనుదిన జీవితంలో ఎదుటి వ్యక్తి చేసినటువంటి తప్పిదములను పరస్పరము క్షమించుకుని ముందుకు వెళ్ళాలి. చాలా సందర్భాల్లో మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే కంటికి కన్ను, పంటికి పన్ను అలాగే దెబ్బకు దెబ్బ మనందరం కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి పరుగులెడుతుంటాం. అన్యాయం చేసిన వారి యెడల పగ, ద్వేషం అసూయ, కోపము మొదలైనటువంటి దుర్గుణాలన్నీ కూడా పెంచుకొని పోతుంటాం. ద్రోహం చేసిన వ్యక్తిపై మనము పగ సాధించుట సర్వసాధారణం అయిపోతుంది. కాబట్టి ప్రభువు ఇవన్నీ కూడా విడిచి పెట్టేసి మన పాపాలు క్షమించబడాలి అంటే మనము కూడా ఇతరుల యొక్క పాపాలు క్షమించమని తెలుపుచున్నారు.
క్షమాపణ లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట శాంతి, సమాధానం, సంతోషం ఉండవు శాంతి సమాధానము లేని చోట నిజమైన క్రైస్తవ జీవితం లేదు కాబట్టి ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. మనము ఎదుటి వ్యక్తి యొక్క పాపములు మన్నించినచో అప్పుడు దేవుడు కూడా మన యొక్క అనేక అపరాధములను మన్నిస్తారని తెలుపుచున్నారు. అదే విధముగా ప్రభువు పరులు చేసిన తప్పులను మీరు క్షమింపనీ ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపరు అని తెలుపుచున్నారు (మత్తయి 16:15). మన సోదరీ సోదరులను మనము అంగీకరించకపోతే దేవుడు మనల్ని తన బిడ్డలగా స్వీకరించరు. ఈ మొదటి పఠణంలో చాలా చక్కగా రచయిత మనము ఇతరులను క్షమించి అలాగే దేవుని క్షమాపణ కోరమంటున్నారు. అనేకసార్లు మనము దేవుడిని మన పాపాలు క్షమించమని కోరుతున్నాము కానీ ఎదుటి వ్యక్తి యొక్క తప్పిదాలను క్షమించడానికి మనకి ఏమాత్రం మనస్సు రావటం లేదు కొన్నిసార్లు దేవుడి యొక్క వాక్యము హెచ్చరించినప్పటికీ దీనిని అంతగా ఎవరు పట్టించుకొనుటలేదు. అనేక సందర్భాలలో ప్రభువు అంటున్నారు బలిపీఠ సన్నిధికి నీ కానుకలను తెచ్చినప్పుడు నీ సోదరుడిపై నీకు వ్యాజ్యమునట్లయితే, ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి, పోయి, నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము అని ప్రభువు పలుకుచున్నారు (మత్తయి 5:23-24). మన యొక్క కోపము పగ మనల్ని ఇంకా పాపం చేయటానికి కారణం అవుతూ ఉంది కాబట్టి ఆ రెండిటిని మనందరం కూడా విడిచిపెట్టుటకు ప్రయత్నం చేయాలి. పౌలు గారు ఈ విధంగా అంటున్నారు ఒకవేళ మీకు కోపం వచ్చినచో ఆ పాపము మిమ్ములను పాపములోకి లాగుకొనిపోకుండ చూచుకొనుడు. సూర్యుడు అస్తమించులోగా కోపం చల్లారిపోవలయును (ఎఫే4:26). మన కోపం మొత్తము సాయంత్రంలోగా నశించిపోయి ఇతరులతో సఖ్యపడాలి అప్పుడు మాత్రమే సంతోషంగా జీవించగలుగుతాం. మన జీవితం శాశ్వతం కాదు కాబట్టి ఏదో ఒక రోజున మరణిస్తాము, అలాగే మన దేహం కూడా కుళ్ళిపోవును. మనమే శాశ్వతం కాదు కాబట్టి మరి పగలను ఎందుకు బ్రతికినంత కాలం ఉంచుకోవాలి? కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ మన కోపము మానుకొని, తప్పిదాలు క్షమించుకుని ఇతరులతో కలిసిమెలిసి జీవించాలి అన్నది ఈనాటి మొదటి పఠణం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. .
