తపస్సు కాలపు నాలుగోవ ఆదివారం
యెహోషువా 5:9-12
2 కొరింథి 5: 17-21
లూకా 15: 1-3, 11-32
క్రీస్తునాధునియందు ప్రియ విశ్వాసిని విశ్వాసులరా, ఈ నాడు మనమందరము కూడా తపస్సు కాలపు నల్గొవా ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము. ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనలను మనం ద్యానించినట్లయితే మూడు పఠనలు కూడా నూతన జీవితం యొక్క సందేశాన్ని మనకు అందజేస్తున్నాయి.
అసలు నూతన జీవితం అంటే ఏమిటి అని గ్రహించినట్లయితే పునీత అసిస్సిపురి ఫ్రాన్సిస్ వారు, అవిలాపురి తెరెసమ్మ గారు మరియు సిలవా యోహాను గారు ఈ విధంగా అంటున్నారు నూతన జీవితం అనేది:
* నూతన జీవితం అనేది క్రీస్తు అడుగు జడలో నడవటం మరియు అయన ఉదాహరణలను అనుసరించడం,
* నూతన జీవితం అంటే ప్రపంచంలోని భోగభాగ్యలకు దూరంగా ఉండటం మరియు నిరాడంబరమైన జీవితాన్ని గడపటం.
* నూతన జీవితం అంటే దేవుని సృష్టిలో సామరహస్యం జీవించడం మరియు దానిని సంరక్షించడం.
* నూతన జీవితం అంటే ఇతరులను నిస్వార్థంగా ప్రేమించటం మరియు అవసరాలను తీర్చుటకు సిద్ధంగా ఉండటం.
* నూతన జీవితం అంటే మన పాపాల నుండి వైదోలగడం మరియు దేవుని వైపు తిరగడం.
* నూతన జీవితం అంటే దేవునితో నిరంతరం సంభాసించటం మరియు అయన చిత్తని తెలుసుకొవడానికి ప్రయత్నించటం.
* నూతన జీవితం అంటే దేవునిపై పూర్తిగా నమ్మకం ఉంచడం మరియు అయన మార్గదర్శకత్వనికి లోబడి జీవిచడం.
* పునీత సిలువ యోహాను గారికి నూతన జీవితం అంటే మన కోరికలను మరియు అటాచ్మెంట్లను అధిగమించడం మరియు దేవునిపై మాత్రమే ఆధారపడటం.
* పునీత అవిలాపురి తెరెసమ్మ మరియు సిలువ యోహాను. వారిద్దరికి కూడా నూతన జీవితం అనేది నిరంతర ఆధ్యాత్మిక ప్రయాణం అని మరియు అది దేవుని ప్రేమలో మరింతగా ఎదగడానికి మనలను పిలుస్తుందని బోధించారు.
యెహోషువ 5:9-12:
ఈ మొదటి పఠనములో ఇశ్రాయేలీయులు ప్రజలు వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత జరిగిన ముఖ్యమైనటువంటి సంఘటన గురించి వివరించబడింది. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు చేయబడని సున్నతి గిల్గాలులో చేయబడుతుంది. దీని అర్థం ఏమిటంటే, వారు ఐగుప్తు బానిసత్వం యొక్క కళంకాన్ని తొలగించుకున్నారు మరియు దేవుని ఎన్నిక చేసుకున్న నూతన ప్రజలుగా కొత్త ప్రారంభాన్ని పొందారు. దీని తర్వాత వారు మొదటిసారిగా ఆ దేశపు పంటను తిన్నారు మరియు అప్పటివరకు వారికి ఆహారంగా ఉన్న మన్నా అక్కడితోటి ఆగిపోయింది. ఈ సంఘటన మన జీవితాలకు ఒక గొప్ప గుణ పాఠాన్ని నేర్పుతుంది. మనం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపం యొక్క బంధకాల నుండి విడుదల పొందుతాము. బాప్తిస్మం అనేది మన జీవితంలో ఒక నూతన ప్రారంభాన్ని మరియు నూతన జీవితాన్ని ప్రారాంబించటం సూచిస్తుంది. ఇకపై మనం పాత జీవితానికి చెందినవారం కాదు అని క్రీస్తునందు కొత్త సృష్టిగా జీవిస్తాము. దేవుడు మనకు అవసరమైన ప్రతిదాన్ని సరైన సమయంలో అందిస్తాడు. అరణ్యంలో మన్నాను అందించిన దేవుడే, వాగ్దాన భూమిలో పంటను కూడా అందించాడు. అదే విధంగా మనం ఆయనపై నమ్మకం ఉంచితే, మన అవసరాలను ఆయన తప్పకుండా తీరుస్తాడు అని ఈ నాటి మొదటి పఠనములో దేవుడు తెలియజేస్తున్నాడు.
2 కొరింథీయులు 5:17-21:
ఈ రెండొవ పఠనములో క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వారి యొక్క నూతనత్వాన్ని మరియు దేవునితో సమాధానపడే అవకాశాన్ని గురించి మాట్లాడుతుంది. ఎవరైనా క్రీస్తునందు ఉంటే, వారు నూతన సృష్టి పునీత పౌలు గారు అంటున్నారు. అంటే మనలో ఉన్నటువంటివి పాతవి గతించిపోయి, ఇదిగో కొత్తవి వచ్చాయి ఇదంతా దేవుని ద్వారానే సాధ్యమైంది అంటు, క్రీస్తు ద్వారా మనలను తనతో సమాధానపరచుకున్నాడు అని మరియు ఆ సమాధాన పరిచర్యను మనకు అప్పగించాడు. యేసు క్రీస్తు పాపం చేయకపోయినా, మన కొరకు పాపవిమోచకుడిగా చేయబడ్డాడు, తద్వారా మనం దేవుని నీతి బిడ్డలుగా తీర్చిదిద్దాబడ్డము. ఈ మాటలు మనకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తాయి. క్రీస్తునందు మనం కొత్త జీవితాన్ని ప్రారంభించగలము. దేవుడు మనలను తనతో సమాధానపరచుకోవడమే కాకుండా, ఇతరులను కూడా ఆయనతో సమాధానపరచడానికి మనలను రాయబారులుగా నియమించాడు. ఇది మనకు ఇవ్వబడిన గొప్ప నూతన అధ్యాద్మిక బాధ్యత.
లూకా 15:1-3, 11-32:
చివరికి సువిశేష పఠనములో యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమానం గురించి ఇది దేవుని యొక్క అపారమైన ప్రేమను మరియు క్షమాపణను చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చిన్న కుమారుడు తన తండ్రి ఆస్తిని తీసుకొని దూర దేశానికి వెళ్లి దుర్వ్యసనాలతో దానిని నాశనం చేసుకుంటాడు. చివరికి దిక్కులేని స్థితిలో తన తండ్రి వద్దకు తిరిగి వస్తాడు. తండ్రి అతన్ని చూసి జాలిపడి పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుంటాడు మరియు ఘనంగా విందు ఏర్పాటు చేసి సంతోషిస్తాడు. అయితే పెద్ద కుమారుడు దీనిని చూసి అసూయపడతాడు. ఈ ఉపమానంలో తండ్రి దేవునికి, ఇద్దరు కుమారులు కూడా మానవులకు ప్రాతినిధ్యం వహిస్తారు. చిన్న కుమారుడు పాపంలో పడిపోయిన మరియు దేవునికి దూరమైన వ్యక్తిని సూచిస్తాడు. అతని పశ్చాత్తాపం మరియు తిరిగి రావడం అనేది దేవుని క్షమాపణను పొందడానికి అవసరమైన హృదయ మార్పును తెలియజేస్తుంది. తండ్రి యొక్క నిస్వార్ధమైన ప్రేమ మరియు క్షమాపణను మరియు దేవుని యొక్క కరుణను మరియు ఆయన పాపులను స్వీకరించే విధానాన్ని చూపిస్తుంది. పెద్ద కుమారుడు తమ నీతిని గూర్చి గర్వపడే మరియు ఇతరులను తక్కువగా చూసే వారిని సూచిస్తాడు. దేవుని ప్రేమ అందరికీ అందుబాటులో ఉంటుందని మరియు మనం ఇతరుల పశ్చాత్తాపం పట్ల సంతోషించాలి అని ఈ ఉపమానం మనకు నేర్పుతుంది.
కాబ్బట్టి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ప్రేమగలవాడు మరియు క్షమించేవాడు. ఆయన మనలను పాపం యొక్క బంధకాల నుండి విడిపించడానికి, మనకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి మరియు తనతో సమాధానపరచుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయనపై విశ్వాసం ఉంచాలి, మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడాలి మరియు ఆయన ప్రేమను ఇతరులతో పంచుకోవాలి అప్పుడే మనం ఒక నూతన సృష్టిగా లేకపోతే నూతన వ్యక్తులుగా పరిగనింపబడతాము. మరి అటువంటి దీవెనలకొరకై మనమందరము ఈ బలి పూజలో ప్రార్దించుకుందాము.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి