1, మార్చి 2025, శనివారం

సామాన్యకాలపు ఎనిమిదవ ఆదివారము

సామాన్యకాలపు ఎనిమిదవ  ఆదివారము
సిరా 27:4-7
1 కొరింథీయులు 15:54-58
లూకా 6:39-44

          క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియా  దేవుని జనులరా , ఈ రోజున మనము సామాన్య కాలపు ఎనిమిదవ ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము, ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనములను మనం చుసినట్లయితే, ఈ మూడు  మనకు ముఖ్యమైనటువంటి మూడు అంశముల గురించి తెలియజేస్తున్నాయి. అవి  మన జీవితానికి చాలా విలువైన విషయాల గురించి నేర్పుతున్నాయి. అవి ఏమిటంటే మన మాటలు, మన చేతలు ద్వారా చేసే పనులు, మన స్వభావం గురించి ఆలోచించి, మంచి జీవితాన్ని గడపమని ఈ వాక్యాలు మనకు నేర్పిస్తున్నాయి. ఈ ముఖ్య గుణములు మన జీవితములో ఎంతగానో ఉపయోగపడతాయి. మనలను మంచి మార్గములో ప్రయాణించుటకు ఉపయోగపడతాయి.

ముందుగా మనము మొదటి పఠనము చూసింట్లయితే 
సిరా 27:4-7 వచనలలో  మన మంచి జీవితం అనేది మన మాట్లమీద ఆధారపడివుందని తెలియజేస్తుంది. అది ఏ విధంగానంటే మనుషుల నిజమైన స్వభావం మీద ఆధారపడివుంది. లూకా సువార్తలో మనము చూస్తున్నాము చెట్టును బట్టే పండ్లు కాస్తాయని. చెట్టు పండును బట్టి ఎలా దాని స్వభావము తెలుస్తుందో, అదే విధంగా మనిషి మాటలను బట్టి అతని హృదయం తెలుస్తుంది.
 ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటకూడా చాలా విలువైనది. మన జీవితములో కొన్ని సార్లు తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటాము. ఏవిధంగానంటే ఎవరినీ తొందరపడి పొగడకూడదు, వారి మాటలు విన్నాకే వారిని అంచనా వేయాలి.
 నిజం జీవితములో మనం మాటల ద్వారానే మన నిజస్వరూపాన్ని బయటపెడతాము. అందుకే మనం మాట్లాడే ప్రతి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని ఈ మొదటి పఠనములో చూస్తున్నాము.
       రెండొవ పఠనము: 
1 కొరింథీయులు 15:54-58:
 ఈ వాక్యాలు మరణంపై విజయం గురించి, శాశ్వత జీవితం గురించి మాట్లాడుతున్నాయి. యేసుక్రీస్తు ద్వారా మరణం అనేది ఓడిపోతుందని, మానవులమైనటువంటి మనకు శాశ్వత విజయం లభిస్తుందని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. మన మానవ జీవితంలో మనము అనేక సార్లు పాపమనే ఉబిలో పడిపోతున్నాము అంటే మనము పాపమానే జీవితములో అనేక సార్లు చనిపోతున్నాము. మరి దీని నుండి మనము బయటకి జీవముతో రావాలంటే యేసు క్రీస్తును దృఢనమ్మకముతో విశ్వాసించాలి ఎందుకంటె క్రీస్తు ద్వారా మనము మరణాన్ని జయించవచ్చు. ఎటువంటి గొప్ప బహుమానము క్రీస్తు ద్వారా  దేవుడు మనకు విజయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేయాలి. మన శ్రమలు ప్రభువులో వ్యర్థం కావు అని, ఎల్లప్పుడూ ప్రభువు పనిలో నిమగ్నమై ఉండాలని అప్పుడే మనము అన్ని జయింపగలమని ఈ వాక్యాలు మనకు నేర్పిస్తున్నాయి.
               చివరిగా సువిశేష పఠనము:
లూకా 6:39-44 ఈ వచనాలు ఇతరులను తీర్పు తీర్చడం గురించి, మంచి ఫలాలను ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాయి. ముందుగా గుడ్డివాడు గుడ్డివాడిని నడిపించలేడని, అంటే పాపం అనే జీవితములో జీవించే వాడు ఇతరులకు మంచిని నేర్పించలేడు అని, ముందుగా మన కంటిలోని దూలాన్ని తీసివేయాలని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. మంచి చెట్టు మంచి పండ్లను ఇచ్చినట్లే, చెడ్డ చెట్టు చెడ్డ పండ్లను ఇస్తుందని, వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు అంటున్నారు. మన హృదయం నుండి వచ్చే మాటలు మన స్వభావాన్ని తెలియజేస్తాయనీ. ఇతరులను మనము సరిచేయడానికి ముందు మనల్ని మనం సరిచేసుకోవాలని సువిశేష పఠనము మనకు నేర్పిస్తుంది.
కాబ్బటి మన మాటలు, చేతలు మంచి ఫలాలను ఇవ్వాలనుకుంటే మన స్వభావము అనేది మంచిగా ఉండాలి అప్పుడే మనము ఇతరులను మంచి మార్గములో ప్రయాణించేలా చేయగలుగుతాము. 
           కాబ్బటి ప్రియా దేవుని బిడ్డలరా మన మాటలు, చేతలు, మన స్వభావం ఇవి అన్ని కూడా మనలను మంచి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలని నేర్పిస్తున్నాయి. ఒక క్రైస్తవునిగా నీ జీవితాము ఏ విధంగా ఉందొ తెలుసుకొని జీవించాలని ఈ బలి పూజలో ప్రార్దించుకొందము.
Fr. Johannes OCD