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు మనము జీవించునను, మరణించినను ప్రభువుకు చెందినవారమే అని పలుకుతున్నారు అనగా దేవునికి చెందినవారు ఎల్లప్పుడూ స్వార్థం లేకుండా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా కలసి మెలసి అన్యోన్యంగా జీవించాలిని తెలుపుచున్నారు. దేవునికి చెందినవారము కాబట్టి దేవుని యొక్క జీవితమును ఈ లోకంలో ఉన్న వ్యక్తులకు చూపించాలి. దేవుని జీవితం క్షమా, దయ, ప్రేమ, జాలి, కలిగినటువంటి జీవితం వాటన్నిటినీ కూడా మన జీవితంలో పాటించాలి.
ఈనాటి సువిశేష భాగములో పేతురు గారు ఏసుప్రభువుని ఒక ప్రశ్న అడుగుతున్నారు "నా సోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను?". దానికి సమాధానంగా ప్రభువు ఒక ఉపమానములు తెలియజేస్తూ దేవుడు ఏ విధంగా మానవాళిని క్షమిస్తున్నారు అని తెలుపుచున్నారు అదేవిధంగా మానవుడు క్షమింపబడిన తర్వాత తన తోటి మానవుడిని క్షమించుట మరచిపోతున్నాడు అనే సత్యమును కూడా వెల్లడి చేస్తున్నారు. యూదా మత బోధకుల ప్రకారము తప్పు చేసిన సహోదరుని కనీసం మూడుసార్లు మన్నించాలి. దీనికి సంబంధించిన ఆధారాలు ఆమోసు గ్రంథంలో మనందరికీ కనిపిస్తాయి.(ఆమోసు 1:3, 6,9,11,13; 2:1,4,6). మూడు తప్పులు వరకు దేవుడు మన్నిస్తాడు నాలుగవసారి శిక్షిస్తాడు అని ఆనాటి యొక్క యూదా బోధకుల అభిప్రాయం. అయితే పేతురు గారు మూడుకు తన యొక్క ఉదార స్వభావంతో ఇంకొక నాలుగు సార్లు అనుసంధానం చేసి మొత్తం 7 సార్లు క్షమించాలి అని అడుగుతున్నారు. 7 యూదులకు పవిత్ర సంఖ్య, పరిపూర్ణతకు గుర్తు అందుకని పేతురు గారు ఏడు సార్లు క్షమించాలా అని అడుగుతున్నారు. దానికి సమాధానంగా ప్రభువు ఏడు కాదు ఏడు డెబ్బది సార్లు అని చెప్తున్నారు. ఏసుప్రభు యొక్క ఉద్దేశం ప్రకారము క్షమాపణకు హద్దులు లేవు అది నిరతము జరుగుతూ ఉండాలి, ద్రోహిని ఎన్నిసార్లైనా క్షమించటానికి సిద్ధంగా ఉండాలి. హద్దులు లేనటువంటి క్షమాపణ నిజమైన మన్నింపు. క్షమాపణ అనేది కేవలం పెదవుల ద్వారా మాత్రమే కాకుండా హృదయపూర్వకముగా ఉండాలి ఎందుకంటే చాలా సందర్భాలలో మనము క్షమిస్తాము కాని వారు చేసినటువంటి గాయమును మరిచిపోవు. మనం హృదయపూర్వకంగా ఇతరుల యొక్క తప్పిదాలు క్షమిస్తేనే మనము వారి యొక్క గాయమును మరిచిపోతాం. మనము అన్నివేళలా, అన్నిచోట్ల దేవుని యొక్క క్షమా గుణాన్ని కలిగి క్షమించే జీవించాలి. క్షమించుట కష్టమే కానీ అసాధ్యము కాదు. మానవులమైన మనందరికీ ఇది కష్టమైనప్పటికీ దేవుని యొక్క సహకారంతో మన గర్వాన్ని అనుచుకొని వినయంతో జీవించినట్లయితే క్షమించుట మనకు సాధ్యపడుతున్నది. ఏసుప్రభు క్షమించుటలో మనందరికీ ముఖ్య నిదర్శనంగా ఉంటున్నారు. ఆయన సిలువ మీద వేలాడుచు తన తండ్రికి చేసిన చివరి ప్రార్థన "తండ్రి వీరు చేయనదేమో వీరు ఎరుగరు వీరుని క్షమింపుము" అని పలుకుచున్నారు (లూకా23:34). ఆయన ఎడల తప్పిదాలు చేసిన వారందరినీ కూడా ప్రభువు ప్రేమతో క్షమించారు. కావున దేవుని యొక్క సహకారంతో మనల్ని మనం తగ్గించుకొని ఇతరులను క్షమించాలి. ఈ సువిశేష భాగములో క్షమింపబడిన వ్యక్తిని మనందరం కూడా పోలివున్నాం, ఎందుకంటే ఆయన యొక్క అప్పు మొత్తం కూడా మన్నించబడినప్పటికీ, తన దగ్గర కొంత రుణము ఉన్నటువంటి వ్యక్తిని ఆయన క్షమింపలేకపోతున్నారు. మనం కూడా అనేకసార్లు దేవుని యొక్క క్షమను పొందుతాం. ప్రతి ఒక్కరికి తెలుసు తాను వ్యక్తిగతంగా, రహస్యంగా, చీకటిలో ఎన్ని తప్పులు చేస్తున్నారని, ఎవరికీ తెలియకుండా ఎన్ని మోసాలు చేస్తున్నారని అయినప్పటికీ దేవుడిని క్షమాపణ కోరుకున్న సమయంలో దేవుడు వారి పాపాలు క్షమిస్తున్నారు కానీ క్షమాపణ పొందిన వ్యక్తులే తమ తోటి వారిని క్షమించలేకపోతున్నారు. క్షమాగుణం ద్వేషపు సంకెళ్లను తెంచి వేస్తుంది. అది ప్రేమ ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. క్షమించే గుణం రోజు మనము అలవర్చుకోవాలి పవిత్ర గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి తప్పు చేసిన వారిని తమ తోటి వారు ఏ విధంగా క్షమించారని.
- ఏసావు యాకోబును క్షమించారు
- ఏసేపు తనను అమ్ముకున్న అన్నలను క్షమించారు
- యావే దేవుడు ఇశ్రాయేలీయుల పాపములను క్షమించారు
- దావీదు తనను చంపివేయాలనుకున్న సౌలును క్షమించారు
-తప్పిపోయిన కుమారుడి యొక్క తప్పిదములను తండ్రి క్షమించారు
-ఏసుప్రభు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ యొక్క పాపమును క్షమించారు
ఈ విధంగా మనందరం చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఎదుటి వ్యక్తి ఎంత అన్యాయం చేసినప్పటికీ దానిని మనసులో ఉంచుకొనకుండా క్షమించటం వీరి ద్వారా మనందరం కూడా నేర్చుకోవాలి. వాస్తవానికి దేవుడు మనందరి నుండి కూడా కోరుతూ ఉన్నది ఇలాంటి జీవితమే క్షమా గుణాన్ని కలిగి జీవించి ఒకరితో ఒకరు స్నేహ సంబంధము కలిగి ఉండమని. కాబట్టి పగలకు, ప్రతీకారాలకు పోకుండా, ద్వేషాలు- ఈర్షలు పెంచుకోకుండా సోదర భావంతో క్షమాగుణము కలిగి జీవించుదాం. ఈ భూలోకంలో ఉండగానే మన జీవితాలను సరి చేసుకొని అందరితో కలిసి మెలిసి జీవించడానికి ప్రయత్నించేద్దాం.
Fr. Bala Yesu OCD
ReplyForward |
15, సెప్టెంబర్ 2023, శుక్రవారం
ఇరువదినాలుగవ సామాన్య ఆదివారము :
సీరా:27:30-28:7 రోమి : 14:7-9; మత్త: 18:21-35
ఈనాటి మూడు పఠనాల ద్వారా దేవుడు మనకు ఏమి తెలియజేస్తున్నాడు అంటే, “హద్దులు లేని క్షమాపణ” కలిగి జీవించాలని తెలియజేస్తున్నాడు.
మొదటి పఠనము:
1.పగ- కోపములకు దూరముగా ఉండాలి:
ఈనాటి మొదటి పఠనములో పగ కోపము మహా గోరమైనవి. పాపి ఆ రెండిటికి వశుడగును. అని తెలుపుతుంది. ఎందుకంటే ఈ పగ కోపములు మనలను మానవులనుండి, దేవునినుండి వేరుచేస్తాయి.
ఆది:4:5-15 లో చూస్తే, కయ్యిను కోపపడ్డాడు. దేవుని ఆజ్ఞలకు విరోధముగా పాపము కట్టుకున్నాడు. తన సొంత తమ్ముడిని చంపివేసాడు.
