22, జులై 2023, శనివారం

 

 

SISXTEENTH ORDINARY SUNDAY

Wisdom 12:13,16-19, Romans 8:26-27, Matthew 13:24-43

Br. Subhash O.C.D

 

First Reading: God has shown himself to be a God of justice and mercy.

Committing sin and mistake again and again is humanness, being merciful and forgiving is Godhood (divineness or godliness).

The first reading explains that, God is just and a merciful father, he treats every one equally. He provides all of us with the opportunity to be saved. And when some one doubts the power of God, god's power is shown to the people in different ways. God has the power or authority to condemn, but he still bears us patiently.

Vs. 19. we, see god waits for his people to repent and he forgives them. So also God desires his good people to forgive one another as he did. He desires his people live in righteous ness. He invites us to possess the qualities of God like mercy and forgiveness.

Those who do good are the children of God and those who do bad are the children of Evil.

Therefore God ask us to be his good children.

 

Responsorial Psalm:

Psalm 86:5-6,9-10,15-16 :  It is A prayer to God for mercy.

 

Second Reading : The Spirit intercedes for us with God.

By nature human beings are  fragile, weak, fall towards sin easily. Because we often fall in to the trap of sin, we fail to love our brethren, we fail to forgive others, we fail to be merciful towards the other in their need.

But st. Paul says that the spirit comes to aid and do the needful to all those are week . The spirit is within us, appealing to the Father on our behalf and enables us to call God Abba Father. Therefore Paul tells  that as humans we do struggle against the flesh, with our desires and selfish attitudes.  The spirit indeed groans within us as we pray to our Father through Jesus.  And God the Father answers us or grants us what ever we ask in prayer through Jesus Christ.

Gospel

This gospel reading is a continuation of the last Sunday’s  Jesus’ discourse to the crowds and disciples .

In today’s Gospel, Jesus speaks three parables to explain about the Kingdom of Heaven. He also explains why he speaks to the crowds in parables and interprets the parable of the sower for the disciples. In three parables the common concept is “the Kingdom of Heaven”. The first parable speaks that the Kingdom of Heaven is compared to the sower (God). And land is compared to the world, and the good seeds are compared to the wheat(children of God) and the  bad seeds are compared to the weeds(children of evil). the enemy is (evil).

Here, did the sower sow the weeds?

No. But an enemy has done that out of jealousy.

Did God create bad people?

No. But it is evil who tempts the people, or attracts the people, by projecting as though it is good.

Why do people tend towards evil, because

-evil is tasty

-evil tempts

-evil attracts

-evil pretends to be good.

The evil tempts human, in the form of pleasures, power, riches or wealth, etc.

However, the wheat and weeds grow together and they will not be realized till the time of collecting the crops. Same way the good people (children of God) and bad people (children of evil) live together in the world. And will not be realized what is good and evil until the final judgment.

The sower is patient enough till the end. To separate wheat and weeds. So also God is so patient he waits for bad people to become good. And on the day of judgement he separates good and the bad. The good people become the children of God, and they inherit the kingdom of heaven. And the bad people children of evil, will inherit the eternal fire.

The second parable explains to us that kingdom of God is like mustard seed, which becomes a huge tree and becomes a shelter for the birds of the air. Beginning the faith of Christianity may be  small but later it increases and many people, cultures, and nations, reflecting God’s plan for the people will realize that god’s Kingdome is something different than what we expect and imagine. In Gods kingdom full of mercy and compassion.

Purposely the enemy comes to destroy while we are in asleep and sows the weeds in the field. That means we must be awake, or be aware of the evil that is around us. As st. Peter said in his letters “Discipline yourselves, keep alert. Like a roaring lion your adversary the devil prowls around, looking for someone to devour” (1Peter 5:8).

So this parable teaches us to be perciver in our prayer. With out failing becaue the devil may miss guide us.

The third parable teaches us that we must be like yeast, in the families and in the societies, spreading God’s love and mercy or sharing goodness to other.We also should expand God’s kingdome on earth.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

