1రాజులు 17 :10 - 16, హెబ్రీ 9: 24 - 28, మార్కు 12: 38 -44
క్రిస్తునాధుని
యందు ప్రియమైన
బిడ్డలారా సహోదరి
సహ్ోదరులారా ఈ
నాటి పరిశుద్ధ
గ్రంథ పఠనాలను
మనం గమనించినట్లయితే
ఉదార స్వభావం
గురించి బోధిస్తున్నాయి
మనం
ఒక మంచి
గుర్తింపు కోసం తాపత్రయ పడే సమాజంలో
జీవిస్తాం. నేటి
సమాజంలో హోదా,
గౌరవం, ఆకర్షణీయ
రూపం చాల
ముఖ్యం. వాస్తవానికి
మనం ఎలాంటి
వారమైన అందరూ
మనల్ని ఎలా చుస్తున్నారన్నదే ప్రదానం.
ఈ నాటి
సువార్తలో ధర్మశాస్ర
బోధకులను, పదుగురి
గుర్తింపు కోసం తాపత్రయ పడే వారీగా
చూపిస్తూ, అందుకు
భిన్నంగా అసలు
గుర్తింపు గురించి
ఆలోచన ,ధ్యాసే
లేని ఒక
పేద విధవరాలితో
పోల్చి ఆమెను
అణకువకు, సంపూర్ణ
ఆత్మ సమర్పణకు
ఆదర్శంగా చూపించటం
జరిగింది.
గుర్తింపుకై
ఆరాటం
: ధర్మశాస్త్ర బోధకులు
చట్టాన్ని వివరించే
వారీగా, వారి
గొప్ప జ్ఞానాన్ని
బట్టి ప్రజల
గౌరవాన్ని పొందేవారు.
చట్టం పట్ల
వారి భక్తిని
వ్యక్తపరుస్తూ వారు
పొడుగాటి తెల్లని
వస్త్రాలను ధరించే
వారు. వారు
ఎదురొస్తే ప్రజలు
లేచి నిలబడి
వారిని బోధకుడా
అని గౌరవంగా
నమస్కరించాల్సి ఉంటుంది.
అసలు సమస్య
ఏటంటే ఇలా
గౌరవాన్ని పొందడాన్ని
వారు తమ
హక్కుగా భావించటం
మొదలై చివరకు
అది వారి
అహంభావానికి, హోదాకు,
ప్రతిష్టకు గుర్తుగా
మారిపోయింది. దేవుని
చుట్టం పట్ల
చూపాల్సిన గౌరవాన్ని
వారు తమ పట్ల
చూపాలని కోరుకొసాగారు.
ఈనాటి మన
సమాజంలో కూడా
పదవిలో ఉండే
కొందరు ఇలాగే
ప్రవర్తిస్తుంటారు అందుకే
ప్రభువు, ధర్మశాస్త్ర
బోధకులను, విధవరాండ్ర
ఆస్తులను దిగమింగే
స్వార్థపరులైన దోపిడీ
దారులుగా బహిరంగంగా
తమ భక్తిని
ప్రదర్శించే డాంబికులుగా
దుయ్యబట్టారు. అధికారం,
పదవి అనేవి
చాలా సందర్భాల్లో
స్వార్థంతో, అవినీతితో
ముడిపడి ఉంటాయి.
ఈనాటి
సువార్త మొదటి
భాగంలో చెప్పుకున్న
ధర్మశాస్త్ర బోధకునికి,
రెండవ భాగంలో
వివరించిన పేద
విధవరాలికి మధ్య
ఒక స్పష్టమైన
వ్యత్యాసం కనిపిస్తుంది.
సమాజంలో
ఎటువంటి గుర్తింపు
లేని ఆ
విధవరాలి అతి సాధారణమైన
భక్తిని, తల
బిరుసు తనముతో సమాజములో
పేరు ప్రతిష్టలు
కోసం ఆరాటపడే
కొందరు మత
పెద్దల భక్తితో
పోల్చటం జరిగింది.
అదేవిధంగా ఎంతో
ఆర్భాటంగా విరాళాలు
ప్రకటించే స్తోమత గల్గిన డాంభికులైన
దాతలతో కూడా
ఆమె పోల్చబడింది.
వారు తమకున్న
అధిక సంపద
నుండి యేవో
కొంత ఇచ్చి
ఉండవచ్చు. అర్పణలు
ఇవ్వటంలో సాధారణంగా
మూడు రకాల
దాతలు ఉంటారు.
ఒకటి సణుగుడు
దాతలు వాస్తవానికి
వీరికి ఇవ్వటమే
ఇష్టం ఉండదు.
రెండు నియమ
దాతలు ఇవ్వటం
తప్పని వ్యక్తిగత
బాధ్యత గనుక
తప్పనిసరై ఇస్తారు. వారు గొణగక
పోవచ్చు కానీ
మనస్ఫూర్తిగా మాత్రం
ఇవ్వరు. మూడు
కారుణ్య దాతలు
వీరు ఎస్టీ
పూర్తిగా ఇస్తారు.
ఇక అలాగే
కొందరు తాము
దోచుకున్న దాంట్లోది
అన్యాయంగా ఇతరుల
నుండి కొల్లగొట్టిన
సొమ్ములోంచి ఇస్తారు.
ఉదాహరణకు జక్కయ్య
(లూకా 19:8 ) అయితే
పేద విధవరాలు
మాత్రం తన
వద్ద ఉన్నదంతా
తన కష్టార్జితమంతా
ప్రేమతో అర్పించింది.
ఈనాటి సువార్త
ఆనాడు నివసించినవారివైపు
కాదు ఈనాడు
నివసిస్తున్న మనవైపు
వేలేత్తిచూపుతుంది.
మరి మనం
కూడా పేరు
కోసం డాంబికులుగా
ప్రవర్తిసున్నామా లేక
మనస్ఫూర్తిగా ఇస్తున్నామా?
ఉదారతకు
దేవుని దీవెనలు
:
దేవుని
కృపానుగ్రహం పట్ల
పేద విధవరాలు
తన అపార
నమ్మకాన్ని ప్రదర్శించినట్లుగానే
ఈనాటి ప్రధమ
పఠనం సారఫెతులోని
మరొక అన్యురాలైన
విధవరాలు దుర్భర
కరువు సమయంలో
తన కోసం
దాచుకున్న తన
చివరి ఆహార
వనరుల్ని ఏలీయా
ప్రవక్తతో ఎలా
పంచుకుంటుందో వివరిస్తుంది.
ఆమె త్యాగపూరిత
ఉదారతకు బహుమానంగా
మిగిలిన కరువు
కాలమంతా వారి
జీవనానికి అవసరమయ్యే
అనుదిన ఆహార
వనరులతో దేవుడు
వారిని సంహృద్దిగా
దీవించాడు. కనుక
ఉదారత్వం అనేది
హృదయం నుండి
రావాలి. ఉదారత్వం
మన హృదయాల
నుండే వస్తుందా?
అని మనలను
సూటిగా నిరాఘాటంగా
ప్రశ్నిస్తున్నారు. విధవరాలి
ఉదారత్వాన్ని మన
ప్రభువు యేసు
మెచ్చుకున్నా విధంగా
ఈనాటి రెండవ
పఠనం మనలను
దేవునికి మన
సాటి సహోదరి
సహోదరులకు సంపూర్ణముగా
ఉదారంగా సమర్పించుకోవాలని
పిలుపునిస్తుంది.
ఈనాటి సువార్త
పఠనం శ్రీసభ
పట్ల, పేదల
పట్ల మరింత
ఉదారత చూపాలని,
ధనికులను కలవరపరచి,
ఒత్తిడి తెచ్చేందుకు
ప్రయత్నించటం లేదు
కానీ మనం
పేదలమైన, ధనికులమైన
అవసరాల్లో ఉన్న
వారిపట్ల ఉదార
గుణం కలిగి
ఉండాలని పిలుపునిస్తుంది.
మదర్
తెరెసాగారు తన
జీవితములో జరిగిన
ఒక సంఘటను
గురించి చెప్పారు.
ఒక రోజు
ఆమె ఒక
వీధిలో వెళుతున్నప్పుడు
ఒక భిక్షగాడు
ఆమెవద్దకు వచ్చి
అమ్మ అందరు మీకు
సహాయం చేస్తుంటారు.
నేను కూడా
మీకు ఇస్తానమ్మా
రోజంతా ఆడుకుంటే
నాకు రెండు
రూపాయలు మాత్రమే
వచ్చాయి దాన్ని
మీకు ఇవ్వాలని
ఆశపడుతున్నాను అని
అన్నాడు. అప్పుడు
మదర్ తెరెసాగారు
సందిగ్ధంలో పడ్డారట. ఒకవేళ
అమ్మ అతని దగ్గరనుండి ఆ
రెండు రూపాయిలు
తీసుకుంటే ఆ రాత్రికి
అతని తినేందుకు
ఏమి ఉండదు.
ఒకవేళ తీసుకోకుంటే
అతన్ని నిరాశపరిచినట్లు
అవుతుంది. కాబట్టి
అమ్మ అతని
ముందు చేతులు
చాచి అతను
ఇచ్చిన డబ్బును
తీసుకుందట.
ఆ
తర్వాత ఒకసారి
ఆమె మాట్లాడుతూ
ఆ భిక్షగాడు
ఇచ్చిన కానుక
నాకు నోబెల్
బహుమతికన్నా గొప్పగా
అనిపించింది. ఎందుకంటే
అతను తన
వద్ద ఉన్నదంతా
ఇచ్చేశాడు. ఇవ్వటంలో
ఉన్న ఆనందాన్ని
నేను అతని
ముఖంలో చూశాను
రోజంతా ఎండలో
తిరుగుతూ అడుక్కోని
పొందిన రెండు
రూపాయలను ఇవ్వటం
అనేది తన
విషయంలో ఎంతో
గోపా త్యాగం.
రెండు రూపాయలు
అంటే చాల
తక్కువ డబ్బు దాంతో
పెద్దగా నేనేమి
కొనలేను కొనలేక
పోవచ్చు. అయితే
అతను దాన్ని
త్యాగం చేసాడు.
ఆ త్యాగాన్ని నేను స్వీకరించాను.
అది నా
దృష్టిలో ఎన్నో
వేలరూపాయల కన్నా
ఎక్కువే. ఎందుకంటె
దాన్ని అతను
ఎంతో ప్రేమతో
ఇచ్చాడు దేవుడు
మనం చేసే
పని ఎంత
గొప్పదా అని
చూడరు కానీ
దానిని ఎంత
ప్రేమతో చేశామా
అనే దాన్ని
చూస్తారు.
కనుక
మనం కూడా
మనకు ఉన్నదాంట్లోంచి
నిర్భాగ్యులు, పీడితులతో
పంచుకోవాలి దానిని
గోనుకుంటానో లేక
విధిలేక చేస్తున్న
పని గానో భావించక
మన స్వీయ
దృక్పథంతో, మానవీయ
సౌబ్రాత్రుత్వంతో,
ఇష్టపూర్తిగా చేయాలన్నదే
ఈనాటి సందేశం.
బ్రదర్.
రత్న రాజ్
ఓ.సి.డి.