సంఖ్యా:22:21-31లో బిలాము మీద దేవుడు కోపపడుతున్నాడు. ఎందుకంటే తాను మోవాబు నాయకులతు చేతులు కలిపి దేవుని ప్రజలగు ఇశ్రాయేలీయులకు విరుద్ధముగా మాట్లాడబోవుచున్నాడు.
సామె:29:22“కోపిష్టి తగవులుతెచ్చి పాపము పెంచును అని చెప్పుచున్నది”.
యోహా: 2:14-15 లో చూస్తే, “దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్భులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాలతో కొరడా పేని, గొర్రెలను, ఎడ్లను అన్నిటిని, ఆలయ వెలుపలకు తోలెను. డబ్భులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడత్రోసి వీనిని ఇక్కడినుండి తీసుకుపొండు. నా తండ్రి ఆలయమును వ్యాపారస్థలముగా చేయవలదు అని చెప్పెను.ఇక్కడ మనము యేసుప్రభువు యొక్క కోపాన్ని మనం చూస్తున్నాం. అయితే, దేవుని కోపం మనలను మార్చడానికి అయితే మనకోపము మాత్రం ఆదేవునినుండి మన తోటివానినుండి వేరుపడి సంభంధం లేకుండా జీవిస్తున్నాం.
కానీ మొదటి పఠనములోదేవుడు అంటున్నాడు, దేవుని ఆజ్ఞలు స్మరించి,
పొరుగువానిమీద కోపం మానుకోవాలి అని తెలుపుచున్నాడు. ఎప్పుడయితే మనము మనలో ఉన్నటువంటి కోపాన్ని తొలగించి ప్రేమను క్షమాగుణాన్ని నింపుకుంటామో అప్పుడు దేవుడు మన జీవితములో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. అదే మనము సువిశేష పఠనములో చూస్తున్నాం.
సువిశేష పఠనము:
సువిశేష పఠనములో పేతురు గారు యేసుప్రభువు దగ్గరకు వచ్చి, “ప్రభూ! నా సహోదరుడు నాకు ద్రోహము చేసిన యెడల ఎన్ని పర్యాయములు క్షమించాలి? ఏడూ పర్యాయములా? అని అడుగుతున్నాడు. అపుడు యేసు ప్రభువు,
ఏడుకాదు ఏడు డెబ్బది పర్యాయములు అని సమాధాన మిచ్చాడు”. అంటే ఇక్కడ మనము చూసినట్లయితే, పేతురుగారు దేవుని ముందు గొప్పవానిగా ఎంచబడాలని తాను ఏడు పర్యాయములు క్షమాపణ గూర్చు అడుగుతున్నాడు. పాత నిబంధన గ్రంధములో మనం చూస్తే, ఒక వ్యక్తిని మూడు పర్యాయములు మాత్రమే మన పొరుగు వానిని క్షమించాలి అని తెలుపబడుతుంది. కానీ పేతురు మాత్రం ఏడు పర్యాయములు అని తెలుపుతున్నాడు.సాధారణముగా బైబిల్ గ్రంధములో చూస్తే ఏడు అను పదము పరిపూర్ణతకు గుర్తు. ఒక వేళ పేతురుగారు కూడా అలాగే అనుకోని ఏడుసార్లు అను ఉండవచ్చు. అంటే, ఒక మానవుడు ఒక విషయాన్ని గూర్చి రెండింతలు ఆలోచిస్తే,
మరి నిన్ను నన్ను కన్న దేవుడు మనయందు ఎన్నిసార్లు ఆలోచించాలి.
పాత నిబంధనా గ్రంధములో మనము చూస్తే, నిర్గ: 21:24,
లో కంటికి కన్ను, పంటికి పన్ను అని తెలుపుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి మనకు విరోధముగా చేసినట్లయితే, ఆ వ్యక్తికి అదే విధముగా బుద్ధి చెప్పాలి. నిన్ను తాను కొడితే తనని కూడా అలాగే కొట్టాలి అని మనకు అర్ధం అవుతుంది. కానీ, నూతన నిబంధన గ్రంధములో దేవుడు అలా అనడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి పైన క్షమాగుణాన్ని గురించి తెలియజేస్తున్నాడు.