15, జులై 2023, శనివారం

15వ సామాన్య ఆదివారం

             15వ సామాన్య ఆదివారం
యెషయ 55:10-11
రోమియులు 8 18-23
మత్తయి 13:1-23

ఈనాటి దివ్య పఠణాలు దేవుని యొక్క వాక్కుకు ఉన్నటువంటి గొప్ప శక్తిని గురించి బోధిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్కు మనందరినీ కూడా ఎంతో ప్రభావితం చేసి, మార్చి వేస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ప్రకటించిన సందర్భంలో అది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విధమైనటువంటి ప్రేరణ కలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యం ప్రకటించిన సందర్భంలో అది కొన్నిసార్లు ప్రజల యొక్క జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురాని సందర్భంలో మనం నిరాశ చెందకూడదు అని కూడా ఈ దివ్య పఠణాలు మనకు సెలవిస్తున్నాయి. ఒక విధముగా చెప్పాలి అంటే ఈనాడు మనం విన్నటువంటి ఈ దివ్య పఠణాలు మనకు గుర్తు చేసే అంశం ఏమిటంటే ఏ విధముగా దేవుని యొక్క వాక్యమును మనము వ్యక్తిగతంగా స్వీకరిస్తూ ఉన్నాము అలాగే దేవుని యొక్క వాక్కు మన జీవితములను ఫలభరితము చేస్తూ ఉన్నదా లేదా. దేవుని యొక్క వాక్కు యొక్క గొప్పతనము. కీర్తన 119:9-11, 105
2 తిమోతి 3:16
హెబ్రీ 4:12
ఈనాటి మొదటి పట్టణంలో యెషయ ప్రవక్త బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నారు.యెషయ  ప్రవక్త ప్రభువు యొక్క వాక్కును వానతోను,మంచుతోను పోల్చి చెబుతున్నారు. వానయు, మంచు ఈ రెండిటికి కూడా జీవమును ఇచ్చే శక్తి ఉన్నది. ఎందుకంటే వాన భూమి మీద పడిన సందర్భంలో అది కొత్త మొలకలు పుట్టే లాగా సహాయపడుతూ ఉంది. అదే విధంగా వానయు, మంచుయు జీవన మనుగడను కొనసాగిస్తుంటాయి ఎందుకంటే నీరు లేకపోతే మనం, జంతువులు, వృక్షములు బ్రతుకలేం. దేవుని యొక్క వాక్కు మన అందరిలో కూడా కొత్త జీవమును పుట్టిస్తుంది.ప్రభువు యొక్క వాక్కు ప్రకటించిన సందర్భంలో అది మనలో ఏదో ఒక విధమైన ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది. యెషయ ప్రవక్త పలికినటువంటి ఈ మాటల యొక్క సంపూర్ణ అర్ధాన్ని గ్రహించాలి అంటే ఆనాటి సందర్భం తెలుసుకోవాలి. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా  దేశంలో బానిసత్వపు జీవితం గడుపుతున్నారు. అక్కడ అనేక కష్టాలు పడుతూ తమకు విముక్తి ఎప్పుడు కలుగుతుందా? అని ఆశతో ఎదురు చూస్తూ నిరాశతో నిస్పృహలతో కృంగి నశించి బాధపడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క వాక్కు ద్వారా ఊరటనిస్తున్నారు. యావే దేవుడు తప్పనిసరిగా ఇశ్రాయేలు ప్రజలకు విముక్తిని దయచేసి మనకు తిరిగి తీసుకొని పోతారని, రక్షణ ప్రసాదిస్తారని ప్రవక్త ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. ఇస్రాయేలు ప్రజలు ప్రభువు యొక్క వాక్కును కూడా విశ్వసించాలి అని యెషయ ప్రవక్త తెలియజేస్తున్నారు. అదేవిధంగా దేవుని యొక్క వాక్కు శక్తివంతమైనదని విశ్వాసనీయమైనదని సృష్టికి మూలమైనదని, నడిపించే వాక్కుని, ప్రేమించే వాక్కు అని, క్షమించే వాక్కు అని ప్రవక్త తెలియజేస్తున్నారు. ప్రభు యొక్క మాటకు తిరుగులేదు, అది తన కార్యాన్ని తప్పక సాధిస్తుంది. ఏ విధముగానయితే కురిసిన వర్షం వృధాగా పోదో అలాగే ప్రకటించినటువంటి దైవవాక్కు వృధాగా పోదు. వానయు మంచు పంట ఎదుగుదలకు కృషి చేస్తాయి అలాగే దైవ వాక్కు కూడా మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు కృషి చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క సంతోషకరమైనటువంటి వార్త ప్రకటించుట ద్వారా ఇశ్రాయేలు ప్రజలలో ఒక కొత్త నమ్మకం, కొత్త ఆశలు పుట్టుకొని వచ్చాయి. ఇది దేవుని యొక్క వాక్కుకు ఉన్నటువంటి శక్తి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు మన యొక్క ఆధ్యాత్మిక జీవితము నశించిపోవుటను గురించి తెలియజేస్తున్నారు. ఈ లోక సంబంధమైన జీవితం జీవిస్తే మన యొక్క ఆధ్యాత్మిక జీవితం నశించి పోతూ ఉంటుంది.  ఏసుప్రభు యొక్క మార్గంలో నడిచినటువంటి పునీత పౌలు గారు రోమీయులను దేవుని యొక్క వాక్కును విశ్వసించమని కోరుతున్నారు. ఆదాము యొక్క పాపము ఈ లోకంలోకి వినాశనమును తీసుకుని వచ్చింది అదేవిధంగా ఈ సృష్టికి మరియు మానవాళికి నాశనమును తీసుకొని వచ్చింది. ఆదికాండము 3:14-19 మనకు తెలిపే అంశము ఏ విధముగా సృష్టి నాశనం అవుతున్నది మానవుని ఒక పాపము వలన. పౌలు గారు తెలిపే అంశమేమిటంటే క్రీస్తు ప్రభువు మనలను రక్షిస్తారు.
ఈనాటి సువిశేషం లో యేసు క్రీస్తు ప్రభువు వారు అందరూ అర్థం చేసుకునే విధంగా ఉపమాన రీతిగా దేవుని యొక్క వాక్కుకు ఉన్నటువంటి శక్తిని గురించి తెలియజేస్తున్నారు. విత్తువాడు విత్తనములు వెదజల్లుటకు వెళుతున్నారు. విత్తనాలు చల్లే సందర్భంలో కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతినేలపడ్డాయి, ఇంకొన్ని విత్తనాలు,  కొన్ని ముళ్ళ పొదల మధ్య పడ్డాయి మరికొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై పడినవి. ఈ ఉపమానంలో చల్లబడిన విత్తనము ఒక్కటే కానీ ఆ విత్తనములు పడినటువంటి స్థలములు నాలుగు రకములు.
విత్తనము చల్లినది దేవుడే ఆ యొక్క విత్తనము దేవుని యొక్క వాక్యం. చల్లబడినటువంటి స్థలములు మనందరిని కూడా సూచిస్తున్నాయి. ప్రతి ఒక్క రైతు విత్తనములు చల్లిన సందర్భంలో ఒక మంచి ప్రతిఫలాన్ని ఆశిస్తారు. పంట వేసే సందర్భంలో ఏ రైతు కూడా తాను వేసిన విత్తనాలన్నీ ఫలిస్తాయని తలంచడు. కొన్ని విత్తనాలు గాలికి  కొట్టుకొని పోవచ్చు, కొన్ని విత్తనాలు మొలకలు రావచ్చు కొన్ని విత్తనాలు తాలు గింజలు ఉండవచ్చు కాబట్టి ఆయన 100% ఫలమును ఆశించడు కానీ వేసినటువంటి పంట మాత్రం తప్పకుండా లభిస్తుందని విత్తనాలు వెదజల్లుతాడు. ఈ విత్తనాలు పడినటువంటి నాలుగు స్థలాలు మన జీవితములను ఏ విధంగా పోలి ఉన్నాయి అని తెలుసుకుందాం.
1. త్రోవ పక్కపడిన విత్తనాలు
త్రోవ పక్కన పడిన విత్తనాలు మొలక ఎత్తటానికి చాలా కష్టం ఎందుకంటే నేల గట్టిగా ఉంటుంది కాబట్టి. నేల మీద పడిన విత్తనాలు భూమిలోనికి స్వొచ్చుకపోలేనందువలన వాటిని పక్షులు వచ్చి తిని వేస్తాయి. అలాగే ఆ మార్గం గుండా నడిచి వెళ్లేవారు ఆ విత్తనాలను త్రొక్కి వేస్తారు. ఈ యొక్క స్థలమును పోలిన వారు దేవుని యొక్క వాక్కును నామమాత్రంగా వింటారు ఆ యొక్క వాక్కు లోనికి పోనందువలన వారి యొక్క జీవితంపై ఎటువంటి ప్రభావితం ఉండదు. వాస్తవానికి ఈ యొక్క విత్తనాన్ని పోలిన వారు వారి యొక్క హృదయములను ఈ లోక సంబంధమైన విషయంతో మూసేస్తారు అందుకని దేవుడి యొక్క వాక్యం వారిలో ప్రవేశించదు కావున ఆ యొక్క వాక్యం ఎటువంటి ప్రతిఫలమును వారి జీవితంలో ఇవ్వదు.
2. రాతి నేలపై పడిన విత్తనాలు
ఈ యొక్క నేలను పోలినటువంటి వారు ఎక్కువ భావోద్వేగాలను కలిగినటువంటి వారు వారు ఎప్పుడు కొత్తదనం కోసం ఎదురు చూస్తూనే ఉంటూ ఉంటారు కానీ జీవితంలో దేని మీద కూడా సరియైనటువంటి ఆసక్తి చూపనై ఉంటారు. ఇలాంటివారు దేవుని యొక్క వాక్కును విన్నటువంటి సందర్భంలో బాగానే ఉంటారు సంతోషిస్తారు ఆసక్తిగా వింటారు కానీ కొద్ది సమయంకే ఆ యొక్క వాక్కు నుండి వారు వేరే అంశముల వైపు పయనిస్తారు. మొదట్లో వారు చాలా ఆసక్తిగా ఉంటారు కానీ తర్వాత తర్వాత వారి యొక్క ఇంట్రెస్ట్ దేవుని యొక్క వాక్కు మీద తగ్గిపోతుంది. పవిత్ర గ్రంథంలో యోహాను సువార్తలో దీనికి తగినటువంటి ఉదాహరణ ఉంది. ఏసుప్రభువుని వెంబడించే శిష్యులు అనేక అనేకమంది ఉన్నప్పటికీ ఎప్పుడైతే తాను ప్రజలకు తన యొక్క శరీర రక్తాలను భోజనంగా ఇస్తారని చెప్పారో అప్పుడు ఆ మాటలను వారు స్వీకరించడానికి అంగీకరించలేరు. ఆ మాటలు వారు జీర్ణించుకోలేకపోయారు. మొదట్లో యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వారికి సంతోషంగానే, వినసొంపుగా ఉన్నాయి కానీ కొద్దిసేపటికే వారికి దేవుని మీద , దేవుని యొక్క ఆ వాక్కు మీద ఉన్నటువంటి ఆసక్తి పోయింది అందుకే వారు క్రీస్తు ప్రభువుని వెంబడించలేకపోయారు . యోహాను 6:60
3. ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనములు
ఈ విత్తనములు పోలిన వారు మొదట్లో దేవుని యొక్క వాక్యమును విని కొంత సమయం వరకు ఆచరిస్తూ ఉంటారు కానీ ఈ లోక సంబంధమైన వ్యసనాలు, వ్యామోహాలు వారిని ఈ లోకానికి పరిమితం చేస్తాయి. సైతాన్ కి సంబంధించినటువంటి అలవాట్లు కలిగిన వారు దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువ కాలం పాటించలేరు. ఎవరి యొక్క ఆలోచనలైతే ధనం మీద గాని, అధికారం మీద కానీ పేరు ప్రతిష్టల మీద కానీ ఉంటాయో వారు ఎక్కువగా వీటి గురించే ఆలోచన చేస్తారే అలాంటి వారిలో దేవుని యొక్క వాక్కు ప్రభావం ఎక్కువగా ఉండదు. వారు దేవుని యొక్క వాక్కు ప్రకారంగా జీవించాలి అని అనుకోరు. చాలామంది దేవుని యొక్క వాక్కు ప్రకారంగా జీవించలేక పోతారు ఎందుకంటే దైవవాక్కు కన్నా ఈ లోక సంబంధమైన విషయాలే వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. చాలామంది ఈ విత్తనమును పోలి ఉంటారు ఎందుకంటే వాక్యమును వింటారు కానీ ఆ వాక్యానికి తగినటువంటి జీవితం జీవించరు.
4. సారవంతమైన నేల మీద పడిన విత్తనములు
ఈ నేలను పోలిన వారు దేవుని యొక్క వాక్యమును విని విన్నటువంటి వాక్యమును ఆచరించేవారు. వారి జీవితంలో ఎన్ని శోధనలు వచ్చిన, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, సమస్యలు వచ్చిన వారు పడిపోరు విశ్వాసాన్ని కోల్పోరు దేవుని యొక్క వాక్కు అనుసారముగా ప్రతినిత్యం జీవిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్కు అనుసరించే సందర్భంలో ప్రాణాలను సైతం కోల్పోవుటకు వారు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు ఇలాంటి వారి జీవితంలో వారు ముప్పదంతలుగా అరవ దంతులగా నూరంతులుగా ప్రతి ఫలమును చూస్తారు వారు అడిగిన ప్రతి వరమును దేవుడు దయచేసి ఉంటారు. మనందరం కూడా సారవంతమైన నేలను పోలిన వ్యక్తులుగా ఉండాలి అన్నదే దేవుని యొక్క కోరిక అందుకే దేవుడు ప్రవక్తల తర్వాత ప్రవక్తలను రాజుల తర్వాత రాజులను యాజకుల తర్వాత యాజకులను సేవకుల తర్వాత సేవకులను సేవకుల తర్వాత సేవకులను పంపిస్తున్నారు వాక్యమును బోధించేలాగా చేస్తున్నారు ఆ వాక్యము ద్వారా మన అందరి జీవితాలు మారాలి అని మనందరి జీవితం ప్రతిఫలం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి దేవుడి యొక్క వాక్యమును ఏ విధముగా స్వీకరిస్తున్నారు ఏ విధముగా ఆలకిస్తున్నాం ఏ విధముగా ఆచరిస్తున్నాం అని మనందరం కూడా వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్కు ఎంతో శక్తివంతమైంది కాబట్టి ఆ వాక్యము క అనుసారంగా మనం జీవించి మన జీవితాలను దేవునికి అనుగుణంగా మార్చుకోవాలి.

Fr. Balayesu OCD

8, జులై 2023, శనివారం

పదునాల్గవ సామాన్య ఆదివారం

పదునాల్గవ సామాన్య ఆదివారం
జెకరియా 9: 9-10, 
రోమా 8: 9, 11-13, 
మత్తయి  11: 25-30

                      బ్రదర్. సుభాష్ ఓ.సి.డి

క్రీస్తుపూర్వం 538 వ సంవత్సరం యిస్రాయేలు ప్రజలు బబులోనియా బానిసత్వం నుండి తిరిగివచ్చిన కాలం.
యిస్రాయేలు ప్రజలను పరిపాలించుటకు ఈ రాజులూ కూడా లేరు . యిస్రాయేలు ప్రజలు స్వతంత్రులు, కానీ ముఖ్య అధికారం మాత్రం యూదులు, పర్షియా, గ్రీసు మరియు రోమీయులది. కానీ యిస్రాయేలు ప్రజలకు ఏ రాజునూ లేడు. దేవాలయం ధ్వంసం చేయబడింది ప్రజల జీవితములో శాంతి లేదు.
ఈ సమయములో జెకర్యా మరియు హగ్గయి  ప్రవక్తలు ఇద్దరు కూడా దేవాలయ నిర్మాణంలో   యిస్రాయేలు ప్రజలను ప్రోత్సహిస్తారు.
ఆ సందర్భంలో జెకరియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను  సంతోష పరిచే వాక్యాలే  మొదటి పఠనంలో చూస్తున్నాము.
9. వచనంలో చూస్తున్నాం, యూదా మరియు యిస్రాయేలు ప్రజలారా మీరు సంతసించండి నేను మీ మధ్య నివసించబోతున్నాను. ఒక శాంతి యుతమైనటువంటి రాజ్యాన్ని స్థాపిస్తాను. మీ శాంతి రాజు గాడిదపై ఊరేగింపుగా వచ్చును అని చెపుతున్నాను. 
రాజులు గుఱ్ఱములపై  లేదా అశ్వములపై  లేదా రథములపైనా కదా ఊరేగింపుగా వస్తారు గాడిదమీద రావటం ఏమిటి?.
ఇక్కడ గాడిద అనే జంతువు వినమ్రతకు, శాంతి సూచనగా నిలుస్తుంది. 
గొప్ప రాజులుకూడా గాడిదపైన ఉరేగింపబడ్డారు. జాయిరు, యిస్రాయేలు ప్రజల ఏడవ నాయకుడు. తన ముప్పది మంది కుమారులతో ముప్పది గాడిదలపై స్వారీ చేసి గిలియాద్ దేశములో ముప్పది పట్టణములను దాడి చేసెను. (న్యాయాధిపతులు 10: 4) 
సొలొమోను మహారాజు కూడా గాడిదపై ప్రయాణించెను (1రాజుల  1 :33). దావీదు మహారాజు కుమారులు కూడా గాడిదపై పర్వతములలోకి పారిపోయాను (2వ సమూయేలు 13 : 29 ). దావీదు మహారాజు కుమారుడు అబ్షాలోము గాడిదపై స్వారీ చేసెను (2వ సమూయేలు 18 : 9 )
ఇక్కడ గాడిదను తక్కువ విలువగల  జంతువుగా కాకుండా గాడిదయొక్క వినమ్రతను ముఖ్యమైన అంశముగా మనం గ్రహించాలి.
10 వ వచనంలో ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను యిస్రాయేలు నుండి రథములను యెరూషలేమునుండి యుద్దఅశ్వములను  తొలగింతును ధనస్సులను  నాశనం చేసెదను.
ఇక్కడ రథములు, ధనస్సులు అధికారానికి గుర్తు. కానీ దేవుడు రథములను తొలగిస్తాను  అంటున్నాడు, ధనస్సులను నాశనం చేస్తా అంటున్నాడు.  అంటే అధికారాన్ని తీసివేస్తా అని చెపుతున్నాడు.
యుద్ధాశ్వములు యుద్దానికి ఉపోయోగించే జంతువులు యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉంటాయి. రాజులకు ఒక శక్తి, బలం లాంటివి. దేవుడు వాటిని కూడా తొలగిస్తానని అంటున్నాడు.
యుద్దాలు శత్రుత్వానికి, చంపుకోవడానికి, చావడానికి గుర్తు. 
ఇక యుద్దాలు జరగవు, శాంతిని దయచేస్తాను అని అంటున్నాడు. మిమ్మలను శాంతితో పరిపాలించుటకు రాజు రాబోవుచున్నాడు అని ప్రభువు జెకర్యా ప్రవక్త ద్వారా పలుకుచున్నాడు.
సువిశేషం:
 25 - 27 వచనాలలో క్రీస్తు ప్రభువు, తండ్రి దేవుడిని స్తుతిస్తున్నారు. ఈ వాక్యాలు యూదుల అధికారములను ధర్మశాస్త్ర బోధకులను, పరిస్సయులను ఉద్దేశించినవి. ఈ వచనంలో దేవుడికి క్రీస్తు ప్రభువుకి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రేమను మనం గమనించవచ్చు.
అంతేకాక “విజ్ఞులకు, వివేకావంతులకు” ,” వీటిని”, “పసిబిడ్డలకు”  “మరుగు పరచి” “బయలు పరచి” అనే  పదాలను వింటున్నాము.
విజ్ఞులకు, వివేకవంతులు :- అంటే యూదులు అధికారులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయులు, గర్వాత్ములు క్రీస్తుని రాజుగాను, దేవుని  కుమారుడగును, రక్షకుడిగాను విశ్వశించని వారు నిరాకరించనివారు.
వీటిని :- క్రీస్తు చేసేటటువంటి అద్భుత కార్యాలు, స్వస్థతలు, మంచి పనులు (పరమ రహస్యాలు) 
పసిబిడ్డలు :- అంటే వయస్సు పరంగా కాదు ఇక్కడ ప్రభువు వ్యక్తుత్వన్ని గురించి మాట్లాడుతున్నాడు. వినమ్ర హృదయులు కలిగిన వారు, పేదలు, దరిద్రులు, పాపాత్ములు  క్రీస్తుని తమ రాజుగా స్వీకరించిన వారు, క్రీస్తు రక్షకుడిగా విశ్వసించినవారు.
మరుగుపరచి:- తొలగించి, తీసివేయబడి. విజ్ఞులు మరియు వివేకవంతుల, నుండి తీసివేయటం 
బయలు పరచటం:- పసిబిడ్డలు వంటి వ్యక్తుత్వం, మంచితనం కలిగిన వారికీ దేవుని ఆశిర్వాదములు బయలుపరచబడ్డాయి.
సొలొమోను మహారాజు  వలె విజ్ఞానం, వివేకం ఉంది దేవుని యందు విశ్వాసం మరియు మంచితనం లేకపోతె మరి ఎందుకు పనికిరాము, దేవునిచే తిరస్కరించబడుతాం.
28 - 30 వచనాలను ధ్యానిస్తే: - ఈ వచనాలు, జీవితంలో, మానసిక, శారీరక, ఆత్మలో, భారంగా నలిగి పోతున్న ప్రజలకు, క్రీస్తు పలుకుతున్న వచనాలు, “భారముచే అలసి సొలసి ఉన్న జనులారా నాయొద్దకు రండి విశ్రాంతినిస్తాను”. అని అంటున్నాడు. 
అంటే క్రీస్తు ప్రభువు మనందరినీ ఆహ్వానిస్తున్నారు. శాంతిని పొందుటకు, రక్షణ పొందుటకు, సంతోషంగా ఉండుటకు.
 పునీత  అగస్తీను  గారు " నా ఆత్మా నీలో కలవనిదే దానికి శాంతి లేదు" అని చెపుతారు. 
ఎప్పుడైతే దేవుని చెంతకు వస్తామో, మన ఆత్మలు దేవునిలో లీనమవుతాయో మనకు కూడా శాంతి లభిస్తుంది.
యూదుల మతాచారాలు వారి చట్టాలు, వారి పరిపాలన ప్రజలకు చాల భారమైంది, శాంతి లేని ఒక అన్యాయపు పరిపాలన యూదులు ప్రజలపై భారం మోపుదురు, కానీ వారి చిటికిన వ్రేలుకూడా సహాయం చేయడానికి కదుపరు. మత్తయి 23 : 4 
యూదా సిద్దాంతాలతో, చట్టాలతో ప్రజలు నలిగి సతమతమవుతున్నారు, కానీ వారు మాత్రం సుఖవంతమైన జీవితాన్ని జీవించేవారు. 
కానీ క్రీస్తు మాత్రం యూదులకంటే భిన్నంగా ప్రజల భారాన్ని కూడా మోశారు.
నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది . ఏమిటి దీని అర్థం?
ఇక్కడ క్రీస్తు ప్రభువు తన సిద్దాంతాలతో , ధర్మశాస్త్ర బోధకులు లేదా యూదుల చట్టాలను పోల్చి చెపుతున్నారు.
యూదుల చట్టాలు " ప్రాణానికి ప్రాణం , కంటికి కన్ను , పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు, దెబ్బకు దెబ్బ నిర్గమ 21 వ అధ్యాయంలో చూస్తున్నాం.  ఈ విధంగా ఉంటుంది. అంటే ప్రతీకారం అనే చట్టం యూదులది. 
యేసు కాడి,  ప్రేమతో కూడినది, దైవ ప్రేమ, సోదర ప్రేమ.
క్రీస్తుని  చట్టం నీ శత్రువులను ప్రేమింపుము, వారికోసం ప్రార్థన చేయుము. క్రీస్తు చట్టంలో క్షమా , దయ , జాలి, సహాయం, కనికరం ఉంటాయి. కానీ యూదా చట్టంలో ఇవేవి ఉండవు.
క్రీస్తు ఈ లోకంలో శాంతిని నెలకొల్పడం కోసం గాడిదపైన వినమ్రుడై , ఉరేగించబడ్డాడు, శ్రమలు అనుభవించి , అవమానాలు పొంది, యూదులు మోపిన సిలువ అనే భారాన్ని మోసి మనకోసం మరణించాడు.
క్షమించు అనే మాట ద్వారా లోకమంతటికి శాంతిని నెలకొల్పాడు.
రెండవ పఠనం;
దేవుని ఆత్మ మనలో వాసమై ఉందని పునీత పౌలు గారు పలుకుతున్నారు.
కాబట్టి మనము ఇక శరీరానికి భానిసలము కాము. ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించమని కోరుతున్నారు. 
13 వ వచనంలో మనము శరీరాను సారంగా జీవిస్తే, మనం మరణిస్తాం. ఆత్మచే జీవిస్తే మరణించినను జీవిస్తాము అని అంటున్నారు. 
ఎందుకంటే ఒక సందర్భంలో పౌలుగారు ఈవిధంగా పలుకుతున్నారు మన హృదయాలు దేవుని ఆలయాలు కాబట్టి దేవుడు మనలో ఉన్నప్పుడు మనము కూడా దేవుడివలె జీవించాలని మనకు తెలియచేస్తున్నారు. 
చివరిగా ఈ మూడు పఠనాలు మనందరినీ కూడా సువిశేషంలో క్రీస్తు ప్రభువు బోధించిన విధంగా 29 వ వచనం . సాధుశీలుడుగను, వినమ్ర హృదయము కలిగి జీవించాలి అప్పుడే మన ఆత్మలకు శాంతి లభిస్తుంది.
మత్తయి 5 : 5  వినమ్ర హృదయులు ధన్యులు, వారు భూమికి వారసులు అగుదురు.
మత్తయి 5 : 9 శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు.
కాబట్టి మనందరం కూడా క్రీస్తు వాలే శాంతి స్థాపకులుగా, మన కుటుంబాలలో , మన సంఘాలలో ఒక నిర్మలమైన జీవితాన్ని జీవించుదాం

