15, మార్చి 2025, శనివారం

తపస్సుకాలపు రెండొవ ఆదివారము

తపస్సుకాలపు రెండొవ ఆదివారము
ఆదికాండము 15:5-12, 17-18
ఫిలిప్పీయులు 3:17-4:1
లూకా 9:28-36

          క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ  దేవుని  దైవ భక్తులారా, ఈ రోజున మనమందరము తపస్సుకాలపు రెండవ  ఆదివారం లోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ నాటి మూడు పఠనలు కూడా మనం దేవుని విశ్వసించాలి, క్రీస్తును అనురించాలి మరియు ఆయన మాట వినాలి అని తెలియజేస్తున్నాయి ఎందుకంటే అలా చేయడం ద్వారా, మనం ఆయన వాగ్దానాలను పొందుతాము మరియు ఆయన మహిమలో పాలుపంచుకుంటాము అని క్లుప్తంగా వివరిస్తున్నాయి.
           మొదటి పఠనములో ఆదికాండము  నుండి చూస్తున్నాము ఇక్కడ అబ్రాహామునకు మరియు దేవునికి మధ్య ఒక ఒప్పందం గురించి తెలియజేస్తుంది. దేవుడు అబ్రామునకు ఆకాశంలోని నక్షత్రాలను చూపించి, అతని సంతానం ఆలాగే ఉంటుందని వాగ్దానం చేస్తున్నాడు. దానికి గాను అబ్రాము దేవునిపై విశ్వాసం చూపిస్తున్నాడు, ఇది అతనికి బహు మంచిగా అనిపించింది. మరల కొద్దీ సేపటి తర్వాత అబ్రాము దేవుని వాగ్దానం గురించి అనుమానం వ్యక్తం చేసాడు అది ఏవిధంగానంటే తన సంతానం ఈ భూమిని ఎలా పొందుతుందని  దేవుని అడిగాడు. దానికి గాను దేవుడు అబ్రాహాముతో నీవు దీనిని నమ్ముటకు కొన్ని జంతువులను తెచ్చి, వాటిని రెండుగా కోసి, ఒకదానికొకటి ఎదురుగా అమర్చమని చెప్పాడు. ఈ ఒప్పంద విధిలో భాగంగా, దేవుడు ఒక పొగమంచు పొగ మరియు మంట దీపం రూపంలో జంతువుల మధ్య దీర్ఘంగా నడిచాడు. దానికి గాను ఈ ఒప్పందంలో దేవుడు అబ్రాము సంతానానికి కనాను అను భూమిని ఇస్తానని వాగ్దానం చేసియున్నాడు. అబ్రాము సంతానం నాలుగు వందల సంవత్సరాలు బందీలుగా ఉంటారని, తర్వాత వారు గొప్ప సంపదతో తిరిగి వస్తారని దేవుడు అబ్రాహామునకు ఒక కచ్చితమైనటువంటి మాటను చెప్పాడు. ఇక్కడ ఈ వచనలలో దేవుని విశ్వాసనీయతను మరియు ఆయన వాగ్దానాలను నెరవేర్చే శక్తిని చూపిస్తుంది. అబ్రాహాము దేవునిని విశ్వసించినట్లే, మనం కూడా ఆయనను విశ్వసించాలి మరియు ఆయన వాగ్దానాలపై ఆధారపడి జీవిస్తుండాలి, ఎందుకంటే మనము కూడా అబ్రాహాము వలే దేవునిపై విశ్వాసం ఉంచి జీవిస్తే అయన వలే మనము కూడా దివించబడతాము. కాబట్టి ఆ ఆశీర్వాదలను ఎలా పొందలో అబ్రాహామును ఒక ఉదాహరణగా తీసుకోవాలని మొదటి పఠనము మనకు వివరిస్తుంది.
            తరవాత రెండవ పఠనములో  పౌలు గారు ఫిలిపియులైన క్రైస్తవులకు సరైన మార్గంలో నడవాలని సలహా ఇస్తున్నాడు. అతను తనను  అనుసరించమని చెబుతున్నాడు. ఈ సందర్భంలో  పౌలు ఎందుకు ఆ ప్రజలను ఆవిధంగా అంటున్నాడంటే అతని విశ్వాసం మరియు నిబద్ధతను అనుసరించమని సలహా ఇస్తున్నాడు. అదేసమయంలో, కొందరు ప్రజలు వారి శరీరాన్ని దేవుని దృష్టిలో అపవిత్రం చేస్తున్నారని మరియు వారికీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారని వారి జీవితాలను బట్టి పౌలు ఆవిధంగానైనా వారిని తిరిగి దేవుని చెంతకు తీసుకునిరావాలన్నా ఆలోచనతోటి వారిని హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా, వారు ప్రభువులో స్థిరంగా నిలబడాలని కోరుకుంటున్నాడు. ఈ విధంగా, పౌలు ఫిలిప్పీయులకు మంచి మార్గంలో నడవడం మరియు దేవుని వాక్యాన్ని పాటించడం గురించి బోధిస్తున్నాడు. కనుక మన జీవితంలో కూడా అనేక సార్లు మనకిష్టమొచ్చినట్లు జీవిస్తూ ఉంటాము. కాబ్బటి ఈనాటి నుండి మనమందరము చెడు జీవితాన్ని వదలిపెట్టి మంచి మార్గాన్ని ఎంచుకోవడం మరియు దేవుని వాక్యాన్ని పాటించడం గురించి ఆలోచించడం మొదలు పెట్టమని పౌలు గారు మనలను  ఈ రెండవ పఠనము ద్వారా హెచ్చరిస్తున్నాడు.
           చివరిగా సువిశేష పఠనములో  యేసు ప్రభువుని రూపాంతరికరణము గురించి చెప్పబడింది. యేసుక్రీస్తు మొషే మరియు ఎలియా  కలిసి ఉండగా రూపాంతరం చెందాడు. ఈ సందర్భంలో ఇక్కడ మన ఆలోచన ఏవిధంగా ఉండాలంటే యేసు ప్రభువు యొక్క విశ్వాసం మరియు అయన యొక్క వాక్య పరిచర్య మరియు అయన వచ్చిన పనిని గురించి ఆలోచించామని మనకు సలహా ఇస్తుంది. ఇక్కడ మనం గమనించలసింది ఏమిటంటే, యేసు తన శిష్యులైన పేతురు, యోహను, యకోబులను వెంటబెట్టుకొని పర్వతము మీదికి తీసుకొని వేలతాడు. అక్కడికి వెళ్లిన తరువాత యేసుక్రీస్తు రూపాంతరం చెండుతాడు. అయన ముఖం మారిపోయి, తన వస్త్రాలు ప్రకాశవంతంగా మారుతాయి. మోషే మరియు ఎలియా ప్రవక్తలు  ఆయనతో సంభాసించటం వారి ముగ్గురికి కనిపిస్తారు. అక్కడ వారు ముగ్గురు అయనకు జెరూసలేములో సంభవించే మరణం మరియు పునరుత్థానం గురించి మాట్లాడారు వారు మాట్లాడుకుంటారు. ఇది అంత జరిగిన తరువాత వారు తిరిగి కిందకు వచ్చే సమయములో ఒక మేఘం వారిని కమ్ముకుంటుంది. ఆ మేఘం నుండి ఒక స్వరం వారికీ వినిపిస్తుంది, అది ఏమిటంటే ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను ఏర్పరచుకొనినవాడు; ఆయన మాట వినుడు అని ఒక శబ్దం వస్తుంది. ఇక్కడ మనం గమనించలసింది.
ఈ సంఘటన యేసు యొక్క దైవత్వాన్ని మరియు ఆయన తండ్రితో ఉన్న ప్రత్యేక సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మోషే మరియు ఏలీయా కనిపించడం ద్వారా పాత నిబంధన యేసులో నెరవేరుతుందని చూపిస్తుంది. తండ్రి స్వరం యేసును ఆయన కుమారుడిగా ధృవీకరిస్తుంది మరియు ఆయన మాట వినమని మనకు ఆజ్ఞాపిస్తుంది. కాబట్టి మనము అయన మాట విని దేవుని ఆశీర్వాదలు పొందాలని మనము ప్రార్థన చేసుకోవాలి మరియు ఆయనను విశ్వాసించాలి.
        కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా ఈ తపస్సు కలమంతా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశము, అంతే కాకుండా మన విశ్వాసాన్ని దేవుని పట్ల ఏంతగా ఉందొ నిరూపించుకొనే ఒక గొప్ప అవకాశము, అందుకని మనం మన విశ్వాసాన్ని దేవుని ముందు వ్యక్తపరుచుచు అయన యడల మన విశ్వాసాన్ని చూపిస్తూ జీవించాలని ఈ దివ్యబలి పూజలో విశ్వాసంతో ప్రార్థించుకుంటు పాల్గొందాము.
Fr. Johannes OCD 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...