15, జూన్ 2024, శనివారం

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం 
యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34
ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బోధిస్తున్నాయి. 
ఈనాటి మొదటి పఠణంలో యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా బానిసత్వంలో ఉన్నటువంటి సమయములో వారి జీవితంలో ఒక నమ్మకమును కలుగ చేస్తున్నారు. దేవుడు ఎత్తైన దేవదారు మీద ఒక కొమ్మను విరిచి దానిని పర్వతం మీద నాటుతారు అని అన్నారు. ఆ యొక్క చెట్టు పెద్దదిగా ఎదిగి గొప్ప దేవదారు వృక్షం అగును అని తెలుపుచున్నారు. ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితమును ఉద్దేశించి ప్రభువు పలికినటువంటి మాటలు.
ఇశ్రాయేలు ప్రజలు తాము చేసినటువంటి పాపమునకు ఫలితముగా బానిసత్వ జీవితమును జీవింపవలసి వచ్చినది. అన్యదైవములను పూజించినందుకు వారు దేవుని చేత శిక్షింపబడ్డారు. వారి యొక్క బాధలో ఉన్న సమయంలో దేవుడు వారిని మరలా స్వీకరించటానికి సిద్ధపడ్డారు అందుకుగాను ప్రభువు పలుకుచున్నారు నేనే స్వయముగా కొమ్మను నాటుదను అది ఎదుగును అని తెలుపుచున్నారు అనగా యావే ప్రభువు త్వరలో ఇశ్రాయేలు ప్రజలను తమ దేశానికి తీసుకుని వచ్చి మరల వారికి స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదిస్తారని ఒక అర్థం ఇంకొక అర్థం ఏమిటంటే రాబోయే కాలంలో ఇజ్రాయేలు ప్రజల నుండి మెస్సయ్య జన్మించి ఆయన సువార్త పరిచర్య ద్వారా అనేకమంది దేవుని యొక్క బిడ్డలగా మార్చబడతారు మరియు దేవుని యొక్క రాజ్యము విస్తరిల్లుతున్నది అని అర్థం. 
మొదటి పఠణము ద్వారా గ్రహించవలసిన అంశములు ఏమిటి అంటే;
1. దేవుడు మనతో ఉంటే మనం అభివృద్ధి చెందుతుంటాము, దీవించబడతాం. ప్రభువు ఏ విధముగానయితే ఇశ్రాయేలు ప్రజలకు భద్రతను కల్పిస్తూ, తోడుగా ఉంటూ వారు అభివృద్ధి చెందే విధంగా ప్రజలును దీవించారు. అలాగే దేవుడు మనతో ఉంటే మనం కూడా దీవించబడతాం.
2. ప్రభువు ఎత్తైన చెట్లను నరుకుతాను అని తెలుపుచున్నారు దీనిని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నట్లయితే ఎవరైతే గర్వంతో ఉంటారో వారిని దేవుడు తమ యొక్క పదవుల నుండి తొలగిస్తారు. అందుకే మరియ తల్లి తన స్తోత్ర గీతములో దేవుడు ఎలాగ గర్వాత్ములను అధికారం నుండి పడగొడతారు తెలుపుతూ దీనులను ఏ విధంగా దీవిస్తారో తెలిపారు. (లూకా 1:51,52)
3. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని తెలుపుతున్నారు ఎందుకనగా పచ్చని చెట్లు ఎండిపోవునట్లు, ఎండిన చెట్లు పచ్చబడునట్లు చేసేది దేవుడు మాత్రమే అనగా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి జీవితాలలో నమ్మకమును దయచేసి దేవుడే అలాగే గర్వముతో , భయము, భక్తి లేకుండా జీవించే వారి యొక్క జీవితాలు సంతోషము లేని జీవితాలుగా మారతాయి. దేవుడు తన ప్రజల జీవితంలో ఏదైనా చేయవచ్చు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.
ఈనాటి సువిశేష భాగములో కూడా ఏసుప్రభు పరలోక రాజ్య వ్యాప్తి గురించి రెండు ఉపమానముల ద్వారా తెలియచేయుచున్నారు. ఈ రెండు ఉపమానములలో ఎదుగుదల అనేది గొప్పదిగా ఉంటుంది. ప్రారంభం చిన్నదిగా ఉన్న ముగింపు మాత్రం పెద్దదిగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదగాలి అది విశ్వాసములో అవ్వొచ్చు, చదువులోనైనా అవ్వొచ్చు, ప్రార్థనలో నైనా అవ్వొచ్చు, సంపదల్లోనైనా అవ్వొచ్చు.  ప్రభువు విత్తు వాడిని ఉదాహరణగా తీసుకొని ఆ విత్తనములు వెదజల్లినప్పుడు ఏ విధంగానైతే ఎవరికీ తెలియకుండా మొలకలు వస్తాయో అదే విధముగా ప్రభువు యొక్క రాజ్యము కూడా ఎవరు ఊహించని విధంగా విస్తరిల్లుతుంది అని తెలిపారు.
రెండవ ఉపమానము ఏసుప్రభు ఆవగింజను ఉదాహరణగా తీసుకొని పరలోక రాజ్యం గురించి తెలుపుచున్నారు. ఆవ గింజ చూడటానికి చిన్నదైనప్పటికీ దాని యొక్క ఎదుగుదల ప్రభావము చాలా గొప్పది. ప్రభువు ఎందుకు ఆవగింజనే ఉదాహరణగా తీసుకున్నారు అని ధ్యానించినట్లయితే ఆవగింజ చిన్నది కానీ ఫలితం పెద్దది అలాగే మన జీవితంలో కూడా వినయముతో ప్రారంభించిన ఏ పని అయినా సరే అది విజయవంతమగుతున్నది  ఎందుకంటే ఆయన దీనులను ఆశీర్వదిస్తారు కాబట్టి.
ఆనాడు దేవుడు ఆదాము అవ్వతో ప్రారంభించిన సృష్టి ఏ విధంగానైతే గొప్పగా విస్తరిల్లినదో అలాగే ఏసుప్రభు 12 మంది శిష్యుల ద్వారా ప్రారంభించిన తన యొక్క పరిచర్య ఈనాడు దేవుని రాజ్యం ఎంతగానో విస్తరిల్లినదో మనం చూస్తున్నాం దీనికి కారణం దేవుడు. శ్రీ సభ దినదినాభివృద్ధి చెందాలి అంటే దేవుని కృప సహకారం ఉండాలి. ఆయన కృప లేనిదే ఏది కూడా సాధ్యం కాదు. 
మన యొక్క అనుదిన జీవితంలో కూడా మనము దినదినాభివృద్ధి చెందాలి దానికి గాను వినయముతో జీవించాలి.
Fr. Bala Yesu OCD

