22, ఫిబ్రవరి 2025, శనివారం

సామాన్యకాలపు ఏడవ ఆదివారము


1 సమూయేలు 26:2, 7-8, 12-13, 22-23; 
1 కొరింథీయులు 15:45-49
లూకా 6:27-38
క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ విశ్వసిని విశ్వాసులరా మరియు దేవుని బిడ్డలరా, ఈ దినమున మనమందరము సామాన్య కాలపు ఏడవ ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము, ఈ నాటి మూడు పఠనములలో మనం చుసినట్లయితే, ఈ మూడు కూడా మనకు ముఖ్యమైన మూడు అంశముల గురించి తెలియజేస్తున్నాయి. అవి ఏమిటంటే మానవుని  వినయం, క్షమాపణ మరియు ఆధ్యాత్మిక పరివర్తన యొక్క ముఖ్యమైన గుణల గురించి నేర్పిస్తున్నాయి.
ముందుగా మొదటి పఠనము చూసినట్లయితే 
1 సమూయేలు 26:2, 7-8, 12-13, 22-23
ఈ వచనలలో  దావీదు రోజు యొక్క వినయమును మనం గమనించ వచ్చు ఎందుకంటే దావీదు ఏవిధంగానైతే దేవుని పట్ల తన వినయమును కనబర్చాడో అదే విధమైనటువంటి వినయం ఈ రోజు దావీదు సౌలు పట్ల చూపిస్తున్నాడు. వినయం అనేది ఒక గొప్ప ముఖ్యమైనుటువంటి లక్షణం. ఇది మనల్ని ఇతరులతో కలిసిమెలిసి ఉండడానికి, వారిని గౌరవించడానికి దోహదపడుతుంది లేదా సహాయపడుతుంది. వినయం గల వ్యక్తి ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు మరియు ఇతరుల నుండి మంచిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇటువంటి వినయమును మనం దావీదులో చూస్తున్నాము. ఎందుకంటే దావీదును సౌలు రాజు వెంబడించే హతమార్చాలి అనుకున్న సమయంలో దావీదు అతనిని ఎదుర్కొంటాడు. దావీదుకు సౌలును చంపడానికి అవకాశం వచ్చినప్పటికి లేదా ఉన్నప్పటికీ, దావీదు సౌలు రాజును విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడ మనం గమనించలసింది దావీదు దేవుని అభిషిక్తుని పట్ల అతని వినయాన్ని మరియు భక్తిని చూపిస్తుంది. కొన్ని సార్లు మన స్వంత  నిర్ణయాలను తీసుకోవడానికి బదులుగా, దేవుని యొక్క న్యాయాన్ని విశ్వసించడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఇక్కడ చూపిస్తుంది. ఇది దేవుడు మానవునికి ఇచ్చినటువంటి అధికారాన్ని గౌరవించాలని మరియు మనకు కీడు చేసిన వారి పట్ల కూడా వినయం మరియు దయ చూపాలని మనకు నేర్పిస్తుంది. చివరిగా సౌలు రాజు దావీదును అసూయతో వెంబడించాడు. ఒక సందర్భంలో దావీదు సౌలును చంపడానికి అవకాశం వచ్చింది, కానీ దావీదు అలా చేయలేదు. ఎందుకంటే సౌలు దేవునిచే ఎన్నుకోబడిన రాజు అని దావీదుకు తెలుసు. దావీదు దేవుని పట్ల వినయం కలిగి ఉన్నాడు మరియు దేవుని నిర్ణయాలను గౌరవించాడు. మనము దావీదును ఒక ఉదాహరణగా తీసుకుంటూ మన జీవితాలను దేవునికి అనుకుగుణంగా మార్చుకుంటూ వినయంతో జీవించాలని మొదటి పఠనము మనకు నేర్పిస్తుంది.
సువిశేష గ్రంథ పఠనమును మనం ద్యానించినట్లయితే 
లూకా 6:27-38 చుసినట్లయితే యేసు ప్రేమ మరియు క్షమాపణ గురించి తన  బోధనలనలో బోదిస్తున్నాడు. ఏవిధంగానంటే మన శత్రువులను ప్రేమించమని, మనలను ద్వేషించే వారికి మంచి చేయమని మరియు మనలను శపించే వారిని దీవించమని ఆయన మనలను పిలుస్తాడు. యేసు మన శత్రువులను ప్రేమించమని మనకు తెలియజేస్తున్నాడు. సాధారణంగా మానవుని జీవితంలో క్షమించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం, ఎందుకంటే సహజంగా మనకు హాని చేసిన వారిని ప్రేమించడం అంటే మనకు అసలు నచ్చనటువంటి పని మరియు భయంకరమైనటువంటి కష్టం. కానీ ఈనాడు యేసు మనలను అలా చేయమని పిలుస్తున్నాడు, ఎందుకంటే ఆయన మనలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి.
మన శత్రువులను ప్రేమించడం అంటే వారిని క్షమించడం మరియు వారికి మంచి చేయడం. వారిని ద్వేషించకుండా, వారి పట్ల దయ చూపించాలి. ఇది చాలా కష్టమైన పని, ఒక్క సారి పేతురు గారు యేసు ప్రభుని ఇలా అడిగినపుడు నా సహోదరుడు నాయడల తప్పు చేసినప్పుడు ఎన్ని పర్యాయములు అతని క్షమించవలయునని  అడిగినప్పుడు యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం మనము చూసియున్నాము. దీనికి యేసు ప్రభువు మనకు ఒక గొప్ప ఉదాహరణగా చూపించాడు. ఆయన మన కొరకు సిలువపై మరణింంచాడు లేదా చనిపోయాడు, మనము ఆయనకు మన పాపల ద్వారా శత్రువులుగా ఉన్నప్పుడు కూడా. ఆయన మనలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టే అలా చేయగలిగాడు. ఈ సమయము నుండి మనము కూడా మన శత్రువులను ప్రేమించాలని యేసు కోరుకుంటున్నాడు. సాధారణముగా ఇది మనకు కష్టంగా అనిపించవచ్చు, కానీ దేవునీ సహాయం మనతో ఉంటే , మనము కచ్చితంగా ఈ క్షమాపణ అనేది నెరవేర్చగలము. ఎందుకంటే 
మన శత్రువులను ప్రేమించడం వలన మనము దేవుని ప్రేమను ఇతరులకు చూపించగలము. ఇది మన జీవితంలో సంతోషాన్ని మరియు సమాధానాన్ని కూడా కలిగిస్తుంది.
కాబట్టి, మన శత్రువులను ప్రేమించడానికి మనమందరము గట్టిగా ప్రయత్నించుదాం. ఇది కష్టమైన పని, కానీ చాలా విలువైనది. ఎందుకంటే దేవుడు మనలను క్షమించినట్లే మనం ఇతరులను క్షమించాలి.
రెండవ పఠనము 1 కొరింథీయులు 15:45-49 వచనలలో మనము చూస్తున్నాము. ఇక్కడ మన శరీరాల పరివర్తన గురించి మాట్లాడుతుంది. ఇది మన లౌకిక, నాశనకరమైనటువంటి శరీరాన్ని పునరుత్థానంలో మనం పొందే మహిమకరమైన శరీరంతో విరుద్ధంగా ఉంటుంది అని తెలియజేస్తుంది. అది ఏవిధంగానంటే మనము ఇప్పుడు చూద్దాము. మొదటి మనిషి అయినటువంటి ఆదాము జీవముగల ప్రాణిగా చేయబడ్డాడు మరియు తన శరీరమంత మట్టితో చేయబడింది మరియు అది ఆశాశ్వతమైనది. కానీ చివరి  ఆదాము అంటే క్రీస్తు ఆయన ఆత్మను ఇచ్చేవాడు. ఆయన శరీరము మహిమకరమైనది మరియు నాశనమయేటువంటిది కాదు. ఒక మానవునిగా మన ప్రస్తుత శరీరాలు ఆదాము నుండి వచ్చినవి. అవి అశాశ్వతమైనవి మరియు పాపానికి లోబడి ఉండేటువంటివి. కానీ పరలోక సంబంధమైనటువంటి శరీరము మనము క్రీస్తును విశ్వసించినప్పుడు, మనము పరలోక సంబంధమైన శరీరాన్ని పొందుతాము. ఇది మహిమకరమైనది మరియు శాశ్వతమైనది. ఈనాడు మనం మన ప్రస్తుత శరీరం గురించి మనం ఏవిధంగా ఆలోచిస్తున్నాము అని మనలను మనం ఒక్క సారి ద్యానిచుకుంటూ ప్రశ్నించుకుందాము.
కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా ఈనాడు మనమందరము దేవుని పట్ల మరియు మానవుని పట్ల వినయం చూపిస్తూ, క్షమాగుణం కలిగి ఇతరులకు పంచుతూ, క్రీస్తులో భాగమై జీవిస్తూ ఆయనతో ఒకటై ఉండాలని ఈ దివ్యబలిలో ప్రార్థిస్తూ పాల్గొందాము.

 ‌Fr. Johannes OCD

19, ఫిబ్రవరి 2025, బుధవారం

మార్కు 9:41-50

 February 27

సిరా 5:1-8

మార్కు 9:41-50

మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవ్వడు మీకు నా పేరిట చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగచెప్పుచున్నాను" అనెను. "నన్ను విశ్వసించు ఈ చిన్న వారిలో ఏ ఒక్కడైన పాపి అగుటకు కారకుడగుటకంటె, అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక్క చేతితో నిత్యజీవము పొందుట మేలు. నీ కాలు నీకు పాపకారణమైనచో, దానిని నరికి పారవేయుము. రెండుకాళ్ళతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కనులు నీకుపాప కారణమైనచో దానిని పెరికి పారవేయుము. రెండుకన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రతి ఒక్కనికి ఉప్పదనము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కాని అది తన ఉప్పదనమును కోల్పోయిన, తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతము చేయగలరు? కావున, మీరు ఉప్పదనమును కలిగి ఒకరితో ఒకరు  సమాధానముతో ఉండుడు" అనెను.  

క్రీస్తు సంబంధీకులు : ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు మిమ్ములను క్రీస్తు సంబంధీకులుగా గుర్తించి మీకు ఎవరు చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును పొందును అని అంటున్నారు. ఎవరు ఈ  క్రీస్తు సంబంధికులు అంటే సువిశేష భాగంలో యేసు ప్రభువుని అనుచరులు అని లేక శిష్యులు అని తెలుస్తుంది. ఇది కేవలం అప్పటి శిష్యులు లేక అనుచరులేనా  అంటే కాదు ఎందుకంటే యేసు ప్రభువుకు చెందిన వారు ఎవరో మనము ఈ అధ్యాయములోనే చూస్తాము. అంతకు ముందు ప్రభువు పేరిట ఒకడు దయ్యములను వదలకొడుతున్నప్పుడు శిష్యులు వాడిని వారించిన పిదప ఆయనకు ఆ విషయం చెప్పగా ప్రభువు అతనిని తనకి చెందిన వానిగానే చెబుతున్నాడు. తరువాత కూడా మీరు వెళ్లి లోకమున ఉన్న వారిని నా అనుచరులుగా చేయమని ప్రభువు చెబుతున్నాడు. ఎవరు అయితె ప్రభువు మాట ప్రకారం జీవిస్తారో వారు క్రీస్తు అనుచరులు, వారే క్రీస్తు సంబంధీకులు. అందుకే ప్రభువు నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడె నా సోదరుడు సోదరి, తల్లి అని ప్రకటించారు. ఈరోజు మనం ఆయన సంబంధీకులము కావాలంటే ఆయన మాటలను అనుసరించాలి. ఈ విధంగా జీవించిన క్రీస్తు సంబంధీకులను గౌరవించిన వారికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. ఎందుకంటే వారి ద్వారా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. ఇది వారి మాటల ద్వారా వారి ప్రేమ పూర్వక జీవితం ద్వారా జరుగుతుంది. 

పాపము చేసిన వారు నరకానికి వెళుతారు, నరకములో ఒక వ్యక్తి  చాలా ఘోరమైన బాధలకు గురవుతాడు.  అది నిత్యము బాధలతో ఉండే స్థితి.  నరకము అనేది దేవున్ని  తిరస్కరించి, ఆయనకు వ్యతిరేకమైన పనులు చేస్తు  పశ్చాత్తాప పడకుండా పాపములోనే  మరణించేవారు పొందే స్థితి.  నరకంలోఎల్లప్పుడు బాధ అనే స్థితి మాత్రమే ఉంటుంది. ఊరట కోసం ఎంత ప్రయత్నించిన అది అది వారికి అందదు. అందుకే ప్రభువు ఈ స్థితి మనకు రాకూడదు అని కోరుకుంటున్నారు. అందుకే మనిషిని నరకానికి పాత్రులుగా చేసే ఎటువంటి దానిని కూడా మన దగ్గర ఉండకూడదు అని కోరుకుంటున్నారు. 

ప్రభువు మనలను ఇతరులు పాపము చేయుటకు కారణం కాకూడదు అని చెబుతున్నారు. అటుల అగుటకంటె మనము మరణించుటయే మంచిది అని పలుకుతున్నారు. మనము పాపము చేయుటకంటే  మనము పాపము చేయుటకు మనలో  ఏదైన కారణమైతే  దానిని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండమని ప్రభువు చెబుతున్నాడు. ప్రభువు ఎందుకు ఇలా చెబుతున్నాడు?  ఎందుకంటే నిత్యం జీవం అనేది అత్యంత విలువైనది, ఏమి ఇచ్చిన కాని దానిని కొనలేము.  మంచి జీవితం జీవించే వారికి దేవుడు ఇచ్చే బహుమతి ఇది.  ఏ వ్యక్తి కూడా తన సొంత ప్రతిభ వలన సాధించదగినది కాదు. పాపము చేసిన వారు కూడా పశ్చాత్తాప పడి ప్రభువు ముందు క్షమాపణ అడిగితే వారికి కూడా ప్రభువు నిత్యజీవాన్ని అనుగ్రహిస్తాడు. అది ప్రభువును ముఖాముఖిగా దర్శించు భాగ్యం. ఎల్లప్పుడూ ఆనందముగా ఉండేటువంటి స్థితి.    అందుకే మనలో పాపకారణమైన భాగం ఉంటె దానిని  కోల్పోవడానికి అయిన సిద్దపడి నిత్యజీవం పొందుటకు సాధన చేయమని ప్రభువు చెబుతున్నాడు. 

ప్రార్ధన: ప్రభువా! మీ అనుచరులు ఎల్లప్పుడు మీమ్ములను ఆదర్శంగా తీసుకోవాలని, మీ వలె జీవించాలని కోరుకుంటున్నారు. మీ అనుచరులను గౌరవించిన వారికి తగిన ప్రతిఫలమును పొందుతారు అని చెబుతున్నారు.  మీ అనుచరులుగా మీకు సంబంధికులుగా ఉండుటవలన  మిమ్ము ఇతరులకు మా జీవితాల ద్వారా   చూపించు,వినిపించు అనుగ్రహం ప్రసాదిస్తున్నారు. దీనిని సద్వినియోగ పరచుకొని    చెడుమార్గంలో ప్రయాణించకుండ, మీ మార్గములో ప్రయాణిస్తూ, మాలో ఏదైనా పాపకారణమైనది ఉన్నచో దానిని తీసివేసి, మీ వలె జీవిస్తూ, నిత్యజీవానికి వారసులము అయ్యేలా అనుగ్రహించండి. ఆమెన్. 

Fr. Amruth 


22 వ సామాన్య ఆదివారం

22 వ సామాన్య ఆదివారం మొదటి పఠనము     సిరాకు : 3 :17 -18 ,20 ,28 ,29 రెండవ పఠనము      హెబ్రి 12 : 18-19-,22-24 సువార్త పఠనము      లూకా ...