22, ఫిబ్రవరి 2025, శనివారం

సామాన్యకాలపు ఏడవ ఆదివారము


1 సమూయేలు 26:2, 7-8, 12-13, 22-23; 
1 కొరింథీయులు 15:45-49
లూకా 6:27-38
క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ విశ్వసిని విశ్వాసులరా మరియు దేవుని బిడ్డలరా, ఈ దినమున మనమందరము సామాన్య కాలపు ఏడవ ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము, ఈ నాటి మూడు పఠనములలో మనం చుసినట్లయితే, ఈ మూడు కూడా మనకు ముఖ్యమైన మూడు అంశముల గురించి తెలియజేస్తున్నాయి. అవి ఏమిటంటే మానవుని  వినయం, క్షమాపణ మరియు ఆధ్యాత్మిక పరివర్తన యొక్క ముఖ్యమైన గుణల గురించి నేర్పిస్తున్నాయి.
ముందుగా మొదటి పఠనము చూసినట్లయితే 
1 సమూయేలు 26:2, 7-8, 12-13, 22-23
ఈ వచనలలో  దావీదు రోజు యొక్క వినయమును మనం గమనించ వచ్చు ఎందుకంటే దావీదు ఏవిధంగానైతే దేవుని పట్ల తన వినయమును కనబర్చాడో అదే విధమైనటువంటి వినయం ఈ రోజు దావీదు సౌలు పట్ల చూపిస్తున్నాడు. వినయం అనేది ఒక గొప్ప ముఖ్యమైనుటువంటి లక్షణం. ఇది మనల్ని ఇతరులతో కలిసిమెలిసి ఉండడానికి, వారిని గౌరవించడానికి దోహదపడుతుంది లేదా సహాయపడుతుంది. వినయం గల వ్యక్తి ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు మరియు ఇతరుల నుండి మంచిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇటువంటి వినయమును మనం దావీదులో చూస్తున్నాము. ఎందుకంటే దావీదును సౌలు రాజు వెంబడించే హతమార్చాలి అనుకున్న సమయంలో దావీదు అతనిని ఎదుర్కొంటాడు. దావీదుకు సౌలును చంపడానికి అవకాశం వచ్చినప్పటికి లేదా ఉన్నప్పటికీ, దావీదు సౌలు రాజును విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడ మనం గమనించలసింది దావీదు దేవుని అభిషిక్తుని పట్ల అతని వినయాన్ని మరియు భక్తిని చూపిస్తుంది. కొన్ని సార్లు మన స్వంత  నిర్ణయాలను తీసుకోవడానికి బదులుగా, దేవుని యొక్క న్యాయాన్ని విశ్వసించడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఇక్కడ చూపిస్తుంది. ఇది దేవుడు మానవునికి ఇచ్చినటువంటి అధికారాన్ని గౌరవించాలని మరియు మనకు కీడు చేసిన వారి పట్ల కూడా వినయం మరియు దయ చూపాలని మనకు నేర్పిస్తుంది. చివరిగా సౌలు రాజు దావీదును అసూయతో వెంబడించాడు. ఒక సందర్భంలో దావీదు సౌలును చంపడానికి అవకాశం వచ్చింది, కానీ దావీదు అలా చేయలేదు. ఎందుకంటే సౌలు దేవునిచే ఎన్నుకోబడిన రాజు అని దావీదుకు తెలుసు. దావీదు దేవుని పట్ల వినయం కలిగి ఉన్నాడు మరియు దేవుని నిర్ణయాలను గౌరవించాడు. మనము దావీదును ఒక ఉదాహరణగా తీసుకుంటూ మన జీవితాలను దేవునికి అనుకుగుణంగా మార్చుకుంటూ వినయంతో జీవించాలని మొదటి పఠనము మనకు నేర్పిస్తుంది.
సువిశేష గ్రంథ పఠనమును మనం ద్యానించినట్లయితే 
లూకా 6:27-38 చుసినట్లయితే యేసు ప్రేమ మరియు క్షమాపణ గురించి తన  బోధనలనలో బోదిస్తున్నాడు. ఏవిధంగానంటే మన శత్రువులను ప్రేమించమని, మనలను ద్వేషించే వారికి మంచి చేయమని మరియు మనలను శపించే వారిని దీవించమని ఆయన మనలను పిలుస్తాడు. యేసు మన శత్రువులను ప్రేమించమని మనకు తెలియజేస్తున్నాడు. సాధారణంగా మానవుని జీవితంలో క్షమించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం, ఎందుకంటే సహజంగా మనకు హాని చేసిన వారిని ప్రేమించడం అంటే మనకు అసలు నచ్చనటువంటి పని మరియు భయంకరమైనటువంటి కష్టం. కానీ ఈనాడు యేసు మనలను అలా చేయమని పిలుస్తున్నాడు, ఎందుకంటే ఆయన మనలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి.
మన శత్రువులను ప్రేమించడం అంటే వారిని క్షమించడం మరియు వారికి మంచి చేయడం. వారిని ద్వేషించకుండా, వారి పట్ల దయ చూపించాలి. ఇది చాలా కష్టమైన పని, ఒక్క సారి పేతురు గారు యేసు ప్రభుని ఇలా అడిగినపుడు నా సహోదరుడు నాయడల తప్పు చేసినప్పుడు ఎన్ని పర్యాయములు అతని క్షమించవలయునని  అడిగినప్పుడు యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం మనము చూసియున్నాము. దీనికి యేసు ప్రభువు మనకు ఒక గొప్ప ఉదాహరణగా చూపించాడు. ఆయన మన కొరకు సిలువపై మరణింంచాడు లేదా చనిపోయాడు, మనము ఆయనకు మన పాపల ద్వారా శత్రువులుగా ఉన్నప్పుడు కూడా. ఆయన మనలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టే అలా చేయగలిగాడు. ఈ సమయము నుండి మనము కూడా మన శత్రువులను ప్రేమించాలని యేసు కోరుకుంటున్నాడు. సాధారణముగా ఇది మనకు కష్టంగా అనిపించవచ్చు, కానీ దేవునీ సహాయం మనతో ఉంటే , మనము కచ్చితంగా ఈ క్షమాపణ అనేది నెరవేర్చగలము. ఎందుకంటే 
మన శత్రువులను ప్రేమించడం వలన మనము దేవుని ప్రేమను ఇతరులకు చూపించగలము. ఇది మన జీవితంలో సంతోషాన్ని మరియు సమాధానాన్ని కూడా కలిగిస్తుంది.
కాబట్టి, మన శత్రువులను ప్రేమించడానికి మనమందరము గట్టిగా ప్రయత్నించుదాం. ఇది కష్టమైన పని, కానీ చాలా విలువైనది. ఎందుకంటే దేవుడు మనలను క్షమించినట్లే మనం ఇతరులను క్షమించాలి.
రెండవ పఠనము 1 కొరింథీయులు 15:45-49 వచనలలో మనము చూస్తున్నాము. ఇక్కడ మన శరీరాల పరివర్తన గురించి మాట్లాడుతుంది. ఇది మన లౌకిక, నాశనకరమైనటువంటి శరీరాన్ని పునరుత్థానంలో మనం పొందే మహిమకరమైన శరీరంతో విరుద్ధంగా ఉంటుంది అని తెలియజేస్తుంది. అది ఏవిధంగానంటే మనము ఇప్పుడు చూద్దాము. మొదటి మనిషి అయినటువంటి ఆదాము జీవముగల ప్రాణిగా చేయబడ్డాడు మరియు తన శరీరమంత మట్టితో చేయబడింది మరియు అది ఆశాశ్వతమైనది. కానీ చివరి  ఆదాము అంటే క్రీస్తు ఆయన ఆత్మను ఇచ్చేవాడు. ఆయన శరీరము మహిమకరమైనది మరియు నాశనమయేటువంటిది కాదు. ఒక మానవునిగా మన ప్రస్తుత శరీరాలు ఆదాము నుండి వచ్చినవి. అవి అశాశ్వతమైనవి మరియు పాపానికి లోబడి ఉండేటువంటివి. కానీ పరలోక సంబంధమైనటువంటి శరీరము మనము క్రీస్తును విశ్వసించినప్పుడు, మనము పరలోక సంబంధమైన శరీరాన్ని పొందుతాము. ఇది మహిమకరమైనది మరియు శాశ్వతమైనది. ఈనాడు మనం మన ప్రస్తుత శరీరం గురించి మనం ఏవిధంగా ఆలోచిస్తున్నాము అని మనలను మనం ఒక్క సారి ద్యానిచుకుంటూ ప్రశ్నించుకుందాము.
కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా ఈనాడు మనమందరము దేవుని పట్ల మరియు మానవుని పట్ల వినయం చూపిస్తూ, క్షమాగుణం కలిగి ఇతరులకు పంచుతూ, క్రీస్తులో భాగమై జీవిస్తూ ఆయనతో ఒకటై ఉండాలని ఈ దివ్యబలిలో ప్రార్థిస్తూ పాల్గొందాము.