మత్త: 5:38 కంటికి కన్ను,
పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారుగదా! నేనిప్పుడు మీతో చెప్పున దేమన: నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయకుము. నీ కుడి చెంపపై కొట్టిన వానిని నీ ఎడమ చెంపపై కూడా కొట్టనిమ్ము" అని యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు.
ఒక రోజు పునీత. రెండవ జాన్ పాల్ పోపు గారిని 13-05-1981 సవంత్సరంలో "మెహ్మెత్ అలీ అఙ్క" అను వ్యక్తి తనను తుపాకీతో కాల్చినప్పుడు,
తనను కొన్ని రోజుల తరువాత జైలులో వున్నా తనను పరామర్శించి, తనను హృదయ పూర్వకముగా క్షమించాడు. ఈనాడు నువ్వు నేను చేయ వెలిసిన పని కూడా ఇదే. క్షమాగుణాన్ని కలిగి జీవించడం.
అయితే యేసు ప్రభువు దీనిని మనకు క్లుప్తముగా వివరించడానికి ఒక ఉపమానమును తెలియజేస్తున్నాడు. అదే క్షమా ధర్మములఉపమానము.
ఇక్కడ రాజు దేవునికి సూచన.
ఋణస్థుడు మనకు సూచన.
ఈరాజు తన దగ్గర తీసుకున్న కోట్ల వరహాల వ్యక్తిని తన యొక్క దీన స్థితిని చూసి క్షమిస్తున్నాడు. కానీ అదే క్షమను పొందిన ఆ ఋణస్థుడు మాత్రం తనదగ్గర కొన్ని రూకలను రుణపడియున్న వ్యక్తిని క్షమించలేక పోయాడు.
2.క్షమా గుణాన్ని కలిగి ఉండాలి:
ఈ క్షమాగుణాన్ని కలిగి జీవించాలి అంటే ముందుగా మన గురించి మనము తెలుసుకోవాలి. నాజీవితము ఎలావుంది. నేను ఎలా జీవిస్తున్నాను అని. అయితే ఒక రోజు పు. మాథెర్ థెరెసా గారు ఒకరోజు తన దగ్గర వున్నా పిల్లల ఆహారంకోసం వీధి వీధి వెళ్లి సహాయాన్ని అర్ధిస్తున్నప్పుడు ఒక వ్యాపారి దగ్గరకు వచ్చి,
అయ్యా! నా పిల్లలు ఆహారంకోసం అల్లాడిపోతున్నారు. మీకు తోచినంత వారికి ఇవ్వండి అని చేయిచాచి అడిగినప్పుడు ఆ వ్యాపారి ఆమె వైపు కోపంగా చూసి తన చేతిలో ఉమ్మును ఉసాడు. అప్పుడు పు. మాథెర్ థెరెసా గారు తన వైపు,
ఆ ఉమ్ము వైపు దీనంగా చూస్తూ,
అయ్యా! ఇది నాకోసము మీరు ఇచ్చారు. మరి నా పిల్లలకు ఏమి ఇస్తారు అన్నప్పుడు ఆ వ్యాపారి ఆ మాటలకు కలత చెంది కన్నీరు కారుస్తూ,
అమ్మా నేను చేసినది చాలా తప్పు. నన్ను క్షమించండి. నేను మీ పిల్లలకు ఎంతయినా సహాయముచేస్తానని చెప్పి వారికి సహాయము సహసాడు. ఇలాంటి జీవితమునే మనంకూడా కలిగి ఉండాలి. మత్త: నీ కుడిచెంపపైకొట్టిన వానికి నీ ఎడమ చెంపకూడా చూపుము అని దేవుడు అంటున్నాడు. అంటే,
వారిని క్షమించమంటున్నదే కానీ వారిపై తెరగబడయును అని అనడం లేదు. దీనికి ఉదాహరణ మన దేవుడవైన యేసుప్రభువు. ఎందుకంటే మన దేవుడు క్షమించే దేవుడు.
యోహా:8:1-11 లో వ్యభిచారము పట్టుబడిన స్త్రీని క్షమియించాడు". అందరూ ఆమెను ద్వేషించినా కానీ యేసు ప్రభువు మాత్రం హృదయపూర్వకముగా క్షమించాడు.
మత్త:26:75,నేను నిన్ను ఎరుగను అని మూడు సార్లు పలికిన పేతురుని క్షమించాడు.
లూకా: 23:40-43సిలువమీద వున్న దొంగను క్షమించాడు.
లూకా: 15:18-24 తప్పిపోయిన కుమారుని క్షమించాడు.
