1, అక్టోబర్ 2022, శనివారం

27 వ సామాన్య ఆదివారం

 27 వ సామాన్య ఆదివారం

హబక్కుకు 1:2-3,2:2-4
2తిమో 1:6-8,13-14
లుకా 17:11-19

ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు విశ్వాసం గురించి తెలుపుచున్నాయి. ద్రుడ విశ్వాసం కలిగి ఉండుట ద్వారా దేవుడు మన జీవితంలో చాలా అద్భుతాలు చేస్తారు.
అందరి జీవితాలలో కష్టనష్టాలు, బాధ, సంతోషాలు ఉంటూనే ఉంటాయి అలాంటి సందర్భంలో దేవుని మీద మనకు ఉన్న విశ్వాసం ఎలాంటిది.
విశ్వాసం గురించి వివరించే సందర్భంలో పునీతా థామస్ అక్వినస్ గారు ఈ విధంగా అంటారు "విశ్వాసం ఉన్నవారికి ఎలాంటి వివరణ అవసరం లేదు ఎవరికైతే విశ్వాసం ఉండదో వారికి ఎంత వివరణ ఇచ్చినా సరే వారు విశ్వసించారు". దేవుని యొక్క విషయాలు మన యందు నెరవేరతాయి అని ఆయన ఎడల మనం పూర్తి విశ్వాసంను కలిగి జీవించాలి.
ఈనాటి అన్ని పట్ణాలు కూడా మనం దేవుని యెడల ఆయన వాగ్దానాల పట్ల అంచంచల విశ్వాసం కలిగి జీవించాలని తెలుపుచున్నాయి.
ఈనాటి మొదటి పట్ణంలో హబక్కుకు ప్రవక్త తోటి యోధ ప్రజలను విశ్వాసం కలిగి ఉండమని తెలుపుచున్నారు. హబక్కూక్ ప్రవక్త క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో జీవించారు అది ఎరుషలేము పతనమయ్యే సమయం (586 BC). ప్రవక్త జీవించే సమయంలో యూదా రాజ్యంలో ఎక్కడ చూసినా సరే అవినీతి, దౌర్జన్యం, అన్యాయం, హింసకాండలు జరుగుతుండేవి.
బాబిలోనియా రాజు యోధ పై రాజ్యంపై దండెత్తి వచ్చి వారిని అనేక కష్టాలు పాలు చేశారు అలాంటి కష్ట పరిస్థితులలో హబక్కూకు ప్రవక్త తోటి యూదా ప్రజలను ఉత్సాహపరుస్తూ దేవుని యెడల విశ్వాసం కోల్పోవద్దని తెలిపారు.
హబక్కుకు మొదటి అధ్యాయం రెండవ అధ్యాయంలో ప్రవక్త మరియు దేవుని యొక్క సంభాషణల గురించి తెలియజేయబడింది. ప్రవక్త మొదటి దేవునికి ప్రజల యొక్క బాధల గురించి దేవునికి ఫిర్యాదు చేసేవారు తరువాత దేవుడు తన ప్రజలకు సమాధానం ఇచ్చేవారు.
క్రీస్తుపూర్వం 600 వ సంవత్సరంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని వడంబడిటకు వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు వారికి నేర్పించుట కొరకు వారిని బాబిలోనియాకు బానిసలుగా పంపించారు. ప్రజల యొక్క పాప ఫలితం గానే తమకు కష్టాలు వచ్చాయి అనే ప్రవక్త గ్రహించారు.
హబక్కుకు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు అన్యుల క్రింద హింసించబడట అంతగా నచ్చలేదు ఎందుకంటే వారు కూడా అన్యాయం చేసిన వారే. ప్రవక్త ఎందుకు దేవుడు అన్యులకు సహకరిస్తున్నారు అని కూడా అనుకున్నారు. ఎందుకు దేవుడు తన శత్రువులను శిక్షించుటలేదు అని భావించారు అయినప్పటికీ దేవుడు దయామయుడు ఆపదలో ఆదుకునేవాడు పాపాన్ని శిక్షించిన దాన్ని మరలా మన్నించి పాపిని దగ్గరకు చేర్చుకుంటాడు అనీ గ్రహించాడు.ప్రజల యొక్క జీవితం ఎంత బాధగా ఉన్నా దేవుడు మాత్రము ప్రవర్తన తన్ను విశ్వసించమని తెలిపారు. యావే దేవుడిని విశ్వసించి ఆయన యందు సహనం కలిగి జీవించమని ప్రవక్తకు తెలియజేశారు. ప్రజలు ఏ విధంగా ఉన్నా కానీ దేవుడు మాత్రము తన యొక్క విశ్వాసనీయతను ప్రదర్శించుచున్నారు.
ఈ మొదటి పట్ణం చివరి మాటల్లో దేవుడు ప్రజలకు మేలు చేస్తానని పలుకుచున్నారు అదేవిధంగా నీతిమంతులు భక్తి విశ్వాసము వలన జీవిస్తారు అని ప్రభువు ప్రవక్తకు తెలియజేశారు. (హెబ్రీ 2:4 రోమి 1:17, గలతి3:11, హెబ్రీ 10:38).
నీతిమంతులు దేవుని యెడల విశ్వాసమును నిలుపుకుంటారు. వారి జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా వారు మాత్రము దేవుని యెడల విశ్వాసం కోల్పోరు. నీతిమంతులు తమ భక్తి విశ్వాసం వలన జీవిస్తారు ఎందుకంటే దేవునితో ఉన్న అనుబంధం అలాంటిది.
ఈనాటి మొదటి పట్ణం ద్వారా మనం గ్రహించవలసిన విషయాలు:
1. దేవుని యెడల గొప్ప విశ్వాసం ఉండాలి ఎందుకంటే ఆయన విశ్వాసనీయుడు.
2. బాధలలో కష్టాలలో దేవుడిని విడువకూడదు. ఆయన మీదనే ఆధారపడి జీవించాలి. 
3.మన హింసలలో మనకు సహనం ఉండాలి.
4. దేవుడి మనకు సమాధానం ఇస్తారు అనే నమ్మకం ఉండాలి.
5. దేవుని దయ అపారమైనది.
ఈనాటి రెండవ పట్ణంలో పుణ్యత పౌలు గారు సువార్త ప్రకటించమని తిమోతి గారిని కోరుచున్నారు. సువార్త ప్రకటన అనేది శ్రమలతో కూడుకున్నది కాబట్టి సువార్తకై పాటుపడమని పౌలు తిమోతికి తెలుపుచున్నారు. పౌలు గారు కూడా క్రీస్తు ప్రభువుని తెలుసుకొనకముందు అనేకమందిని హింసించారు తరువాత ఆయన గురించి సువార్త ప్రకటించారు. మనం జీవితంలో కూడా సువార్త ప్రకటించాలి పౌలు గారు తన పరిచర్యలో అనేక హింసలు పొందారు అయినా విశ్వాసం కోల్పోలేదు ప్రభువు హక్కును ప్రకటించారు అదేవిధంగా చేయమని తిమోతిని కోరారు. 
తన వలి సత్య సువార్త కోసం శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని తిమోతికి తెలుపుచున్నారు. ఈనాటి సువిశేషంలో ప్రభువు విశ్వాసం గురించి తెలుపుచున్నారు అదేవిధంగా ఒక సేవకుని యొక్క కర్తవ్యం గురించి కూడా తెలుపుచున్నారు. 
ఈ విశేష భాగమునకు ముందు వచనాలు చదివినట్లయితే అక్కడ పొరుగు వారిని క్షమించుట గురించి తెలియజేయబడినవి. ఒక వ్యక్తిని పదేపదే క్షమించాలంటే చాలా గొప్ప విశ్వాసమే ఉండాలి అందుకే మా విశ్వాసమును పెంపొందించమని అన్నారు. దానికి సమాధానం క్రీస్తు ప్రభువు ఆవగింజ విశ్వాసం ఉన్న కంబళి చెట్టును వేరుతో పెల్లగిలి సముద్రమనా పడుము అని ఆజ్ఞాపించిన అది అట్లే జరుగును అని అన్నారు.ఆవగింజ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది ఒక ఇసుక రేణువలే ఉంటుంది అలాంటి చిన్న నిజమైన విశ్వాసం మన జీవితంలో అనేక మార్పులు చేస్తుంది అనే ప్రభువు తెలిపారు.
విశ్వాసం అంటే నమ్మకం. మనకు ఉన్న డబ్బును బ్యాంకులలో వేస్తాము ఎందుకంటే ఆ బ్యాంకు మీద ఉన్న నమ్మకమును బట్టి మన డబ్బును దాచుకుంటాం. అదేవిధంగా మన నమ్మకం దేవుని యందు ఉంచాలి. దేవుని యందు ఉంచితే అది మేలు చేకూర్చుతుంది. 
పునీత పౌలు గారు అంటారు విశ్వాసం అంటే చూడని విషయాలు జరుగుతుంటాయి అనే నమ్మకమును కలిగి ఉండటమే. హెబ్రీ 11:1.
ఈ విశ్వాసమును కలిగి ఉండటం ద్వారా దేవుడు అనేక అద్భుత కార్యాలు చేస్తారు. 
1. విశ్వాసం ద్వారా దేవుడు అబ్రహామును మహాజాతిగా తీర్చిదిద్దారు.
2. విశ్వాసం ద్వారానే మోషే ఎర్ర సముద్రమును కర్రతో కొట్టి రెండు పాయలుగా చేశారు.
3. విశ్వాసం ద్వారానే సారేఫతు వితంతువు ఏలియా కు సహాయం చేశారు.
4. విశ్వాసం ద్వారానే నామాను ఎలీషా చెప్పిన విధంగా చేశారు.
5. విశ్వాసం ద్వారానే కణనీయ స్త్రీ తన కుమార్తెకు స్వస్థత వచ్చేలా చేసింది.
6. విశ్వాసం ద్వారానే యాయీరు తన కుమార్తెను బ్రతికించుకున్నారు.
ఈ విధంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండుట ద్వారా అనేకమంది జీవితాలలో దేవుడు అద్భుతాలు చేశారు.
2. విశ్వాసం దేవునితో ఉన్న బంధంను చూసిస్తుంది. మనకు దేవునితో చిన్న బంధం ఉన్నట్లయితే అది చాలు చాలా అద్భుతాలు జరుగుతాయి అని ప్రభువు తెలుపుచున్నారు. విశ్వాసం కలిగి జీవించుట ద్వారా ఎంతటి పెద్ద సమస్యను అయినా పరిష్కరించుకోవచ్చు అని తెలుపుచున్నారు. భూమిలోకి పాతుకొని పోయిన ఒక పెద్ద చెట్టు సైతం విశ్వాసం ద్వారా పిలికించవచ్చని ప్రభువు అన్నారు. 
ఇక్కడ ఏసుప్రభువు శిష్యులను కేవలం పొరుగు వారిని క్షమించుటకే విశ్వాసమును కలిగి ఉండమని తెలుపుచున్నారు. విశ్వాసం అంటే దేవునితో ఉన్న ప్రేమ అనుబంధం దానివలన మనం ఇతరులకు మేలు చేస్తాం. 
సువిశేష రెండవ భాగంలో సేవకుని కర్తవ్యం గురించి ఏసు ప్రభువు తెలుపుచున్నారు. మన యొక్క విశ్వాసం ఏ విధంగా నిరూపించబడుతుంది అంటే మన యొక్క క్రియల వలన. విశ్వాసమున సేవకుడు తన యొక్క బాధ్యతను సక్రమంగా నెరవేర్చుతాడు. మనము దేవుని యొక్క సేవకులం కాబట్టి యజమాని యొక్క పని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఎటువంటి బహుమానంను ఆశించకూడదు మన యొక్క బాధ్యతలు నెరవేర్చటలో ఏ విధంగా మనం ఉంటున్నాం. ఒక గురువుగా తల్లిగా తండ్రిగా ఉపాధ్యాయుడిగా మన బాధ్యతలు ఎలాగ నెరవేర్చుతున్నాము..
విశ్వాసము ద్వారా దేవుడు అసాధ్యమైనవి సుసాధ్యం చేస్తారు కాబట్టి ఆయన ఎంతో నమ్మకం కోల్పోరాదు. .
విశ్వసించుట అంటే ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉండటమే.
విశ్వసించుట అంటే ఆయన్ను ప్రేమించడమే.
విశ్వసించుట అంటే ఆయన్ను విదేయించుటయే.
విశ్వసించుట అంటే దేవుని వాగ్దానాలు నెరవేరతాయి అని నమ్ముటయే కాబట్టి ప్రభువుని విశ్వసించి ఆయన యొక్క వాక్కు అనుసారంగా జీవించి దేవునికి ఇష్టమైన సేవకులుగా జీవించుదాం.

BY.  FR. BALAYESU OCD

30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

27 వ సామాన్య ఆదివారం(2)

                      27 వ సామాన్య ఆదివారం


హబక్కూకు 1: 2-3, 2: 2-4 , 2 తిమోతి 1: 6-8, 13-14, లూకా 17: 5-10


ఈ నాటి మూడు పఠనాల ద్వారా తల్లి మనందరిని కూడా దేవుని పై మనకున్నటువంటి నమ్మకమును దృఢపరుచుకోమని

లేదా మన విశ్వాసమును సుదృఢపరుచుకోమని ఆహ్వానిస్తోంది.

దేవునికి మనకు మధ్య ఉన్న భందాన్ని దృఢపరుచుకోమని కోరుతుంది.

మరి ఎప్పుడు దేవునికి మనకి మధ్య ఉన్న ఆబంధం దృడంగా ఉంటుంది అంటే దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు, దేవునికి

ప్రియమైన వారిగా , నీతివంతమైన జీవితాన్ని జీవించినప్పుడు. ముఖ్యముగా క్రైస్తవ జీవితంలో వచ్చే ఆటంకాలకు,

సమస్యలకు భయపడకుండా, దేవుని యందు విశ్వాసముంచి జీవించినప్పుడు. దేవునికి ప్రియమైన వారిగా ఉంటాము.

మొదటి పఠనం

ఈ మొదటి పఠనం హబక్కూకు ప్రవక్త మరియు దేవాది దేవుడికి మధ్య జరిగిన సంభాషణ సన్నివేశాన్ని తెలియ చేస్తుంది.

అసలు దీనిగురించి ఈ సంభాషణ, ఏమిటి ఈ సంభాషణ ?

హబక్కూకు ప్రవక్త ప్రశ్న మరియు దేవుని సమాధానమే ఈ సంభాషణ.

క్రీస్తు పూర్వం 6 వ శతాబ్దం కాలంలో (609-597) . ఈ కాలానికి చెందినవాడు హబక్కూకు ప్రవక్త. అప్పుడు యూదా

రాజ్యాన్ని యెహోయాకీము రాజు పరిపాలిస్తున్నాడు. ప్రజల జీవితాలు, చీకటి జీవితలుగా మారిపోయాయి, మంచి

పరిపాలనలేదు, నీతి గల నాయకుడు లేడు. ఈ యోహాయాకీము రాజు అవినీతితో , అధర్మం , దౌర్జన్యం , దోపిడీ,

హింసలతో రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయం. దేవుని ప్రజలు ఆకలి తో అలమటిస్తున్నారు. రాజ్యం ఇలా ఉండగా ,

మరోవైపు బబులోనియా రాజు ఈజిప్టు ని ఓడించి యూదా ప్రజలమీద దండయాత్రకు , రాజ్యం వెలుపల సిద్ధంగా ఉన్నారు.

ఇలాంటి సమయంలో నీతివంతమైన జీవితాన్ని జీవిస్తున్న హబక్కూకు ప్రవక్త యూదా ప్రజల మధ్యవర్తిగా దేవుడికి పిర్యాదు

చేస్తున్నారు. దేవుడికి మొరపెడుతున్నారు. ?

2, 3 వచనాలను చుస్తే ప్రవక్త దేవుడిని ప్రశ్నిస్తున్నారు “నీవు ఆ దుష్కార్యములుచూసి ఎట్లు సహింతువు”? అని.

ఎందుకంటే మనము 4 వచనము ధ్యానిస్తే , ఇక్కడ ప్రవక్త అంటారు “ధర్మ శాస్త్రం బలహీనమైనది , నిష్ప్రయోజనమైనది

న్యాయం జరుగుటలేదు, దుష్టులు సజ్జనులను అణగద్రొక్కుతున్నారు , న్యాయం తారుమారగుచున్నది . నీవు

ఏమిచేస్తున్నావు” అని దేవుడిని ప్రశిస్తున్నాడు అని మొదటిభాగం మొదటి అధ్యాయంలో చూస్తున్నాం.

ఈ యోహాయాకీము రాజు , ధర్మశాస్త్రమును పాటించుటలేదు. ఏమిటి ఈ ధర్మశాస్త్రము ?

ధర్మశాస్త్రమంతా కూడా బోధించేది మనకు దేవుని ప్రేమిచడం మరియు మానవుని ప్రేమిచడం. ఇక్కడ ఈ రాజు రెండు

చేయుటలేదు. రాజ్యాన్ని అన్యాయముగా పరిపాలిస్తున్నాడు.

మరి ప్రవక్త అడిగిన ప్రశ్నకు సమాధానముగా దేవుడు 2 వ అధ్యాయంలో , సమాధానమిస్తున్నారు. ఇది రెండవభాగం.

ఇక్కడ దేవుని సంధానం ఏమిటి అంటే ; నిర్ణీత కాలమున సంస్తముకూడా జరుగుతుందని, ఆలస్యముగా జరుగుతుందని.

ఓపికతో వేచివుండుము అని, అప్పటివరకు నీతిమంతులుగా భక్తి విశ్వాసములతో జీవించమని దేవుడు

సమాధానమిస్తున్నారు.

కాబట్టి మొదటి పఠనం నుండి మనము నేర్చుకోవలసినది; దేవునియందు విశ్వాసముంచి , ఓపిక గలిగి నీతివంతమైన

జీవితాన్ని జీవించడం.

రెండవ పఠనం

ఈ రెండవ పఠనం కూడా క్రీస్తునందు ప్రేమ, మరియు విశ్వాసము కలిగి జీవించుము అని తెలియచేస్తుంది.

ఏవిధంగానంటే

ఈ నాటి రెండవ పఠన చరిత్ర మనం చూస్తే ; ఇది పునీత పౌలు గారు రోమునగరమందు చెరసాలలో బందీగా ఉన్నప్పుడు

దైవ సేవకుడైన తిమోతీ గారికి సలహాలుగా , సూచనలుగా రాస్తున్న లేక ఇది.

క్రీ. శ 63 వ సంవత్సరంలో పౌలు గారు బందీ గా చేయబడ్డారు. ఎఫెసు నగరంలో తిమోతి గారు దైవసేవకుడిగా ఉన్నారు.

ఆ సమయంలో ఎఫెసు నగరంలో కొన్ని విభేదాలు, సమస్యలు, విభజనలు జరుగుతున్నాయి. ముఖ్యముగా నాస్తికుల

వాదనలు, విమర్శలు పెరిగాయి , క్రీస్తుని అనుసరించువారిని విశ్వాసంలో తప్పుదారిలో నడిపిస్తున్నారు, విశ్వాసులు క్రీస్తుకు

దూరమవుతున్నారు . ఇలాంటి అయోమయ స్థితిలో తిమోతిగారికి సువార్త పరిచర్య కష్టమవుతుంది. అందుకుగాను

పౌలుగారు తన సలహాలను, సూచనలను తిమోతి గారికి పంపిస్తున్నారు.

ఇక్కడ మనము ముఖ్యముగా మూడు సలహాలను చూడవచ్చు.

మొదటిగా

“నీకు జ్ఞాపకము చేయుచున్నాను” ఏమని, నీవు దేవుని సేవకుడవు, క్రీస్తు సేవకుడవు, నాలాగే నీవుకూడా “దేవుని

వరమును” (దేవుని శక్తి లేదా పవిత్రాత్మను) పొందియున్నావు. ఆ శక్తి నిన్ను పిరికివాని చేయదు. నిగ్రహము కలిగి ఉండుము

అని తెలియచేస్తున్నారు.

రెండవదిగా

క్రీస్తు ఒసగినటువంటి శక్తితో, సువార్త కొరకై నావలే పాటుపడుము. దేవునికి సాక్షిగా ఉండుటకు సిగ్గుపడకుము అని

అంటున్నారు . క్రీస్తు కొరకై శ్రమలు అనుభవించడానికి సిగ్గు పడకుము, భయపడకుము అని అంటున్నారు.

మూడవదిగా

“క్రీస్తు యేసునందు ఐక్యము” వలన అంటే “నీవు క్రీస్తు యేసుతో ఐక్యమై ఉండుము”. ప్రేమబందాన్నీ , విశ్వాస బంధాన్ని

కలిగి జీవించు అని అంటున్నారు. ఎప్పుడైతే అలాజీవిస్తావో క్రీస్తు కొరకు పాటుపడటానికి సాధ్యమవుతుంది.

ఈ రెండవ పఠనం నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే

క్రైస్తవులైన మనందరం కూడా జ్ఞానస్నానం ద్వారా పవిత్రాత్మ వరమును , శక్తిని పొందియున్నాము. కాబట్టి మనము కూడా

పైన పేర్కొనిన మూడు సిద్దాంతాల ప్రకారం జీవించాలని పునీత పౌలుగారివలె , తిమోతి గారివలె జీవించమని , క్రైస్తవులైన ,

దైవసేవకులైన మనందరికీ తెలియ చేస్తున్నారు.

1. మనలో కూడా పవిత్రాత్మ ఉన్నది.

2. మనము కూడా సువార్త కొరకై పాటుపడాలి, క్రీస్తుకు సాక్షిగా నిలవాలి

3. క్రీస్తునందు ప్రేమ, మరియు విశ్వాస భందాన్ని ఏర్పరుచుకోవాలి.

సువిశేష పఠనం

సువిశేష పఠనంలో కూడా శిష్యులు ప్రభువుతో “మా విశ్వాసము పెంపొందించుము” అని అంటున్నారు. ఎందుకు?

మనము ఈ నాటి సువిశేష పఠనం 1 నుండి 4 వచనాలు ధ్యానిస్తే ; క్రీస్తు ప్రభువు శిష్యులకు ఈ విధంగా ఉపదేశిస్తున్నారు.

“ఆటంకములు రాక తప్పవు. జాగరూకులు కండు” అని ఉపదేశించిన సందర్భంలో లోని మాటలు ఇవి. ఈ మాటలకి

శిష్యులు “మా విశ్వాసమును పెంపొందించుము” అని అంటున్నారు.

శిష్యులకి కూడా తమ వ్యక్తిగత జీవితాలలో ఆటంకములు, సమస్యలు రావచ్చును. తమ సోదరుల మధ్య ఉన్న

సంభందాలలో ఆటంకములు విమర్శలు రావచ్చును. ముఖ్యముగా తమ సువార్త పరిచర్యలో కష్టాలు, ఆటంకములు,

సమస్యలు రావచ్చును. ఇలా ఎన్ని వచ్చినాకూడా, క్రీస్తు అప్పగించిన, లేదా క్రీస్తు నిర్వహించిన కర్తవ్యమును నెరవేరుస్తారో

వారు మాత్రమే సేవకులంటున్నారు. ఉదాహరణకు రెండవ పఠనం , పునీత పౌలుగారి జీవితం.

అందుకే క్రీస్తు ప్రభువుకూడా -ఒక సేవకుని కర్తవ్యమును ఉదాహరణగా చూపిస్తున్నారు .

సేవకుడు ఎన్ని పనులు చేసిన , ఎంత అలిసిపోయిన , ఎన్ని ఆటంకాలు న్నా , తన యజమానుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం

జీవించడమే సేవకునియొక్క కర్తవ్యం అని క్రీస్తుప్రభువు తెలియచేస్తున్నారు. అలా జీవించడానికి కావలసినవి యజమానుని

యందు ప్రేమ మరియు యజమానుడు ఒసగిన కర్తవ్యాన్ని విశ్వాసంతో చేయడం.

అవిలేనిదే మనము ఏపనికూడా చేయలేము.

అందుకే క్రీస్తు ప్రభువు ఈ నాటి పఠనంలో అంటున్నారు మీకు ఆవగింజంత విశ్వాసము, ప్రేమ ఉన్న , వృక్షాలు సైతం

తొలగించవచ్చని.

మరి మంజీవితాలలో అలాంటి విశ్వాసం , ప్రేమ దేవునియెడల ఉన్నట్లయితే మన జీవితాలలో వృక్షాలుగా పాతుకుపోయిన

ఆటంకాలు, కష్టనష్టాలు , సమస్యలును కూడా ఎదుర్కొనవచును , వాటిని వేరుతో సహా పెళ్లగిలి బయట పారవేయవచ్చును

మరి ఒక్కసారి మనం ధ్యానిద్దాం , ఆత్మ పరిశీలన చేసుకుందాం.

మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఇలాంటి ఆటంకాలే వస్తాయి. ఏవిధంగా అయితే యూదా ప్రజలు

యోహాయాకీము రాజు అన్యాయ, అక్రమ పరిపాలనను అనుభవించారో, దైవ సేవకులైన పునీత పౌలుగారు మరియు

తిమోతి గారు నాస్తికుల విమర్శలకు మరియు కష్టాలు, శ్రమలకు గురయ్యారో, ఏవిధంగా క్రీస్తు ప్రభువు శిష్యులు విశ్వాస

పరీక్షలకు గురయ్యారో, మనము కూడా అలాంటి సమస్యలనే ఎదుర్కొంటాం. అలాంటి సమయాలలో కూడా మనము

పాటించవలసిన సిద్దాంతం.

1. మనలో కూడా దైవ వరం లేదా పవిత్రాత్మ శక్తి ఉందని గుర్తించాలి.

2. సమస్యలకు ఆటంకాలు భయపడకుండా, క్రీస్తుని సువార్తకై సాక్షిగా జీవించాలి.

3. క్రీస్తుని ప్రేమిస్తూ, ఆయనయందు విశ్వాసముంచి, మనజీవితాలలో ముందుకు సాగాలి.

బ్రదర్. సుభాష్ ఓ.సి.డి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...