1, జూన్ 2024, శనివారం

పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తముల పండుగ

పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తముల పండుగ 

ఈనాడు తల్లి శ్రీ సభ ఏసుక్రీస్తు దివ్య శరీర రక్తముల పండుగను కొనియాడుచున్నది. ఈ పండుగ దేవుని యొక్క నిజమైన సాన్నిద్యం దివ్యసప్రసాదంలో ఉన్నది అని తెలుపుచున్నది. ఈ పండుగ 13వ శతాబ్దంలో జూలియానా అనేటటువంటి భక్తిపరురాలు తనకు కలిగినటువంటి దర్శనం ద్వారా అప్పటి 4 వ ఉర్బన్ పాపుగారు తెలియజేసి ఈ పండుగ అధికార పూర్వకంగా ప్రపంచమంతా జరుపుకోవాలని ప్రకటించారు. ఈ యొక్క పండుగ మూడు విశ్వాస సత్యాలను మనకు నేర్పిస్తుంది. 
1. నిజ దేవుడు నిజమానవుడైన యేసు క్రీస్తు ప్రభువు మన కొరకు భూమికి దిగి రావటం. మన కొరకు తన శరీర రక్తములను ఆహారముగా ఇచ్చుట. 
2. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలతో జీవిస్తారు ఈ యొక్క దివ్య సత్ప్రసాదం ద్వార.
3. దేవుని యొక్క సాన్నిద్యాన్ని ప్రతిరోజు దివ్యబలి పూజ ద్వారా అనుభవించుట.
 ఏసుప్రభు మరణించే ముందు మనందరికీ కూడా ఇచ్చినటువంటి రెండు విలువైన కానుకలు ఆయన యొక్క శరీర రక్తములు. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండటానికి ఆయన యొక్క శరీర రక్తములను మనకు ఒసగి ఉన్నారు.
 ఈనాడు మనందరం కూడా ప్రత్యేక విధముగా ధ్యానించవలసినటువంటి అంశము ఏమిటి అంటే దివ్య సత్ప్రసాదం యొక్క గొప్పతనం. దివ్య సత్ప్రసాదం ద్వారా దేవుడు అనేక అద్భుతములు చేసి ఉన్నారు. దివ్యసప్రసాదం శ్రీ సభకు ఉన్నటువంటి ఒక గొప్ప సంపద. ఎక్కడ ఎవరి దేవాలయానికి వెళ్లిన వారికి కేవలం దొరికేది దేవుని యొక్క ప్రసాదం మాత్రమే కానీ కతోలికలకు లభించేది ఏమిటి అంటే సాక్షాత్తు దేవుని యొక్క శరీర రక్తములు. స్వయముగా దేవుడే ప్రజల యొక్క హృదయంలోకి వేంచేస్తారు. చాలామంది పునీతులు దివ్య సత్ప్రసాదం యొక్క ఔన్నత్యం గురించి తెలియజేశారు. పునీత మదర్ తెరిసా గారు నేను ఇంతటి గొప్ప సేవ చేస్తున్నాను అంటే దానికి కారణము దివ్య సత్ప్రసాద నాధుడు నాకు శక్తిని ఇస్తున్నారు అని పలికారు. 
పునీత మరియా జాన్ వియాని గారు దివ్యసప్రసాదం గురించి తెలిపే సందర్భంలో ఈ విధంగా అంటున్నారు దివ్యసప్రసాదం స్వీకరించిన వ్యక్తి ఒక నీటి చలమ దగ్గర ఉండి ఆ నీటిని తనలోకి తీసుకోలేకుండా దాహంతో మరణించినవారి లాంటి వారు.
పునీత సిరిల్ గారు దివ్య సత్ప్రసాదం గురించి ఈ విధంగా అంటున్నారు దివ్య సత్ప్రసాదములో ఉన్న సజీవుడైన యేసును స్వీకరించిన వ్యక్తి సజీవుడుగా మారతాడు. 
పునీత్ అగస్టీను గారు అంటారు, దివ్య సత్ప్రసాదమును స్వీకరించిన వ్యక్తి క్రీస్తు వలే రూపాంతరం చెందుతారు. క్రీస్తు ప్రభువు యొక్క జీవితమే మన జీవితంగా మారుతుంది. పునీత పౌలు గారు పలికిన విధంగా ఇక నేను కాదు జీవించేది నాలో ఉన్న క్రీస్తే జీవిస్తారు (గలతి 2:20) అని అన్నట్టుగా మన జీవితం మారాలి. ఆయన వలే ప్రేమించాలి, ఆయన వలే క్షమించాలి, ఆయన వలె సహాయం చేయాలి ఇంకా ఆయన వలే మంచి లక్షణములు కలిగి జీవించాలి అప్పుడే మనందరం కూడా క్రీస్తు ప్రభువు వలే రూపాంతరం చెందిన వారంగా పిలవబడతాం.
దివ్యసత్రసాదం మనకు బలమును, జీవమును, అనుగ్రహమును దయ చేస్తుంది. దివ్య సత్ప్రసాదములో ఉన్న ఏసుప్రభు మనందరినీ ఆయన యొక్క శరీర రక్తములను భుజించమని తెలిపారు. యోహాను సువార్త 6:53 ఆయన యొక్క శరీర రక్తమును భుజించిన ఎడల మనలో జీవము ఉంటుంది అని తెలియజేశారు. అదేవిధంగా ప్రభువు శరీర రక్తములను స్వీకరించుట ద్వారా మన యందు దేవుడు దేవునియందు మనం ఐక్యమై జీవిస్తాము. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఆకాశము నుండి మన్నాను భుజించిరి కానీ వారు మరణించిరి కానీ ఏసుప్రభు తన యొక్క శరీర రక్తములను వసగుట ద్వారా వాటిని స్వీకరించిన మనము నిత్యము ప్రభువు నందు జీవిస్తాము.
ఇజ్రాయిల్ ప్రజలు మన్నా భుజించారు ఆ మన్నా కొలది కాలం మాత్రమే వారితో ఉన్నది కానీ ఏసుప్రభు ఇచ్చిన శరీర రక్తములు మనతో శాశ్వతంగా ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు మన్నాను భుజించి మరణించింరి కానీ ఆయన శరీర రక్తములు భుజించిన మనం నిత్యము జీవిస్తాము.
దివ్యసప్రసాదము ద్వారా క్రీస్తు తన యొక్క జీవితాన్ని మనందరికీ కూడా త్యాగం చేశారు మరి మనము కూడా మన యొక్క జీవితంలో త్యాగం చేస్తూ ఇతరులకు సంతోషమును దయచేయాలి. 
దివ్య సత్ప్రసాదం దేవుని యొక్క ప్రేమకు గుర్తు కాబట్టి మనము కూడా ప్రేమతో జీవించాలి. 
దివ్యసప్రసాదం ఐక్యతకు గురుతు కాబట్టి మనము కూడా ఐక్యంగా జీవించాలి.
Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

17వ సామాన్య ఆదివారం

2 రాజుల 4: 42-44, ఎఫేసి 4:1-6, యోహాను 6:1-15 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల యొక్క ఆకలిని సంతృప్తి పరచు విధానం గురించి తెలుపుచున్...