తనను సిలువపై కొట్టి, ఉమ్మివేసి,
గెలిచేసి,
ముళ్లకిరీటముపెట్టి,
ఇతడు ద్రోహి అని నిందిచి, ఇతడు పాపి సుంకరులతో,
పాపులతో కలిసి భుజిస్తాడు,
ఇతడు తిండిబోతు అని ఎంతోమంది తనను అని దూషించినా,
కొట్టినా,
ఇబంది పెట్టినా ఒక్కరిని కూడా పల్లెత్తి ఒక్క మాటకూడాఆ అనలేదు. కానీ థానే చివరికి తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. వీరిని క్షమించండి అని ప్రార్ధన చేస్తున్నాడు. ఈనాడు మనము కూడా చేయ వలసిన ప్రార్ధన కూడా ఇదే.మనకు మన దేవుడవైన యేసుప్రభువు నేర్పించిన పరలోక ప్రార్ధనలో ప్రతిరోజు మనము జపిస్తూనే వున్నాం. అది ఏమిటంటే, మాయొద్ద అప్పుపడిన వారిని మేము క్షమించునట్లు మా అప్పులను కూడా క్షమించుము అని మత్త: . అయితే ఒకవేళ మన పొరుగు వారిని మనము క్షమించకుండా ఎప్పుడు దేశిస్తూనే ఉంటే మన ప్రార్ధన దేవుడు ఆలకించాడు ఇంక మన పాపములను క్షమించడు. కాబట్టి ఎప్పుడయితే దేవుడు మనకు దయచేసి దయార్ద్ర హృదయముతో మన పొరుగువారికి క్షమించాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్ధము పరమార్ధము ఉంటుంది. అయితే ఈనాటి రెండవ పఠనంలో పు. పౌలు గారు మనకు మన జీవితము గురించి క్లుప్తముగా తెలియజేస్తున్నాడు.
రెండవ పఠనము:
3.మనజీవితము మనకొరకు కాదు ఇది కేవలము దేవుని కొరకే:
పు.పౌలుగారు అంటున్నారు, "మనలో ఎవడును తనకొరకు జీవింపడు. తనకొరకు మరణింపడు. మనము జీవించినా ప్రభువు కొరకే జీవించుచున్నాము. మరణించునా ప్రభువు కొరకే మరణించుచున్నాము" అని. దీని అర్ధం ఏమిటంటే,
మన జీవితము మనకొరకు కాదు. మనకు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుని కొరకు. ఎందుకంటే మనలను తన కొరకే సృజించుకున్నాడు. తనతో ఉండటానికి,
తన ఆజ్ఞలను పాటించడానికి.
కాబట్టి తనతో ఉండాలి అంటే తన ఆజ్ఞలను పాటించాలి. తన ఆజ్ఞలు మనకు ఏమి నేర్పిస్తున్నాయి అంటే,
1.దేవుని ప్రేమించమని
2.మన పొరుగువారికి ప్రేమించమని.
మనము ఎప్పుడయితే దేవుని ప్రేమిస్తామో, అప్పుడు మనము మన పొరుగువానిని కూడా ప్రేమిస్తాము. కానీ ఎప్పుడయితే మన దేవుని ద్వేషిస్తామో అప్పుడు మన పొరుగు వానినికూడా ద్వేషిస్తాము. కాబట్టి ఈనాటి మూడు దివ్యగ్రంధ పట్టణాల ద్వారా దేవుడు మనకు బోధించేది, ఒకరిపై ఒకరికి కోపము పగ లేక ఇతర మనస్పర్థలు లేకుండా పరస్పర సహోదరా భావము కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ జీవించాలని భోదిస్తున్నాయి.
కాబట్టి ఈనాటి ఈ దివ్య బలిపూజలో పాల్గొంటున్న మనమందరము ఈ క్షమా గుణాన్ని కలిగి జీవిస్తూ దేవుని ప్రేమను పొందుతూ ఒక ఆదర్శవంతమయిన క్రైస్తవ బిడ్డలుగా జీవించాలి అని ఈ దివ్యబలిపూజలో ప్రార్ధన చేద్దాం.
బ్రదర్. శాంసన్
డీకన్. సునీల్ ఓ సి డి.
డీకన్. జోసెఫ్ మారియో ఓ సి డి.
నిత్య జీవము ఎలా వస్తుంది
యోహాను 6: 22-29 మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...