 ‌Fr. Johannes OCD

19, ఫిబ్రవరి 2025, బుధవారం

మార్కు 9:41-50

 February 27

సిరా 5:1-8

మార్కు 9:41-50

మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవ్వడు మీకు నా పేరిట చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగచెప్పుచున్నాను" అనెను. "నన్ను విశ్వసించు ఈ చిన్న వారిలో ఏ ఒక్కడైన పాపి అగుటకు కారకుడగుటకంటె, అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక్క చేతితో నిత్యజీవము పొందుట మేలు. నీ కాలు నీకు పాపకారణమైనచో, దానిని నరికి పారవేయుము. రెండుకాళ్ళతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కనులు నీకుపాప కారణమైనచో దానిని పెరికి పారవేయుము. రెండుకన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రతి ఒక్కనికి ఉప్పదనము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కాని అది తన ఉప్పదనమును కోల్పోయిన, తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతము చేయగలరు? కావున, మీరు ఉప్పదనమును కలిగి ఒకరితో ఒకరు  సమాధానముతో ఉండుడు" అనెను.  

క్రీస్తు సంబంధీకులు : ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు మిమ్ములను క్రీస్తు సంబంధీకులుగా గుర్తించి మీకు ఎవరు చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును పొందును అని అంటున్నారు. ఎవరు ఈ  క్రీస్తు సంబంధికులు అంటే సువిశేష భాగంలో యేసు ప్రభువుని అనుచరులు అని లేక శిష్యులు అని తెలుస్తుంది. ఇది కేవలం అప్పటి శిష్యులు లేక అనుచరులేనా  అంటే కాదు ఎందుకంటే యేసు ప్రభువుకు చెందిన వారు ఎవరో మనము ఈ అధ్యాయములోనే చూస్తాము. అంతకు ముందు ప్రభువు పేరిట ఒకడు దయ్యములను వదలకొడుతున్నప్పుడు శిష్యులు వాడిని వారించిన పిదప ఆయనకు ఆ విషయం చెప్పగా ప్రభువు అతనిని తనకి చెందిన వానిగానే చెబుతున్నాడు. తరువాత కూడా మీరు వెళ్లి లోకమున ఉన్న వారిని నా అనుచరులుగా చేయమని ప్రభువు చెబుతున్నాడు. ఎవరు అయితె ప్రభువు మాట ప్రకారం జీవిస్తారో వారు క్రీస్తు అనుచరులు, వారే క్రీస్తు సంబంధీకులు. అందుకే ప్రభువు నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడె నా సోదరుడు సోదరి, తల్లి అని ప్రకటించారు. ఈరోజు మనం ఆయన సంబంధీకులము కావాలంటే ఆయన మాటలను అనుసరించాలి. ఈ విధంగా జీవించిన క్రీస్తు సంబంధీకులను గౌరవించిన వారికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. ఎందుకంటే వారి ద్వారా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. ఇది వారి మాటల ద్వారా వారి ప్రేమ పూర్వక జీవితం ద్వారా జరుగుతుంది. 

పాపము చేసిన వారు నరకానికి వెళుతారు, నరకములో ఒక వ్యక్తి  చాలా ఘోరమైన బాధలకు గురవుతాడు.  అది నిత్యము బాధలతో ఉండే స్థితి.  నరకము అనేది దేవున్ని  తిరస్కరించి, ఆయనకు వ్యతిరేకమైన పనులు చేస్తు  పశ్చాత్తాప పడకుండా పాపములోనే  మరణించేవారు పొందే స్థితి.  నరకంలోఎల్లప్పుడు బాధ అనే స్థితి మాత్రమే ఉంటుంది. ఊరట కోసం ఎంత ప్రయత్నించిన అది అది వారికి అందదు. అందుకే ప్రభువు ఈ స్థితి మనకు రాకూడదు అని కోరుకుంటున్నారు. అందుకే మనిషిని నరకానికి పాత్రులుగా చేసే ఎటువంటి దానిని కూడా మన దగ్గర ఉండకూడదు అని కోరుకుంటున్నారు. 

ప్రభువు మనలను ఇతరులు పాపము చేయుటకు కారణం కాకూడదు అని చెబుతున్నారు. అటుల అగుటకంటె మనము మరణించుటయే మంచిది అని పలుకుతున్నారు. మనము పాపము చేయుటకంటే  మనము పాపము చేయుటకు మనలో  ఏదైన కారణమైతే  దానిని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండమని ప్రభువు చెబుతున్నాడు. ప్రభువు ఎందుకు ఇలా చెబుతున్నాడు?  ఎందుకంటే నిత్యం జీవం అనేది అత్యంత విలువైనది, ఏమి ఇచ్చిన కాని దానిని కొనలేము.  మంచి జీవితం జీవించే వారికి దేవుడు ఇచ్చే బహుమతి ఇది.  ఏ వ్యక్తి కూడా తన సొంత ప్రతిభ వలన సాధించదగినది కాదు. పాపము చేసిన వారు కూడా పశ్చాత్తాప పడి ప్రభువు ముందు క్షమాపణ అడిగితే వారికి కూడా ప్రభువు నిత్యజీవాన్ని అనుగ్రహిస్తాడు. అది ప్రభువును ముఖాముఖిగా దర్శించు భాగ్యం. ఎల్లప్పుడూ ఆనందముగా ఉండేటువంటి స్థితి.    అందుకే మనలో పాపకారణమైన భాగం ఉంటె దానిని  కోల్పోవడానికి అయిన సిద్దపడి నిత్యజీవం పొందుటకు సాధన చేయమని ప్రభువు చెబుతున్నాడు. 

ప్రార్ధన: ప్రభువా! మీ అనుచరులు ఎల్లప్పుడు మీమ్ములను ఆదర్శంగా తీసుకోవాలని, మీ వలె జీవించాలని కోరుకుంటున్నారు. మీ అనుచరులను గౌరవించిన వారికి తగిన ప్రతిఫలమును పొందుతారు అని చెబుతున్నారు.  మీ అనుచరులుగా మీకు సంబంధికులుగా ఉండుటవలన  మిమ్ము ఇతరులకు మా జీవితాల ద్వారా   చూపించు,వినిపించు అనుగ్రహం ప్రసాదిస్తున్నారు. దీనిని సద్వినియోగ పరచుకొని    చెడుమార్గంలో ప్రయాణించకుండ, మీ మార్గములో ప్రయాణిస్తూ, మాలో ఏదైనా పాపకారణమైనది ఉన్నచో దానిని తీసివేసి, మీ వలె జీవిస్తూ, నిత్యజీవానికి వారసులము అయ్యేలా అనుగ్రహించండి. ఆమెన్. 