8, జూన్ 2024, శనివారం

పదవ సామాన్య ఆదివారం

పదవ సామాన్య ఆదివారం 
ఆది 3:9-15
2 కొరింతి 4:13-5:1
మార్కు 3:20-35
ఈనాటి పరిశుద్ధ దివ్య గ్రంథ పఠణములు పాపము దాని యొక్క ఫలితము గురించి బోధిస్తున్నాయి. పాపము చేయటం ద్వారా మానవులు దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. పాపము చేయటం ద్వారా దేవునికి దూరమవుతాం అదేవిధంగా మన యొక్క పొరుగు వారికి కూడా దూరం అవుతాం అలాగే వారిని బాధిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో పాపము చేస్తూనే ఉంటారు. ఈనాటి మొదటి పఠణంలో ఈ లోకంలోకి పాపము ప్రవేశించినటువంటి విధానము గురించి ఆదికాండములో వివరించబడినది. ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ పాపము చేసి దేవునికి విరుద్ధముగా నడుచుకున్నారు. దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించారు. హీబ్రూ భాషలో పాపమును HATTAH అని పిలుస్తారు అనగా చేయవలసిన మంచి చేయకపోవడం. ( Missing the target). ఆదాము అవ్వ దేవుడి ఎడల మంచిగా ప్రవర్తించవలసి ఉండినది కానీ వారు ప్రవర్తించలేదు. దేవునికి వారు విధేయత చూపించాలి కానీ చూపించలేదు అది వారి యొక్క పాపం. పాపం చేయటం ద్వారా ఆదాము అవ్వ దాగుకొని జీవిస్తున్నారు ఆ సందర్భంలో దేవుడు ఆదామును నీవెక్కడ అని ప్రశ్నించారు? ఇది దేవుడు పవిత్ర గ్రంథంలో అడిగిన మొట్టమొదటి ప్రశ్న. దీని యొక్క అర్థం ధ్యానించినట్లయితే -దేవుడు ఆదామును నీవు నాతో ఉన్నటువంటి బంధములో ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తున్నారు.
- నీవు నీ కుటుంబ సభ్యుల బంధములో ఎక్కడున్నావు 
- నీవు నీ పొరుగు వారి యొక్క విషయాలలో ఎక్కడున్నావు 
- నీవు దేవాలయం రాకుండా ఎక్కడున్నావు 
- ప్రార్థించకుండా ఎక్కడున్నావు అని వివిధ కోణాలలో ఈ యొక్క ప్రశ్న గురించి ధ్యానించవచ్చు. నేడు దేవుడు ఇదే ప్రశ్న మనందరిని కూడా అడుగుచున్నారు. నీవు ఎక్కడున్నావు?
పాపములో జీవిస్తున్నటువంటి మనము దేవునితో ఉన్నటువంటి బంధంలో ఎక్కడ జీవిస్తున్నాం. మనం కూడా ఆదాము అవ్వలే పాపం చేసి దేవుని సన్నిధికి రాకుండా జీవిస్తున్నామా?
 దేవుడు ఆదాము అడిగిన రెండవ ప్రశ్న నీవు దిశములతో ఉన్నావు అని ఎవరు చెప్పితిరి? 
ఆదాము సైతాను నాకు ఈ విషయమును తెలియజేశారు అని పలికాడు. ఆదాము సైతాను మాట విన్నాడు కాబట్టి పాపము చేసాడు. సైతాను మనల్ని అనేక సందర్భాలలో మోసం చేస్తూనే ఉంటూ ఉంటుంది. మనం ఎవరి స్వరమును వినాలి, ఎవరిని అనుసరించాలి, ఎవరికి విధేయత చూపించాలి అనేది మన యొక్క అనుదిన జీవితంలో ఒక పోరాటం లాంటిది కాబట్టి మనం సరియైన నిర్ణయం తీసుకొని దేవుడికి అనుగుణంగా మంచిని ఎన్నుకొని జీవించాలి.