Fourteenth Ordinary Sunday

FOURTEENTH ORDINARY SUNDAY
Zechariah 9: 9-10, 
Romans 8: 9, 11-13, 
Mathew 11: 25-30
                                 Br. Subhash O.C.D

The First Reading: The Messianic Declaration: The King of Peace Comes to Reign
Babylon captured the Hebrews and took them to their home land as slaves, where the people of the Lord lived in exile. The history says that God did allow the Babylonians to invade, conquer and destroy the southern kingdom, including its capital Jerusalem (587 BC). Because people have forgotten the Lord and his great deeds, so in order to bring them back he did punish the Hebrews. And many Judahites and the Benjamites were taken to Babylon.
But eventually God in his mercy remembering his oath to David and his ancestors, he used the Medes and Persians to conquer the Babylon so that the Hebrews may return to their home (538 BC).
After this exile there was no king in both the kingdoms, although the Israelites were independent, the Mede- Persians Greece and Romans had the major powers. During this time
Prophet Zechariah proclaims the word of God. To the people of Israel.
Prophet Zechariah is contemporary to the prophet Haggai. Both of them encouraged the Israelites to rebuilt the temple.
So, the first reading is the messianic prophecy. Where prophet Zechariah announces to the despair people of Israel. And the lord promised that he would protect his people. And he is going to come or establish his kingdom among men. A spiritual kingdom a deliverance and salvation of the Jews or Hebrews which was typical redemption by Jesus Christ.
We see vs. 9. God declaring joy to the people of Zion and Jerusalem. Also, the establishment of his kingdom among men. A kingdom peace, not of authority and power. We also notice that the king comes riding on donkey. Here the donkey was thought of as a lowly beast or animal. And great and important men rode them.
 Jair, the seventh judge of Israel (1126 – 1104 B.C.), succeeded Tola, who ruled Israel for 23 years until his death. He had thirty sons who rode thirty ass colts or donkeys and controlled thirty towns in Gilead, which were called Havvoth Jair.
 Great king Solomon 1kings 1: 33,
 The sons of king David mounted their mules and fled 2 Samuel 13: 29,
 Absalom rode upon a mule, 18: 9.
Here the donkey is referred to meek and lowly. The king who come on it is the king of establishes peace on earth.
Vs 10. He will cut of the chariots; chariots symbolize the power and authority. So, cutting of chariots means destroys the power and authority.
Throw off the horses; horses’ symbol of readiness to fight or to wage war. Now God says that he would throw off the horses that means no war, the enmity is destroyed.
Battle is cut of God says; usually battle is the symbol of war and bloodshed and death and enmity. Now God says he cuts of battle, which means peace is declared, no bloodshed, no death, no enmity.
Gospel
Vs. 25-27. In this verse we see Jesus praises his Father. Which shows the relationship between the Heavenly Father and Jesus Christ. Also, the words like “these things” (refers to the mission of Jesus), “the wise” (the Rabbis and wise men of Israel, the pharisees and Scribes, because they rejected the son of man) “little children” this does not mean that Jesus is referring to age or to new-born children. But he is referring to the meek and humble people, the simple people we accepted Jesus as the Messiah, as the son of God.
Jesus is referring to the people all who trust in God alone, who depend on God, who are simple like child, meek and humble. (blessed are the meek for they will inherit the earth Mt: 5:5).
The great learned men did not welcome Jesus but the simple people welcomed and accepted him.
Jesus tells the Jews who are in power and authority, and to those who reject Christ as the son of God, they rejected the works of Jesus that he did on the sabbath day.
For what use if people may be wise as Solomon but if they have no simplicity, innocence, trust, child like heart they reject God like the Jews. Because the Jews and the Rabbis rejected Jesus. That is why Jesus is condemning their attitude and intellectual pride and power.
Vs 28-30 these words to the desperate people who trying to find God. For those people who are weary and despair in their lives. Promising rest and peace.
Jesus says “come to me I will give you rest”. It is an invitation for all who are exhausted in search of rest, peace, consolation, love, joy and etc.
 St. Augustine says; “my heart is restless until it rests in you”.
Here we need to aware that the Jews religion is full of rules and regulations according to their convenience. The authorities over burden the simple people and even they don’t put their finger to help them, such was the cruel situation of the Jews authorities.
They ask over taxes from the people, they don’t take care of the poor people, they object Jesus who gives life on the sabbath days or heals on the sabbath days. They reject good, instead of doing good.
Now Jesus invites people saying come to me I give rest, carry my yoke, my burden is light.
What does it mean the law of Jews was over burden, because of above mentioned things. The law of taking revenge, we this in Exodus 21, the concept of reciprocal justice, the social equals; “life for life, eye for eye, tooth for tooth, hand for hand, foot for foot, burn for burn, wound for wound, stripe for stripe”.
But Jesus law is love enemy and pray for them. Jesus carried the yoke of humiliation, suffering, cross and death. This was a burden of love, which is easier for the loved ones. That is why if we love, then we don’t feel it heavy or burden.
Second Reading
We see St. Paul saying that the spirit of the Lord is in us. Therefore, we are no more slaves for sin, for flesh. But we should live by the spirit of the Lord.
Vs. 13 we see that “if you live according to the Flesh you will die, in spirit also. But if you live in spirit of Christ, though we die, we live.
Whoever does not live by the spirit of Christ, does not belong to Christ. That is St. Paul also says “we are the temple of the Lord; our bodies are the dwellings of the Spirit of the Lord.”
So, Christ lives in us. Therefore, God also lives in us. Therefore, we belong to God and we belong to Jesus Christ.
So we need to live like Christ. Sharing his love to one another.

1, జులై 2023, శనివారం

13 వ సామాన్య ఆదివారం

 13 వ సామాన్య ఆదివారం


2రాజులు 4: 8-11, 14-16

రోమా 6: 3-4, 8-11

మత్తయి 10: 37-42


ఈనాటి  దివ్య గ్రంథ పఠనాలు దేవుని యొక్క సేవ చేసేటటువంటి వారి యొక్క జీవితమును గురించి తెలియజేయబడుతున్నాయి. దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి సువార్త సేవకులు,దేవుడిని ప్రేమిస్తూ, పొరుగు వారిని ప్రేమిస్తూ దేవునికి సాక్ష్యం ఇస్తూ జీవించాలి. సువార్త సేవకులు కూడా ఒక త్యాగపూరితమైన జీవితం జీవించాలి అనే అంశము గురించి కూడా ఈనాటి దివ్య ప ఠణనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. దేవుని శిష్యులుగా ఉండాలి అంటే వారి జీవితంలో అనేక రకాలైన త్యాగాలు చేయాలి.

ఈనాటి మొదటి పఠనంలో దేవుని యొక్క ప్రవక్త అయిన ఎలిషాకు షునేము పట్టణంలో ఉన్న ఒక సంపన్నురాలు ఆతిథ్యం ఇచ్చినటువంటి విధానం మనం తెలుసుకుంటున్నాం. ఎలీషా ప్రవక్త దేవుని యొక్క సేవకుడని గుర్తించి తాను చేసేటటువంటి పరిచర్యకు షునేము పట్టణంలో ఉన్న సంపన్నురాలు సహకరించింది. ఈమె ఎలీషాకు ఆహ్వానం ఇచ్చి ఆతిథ్యమిచ్చి స్వయంగా తన యొక్క ఇంటి మీదనే అతని కొరకు బస చేయుటకు ఒక గదిని నిర్మించి దానిలో ఒక మంచాన్ని, బల్లను, కుర్చీని, దీపాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంపన్నురాలు దేవుని యొక్క రక్షణ కార్యములో తన వంతు సహకారం తాను చేస్తుంది. ఈ సంపన్నురాలు దేవుని యందు అచంచల విశ్వాసం కలిగినటువంటి ఒక వ్యక్తి. దేవుడు తనకిచ్చినటువంటి వరాల ద్వారా ఇతరులకు సహాయం చేస్తుంది. దేవుని యొక్క పని కోసం తనకు సాధ్యమైన విధంగా ఆమె ఎలీషాకు భోజనం పెట్టి, వారి యొక్క బాగోగులను చూసుకున్నారు. ఆమె యొక్క మంచితనమును, ప్రేమను, విశ్వాసమును చూసిన ఎలీషా ప్రవక్త ఈ విశ్వాసికి కృతజ్ఞత తెలపాలి అని భావించారు దానికి గాను తన కుటుంబంలో సంతానం లేదని తన శిష్యుడైన గెహాజీ ద్వారా తెలుసుకొని వారికి సంతాన వరమును ప్రసాదించారు. ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనం గ్రహించవలసిన సత్యమేమిటంటే ఇతరులకు మేలు చేస్తే ఆ మేలు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడు ఎవరి రూపాన ఏ అవసరంలో మన కుటుంబాన్ని సందర్శిస్తారు తెలియదు కాబట్టి వచ్చినటువంటి వారిని ప్రేమతో స్వీకరిస్తూ వారికి సాధ్యమైన విధంగా మంచి చేస్తే అది ఒక గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. అదేవిధంగా ఏ కుటుంబం అయితే దేవుని యొక్క సేవకులను గుర్తించి వారికి పరిచర్య చేస్తూ వారిని బాధ పెట్టకుండా మంచిగా చూసుకుంటారో ఆ కుటుంబము ఎల్లప్పుడూ కూడా దీవించబడుతుంది. క్రీస్తు ప్రభువై స్వయముగా తన శిష్యులతో అంటున్నారు మేము స్వీకరించిన వారు నన్ను స్వీకరిస్తారు అలాగే నన్ను పంపిన వారిని కూడా స్వీకరిస్తారని. ఈ సంపన్నురాలు కేవలము ఎలిషాను మాత్రమే కాదు తన ఇంటికి ఆహ్వానించింది స్వయముగా దేవుడిని తన ఇంటిలోనికి ఆహ్వానించింది అందుకనే ఆమె కుటుంబంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నారు భర్త వృద్ధుడైనప్పటికిని వారు చేసినటువంటి మంచి పనికి గాను దేవుడు అసాధ్యమైన కార్యం సుసాధ్యం చేస్తున్నారు వారు ఆయన ఎడల గొప్ప ప్రేమను చాటి చెప్పారు అందుకే దేవుడు వారిని దీవించారు. ఈ సంపన్నురాలు ఎలీషా ప్రవక్తకు ప్రత్యక్షంగా సువార్త సేవకు సహకరించకపోయినప్పటికీ పరోక్షంగా ఆమె సహకరించారు అలాగే మనం కూడా సువార్త సేవకులకు సహకరించాలి.

రోమీ-12:13

హెబ్రి-13:2

1పేతు-1:4-9

ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు మనందరం కూడా క్రీస్తు నందు జ్ఞాన స్నానం పొందినట్లయితే క్రీస్తు మరణం మందు జ్ఞాన స్నానము పొందుతామని మనందరికీ కూడా గుర్తు చేస్తున్నారు. క్రీస్తుతో మరణించుట అంటే మనం కూడా మన యొక్క పాపములకు మరణించి ఒక కొత్త జీవితమును జీవించాలి అప్పుడే మన యొక్క జీవితమునకు సరియైనటువంటి అర్థం ఉంటుంది. ఏ విధముగానయితే క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం ఒక కొత్తదనము తీసుకుని వచ్చినదో అదే విధముగా మనము కూడా క్రీస్తుతో మన యొక్క పాపములకు మరణించినట్లయితే ఒక పవిత్రమైన, కొత్తదైన, సంతోషకరమైనటి జీవితం జీవించవచ్చు అదియే పునీత పౌలు గారు మనకు తెలియచేసే అంశం.

ఈనాటి సువిశేష పట్టణంలో ఏసుప్రభు యొక్క శిష్యులకు ఉండవలసినటువంటి కొన్ని లక్షల గురించి మత్తయి సువార్తికుడు మనకు తెలియచేస్తున్నారు ప్రభు యొక్క శిష్యులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అన్నిటికంటే దేవుడిని ఎక్కువగా దేవుడిని ఎక్కువగా ప్రేమించడం అంటే తమ యొక్క జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చుటయే. ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద కాకుండా వ్యక్తుల మీద కాకుండా ప్రేమ నంతయు దేవుని మీద చూపించినప్పుడే మనం గొప్ప సాక్షి పూరిత జీవితం జీవిస్తున్నాం. చాలా సందర్భాలలో మనందరం కూడా ఈ లోకంలో ఉన్న వ్యక్తులను వస్తువులను ప్రేమిస్తుంటాం వాటికే ప్రాధాన్యతనిస్తుంటా కానీ ఏసుప్రభు ఎవరైతే తన శిష్యులుగా ఉండాలి అనుకుంటున్నారో వారు మొట్టమొదటిగా తమ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలుపుచున్నారు. ఎందుకంటే దేవుడే వారిని తన ముఖ పోలికలో సృజించారు, వారిని దీవించారు ఎన్నుకున్నారు. కాబట్టి వారు తమ జీవితంలో అన్నిటికన్నా దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తూ ప్రాధాన్యతనిస్తూ జీవించాలి. దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వటం ద్వారా  వారు దేవుని యొక్క కుటుంబంలో భాగస్తులు అవుతారు.

రెండవ లక్షణం- ఏసుప్రభు యొక్క శిష్యులుగా ఉండాలి అంటే వారికి ఉండవలసిన రెండవ లక్షణం ఏమిటంటే తమ శిలువను తాము ఎత్తుకొని దేవుడిని వెంబడించాలి. యూదుల నమ్మకం ప్రకారం సిలువ శిక్ష అనేది అతిపెద్ద తప్పిదం చేసిన వారికి వేసేటటువంటి శిక్ష అయితే ఈ సిలువ యూదులకు అవమానంగా ఉన్నది కానీ క్రీస్తు ప్రభువు తన శిష్యులకు నేర్పిన విషయం ఏమిటంటే సిలువను ఎత్తుకొని రావటం అంటే వారి జీవితంలో గొప్ప క్షమించే గుణమును కలిగి ఉండటం, అవమానాలు భరించటం, నిందలు మోయటం. సిలువను ఎత్తుకొని రావటం అంటే బాధలు కష్టాలు సమస్యలు అన్నిటిని కూడా ప్రేమతో భరించుకొని స్వీకరించుకొని క్రీస్తు ప్రభువును వెంబడించుట అలాగే సిలువను ఎత్తుకొని ఏసుక్రీస్తును అనుసరించడం అంటే సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుడిని వెంబడించుటయే. వీటన్నిటినీ చేకొని క్రీస్తు ప్రభువుని అనుసరించాలి. చాలా సందర్భాలలో మనము సిలువను తృణీకరిస్తాం కానీ క్రీస్తు ప్రభువు మనందరినీ కూడా సిలువను ఎత్తుకొని తనను అనుసరించమన్నారు అనగా ఈ క్షమించే గుణములు కలిగి అవమానాలు భరించి అలాగే సమస్తమును త్యజించుకొని క్రీస్తు ప్రభువుని అనుసరించాలి.

మూడో లక్షణం-దేవుని కొరకు మన జీవితములను కోల్పోవుట మనం కలిగి ఉండాలి. మన జీవితంలో మన యొక్క స్వార్ధపు ఆలోచనలకు కాకుండా స్వార్థపు జీవితం కాకుండా మన కొరకు మనము జీవించకుండా క్రీస్తు కొరకు జీవించాలి అప్పుడే ఆ జీవితమునకు సరియైనటువంటి అర్థం ఉంటుంది. పునీతులు ఈ లోకంలో జీవించినప్పుడు తమ కొరకు తాము జీవించకుండా ఇతరుల కొరకు దేవుని కొరకు జీవించిన విధంగా మనం కూడా దేవుని కొరకు జీవించాలి.

దేవుని యొక్క సేవ చేసేటటువంటి వారికి తగినటువంటి ప్రతిఫలం దొరుకుతుందని యేసు క్రీస్తు ప్రభువు ముందుగానే తెలియజేస్తున్నారు. అలాగే ఎవరైతే దేవుని యొక్క సేవకులు వీరు అని గుర్తించి వారిని ఆదరించి మంచిగా చూసుకుంటారు వారి ఎల్లప్పుడూ కూడా దీవించబడుతుంటారు. కాబట్టి దేవుని యొక్క సేవకులను గుర్తించి వారికి మంచిని చేస్తూ మనం కూడా దేవుని యొక్క సువార్తలో భావిస్తులై జీవించుదాం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సువార్త సేవ చేసే వారికి మన వంతు సహాయం మనం చేద్దాం.

ఈనాటి పరిశుద్ధ దివ్య గ్రంథ పఠనాలు దేవుని యొక్క సేవ చేసేటటువంటి వారి యొక్క జీవితమును గురించి తెలియజేయబడుతున్నాయి. దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి సువార్త సేవకులు,దేవుడిని ప్రేమిస్తూ, పొరుగు వారిని ప్రేమిస్తూ దేవునికి సాక్ష్యం ఇస్తూ జీవించాలి. సువార్త సేవకులు కూడా ఒక త్యాగపూరితమైన జీవితం జీవించాలి అనే అంశము గురించి కూడా ఈనాటి దివ్య ప ఠణనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. దేవుని శిష్యులుగా ఉండాలి అంటే వారి జీవితంలో అనేక రకాలైన త్యాగాలు చేయాలి.

ఈనాటి మొదటి పఠనంలో దేవుని యొక్క ప్రవక్త అయిన ఎలిషాకు షునేము పట్టణంలో ఉన్న ఒక సంపన్నురాలు ఆతిథ్యం ఇచ్చినటువంటి విధానం మనం తెలుసుకుంటున్నాం. ఎలీషా ప్రవక్త దేవుని యొక్క సేవకుడని గుర్తించి తాను చేసేటటువంటి పరిచర్యకు షునేము పట్టణంలో ఉన్న సంపన్నురాలు సహకరించింది. ఈమె ఎలీషాకు ఆహ్వానం ఇచ్చి ఆతిథ్యమిచ్చి స్వయంగా తన యొక్క ఇంటి మీదనే అతని కొరకు బస చేయుటకు ఒక గదిని నిర్మించి దానిలో ఒక మంచాన్ని, బల్లను, కుర్చీని, దీపాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంపన్నురాలు దేవుని యొక్క రక్షణ కార్యములో తన వంతు సహకారం తాను చేస్తుంది. ఈ సంపన్నురాలు దేవుని యందు అచంచల విశ్వాసం కలిగినటువంటి ఒక వ్యక్తి. దేవుడు తనకిచ్చినటువంటి వరాల ద్వారా ఇతరులకు సహాయం చేస్తుంది. దేవుని యొక్క పని కోసం తనకు సాధ్యమైన విధంగా ఆమె ఎలీషాకు భోజనం పెట్టి, వారి యొక్క బాగోగులను చూసుకున్నారు. ఆమె యొక్క మంచితనమును, ప్రేమను, విశ్వాసమును చూసిన ఎలీషా ప్రవక్త ఈ విశ్వాసికి కృతజ్ఞత తెలపాలి అని భావించారు దానికి గాను తన కుటుంబంలో సంతానం లేదని తన శిష్యుడైన గెహాజీ ద్వారా తెలుసుకొని వారికి సంతాన వరమును ప్రసాదించారు. ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనం గ్రహించవలసిన సత్యమేమిటంటే ఇతరులకు మేలు చేస్తే ఆ మేలు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడు ఎవరి రూపాన ఏ అవసరంలో మన కుటుంబాన్ని సందర్శిస్తారు తెలియదు కాబట్టి వచ్చినటువంటి వారిని ప్రేమతో స్వీకరిస్తూ వారికి సాధ్యమైన విధంగా మంచి చేస్తే అది ఒక గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. అదేవిధంగా ఏ కుటుంబం అయితే దేవుని యొక్క సేవకులను గుర్తించి వారికి పరిచర్య చేస్తూ వారిని బాధ పెట్టకుండా మంచిగా చూసుకుంటారో ఆ కుటుంబము ఎల్లప్పుడూ కూడా దీవించబడుతుంది. క్రీస్తు ప్రభువై స్వయముగా తన శిష్యులతో అంటున్నారు మేము స్వీకరించిన వారు నన్ను స్వీకరిస్తారు అలాగే నన్ను పంపిన వారిని కూడా స్వీకరిస్తారని. ఈ సంపన్నురాలు కేవలము ఎలిషాను మాత్రమే కాదు తన ఇంటికి ఆహ్వానించింది స్వయముగా దేవుడిని తన ఇంటిలోనికి ఆహ్వానించింది అందుకనే ఆమె కుటుంబంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నారు భర్త వృద్ధుడైనప్పటికిని వారు చేసినటువంటి మంచి పనికి గాను దేవుడు అసాధ్యమైన కార్యం సుసాధ్యం చేస్తున్నారు వారు ఆయన ఎడల గొప్ప ప్రేమను చాటి చెప్పారు అందుకే దేవుడు వారిని దీవించారు. ఈ సంపన్నురాలు ఎలీషా ప్రవక్తకు ప్రత్యక్షంగా సువార్త సేవకు సహకరించకపోయినప్పటికీ పరోక్షంగా ఆమె సహకరించారు అలాగే మనం కూడా సువార్త సేవకులకు సహకరించాలి.

రోమీ-12:13

హెబ్రి-13:2

1పేతు-1:4-9

ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు మనందరం కూడా క్రీస్తు నందు జ్ఞాన స్నానం పొందినట్లయితే క్రీస్తు మరణం మందు జ్ఞాన స్నానము పొందుతామని మనందరికీ కూడా గుర్తు చేస్తున్నారు. క్రీస్తుతో మరణించుట అంటే మనం కూడా మన యొక్క పాపములకు మరణించి ఒక కొత్త జీవితమును జీవించాలి అప్పుడే మన యొక్క జీవితమునకు సరియైనటువంటి అర్థం ఉంటుంది. ఏ విధముగానయితే క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం ఒక కొత్తదనము తీసుకుని వచ్చినదో అదే విధముగా మనము కూడా క్రీస్తుతో మన యొక్క పాపములకు మరణించినట్లయితే ఒక పవిత్రమైన, కొత్తదైన, సంతోషకరమైనటి జీవితం జీవించవచ్చు అదియే పునీత పౌలు గారు మనకు తెలియచేసే అంశం.

ఈనాటి సువిశేష పట్టణంలో ఏసుప్రభు యొక్క శిష్యులకు ఉండవలసినటువంటి కొన్ని లక్షల గురించి మత్తయి సువార్తికుడు మనకు తెలియచేస్తున్నారు ప్రభు యొక్క శిష్యులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అన్నిటికంటే దేవుడిని ఎక్కువగా దేవుడిని ఎక్కువగా ప్రేమించడం అంటే తమ యొక్క జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చుటయే. ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద కాకుండా వ్యక్తుల మీద కాకుండా ప్రేమ నంతయు దేవుని మీద చూపించినప్పుడే మనం గొప్ప సాక్షి పూరిత జీవితం జీవిస్తున్నాం. చాలా సందర్భాలలో మనందరం కూడా ఈ లోకంలో ఉన్న వ్యక్తులను వస్తువులను ప్రేమిస్తుంటాం వాటికే ప్రాధాన్యతనిస్తుంటా కానీ ఏసుప్రభు ఎవరైతే తన శిష్యులుగా ఉండాలి అనుకుంటున్నారో వారు మొట్టమొదటిగా తమ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలుపుచున్నారు. ఎందుకంటే దేవుడే వారిని తన ముఖ పోలికలో సృజించారు, వారిని దీవించారు ఎన్నుకున్నారు. కాబట్టి వారు తమ జీవితంలో అన్నిటికన్నా దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తూ ప్రాధాన్యతనిస్తూ జీవించాలి. దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వటం ద్వారా  వారు దేవుని యొక్క కుటుంబంలో భాగస్తులు అవుతారు.

రెండవ లక్షణం- ఏసుప్రభు యొక్క శిష్యులుగా ఉండాలి అంటే వారికి ఉండవలసిన రెండవ లక్షణం ఏమిటంటే తమ శిలువను తాము ఎత్తుకొని దేవుడిని వెంబడించాలి. యూదుల నమ్మకం ప్రకారం సిలువ శిక్ష అనేది అతిపెద్ద తప్పిదం చేసిన వారికి వేసేటటువంటి శిక్ష అయితే ఈ సిలువ యూదులకు అవమానంగా ఉన్నది కానీ క్రీస్తు ప్రభువు తన శిష్యులకు నేర్పిన విషయం ఏమిటంటే సిలువను ఎత్తుకొని రావటం అంటే వారి జీవితంలో గొప్ప క్షమించే గుణమును కలిగి ఉండటం, అవమానాలు భరించటం, నిందలు మోయటం. సిలువను ఎత్తుకొని రావటం అంటే బాధలు కష్టాలు సమస్యలు అన్నిటిని కూడా ప్రేమతో భరించుకొని స్వీకరించుకొని క్రీస్తు ప్రభువును వెంబడించుట అలాగే సిలువను ఎత్తుకొని ఏసుక్రీస్తును అనుసరించడం అంటే సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుడిని వెంబడించుటయే. వీటన్నిటినీ చేకొని క్రీస్తు ప్రభువుని అనుసరించాలి. చాలా సందర్భాలలో మనము సిలువను తృణీకరిస్తాం కానీ క్రీస్తు ప్రభువు మనందరినీ కూడా సిలువను ఎత్తుకొని తనను అనుసరించమన్నారు అనగా ఈ క్షమించే గుణములు కలిగి అవమానాలు భరించి అలాగే సమస్తమును త్యజించుకొని క్రీస్తు ప్రభువుని అనుసరించాలి.

మూడో లక్షణం-దేవుని కొరకు మన జీవితములను కోల్పోవుట మనం కలిగి ఉండాలి. మన జీవితంలో మన యొక్క స్వార్ధపు ఆలోచనలకు కాకుండా స్వార్థపు జీవితం కాకుండా మన కొరకు మనము జీవించకుండా క్రీస్తు కొరకు జీవించాలి అప్పుడే ఆ జీవితమునకు సరియైనటువంటి అర్థం ఉంటుంది. పునీతులు ఈ లోకంలో జీవించినప్పుడు తమ కొరకు తాము జీవించకుండా ఇతరుల కొరకు దేవుని కొరకు జీవించిన విధంగా మనం కూడా దేవుని కొరకు జీవించాలి.

దేవుని యొక్క సేవ చేసేటటువంటి వారికి తగినటువంటి ప్రతిఫలం దొరుకుతుందని యేసు క్రీస్తు ప్రభువు ముందుగానే తెలియజేస్తున్నారు. అలాగే ఎవరైతే దేవుని యొక్క సేవకులు వీరు అని గుర్తించి వారిని ఆదరించి మంచిగా చూసుకుంటారు వారి ఎల్లప్పుడూ కూడా దీవించబడుతుంటారు. కాబట్టి దేవుని యొక్క సేవకులను గుర్తించి వారికి మంచిని చేస్తూ మనం కూడా దేవుని యొక్క సువార్తలో భావిస్తులై జీవించుదాం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సువార్త సేవ చేసే వారికి మన వంతు సహాయం మనం చేద్దాం.

Fr. Bala Yesu OCD

13 వ సామాన్య ఆదివారం

 

13 సామాన్య ఆదివారం

2రాజులు 4: 8-11, 14-16, రోమా 6: 3-4, 8-11, మత్తయి 10: 37-42

బ్రదర్. సుభాష్ .సి.డి.

మొదటి పఠనం: అతిథి దేవో భవా

షూనేము నగర సంపన్నురాలు ఎలీషా ప్రవక్తచే దీవించబడుట.

మొదటి పఠనంలో షూనేము నగర సంపన్నురాలు ఎలీషా ప్రవక్తని ఒక దైవ భక్తునిగా, దైవ సేవకునిగా, ఒక ప్రవక్తగ స్వీకరించింది, తన ఇంటిలోనికి ఆహ్వానించింది, మరియు అతిధి సత్కార్యాలు చేసింది.

దానికి ప్రతిఫలంగా ఆమె అడగకుండానే ప్రవక్త ఆమె కుటుంబాన్ని దీవించి సంతానం లేని ఆమె  ఒక కుమారినికి జన్మనిస్తుంది అని ఆమెను దీవించాడు.

ఎందుకు షూనేము సంపన్నురాలు దీవించబడింది?

ఎందుకంటే ఆమె దేవుని ప్రవక్తను ఆహ్వానించింది, ప్రవక్తలో ఉన్న దైవత్వాన్ని గుర్తించింది. అంతే కాకుండా ప్రవక్తకి, తన కుటుంబంలో ఒకడిగా భావించి, ఒక గదిని ఏర్పాటు చేసి, మంచము, బల్ల, కుర్చీ మరియు దీపమును ఏర్పాటు చేసింది. ప్రవక్తకు అవసరమైనవన్నీ సమకూర్చింది. విందును ఏర్పాటు చేసి వారికి అతిథి సత్కార్యాలు చేసారు.

ఇంకా ఉదాహరణలుగా చెప్పాలంటే

l అబ్రాహాము మరియు సారా దంపతులు ముగ్గురు దేవదూతలు ఆహ్వానించారు, అందుకు గాను దేవదూతలు దేవుని ఆశీర్వాదాన్ని కుమారుని రూపంలో దీవిస్తున్నారు.

l అబ్రాహాము సోదరుడు లోతు కూడా దేవదూతలు ఆహ్వానించారు, దేవుడు దేవదూతలద్వారా లోతు కుటుంబాన్ని రక్షించారు.

l సెరఫాత్ విధవరాలు కూడా ఏలీయా ప్రవక్తకి ఆహరం అందించి అతిథి సత్కార్యాలు చేసింది దేవుని దీవెనలు పొందుకుంది.

వీరందరూ కూడా దేవుని సేవకులను స్వీకరించారు, దేవునికి ప్రీతి కలిగించి, వారు అడగకుండానే అద్భుతాలు చూసారు.

మొదటి పఠనంలో మనం చూస్తే, షూనేము నగర సంపన్నురాలు నుండి మనము కొన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకోవచ్చు. అవి;

మొదటిగా  దైవ సేవకులను ఆహ్వానించాలన్న కోరిక, ఉదారస్వభావం, దైవ భక్తి , అనే లక్షణాలను మనము నేర్చుకోవచ్చు

మరి రెండవదిగా ఎలీషా ప్రవక్త ఒక ఆశీర్వాదంగా మారడాన్ని మనం గమనించవచ్చు.

కాబట్టి ఎలీషా ప్రవక్త వలే దైవ సేవకులు కూడా, పవిత్ర జీవితాన్ని జీవిస్తే , వారిలో కూడా ప్రజలు దైవత్వాన్ని చూడాలి, సంపన్నురాలి వలే , ఇతడు దేవుని సేవకుడు అని ఇతరులకు చాటి చెప్పాలి. మరియు దైవ సేవకులు కూడా  ప్రజలను దీవించే విధంగా, ఒక ఆశీర్వాదంగా ఉండాలి. దేవుని ప్రతిరూపాలుగా ఉండాలి.

రెండవ పఠనం : క్రీస్తు అనబడే ఆశీర్వాదం ద్వారా మనకు నూతన జీవితం

పునీత పౌలు గారు, రెండవ పఠనంలో క్రీస్తుప్రభుని ఒక ఆశీర్వాదంగా మనకు చూపిస్తున్నారు. ఎందుకంటే క్రీస్తు ద్వారా మనము దేవుని బిడ్డలుగా పిలవబడుతున్నాం. జన్మ పాపంతో ఉన్న మానవాళికి, జ్ఞాన స్నానంద్వారా దేవుడు నూతన జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు. జ్ఞాన స్నానంద్వారా , పవిత్రాత్మ మనపైకి వేంచేసి, దేవుని సాన్నిధ్యాన్ని మనలో నింపుకుంటున్నాం. నిత్యజీవితాన్ని పొందుకుంటున్నాం.

 క్రీస్తు మరణంలో భాగస్తులమై, పాపాన్ని విడిచిపెట్టి,  ఆయన ఉత్తానములో మనము పాపము అనే మరణమును కూడా జయించాము అని, ఆయన మరణ పునరుత్తానములోనే మనకు రక్షణ అని పునీత పౌలు గారు రెండవ పఠనంలో తెలియ చేస్తున్నారు.  

రోమా: 8 : 1-3 . వచనంలో మనం చూస్తున్నాం, " 1. క్రీస్తు యేసుతో ఏకమై జీవించువారికి ఇప్పుడు దండనయు లేదు. 2. ఏలయన, క్రీస్తు యేసుతో మనకు జీవమిచ్చెడి ఆత్మ యొక్క చట్టము, పాపమును మృత్యువును కలిగించు చట్టము నుండి నాకు విముక్తిని ప్రసాదించెను. 3. మానవ స్వభావము బలహీనమైనందున ధర్మ శాస్త్రము చేయజాలని దానిని, దేవుడు చేసెను. తన కుమారుని పంపుట ద్వారా మానవ ప్రకృతి యందలి పాపమును ఆయన ఖండించెను. కుమారుడు పాపమును తొలగించుటకై మానవుని పాప స్వభావం వంటి స్వభావంతో వచ్చెను."

కాబట్టి క్రీస్తు ప్రభువు మానవాళి నంతటికి ఒక అనుగ్రహముగా, ఒక ఆశీర్వాదముగా లోకానికి దేవునిచేత పంపబడ్డారు.

సువిశేషము

మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపినవానిని స్వీకరించుచున్నాడు. నా శిష్యుడని చిన్నవారిలో ఒకనికి ఎవడేని ఒక గ్రుక్కెడు మంచి నీరొసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

అంటే మనము దైవ సేవకులను స్వీకరించాలి వారికి ఆతిధ్యమివ్వాలని ప్రభువు పలుకుతున్నారు.

క్రీస్తును స్వీకరించినవారు ఆయన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్టే. (యోహాను 10:30). క్రీస్తు శిష్యులను స్వీకరించినవారు క్రీస్తును స్వీకరించినట్టే. శిష్యులు క్రీస్తు పంపిన  ప్రతినిధులు. (మత్తయి10: 1-42), (అపో. కార్యములు 9:1-5). మనం దీన్ని నిజంగా విశ్వసిస్తే క్రీస్తు శిష్యులకు సహాయం చేసేందుకు వెనుకంజ వేయము.

ఎందుకు క్రీస్తు ప్రభువు మాటలు పలుకుతున్నాడు ?

గర్వంతో ఉన్న కొంతమంది యూదా ప్రజలను మరియు క్రీస్తుని, ఆయన శిష్యులని అంగీరించని వారిని ఉద్దేశించి మాటలను పలుకుతున్నాడేమో.

సాధారణంగ యూదా ప్రజలు, వారు దేవుని చే ఎన్నుకొబడ్డవారని, రక్షణ వారికి మాత్రమేనని, క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు కాదని, యూదులకు వ్యతిరేకంగా ఉన్నాడని, యూదా ప్రజలు క్రీస్తుని తిరస్కరించారు. దేవుని రక్షణకు దూరమవుతున్నారు.

వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెపుతున్నారు, కానీ క్రీస్తుని గుర్తించుటలేదు, ద్వేషిస్తున్నారు. అంతేకాక వారు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నాం అంటున్నారు, పొరుగు వారిని ప్రేమించటం లేదు. ఆపదలలో, పేదరికంలో ఉన్న సహోదరులను తిరస్కరిస్తున్నారు, పాపాత్ములు అంటున్నారు.

అందుకు గాను మత్తయి సువార్తికుడు క్రీస్తు ప్రభువు యూదా ప్రజలను, వారి కఠినత్వాన్ని  ఉద్దేశించి, మాటలను పలికారని తెలియచేస్తున్నారు.

ఉదాహరణకు

·       జక్కయ్య క్రీస్తు ప్రభుని ఆహ్వానించారు, విందును ఏర్పాటు చేసి, అతిధి సత్కార్యాలు చేసాడు. దేవుని రక్షణను పొందాడు .

·       శతాధిపతి క్రీస్తుని ఆహ్వానించారు, ఒక్క మాటతో నే తన సేవకుడు స్వస్థత పొందాడు.

·       పేతురు క్రీస్తుని విందునకు  ఆహ్వానించాడు, జ్వరంతో భాదపడుతున్న ఆయన అత్తకు స్వస్థత కలిగింది.

నాటి సువిశేషములో చూస్తున్నాం, "37. తన తండ్రినిగాని, తల్లినిగాని నా కంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారునిగాని, కుమార్తెనుగాని, నా కంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. 38. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరించువాడు నాకు యోగ్యుడు కాడు."

గురువులు కన్యాస్త్రీలు, దైవ సేవకులు, వారి కుటుంబాలను, బంధువులను, సన్నిహితులను, మరియు లోకపు జీవితాన్ని కూడా త్యాగం చేసి, దేవుని  సేవకై, దేవుని  వాక్యాన్ని ప్రజలకు భోధించుటకై, వారు సుమారు 14 లేదా 15 సంవత్సరాల పాటు శిక్షను పొంది వస్తున్నారు. వారు దేవునిచే ఎన్నుకోబడి అభిషక్తులయ్యారు.  కేవలం ప్రజలకి దేవుని ఆశీర్వాదాలు ఇవ్వడానికి, దేవుని రూపంలో ప్రజలను దీవించడానికి. అలాంటివారిని మనందరం కూడా గౌరవించాలి, ఆదరించాలని, నాటి మూడు పఠనాలు మనకు తెలియచేస్తున్నాయి.

కావునా, మనంకూడా క్రీస్తుని, వాక్యరూపములో, ప్రార్థన రూపంలో, గురువులు, దైవ సేవకుల రూపములో , మన జీవితాలలోకి , మన కుటుంభాలలోకి ఆహ్వానించాలి.

అప్పుడే మనలో ఉన్నటువంటి భాదలు, సమస్యలు తీసివేసి మనలను మనకుటుంబాలను ఆశీర్వదిస్తారు. మనము క్రీస్తుని ఆహ్వానించకపోతే ఎటువంటి మేలులు దీవెనలు పొందుకోలేము.

అధేవిధంగ దైవ సేవకులు కూడా ప్రజలకు, నిజంగా దైవ సేవకులు అనిపించేలా జీవించాలి .  షూనేము నగర సంపన్నురాలివలె " ఇతనిలో దేవుడున్నాడు, దైవభక్తుడు" అని ఇతరులకు చాటిచెప్పే విధంగా ఉదాహరణ జీవితాన్ని జీవించాలి. దేవుని ఆశీర్వాదాన్ని ప్రజలకు ఇచ్చే మధ్యవర్తిగా వ్యవహరించాలని, పఠనాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. కావున మనందరం కూడా షూనేము నగర సంపన్నురాలివలే  దైవ భక్తితో, దైవ సేవకులను, మనకుటుంబాలలోకి, ఎలాంటి కుల, మత, భేదాభిప్రాయాలు లేకుండా ఆహ్వానిద్దాం, వారిని కూడా మనకుటుంబములో ఒకరిలా చూసుకుంటూ, గురువులు, దైవ సేవకుల ద్వారా  దేవుని దీవెనలు పొందుదాం.

 

మార్కు 6 : 14 – 29

 February 07 హెబ్రీ 13 : 1 - 8 మార్కు 6 : 14 – 29 ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో ను...