16, ఫిబ్రవరి 2025, ఆదివారం

మార్కు 9:38-40

 February 26

సిరా 4:11-19

మార్కు 9:38-40

అంతట యోహాను యేసుతో "బోధకుడా! మనలను అనుసరింపని ఒకడు నీపేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి" అని పలికెను. అందుకు యేసు "మీరు అతనిని నిషేధింపవలదు, ఏలయన, నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధికానివాడు మన పక్షమున ఉండువాడు. 

యోహాను  యేసుతో, “బోధకుడా, దయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తిని మేము చూశాము. అతను మనల్ని అనుసరించడు కాబట్టి మేము అతన్ని ఆపడానికి ప్రయత్నించాము” అని చెప్పడంతో ప్రారంభమవుతుంది ఈనాటి సువిశేషం. ఆ  వ్యక్తి దయ్యాలను వెళ్ళగొట్టే సామర్థ్యం పట్ల శిష్యులు  అసూయపడుతున్నారా? వారు ఈ రకమైన శక్తిని కలిగి ఉండాలనుకుంటున్నారా?  అనే ప్రశ్నలను అడిగితే ఆ వ్యక్తి వలే వీరుకూడా చేయాలి అని అనుకోని ఉండవచ్చు. యేసు యోహానుతో, “అతన్ని నిరోధించవద్దు. ఎవరైనా నా నామంలో మంచి పని చేస్తే, నా గురించి వారు ఎలా  చెడుగా మాట్లాడరు” అని అంటాడు. తరువాత యేసు ఇలా అంటాడు: “మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్నాడు.”

ఈ రోజు యేసు ప్రభువు  మనకు ఒక ముఖ్యమైన సూచన ఇస్తున్నాడు. మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్నాడని ఆయన మనకు చెబుతున్నాడు. సాధారణంగా చాలా మంది మానవులకు ఏ వ్యక్తులు తమను ఆదరిస్తారో తెలుసు. అయితే, ఏ వ్యక్తులు మనతో పోరాడవచ్చు, మనల్ని ఇష్టపడకపోవచ్చు లేదా మనల్ని విస్మరించవచ్చు అని కూడా మనకు తెలుసు.  కాని ఈ రోజులలో మనతో మంచిగా మాటలాడి మనము లేని సమయంలో వ్యతిరేకంగా మాటలాడువారే ఎక్కువ మంది ఉండవచ్చు. 

యేసు ప్రభువును అనుసరించకుండా,  ఆయన నామమున ఒక వ్యక్తి దయ్యములను వెడలగొడుతున్నాడు అంటే ఆ వ్యక్తి యేసు ప్రభువును దేవునిగా , రక్షకునిగా అంగీకరించాడు. మరియు యేసు ప్రభువు మాటలను పాటించి జీవిస్తూ ఉండవచ్చు. ఎదో ఒక సమయంలో ప్రభువు మాటలను విని, ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. ప్రభువు చెప్పినట్లు ఆ వ్యక్తి ప్రార్థన, మరియు ఉపవాసములతో జీవించేవాడు అయివుండవచ్చు ఎందుకంటే ప్రభువే చెబుతున్నాడు ఇటువంటివి కేవలం ప్రార్ధన మరియు ఉపవాసంతోనే సాధ్యమని కనుక ఆ వ్యక్తి ప్రభువుతో ఉండకపోయినా  ప్రభువుని అనుచరుడే. 

 మానవులుగా, మనలో చాలామంది ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో దాని గురించి ఎక్కువగా శ్రద్ధ వహించవచ్చు. అయితే, యేసు తన శిష్యులు నిజంగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాడు. వారు ఇతరుల పట్ల అసూయపడటం లేదా మరొకరి సామర్థ్యాలు మరియు బహుమతులను కోరుకోవడం ఆయనకు ఇష్టం లేదు. తన శిష్యులు తమ సొంత బహుమతులను మరియు ఇతరుల బహుమతులను కూడా అభినందించాలని యేసు స్పష్టంగా కోరుకుంటున్నాడు.

Br. Pavan OCD

మార్కు 9:30-37

 February 25

సిరా 2:1-11

మార్కు 9:30-37

వారు ఆ స్థలమును వీడి గలిలీయ ప్రాంతమునకు వెళ్లిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికిని తెలియకూడదని ఆయన కోరిక. ఏలయన, "మనుష్యకుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును. వారు ఆయనను చంపుదురు కాని మరణించిన మూడవదినమున ఆయన పునరుత్తానుడగును" అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి. అయినను ఆయనను అడుగుటకు భయపడిరి. అంతట వారు కఫర్నామునాకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను "మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి?" అని అడిగెను. తమలో గొప్పవాడెవ్వడని మార్గమధ్యమున వాదించు కొనియుండుటచే వారు ప్రత్యుత్తరమీయలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి పన్నిద్దరు శిష్యులను చేరబిలిచి, "ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై, అందరకు సేవకుడుగా ఉండవలయును"అని పలికెను. మరియు ఆయన ఒక చిన్నబిడ్డను చేరదీసి వారి మధ్యనుంచి, వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో, "ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించినవాడగును. నన్ను  స్వీకరించినవాడు నన్నుకాదు , నన్ను పంపినవానిని స్వీకరించుచున్నాడు" అనెను. 

యేసు ప్రభువు , పన్నెండు మందిని పిలిచి, మీలో ఎవరైనా మొదటివారిగా  ఉండాలనుకుంటే, అతను చివరివాడిగా మరియు అందరికీ సేవకుడిగా ఉండాలని చెబుతున్నాడు.  అంతకు ముందు  యేసు ప్రభువు   తనకి  అత్యంత  సన్నిహిత శిష్యులను, తీసుకొని ఒక రహస్య ప్రదేశానికి ప్రార్ధించుటకు వెళ్ళాడు, తరువాత  వారు కఫర్నముకు వచ్చారు, యేసు ప్రభువు  వారిని దారిలో దేని గురించి వాదిస్తున్నారని అడిగాడు. ఎవరు గొప్పవారో వారు వాదించుకుంటున్నారని వారు అంగీకరించడానికి ఇష్టపడలేదు.  అది ప్రభువుకు వారు చెప్పలేక పోయారు. 

 మొదటివారిగా  ఉండాలనుకునే ఎవరైనా చివరివారై ఉండాలి, అందరికీ సేవకుడుగా  కావాలని ప్రభువు  చెప్పాడు. కేవలం అది చెప్పడంతో ఆగిపోకుండా  ఒక చిన్న బిడ్డను తీసుకొని , వారి మధ్య ఉంచి తన పేరు మీద ఒక బిడ్డను స్వాగతించేవాడు తనను స్వాగతిస్తాడని చెబుతున్నాడు. చిన్నవాడిని లేక ఇతరుల మీద ఆధారపడేవారిని ఆహ్వానించడం మనలను దైవ స్వభావం కలిగేలా చేస్తుంది. ప్రపంచం తరచుగా నాయకత్వాన్ని, అధికారంతో, శక్తితో సమానం చేస్తుంది. 

దేవుని రాజ్యంలో, అధికార సమీకరణం తారుమారు అవుతుంది. మనం సేవ చేయడం ద్వారా నాయకత్వం వహిస్తాము, దిగువకు మారడం ద్వారా ఉన్నతంగా వెళ్తాము, అత్యల్పంగా ఉండటం ద్వారా అధికారాన్ని ఉపయోగిస్తాము. స్వార్థపూరిత నాయకత్వానికి అలవాటుపడిన ప్రపంచంలో ఇది అర్ధవంతం కాదు. దేవుడిని ప్రేమించడం మరియు ఒకరినొకరు ప్రేమించుకోవడం అనే రెండు గొప్ప ఆజ్ఞలు ఉన్న సమాజ మాత్రమే లో, లోక  నియమాలను తిప్పికొట్టకలుగుతుంది. .

మనం ఇతరులకు సేవ చేసినప్పుడు నాయకత్వం వస్తుంది. ప్రజలకు సహాయం చేయడంలో ప్రభావం వస్తుంది.  అది మనం కోరుకునేది కాదు, ఎందుకంటే మనం కోరుకునేది సేవ చేయడమే. సేవ చేయడంలో అవకాశం నాయకత్వం వహించడానికి రావచ్చు.

Br. Pavan OCD

మార్కు 9:14-29

 February 24

సిరా 1:1-10

మార్కు 9:14-29

వారు తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జనసమూహము కూడియుండుట చూచిరి. ధర్మ శాస్త్ర బోధకులు క్కో శిష్యులతో తర్కించుచుండిరి. యేసును చూడగనే ప్రజలు ముగ్గుల ఆశ్చర్యపడి, పరుగునవచ్చి ఆయనకు నమస్కరించిరి. "వారితో ఏ విషయమునుగూర్చి తర్కించుచున్నారు?" అని యేసు శిష్యులను ప్రశ్నించెను. జనసమూహములో ఒకడు "బోధకుడా!మూగ దయ్యము పట్టిన నా కుమారుని తమయొద్దకు తీసుకొనివచ్చితిని. భూతము వీనిని ఆవేశించినపుడెల్ల నేలపై  పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నురుగులు క్రక్కుచు పండ్లు కోరుకుచు, కొయ్యబారిపోవును.  ఈ దయ్యమును పారద్రోలమీ శిష్యులను కోరితిని. అది వారికి సాధ్యపడలేదు" అని విన్నవించెను. యేసు వారితో "మీరు ఎంత అవిశ్వాసులు! నేను ఎంత కాలము మీ మధ్యనుందును? ఎంతవరకు  మిమ్ము సహింతును? ఆ బాలుని ఇటకు తీసుకొని రండు" అనగా, వారు అట్లే వానిని తీసికొని వచ్చిరి. యేసును చూచినవెంటనే ఆ దయ్యము వానిని విలవిలలాడించి నేలపై పడవేసి, అటుఇటు దొర్లించి, నురుగులు క్రక్కించెను. "ఈ  దుర్బరావస్థ ఎంత కాలము నుండి?" అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగెను. "పసితననము నుండి" అని అతడు బదులు   చెప్పి, "అనేక పర్యాయములు ఆ భూతము వీనిని నాశనము చేయవలెనని నీళ్లలోను, నిప్పులలోను పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేని మాపై కరుణించి సాయముచేయుడు" అని ప్రార్ధించెను. అందుకు యేసు "సాధ్యమగునేని' అనుచున్నావా! విస్వసించు వానికి అంతయు సాధ్యమే" అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి "నేను  నమ్ముచున్నాను. నాకు అవిశ్వాసము  లేకుండునట్లు తోడ్పడుము" అని ఎలుగెత్తి పలికెను.  అంతట జనులు గుమికూడి తనయొద్దకు పరుగెత్తుకొనివచ్చుట  చూచి యేసు "మూగ చెవిటి దయ్యమా! ఈ బాలుని విడిచిపొమ్ము, మరెన్నడును వీనిని ఆవహింపకుము" అని శాసించెను. అప్పడు ఆ  భూతము ఆర్భటించుచు, బాలుని విలవిలలాడించి వెళ్లిపోయెను. బాలుడు పీనుగువలె  పడిపోయెను. అనేకులు వాడు చనిపోయెననిరి. కాని, యేసు వాని చేతినిపట్టి లేవనెత్తగా వాడులేచి నిలుచుండెను. యేసు ఇంటికి వెళ్లిన పిదప శిష్యులు  ఏకాంతముగ ఆయనతో "ఈ దయ్యమును పారద్రోల మాకు ఏల సాధ్యపడలేదు?" అని ప్రశ్నించిరి. అందుకు ఆయన   వారితో, "ప్రార్ధనవలనతప్ప మరే విధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు" అని చెప్పెను. 

శిష్యులు  మూర్ఛరోగిని ‘ స్వస్థపరచలేక’ దుష్టాత్మను వెళ్లగొట్టలేకపోవుటను  చూసినప్పుడు, వారు తమ వైఫల్యానికి కారణాన్ని గురువును అడిగారు. ఆయన వారికి ‘సాతానుపై  శక్తి మరియు అధికారం, మరియు అన్ని వ్యాధులను నయం చేయడానికి శక్తిని ’ ఇచ్చాడు. వారు తరచుగా ఆ శక్తిని ఉపయోగించారు మరియు  వారికి సాతాను ఎలా లోబడి ఉన్నాడో సంతోషంగా చెప్పారు. అయినప్పటికీ, ఆయన కొండపై ఉన్నప్పుడు, వారు పూర్తిగా విఫలమయ్యారు. 

దేవుని చిత్తం లేకుండా విముక్తి ప్రసాదించడం, అయన అనుగ్రహం లేకుండా ఏదైనా సాధించడం సాధ్యం కాదు. క్రీస్తు ఆజ్ఞ మేరకు దుష్టాత్మ వెళ్ళిపోయింది.  మేమెందుకు చేయలేకపోయాము?’ అనే వారిప్రశ్న,  వారు కూడా ఆ దుష్టాత్మను వెళ్ళగకొట్టాలని   ప్రయత్నించారని స్పష్టంగా తెలుస్తుంది; వారి ప్రయత్నాలు ఫలించలేదు , ప్రజల ముందు వారి అశక్తి నిరూపితమైంది. దానికి వారు సిగ్గుపడ్డారు. 

విశ్వాసం ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత వ్యాయామం, ఇక్కడ మన ఆత్మ దేవుని ఆత్మకు పరిపూర్ణంగా స్వీకరించడంలో తనను తాను సమర్పించుకుంటుంది మరియు  అత్యున్నత కార్యాచరణకు బలపడుతుంది. ఈ విశ్వాసం పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిపై ఆధారపడి ఉంటుంది; ఇది బలంగా మరియు పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మన జీవితంలో పూర్తిగా ఆధిపత్యం చెలాయించినప్పుడు మాత్రమే, దాని శక్తివంతమైన పనులను చేయడానికి విశ్వాసమునకు  శక్తి ఉంటుంది. 

అందుకే యేసుప్రభువు సాతాను ఉపవాసం మరియు ప్రార్థన ద్వారా మాత్రమే పారద్రోలబడుతుంది.  ఈ దుష్టాత్మలో ఉన్న మొండి పట్టుదలను , ప్రతిఘటనను అధిగమించగల విశ్వాసం, దేవునితో  సన్నిహిత సహవాసంలో ఉండి మరియు లోకం దాని క్రియల నుండి సాధించవచ్చు.  విశ్వాసం పెరగడానికి మరియు బలంగా ఉండటానికి ప్రార్థన జీవితం అవసరం.  ప్రార్థన ఉపవాసం విశ్వాసాన్ని పెంచుతాయి. 

విశ్వాసం పెరుగుదల కోసం ప్రార్థన జీవితం అవసరం. ఆధ్యాత్మిక జీవితంలోని అన్ని విభిన్న భాగాలలో, దేవునితో ఎంత దగ్గర సంబంధం కలిగి ఉంటామో అంత పవిత్రత కలిగి ఉంటాము. భగవంతుడిని ఆరాధించడంలో, ఆయన కోసం వేచి ఉండటంలో, దేవుడు తనను తాను మనకు వెల్లడించడానికి సిద్ధపడేది మన విశ్వాసం ప్రకారముగానే తెలుసుకుంటాము. దాని దేవుడిని తెలుసుకునే మరియు విశ్వసించే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది.

Br. Pavan OCD

మార్కు 10:1-12

 February 28

సిరాకు 6:5-17

మార్కు 10:1-12

యేసు ఆ స్థలమును వీడి యొర్దాను నదికి ఆవాలనున్న యూదయా ప్రాంతమును చేరెను. జనులు గుంపులుగా ఆయనను  చేరవచ్చిరి. అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను. పరీక్షార్ధము పరిసయ్యులు ఆయనయొద్దకు వచ్చి, "భార్యను పరిత్యజించుట భర్తకు తగునా?" అని ప్రశ్నించిరి. అందుకు యేసు "మోషే మీకేమి ఆదేశించెను?" అని తిరిగి ప్రశ్నించెను. "విడాకుల పత్రమును వ్రాసియిచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే ఆదేశించెను?" అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు "మీ హృదయకాఠిన్యమునుబట్టి  మోషే ఇట్లు ఆదేశించెను. కాని, సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించియున్నాడు. ఈ హేతువువలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏకశరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులుకాక, ఏక శరీరులైయున్నారు. దేవుడు జతపరచిన జంటను మానవుడు వేరుపరుపరాదు" అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి  శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అపుడు ఆయన వారితో "తన భార్యను పరిత్యజించి, వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి, వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది" అని పలికెను.   

అన్ని వివాహాలు స్వర్గంలో జరగవు. కొన్ని బలవంతపు వివాహాలు మరియు మరికొన్ని ప్రేమలేని వివాహాలు. ఒక వివాహిత జంట రాత్రింబవళ్ళు ఒకరితో ఒకరు గొడవపడటం లేదా మూడవ వ్యక్తి లేదా నాల్గవ వ్యక్తితో, ఒకరి దాంపత్య జీవిత  సంబంధంలో నిరంతరం ముల్లుగా మారడం ఊహించుకోండి. కొన్ని కుటుంబాలు   ఎంత దురదృష్టకర జీవితాన్ని గడుపుతాయి! కాబట్టి క్రైస్తవ సమాజంలో  కూడా విడాకుల ప్రశ్న ప్రతిసారీ తలెత్తుతుంది. విరిగిన కుటుంబం యొక్క తక్షణ పరిణామం దాని సభ్యుల విచ్ఛిన్నమైన సంబంధం.విడాకుల తర్వాత కూడా మనం సంతోషకరమైన ముఖాలను చూడగలిగినప్పటికీ, విభజన యొక్క గాయం  ముఖ్యంగా విరిగిన కుటుంబం యొక్క మొదటి బాధితులైన పిల్లలలో కొనసాగుతుంది. 

కుటుంబంలో విచ్ఛిన్నం దేవునితో మన విచ్ఛిన్నమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజల హృదయ కాఠిన్యం కారణంగా మోషే విడాకులను అనుమతించాడని యేసు ప్రభువు  వివరించాడు. చాలా మంది ప్రవక్తల మాట మరియు యేసుప్రభువు  మాట వినకుండా  అదే హృదయ కాఠిన్యం కలిగి జీవిస్తుంటారు. ఈ రోజుల్లో ప్రజలు, ప్రేమ మరియు పశ్చాత్తాపం యొక్క సువార్త సందేశాన్ని వినకపోవడానికి ఇది కారణం ఈ హృదయ కాఠిన్యమే కావచ్చు. బహుశా భార్యాభర్తలు  ఒకరినొకరు వినడం నేర్చుకుంటే, ముఖ్యంగా దేవుని మాట వినడం నేర్చుకుంటే, విడాకుల సమస్యకూడా చర్చించబడకపోవచ్చు. వారు ఒకే శరీరంగా ఉండటం యొక్క అర్థాన్ని అర్థం చేసుకుని, వారి ఏకత్వాన్ని కొనసాగిస్తే, మానవాళి మొత్తం దేవుడు అందరికీ ఒకే తండ్రిగా ఉన్న నిజమైన కుటుంబంగా ఉంటుంది. ప్రతి కుటుంబం మనుగడ మరియు ఆనందం కోసం మనం ప్రార్థిస్తూ ఉండటం క్రైస్తవుల కర్తవ్యం. 

Br. Pavan OCD

15, ఫిబ్రవరి 2025, శనివారం

లూకా 6: 27-38

 February 23

మొదటి సమూయేలు 26: 2, 7-9, 12-13, 22-23

మొదటి కొరింథీయులు 15: 45-49

లూకా 6: 27-38

"కాని, మీతో నేను చెప్పునది ఏమన: మీ శత్రువును ప్రేమింపుడు. మిమ్ము ద్వేషించువారికి మేలు చేయుడు. మిమ్ము శపించువారిని ఆశీర్వదింపుడు. మిమ్ము బాధించువారికై ప్రార్ధింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టినవానికి రెండవ చెంపను కూడా చూపుము. నీ పై బట్టను ఎత్తుకొనిపోవు వానిని  నీ అంగీనికూడా తీసికొనిపోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొనిపోవు వానిని తిరిగి అడుగవలదు. ఇతరులు మీకు ఎట్లు చేయవలెనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు. మిమ్ము ప్రేమించినవారిని మాత్రమే మీరు ప్రేమించినచో యిందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అటుల చేయుటలేదా? తిరిగి ఈయగల వారికే ఋణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులును అటుల  పాపులకు ఇచ్చుటలేదా? కనుక, మీరు మీ శత్రువులను ప్రేమింపుడు. వారికి మేలు చేయుడు. అప్పు ఇచ్చి తిరిగిపొందవలెనని ఆశపడకుడు. అపుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు. ఏలయన, ఆయన కృతజ్ఞతలేని  వారికిని, దుష్టులకును మేలుచేయును. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై యుండుడు. "పరులను గూర్చి మీరు తీర్పుచేయకుడు. మిమ్మును గూర్చియు తీర్పుచేయబడదు. పరులను ఖండింపకుడు. అపుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు. మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు ఒసగుడు. మీకును ఒసగబడును, కుదించి, అదిమి, పొర్లిపోవు నిండుకొలమానముతో ఒసగబడును. మీరు ఏ  కోలతతో కొలుతురో, ఆ కొలతతోనే మీకును కొలవబడును" అని యేసు పలికెను. 

నేటి సువార్తలో యేసు ప్రభువు  మనల్ని “ఉన్నతమైన” ప్రేమకు పిలుస్తున్నాడు. ఆధ్యాత్మిక మినిమలిజాన్ని ఆచరించకుండా లేదా అనుసరించకుండా ఉండమని యేసు మనల్ని కోరుతున్నాడు, అంటే, అవసరమైన వాటిలో కనీసాన్ని మాత్రమే చేయాలని చూడటం లేదా “తగినంత మంచి” పద్ధతి ద్వారా జీవితాన్ని గడపడం - క్విడ్ ప్రో కో దానిని తగ్గించదు. యేసు ప్రభువుని  యొక్క “ఉన్నతమైన ప్రేమ” నిజంగా ఫ్రాన్సిస్ “భక్తి” భావన గుండెలో ఉంది. ఆయన ఇలా వ్రాశాడు: “నిజమైన, సజీవ భక్తి దేవుని ప్రేమను సూచిస్తుంది, కాబట్టి ఇది దేవుని నిజమైన ప్రేమ. అయినప్పటికీ అది ఎల్లప్పుడూ అలాంటి ప్రేమ కాదు. దైవిక ప్రేమ ఆత్మను అలంకరిస్తుంది కాబట్టి, దానిని కృప అంటారు, ఇది దేవుని దైవిక మహిమకు మనల్ని సంతోషపరుస్తుంది. మంచి చేయడానికి అది మనల్ని బలపరుస్తుంది కాబట్టి, దానిని దాతృత్వం అంటారు. అది పరిపూర్ణతకు చేరుకున్నప్పుడు, అది మనల్ని మంచి చేయడమే కాకుండా జాగ్రత్తగా, తరచుగా మరియు వెంటనే మంచిని చేయమని  చేస్తుంది.

దేవా, ఈ ఉన్నత ప్రేమను జీవించడానికి మాకు సహాయం చేయండి. జీవితంలో వచ్చే కొన్ని సమస్యలు, బాధలు కష్టాల నుండి తప్పించుకోవడానికి లేదా “పారిపోవడానికి” ప్రయత్నించకుండా ఉండటానికి మాకు సహాయం చేయండి; నిజంగా జీవించడం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి.

ప్రతిఫలం ఏమీ ఆశించకుండా మంచి చేయడం. మన శత్రువుల పట్ల  ప్రేమ కలిగి ఉండటం ఎప్పుడూ ఆదరణ పొందిన ఆజ్ఞ కాదు.  కానీ యేసు ఇలా చెప్పినప్పుడు చాలా ఖచ్చితముగా చెప్పాడు. అందుకే ఆయన అనుచరులు దానిని చాలా స్పష్టంగా ఆచరించారు. తొలి క్రైస్తవులు  యేసు ప్రభువు చెప్పినట్లుగా జీవించారు. శిష్యులు వారు పొందిన శ్రమలకు ప్రతీకారం తీసుకోలేదు.  శిష్యుల హింసలన్నింటిలోనూ  ప్రతీకారం తీర్చుకున్నారని లేదా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించారని మనకు ఏవైనా ఆధారాలు ఉన్నాయా? నాకు ఏమీ తెలియదు.. శత్రువుల పట్ల ప్రేమను బోధించినప్పుడు యేసు తన దైవిక మూలాల్లోకి లోతుగా చేరుకున్నాడు. ఇది విమోచన యొక్క అంతర్గత తర్కానికి విజ్ఞప్తి చేస్తుంది. దేవుడు పాపాన్ని క్షమించినట్లే, మనం కూడా క్షమించాలి.

సువార్త యొక్క తర్కం చాలా సులభం, ద్వేషం ద్వేషాన్ని పుట్టిస్తుంది, క్షమాపణ క్షమాపణను పుట్టిస్తుంది మరియు ప్రేమ ప్రేమను పుట్టిస్తుంది; చూడటం సులభం, కానీ జీవించడం కష్టం. మనం ఎక్కడ ప్రారంభించాలి? మీరు ఏమి చేయగలరు? మీకు నచ్చని లేదా బాధపెట్టిన లేదా మీరు పోరాడిన వ్యక్తి కోసం ప్రార్థించడం ఒక సాధారణ ప్రారంభం. మీరు రాజీపడటానికి ప్రయత్నించడానికి ధైర్యం, విశ్వాసం కనుగొనవచ్చు. కోపం మరియు ద్వేషం అలసిపోయేవి మరియు చీకటిగా ఉంటాయి. యుద్ధం అలసిపోయేది. ప్రేమ శక్తినిస్తుంది మరియు ఉత్సాహపరుస్తుంది మరియు ప్రకాశవంతంగా ఉంటుంది. క్రీస్తు క్షమించే స్వభావాన్ని మనం కూడా అలవరచుకుందాం. 

Br. Pavan OCD

14, ఫిబ్రవరి 2025, శుక్రవారం

మత్తయి 16: 13-19

 February 22

మొదటి పేతురు 5: 1-4

మత్తయి 16: 13-19

వారు ఇద్దరు తిరిగివచ్చి తక్కినవారికి ఈ విషయమును తెలియపరచిరి. కానివారు నమ్మలేదు. తదుపరి పదునొకండుగురు శిష్యులు భోజనము చేయుచుండగా, యేసు వారికి ప్రత్యక్షమై,  సజీవుడై లేచివచ్చిన తనను చూచిన వారి మాటలను కూడ నమ్మనందున వారి అవిశ్వాసమునకును, హృదయకాఠిన్యమునకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను: "మీరు ప్రపంచమందంతట తిరిగి, సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును. విశ్వసింపనివానికి దండన విధింపబడును. విశ్వసించు వారు ఈ అద్భుత శక్తులను కలిగియుందురు. నా నామమున దయ్యములను వెళ్లగొట్టెదరు. అన్యభాషలను మాట్లాడెదరు. పాములను ఎత్తిపట్టుకొందురు. ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములనుంచిన  వారు ఆరోగ్యవంతులు అగుదురు." ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని  కుడిప్రక్కన కూర్చుండెను. 

తన మొదటి లేఖలో, పునీత  పేతురు విశ్వాసులను చూసుకోవడానికి బాధ్యత వహించే వారికి ఒక మతసంబంధమైన లేఖ ద్వారా తన అధికారాన్ని ఎలా ఉపయోగించాడో మనకు చెబుతాడు. ఈ భాగంలో పేతురు తాను క్రీస్తు బాధలకు సాక్షిగా ఉన్నానని మాట్లాడుతుంటాడు - తాను ప్రభువుతో ఉన్నానని మరియు మానవ క్రీస్తును తెలుసుకున్నానని తన పాఠకులకు గుర్తు చేస్తున్నాడు.

ప్రభువు తమకు అప్పగించిన వారికి నిజమైన కాపరులుగా ఉండాలని మరియు సువార్తకు సజీవ సాక్షులుగా పరిపూర్ణ ఉదాహరణలుగా ఉండాలని పెద్దలందరినీ ఆయన ఎలా వేడుకుంటున్నాడో కూడా ఈ లేఖ మనకు చెబుతుంది. క్రీస్తు తర్వాత పేతురు మందకు ప్రధాన కాపరిగా ఉన్నందున, నేటి కీర్తన ప్రభువు నిజమైన కాపరి అని మనకు గుర్తు చేస్తుంది.

 పునీత  మత్తయి సువార్త భాగం పేతురుకు  క్రీస్తుపై గొప్ప విశ్వాస ప్రకటన తర్వాత క్రీస్తు  సంఘానికి  నాయకుడిగా నియమించబడ్డాడని చూపిస్తుంది. అతను కొత్తగా వచ్చిన సమూహానికి నాయకుడిగా ఉన్నప్పటికీ, అతను సంఘ  ఐక్యతకు శక్తివంతమైన చిహ్నంగా కూడా ఉన్నాడు, ఇది నేటి వరకు కొనసాగుతోంది.

పునీత పేతురు  అపోస్తులిక పరంపరను  మరియు పునీత పేతురు రోము మొదటి పీఠాధిపతిగా   క్రైస్తవ సంఘ నాయకునిగా తెలుపుతుంది ఈనాటి దైవార్చన. . పునీత పేతురు  అసలు పేరు సైమన్. అతనిని  శిష్యులలో  మరియు యేసు పన్నెండు మంది అపొస్తలులలో ఒకరిగా ఉండమని పిలిచినప్పుడు కఫర్నములో జాలరిగా నివసిస్తున్నాడు . యేసు ప్రభువు  పేతురుకు అపొస్తలులలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు. క్రీస్తు రూపాంతరం మరియు గెత్సేమనే తోటలో వేదన వంటి ప్రత్యేక సందర్భాలలో క్రీస్తుతో ఉన్న ముగ్గురిలో అతను ఒకడు. పునరుత్థానం తర్వాత మొదటి రోజున క్రీస్తు కనిపించిన ఏకైక అపొస్తలుడు ఆయన.

పేతురు తరచుగా అపొస్తలుల తరపున మాట్లాడేవాడు.మనం  తిరుసభలో , సంఘంలో “పేతురు స్థానాన్ని ”  ప్రత్యేకమైనదిగా జరుపుకుంటున్నప్పుడు, దేవుని రాజ్య పనిని కొనసాగించడంలో యేసు మనలో ప్రతి ఒక్కరికీ ఒక కుర్చీని - ఒక స్థలాన్ని, ఒక పాత్రను - సిద్ధం చేశాడని మర్చిపోకూడదు. . పేతురులాగే, నేడు మన స్థానాన్ని తీసుకునే ధైర్యం మనకు ఉందా? అని ఆలోచిస్తూ , దేవుడు మనకు ఏర్పరచే స్థానాన్ని ఎల్లపుడు కాపాడుకొనుటకు ప్రయత్నించుదాం. 

Br. Pavan OCD

మార్కు 8: 34 – 9:1

 February 21

ఆదికాండము 11: 1-9

మార్కు 8: 34 – 9:1

అంతట యేసు జనసమూహములను, శిష్యులను చేరబిలిచి, "నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని, తన సిలువను మోసికొని, నన్ను అనుసరింపవలయును. తన ప్రాణమును కాపాడుకొనచూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము, తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి, తన ఆత్మను కోల్పోయిన, వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఈయగలడు? నన్ను గూర్చి నా సందేశమును గూర్చి ఈ పాపిష్టి వ్యభిచారతరములో సిగ్గుపడువానిని గూర్చి, మనుష్య కుమారుడు కూడ దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును" అని పలికెను. మరియు ఆయన వారితో, "దేవునిరాజ్యము శక్తి సహితముగ సిద్దించుట చూచువరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణించరని నేను నిశ్చయముగాఆ  చెప్పుచున్నాను" అని పలికెను. 

ఆదికాండము పుస్తకాన్ని చదివినప్పుడు, ప్రజలు ఒడంబడిక నుండి ఎలా దూరమయ్యారో మరియు వారి గర్వంతో స్వర్గం వరకు చేరుకునే గోపురాన్ని నిర్మించడం ద్వారా దేవుని వలె శక్తివంతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారని మనం చూస్తాము. వారి అహంకారంతో, దేవుడు ఆ గోపురాన్ని నాశనం చేస్తాడు మరియు ప్రజలు ఒకరి భాష ఒకరు   అర్థం చేసుకోలేని విధంగా వారికి వివిధ భాషలను ఇవ్వడం ద్వారా వారిని గందరగోళానికి గురిచేస్తాడు. 

వాస్తవానికి మనం పరలోకంలో మన స్థానాన్ని పొందేందుకు కృషి చేస్తున్నప్పుడు ఈ ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నించడం వ్యర్థమని యేసు సువార్తలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. యేసును నిజాయితీగా మరియు నిశ్చయమైన హృదయంతో అనుసరించేవారు మాత్రమే రాజ్యంలోకి మరియు వారి నిజమైన వారసత్వంలోకి ప్రవేశిస్తారు.

భవనాన్ని నిర్మించడం ఒక విషయం, కానీ దానిని నిర్వహించడం మరొక విషయం. వివేకవంతమైన నిర్మాణకులు/యజమానులు తాము నిర్మించే దాని  నిర్మాణం కోసం వనరులను కేటాయించడమే కాకుండా, భవనం యొక్క నిరంతర నిర్వహణ కోసం వనరులను కూడా కేటాయించారు. ప్రధాన నిర్మాణకర్త అయిన దేవుడు - మనలో ప్రతి ఒక్కరినీ తన స్వరూపంలో మరియు పోలికలో నిర్మించాడు. మనం వస్తువులను నిర్మించడం ద్వారా - ముఖ్యంగా సంబంధాలను - నిర్మించడం ద్వారా దేవుని నిర్మాణాన్ని జరుపుకుందాం, దీని ముఖ్య లక్షణాలు వినయం మరియు దాతృత్వం. అలా చేయడం ద్వారా, మనం మనకే కాదు, దేవునికే మహిమ తెచ్చుకుందాం! . 

Br. Pavan OCD

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...