1.పాపము చేయటం ద్వారా - ఆదాము అవ్వలు అవమానానికి గురయ్యారు అందుకనే వారు ఎవరికీ కనబడకుండా దాగుకొని జీవించడానికి సిద్ధమయ్యారు.
2. పాపము చేయడం వలన కొన్నిసార్లు దానిని మనము అంగీకరించము. ఆదాము అవ్వ చేసినటువంటి పాపము కూడా అంగీకరించలేదు. 
3. పాపము మనలను ఇతరులను నిందించేలాగా చేస్తుంది. ఆదాము అవ్వను నిందించాడు, అవ్వ పామును నిందించినది. ఈ విధంగా ప్రతిసారి పాపం చేసిన సందర్భంలో మనము ఎవరినో ఒకరిని నిందిస్తూ ఉంటాం.
4. పాపం చేయడం ద్వారా ఆదాము అవ్వ భయపడుతూ, భయపడుతూ జీవిస్తున్నారు. 
5. పాపము చేయటం ద్వారా స్వేచ్ఛను కోల్పోతున్నారు.
6. పాపము చేయటం ద్వారా దేవునితో ఉన్నా స్నేహం కోల్పోయారు. 
7. పాపము చేయటం ద్వారా పరలోకమును కోల్పోయారు.
 ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుని యందు విశ్వాసము కలిగి జీవించుట అనే అంశం గురించి తెలుపుచున్నారు. ఈ లోకంలో చిన్న చిన్న కష్టాలు ఎదురైనా సరే దేవుడువసగు ప్రతిఫలము ద్వారా సంతోషముగా జీవిస్తున్నాం అని పౌలు గారు తెలుపుతున్నారు. 
ఈనాటి సువిశేష భాగములో మార్కు సువార్తికుడు రెండు అంశములను గురించి తెలియజేస్తున్నారు. 
1. ఏసుప్రభు ఎవరి అధికారంతో దయ్యములను పారద్రోలుచున్నారు అని.
2. ప్రభువు యొక్క ఆధ్యాత్మిక తల్లి, సోదరీ సోదరులు ఎవరని. 
ఏసుప్రభు నజరేతు వచ్చినటువంటి సమయంలో అక్కడికొందరి ప్రజలు ఆయనకు మతి చలించినదని భావించారు. ఆయన వారికి ఎంత మంచి చేసినప్పటికీ వారు మాత్రము ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకుని పాపం చేశారు. దానికి ప్రతిఫలంగా ప్రభువు, ఆయన ఎవరి అధికారంతో దయ్యములను వెళ్ళగొట్టుచున్నారని తెలిపారు. 
అదేవిధంగా ప్రభువు యొక్క కుటుంబ సభ్యులో భాగస్తులై జీవించాలి అంటే మనము దేవుని యొక్క చిత్తమును మన యొక్క జీవితంలో నెరవేర్చాలి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. మరియ తల్లి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి దేవునికి విధేయత చూపించినది కాబట్టే ఆమె నిష్కలంక మాతగా జీవించారు. మరియ తల్లి పాపము చేయకుండా సంపూర్ణముగా దేవునితో బంధము కలిగి ఆమె మనందరికీ కూడా ఒక సుమాతృకగా జీవించారు.
ఈనాడు మనందరం కూడా మన యొక్క బలహీనత ద్వారా పాపములో పడకుండా, సైతాను శోధనలకు లొంగకుండ దేవుని చిత్తానికి లోబడి, మంచిని చేస్తూ ఆయనతో బంధము కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. 
పాపం మనల్ని దేవుడి నుండి దూరం చేస్తుంది కాబట్టి పాపమని విడిచిపెట్టి, పశ్చాతాపపడి దేవునికి దగ్గర జీవించుదాం.
Fr. Bala Yesu OCD

దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

 మత్తయి 5: 20-26 ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ...